Adhogataa Purogataa
అధోగతా...పురోగతా?
---------------------------------
మారుతున్నకాలంలో మనిషి ఎటువైపు ప్రయాణిస్తున్నాడో చెప్పడం కష్థమవుతున్నాది . మన పూర్వికులు నిరక్షరాస్యులు , అవివేకస్థ్థితిలో ఉన్న మానవులకోసం వారి యాంత్రిక, దైనందికజీవనాన్ని దృష్థిలోపెట్టుకొని మన సంస్కృతికి కొన్ని సాంప్రదాయాల్ని శాస్థ్రాను కూలంగా కొన్ని ఆచార -వ్యవహారాలని జతకూర్చి , పురాణాలకి ప్రశస్త్యమిచ్చి , దేవతలని ,
వాటిరూపాలని, రూపాన్నిబట్టి దేవతల విశిష్థ గుణ-గణాలని మేళవించి , హైందవసంస్కృతిగా దానిని ఆచరణలోపెట్టేరు .
( ఐతే వైదికకాలంలో పరమాత్మస్వరూపాన్ని రూపరహితంగా , సత్యస్వరూపంగా ఆరాధిస్తూ " బ్రహ్మ, నిర్గుణ, ఈశ్వర: " అనే శబ్ధంతో ఆరాధించేవారు . ఈ నిరాకారస్వరూపానికి ఏరకమైన ఆకారమూలేదు . ఆకాలంలో ఋషులు , మునులు , ,మొదలైనవారు శిలారూపదేవతలని పూజించినట్లు ఆధారాలుకూడాలేవు )
అప్పుడుకూడా ప్రజలు పెద్దలు ప్రవేశపెట్టిన పద్ధతులకి తమతమ ఆలోచనాపంధాలని జతకలిపి , దేవతార్చనలు , దేవీబలులు, స్థ్థ్రీలకట్టుబాట్లు , ఆచార-వ్యవహారాలలో కఠిన నియమ-నిబంధనలు జతకూర్చి , కన్యాశుల్కం , బాలవివాహాది - విధవాముండనాలవంటి కఠోర నియమాలతో జీవితాలని దుర్భరం చేసుకున్నారు .
జాతులు, శాఖలు , ఉచ్చవర్గాలు , నీచవర్గాలు అంటూ తమసాటి వారిని తమతో వేరుచేస్తూ కట్టడి చేసేవారు .
కాలం గడుస్తున్నకొలదీ వీరిలోకూడా మార్పు వచ్చింది . కొన్ని కట్టుబాట్లు వెసులు పడ్డాయి . ఆడపిల్లలను చదువు, సంస్కారాలకై స్కూళ్లకి పంపడం , యుక్తవయస్సువచ్చాకా వివాహాలుచేయడం , కన్యాశుల్కం వంటివి రూపుమాపడం వంటి చిన్న-చిన్న మార్పులు మొదలయ్యాయి.
ఈమార్పు ఇంతటితో ఆగలేదు . మగవారు వ్యవసాయం , పౌరోహిత్యం , వేదపఠనం వంటివి వదలి ఉద్యోగస్తులయ్యేరు . కాలం మారిందిం, మనం మారాలి ,అంటూ మరీ ముందుకు సాగిపోయారు .
దాని పర్యవసానంగా పొద్దెక్కినా నిద్రలేవని పడకలు , ఒక సమయం , పద్ధతీ లేని ఆహారపూలవాట్లు , సుచీ - శుభ్రతా లేని దైనందిక చర్యలు , దైవం అంటే ఎవరు ? ఆచారం అంటే ఏమిటీ ? అంటూ వితండవాదం చేస్తూ అజ్ఙానంలో కొట్టుకుపోతున్నామన్న ధ్యాస కూడాలేకుండా వ్యవహరిస్తున్నారు .
మితిమీరిన స్వాతంత్ర్యం మినీబట్టలరూపంలో , మాదకద్రవ్యాల మత్తులో ,మనుగడమరచి ఆడా, మగా, తేడాలు విడచి వికటంగా వెకిలిపోకడలుపోతున్నాది .మనిషి వికాసానికై తోడ్పడవలసిన విజ్ఞానం మందుగుండు పేలుళ్లతో మసికొట్టుకుపోయింది . స్వాతంత్ర్యానికి మరో మెట్టు , అబలల ఆర్తనాదాలు , బాల-బలాత్కారాలు , భ్రూణహత్యలు .ఈ పరిస్థితిలో ఏదిమంచో, ఏదిచెడో నిర్ణయించుకోలేక మానవజీవనం అగమ్యగోచరమవుతున్నాది . ఎందుకంటే కాలంలో ఏ మార్పూ రాలేదు . మనిషి మాత్రం మారేడు .
రాను, రాను సమాజ పరిస్థితి ఎలామారిందంటే , ఆధునికపోకడలంటూనే ఆచారాలంటారు , కానీ వాటిని పాటించరు . సంస్కారం ఇది , అంటారు కానీ ఎక్కడా కనిపించదు. స్త్రీ లకి స్వాతంత్ర్యం అంటారు , కానీ రక్షణ లేదు .మాట్లాడే మాటలో
మృదుత్వం లేదు , కట్టే బట్టలో నిండుతనం లేదు . నీతులుచెప్పేవారు తమదాకా వస్తే తప్పుకుంటున్నారు . రాతలు రాసేవారు రాయడంతో తమపని అయిపోయిందనుకుంటున్నారు .
ఎవరో వస్తారు , ఏదో చేస్తారని మిగిలినవాళ్లు ఎదురుచూస్తున్నారు . ఇలా చేసేబదులు అంతా ఒక్కటై ఒక నవ, సమసమాజాన్ని
స్తాపించి , మంచిగా , మహొన్నతంగా , మానవత్యంతో బతికే మహాప్రస్థానాన్ని ప్రతిష్థిస్తే , అందరం
ఒక్కటై కలసి జీవిస్తే ,...............
ఈ అల్లర్లు ఉండవు . ఆర్తనాదాలు ఉండవు . అప్పుడే " సత్యం వద - ధర్మం చర " అన్న పదానికి న్యాయం చేకూరుతుంది .
అదే నిజమైన జ్ఞానం , నిశ్చలమైన భగవత్తత్వస్వరూపం ..
విజయోస్థు .
-----------------------------------------------
రచన..శ్రీమతి',
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-----------------------------------
*****