Saturday, February 26, 2022

నేటి పంచపది

[2/26, 18:43] p3: 26/02/2022.
నేటి పంచపది :  115
అంశం : జెట్టి ఈశ్వరీబాయి.

రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర


 గీతా ప్రైమరీ స్కూలు, గీతా మిడిల్ స్కూలు అనే విద్యాసంస్థలతో  ఉపాధ్యాయురాలిగా వృత్తి ప్రారంభం.॥

దళిత వర్గాల వీధుల్లో  లభించిన అధిక ఓట్లతో చుట్టిన శ్రీకారం .॥

వెనుకపడిన, బలహీన, బడుగువర్గాల అభ్యున్నతికి 
తోడ్పడాలన్న ఆశయ సాకారం .॥

ఎ.పి. షెడ్యూల్డు కులాల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా
ఈశ్వరీ బాయి  కృషి  అపారం ॥

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతిఏటా ఈశ్వరీబాయి జయంతి, వర్ధంతి వేడుకలమొాఘమీశ్వరీ ॥

*పంచపది కవన వేదిక* 
*నేటి పంచపది*115* తేదీ:26.2.22
అంశం *జెట్టి ఈశ్వరీబాయి*

*నేటి పంచపదులలో*
ప్రథమ బహుమతి *పంచపది శ్రేష్ఠ*
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు 15

ద్వితీయ బహుమతి *పంచపది విశిష్ట*
శ్రీమతి డా ఉషారాణి కోగంటి 19


*నేటి పంచపది* విజేతలందరికి అభినందనలు.
💐💐💐💐💐




[2/26, 21:57] +91 94405 30763: *నేటి అత్యుత్తమ అంత్యప్రాసగా ఎన్నుకోబడిన పంచపది*

నేటి పంచపది 
తేది -26-2-22
అంశం - జెట్టి ఈశ్వరీబాయి 
పేరు -ఎం .వి .ఉమాదేవి 

సబ్బండవర్ణాల ఆశాజ్యోతి, నాయకురాలు 
నిస్వార్ధహృదయంతో మహిళా సేవకురాలు 
ప్రశ్నించేస్వభావంతో  ప్రగతి కారకురాలు 
సామాజికన్యాయం,విద్యనిచ్చే  సాధకురాలు 
జెట్టి ఈశ్వరీబాయి అంబేద్కర్ వారసురాలు ఉమా!!

🙏👏🙏

సీస పద్యము

రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .


అంశం:దత్తపది
కనుమ,వినుమ,మనుమ,చనుమ

ప్రక్రియ : సీస పద్యము 

(కనుమ)పం డగనాడు కష్టించు రైతుతో
మిత్ర భావము తోడ ( మనుమ) నీవు॥

కడు ప్రేమ మీరంగ కలిసి పండగ జేయ
 (చనుమ) వారికడకు  జక్క గాను॥
 
పట్టుపు ట్టములిచ్చి పలకరింపుల తోడ
(వినుమ)వా రిదిమాట వివర ముగను ॥

తగుపంట ఫలముకు  తగుసాయ మునుజేయు
 అతడన్న దాతగా  అవని వేల్పు ॥ 

(సీస పద్యము మొదటి ప్రయత్నము.)

ప్రక్రియ:పద్యం : ఆటవెలది.
 

(కనుమ ) మంచి నెపుడు కనులార భువిలోన
(చనుమ )గురుల కడకు చదువు లొప్ప
(మనుమ) మహిని మంచి మాటతో జనులతో.
(వినుమ) శుభము లిచ్చు విలువ పెరుగు ॥

Friday, February 25, 2022

రగులుతున్న చైతన్యం

25 /02/2022.
శీర్షిక : రగులుతున్న చైతన్యం.

రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .


నీలాకాశంలో పొగబారిన మేఘాలు.
పర్యావరణపు వేడి సెగలకు 
వింత రోగాలతో విచ్ఛిన్నమౌతుా 
తమలో దాచుకున్న తేమ చుక్కలను
కాపాడుకునేందుకు అకాశమంతా
పరుగులు పెడుతున్నాయి. ॥
చినుకు తడికి నోచుకోని నేల తల్లి
పచ్చని పైరు చీర , చివికిపోయి చీదర 
కంపుకొడుతుా నిస్సారమైన బ్రతుకుతో
బీటలు బారిన బీడయ్యింది.॥
మానవత్వం చచ్చిన మనుషులు
అహం నిండిన స్వార్ధంతో 
చేసిన దాడులకు విరిగిన గ్రహ 
చరియల వింత ఆకారాలు 
విచిత్ర రోదనలు చేస్తుా 
వెక్కిళ్ళు పెడుతున్నాయి-॥
వీధిన పడిన వింత ఆకారాలు
గ్రహాల మీదకు వచ్చిన 
మానవ భుాతాలను పారద్రోలేందుకు
చేస్తున్న మారణ హోమాలకు  
భుామిపైకి  దుాసుకువెళుతున్న  
విష-వాయువుల  ఆక్రమణల
దాడికి జనులు వింత రోగాలతో
వీధిలోకి రావడం మానుకున్నారు.॥
పనీ పాటా లేని  పనికిమాలిన జనం 
తోచక చేస్తున్న చెత్తపనులకి 
పుట్టుకొస్తున్న భరత భవిత 
ఆటపాటలు లేని అసహనానికి 
రగిలిపోతుా అ= అంటే అధికారం ,
ఆ = అంటే ఆక్రమణలు.. అంటుా 
చేస్తున్న అక్షరాభ్యాసానికి ఆకాసం
తన పై నున్న మిన్ను విరిగి 
మీద పడ్డట్టు కెవ్వున కేక వేసింది.॥



  

 
 
 
 







 

Tuesday, February 22, 2022

నేను సైతం యుాట్యుాబ్ ఛానల్ కొరకు

సాహితీ బృందావన జాతీయ వేదిక మరియు
నేనుసైతం...యుాట్యుాబ్ ఛానల్ వారు సంయుక్తంగా  చేయబోయే సంకలనం కొరకు..

నా పేరు శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర లో ఉంటాను.

శీర్షిక  :మహిళా రత్నం శ్రీ " దుర్గాబాయి దేశ్ ముఖ్.

నాటినుండి నేటి వరకు గల చరిత్రలో ,
ఎందరో మహిళామణులు విద్య , వైద్య,  న్యాయ ,
సంగీత , సాహిత్యాది అనేక కళా రంగాలలోనే గాక ,
శాస్త్ర  సాంకేతిక వైజ్ఞానిక, రాజకీయ, స్వాతంత్ర్యాది
ఉద్యమాల లో పాల్గొని , తమ విశిష్ట ప్రతిభను 
చాటుకున్నారు.
వారందరుా మన భరతమాత కీర్తి కిరీటంలో 
కలికితురాయిలై , నేటికీ  చరిత్ర పుటల్లో
మహిళా శక్తికి స్ఫుార్తిదాయకులై నిలచేరు. 

జాతీయ మరియు అంతర్జాతీయ మహిళా-
దినోత్సవాల సందర్భంగా , సాహితీ బృందావన జాతీయ వేదికవారు నిర్వహిస్తున్న
 " మగువ మహారాణి " పోటీలకుగాను
 నేను తీసుకున్న అంశం నాటి మహిళా రత్నమైన
 శ్రీ " దుర్గాబాయి దేశ్ ముఖ్ " గారిది.

ఈమె మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబీకులైన
రామారావు క్రిష్ణవేణమ్మ  దంపతులకు రాజమండ్రిలో
జన్మించారు.
8 సంవత్సరముల వయస్సు లో ఆమెను ఆమె తల్లిదండ్రులు , ఆమె మేనమామకు ఇచ్చి వివాహం చేయ నిశ్ఛయించగా, ఆ వయసులోనే ఆమె ఆ వివాహాన్ని తిరస్కరించేరు.
12 సంవత్సరాల వయసుకే ఆమె హిందీ పాండిత్యాన్ని
సంపాదించి , రాజమండ్రిలో హిందీ పాఠశాలను
నెలకొల్పి , అన్ని వయసులవారికీ విద్యా బోధనను 
చేసేరు

మహాత్మాగాంధీగారు ఆంధ్రా పర్యటనకు వస్తున్నారని తెలిసిన  ఆమె ఎనలేని విరాళాలను సేకరించి ,
వాటితోపాటు ఆమె చేతికున్న బంగారు గాజులను కుాడా స్వాతంత్ర్య పోరాట విరాళంగా సమర్పించేరు.
ఆంధ్రా పర్యటనలో గాంధీగారు చేసిన హిందీ ఉపన్యాసాలను , తెలుగులోనికి అనువదించి 
ఆయన  ప్రశంసలను పొందేరు.
ఉప్పు సత్యాగ్రహంలో అరెస్టు కాబడి కుాడా , 
స్వాతంత్ర్యోద్యమాలలో  పాల్గొన్న ధీర వనిత
శ్రీ  దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారు.
ఇన్ని చేస్తుా కుాడా ఆమె తన చదువుకు ఆటంకం రానీయలేదు. విరామసమయాల్లో అమె చదువుకుంటుా  తన విద్యను సకాలంలో పుార్తిచేసి, 
న్యాయ కోవిదురాలిగా , ప్రఖ్యాత క్రిమినల్ లాయర్  గా
జగద్విఖ్యాతిగాంచేరు.

అనేక సాంఘీక సంక్షేమ  సంస్థలను ప్రారంభించి
స్త్రీ ల అభ్యున్నతికి కృషి చేసేరు.
చెన్నై లో ఆంధ్ర మహిళా సభను  
లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అనే బాల సంఘాన్ని
స్థాపించేరు.
ఆంధ్ర  విద్యాలయంలో మహిళా వసతి గృహాలను, హైదరాబాదులో  ఆంధ్ర మహిళా పత్రికను స్థాపించి
దానికి  సంపాదకత్వాన్ని వహించేరు.
రాష్ట్రమంతటా   ఎన్నో కళాశాలలు, వసతి గృహాలుా,
నర్సింగ్ హోమ్ లు, వృత్తి కేంద్రాలు నెలకొల్పారు.
చెన్నై లో 70 మంది కార్యకర్తలతో  ఉదయవనం అనే
సత్యాగ్రహ సిబిరాన్ని ఏర్పరచేరు.
స్వాతంత్ర్యానంతరం అమె భారత రాజ్యాంగ నిర్మాణ 
సభలోసభ్యురాలిగా పనిచేసేరు.
అటుపై C D దేశ్‌ముఖ్  గారితో వివాహానంతరం
అమె సాక్షారతాభవన్ ను స్థాపించగా..
ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఈమెకు గౌరవ
డాక్టరేట్ ను ప్రదానం చేసేరు.
పిదప భారత ప్రభుత్వంచే నెలకొల్పబడిన
కేంద్ర సాంఘీక సంక్షేమ బోర్డ్ కు , దిల్లీ లో ఉన్న
బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ లకు అద్యక్షురాలిగా
పని చేసారు.

కేంద్ర సాంఘీక సంక్షేమ బోర్డ్  వారు ఈమెకు 1998లో
ఈమె పేరున " డాక్టర్ దుర్గాబాయి దేశ్‌ముఖ్" వార్షిక అవార్డు ను నెలకొల్పి , దానిని మహిళా అభ్యున్నతికి
పాటుపడే స్వశ్ఛంద సంస్థలకై వినియొాగపరిచేరు.

దిల్లీ లో ఉన్న  బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు
2006లో ఈమె పేరున "దుర్గాబాయి దేశ్‌ముఖ్ -
కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్" ను నెలకొల్పారు.

ఇలా ఒక స్త్రీ గా, పిన్న వయసు నుండి కుాడా దేశానికి
ఎనలేని సేవలందించిన గౌరవనీయులు 
శ్రీ దుర్గాబాయి దేశ్‌ముఖ్  గారు 1981 మే వ తారీఖున
హైదరాబాదు లో దివంగతులై భరత మాత కీర్తి కిరీటంలో మణిరత్నమై చిరస్మరణీయులయ్యేరు.

"మగువ మహారాణి " పేరుతో మహిళలకు
అత్యున్నత వేదికను కల్పించి , మహోన్నతమైన మహిళా మణుల వీర చరితల సంస్మరణతో, మహిళా శక్తిని జాగృత  పరచే విధంగా , వచన, కవితా గానాలను చేసే అవకాశాలను కల్పిస్తుా ప్రోత్సహిస్తున్న 
సున్నితం ప్రక్రియ రుాపకర్త ,సాహిత్య పోషిణులుా ఐన గౌరవనీయులు శ్రీ నెల్లుట్ల సునీతగారికి , ఆమెకు సహకరిస్తుా కవులను ఉత్సాహపరుస్తున్న 
యుాట్యుాబ్ ఛానల్ నిర్వాహకులు
గౌరవనీయులైన శ్రీ దేవవరపు ఈశ్వర రావుగారికి
సాదర నమస్కారములతో
నా మనఃపుార్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.


                               🙏🙏










Monday, February 21, 2022

తెలుగు వెలుగు

2102/2022.

శీర్షిక : దేశ భాషలందు మేటి భాష.

రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .


నాటి సంస్కృత భాష నుండి పుట్టి
నేటి వ్యవహారిక భాషగా మారి
జన పదాల అందమై, కావ్య కన్నెల
 గంధమై అలరారుతున్న
భవిత చరితల వెలుగు బాట
 మన తెలుగు భాష ॥

మేటి సాహిత్యపు మేలు సారమై  
అష్ట దిగ్గజాల పద్య గద్యాల 
రచనల లో  అంద ఛందాల 
మేలు కందమై అక్షరాల తోటలో 
పరిమళ గంధమై వికసించిన
సుకుమార సుందర పారిజాత 
సుమ బాల మన తెలుగు బాల ॥

సప్త స్వరాల సంగీత నాదమై 
అరువది నాలుగు కళలకు నిలయమై
కోటిరతనాల వీణగా వన్నె కెక్కిన
అందమైన భాష మన తెలుగు భాష॥

వేమన పద్యాలలో అలవోకగా
 అందాలు సంతరించుకుంటుా..
మేటి  కవుల కవన వనంలో , 
పరిమళాల గంధమై విహరిస్తున్న కావ్య-
 కవితా సుందరి మన తెలుగు భాష॥
 
 మనవైన సాంప్రదాయాల అందమై
  సమానత్వ విలువలకు బంధమై
  కీర్తి పతాకపు రంగుల బాటలో
  వేల భాషల కలుగోలుపు వేటలో
  ఐకమత్యానికి నెలవైన అందమైన 
  రంగుల పుాలతోట మన తెలుగు ॥భాష ॥
  
*********************

పగలేవెన్నెలా జగమే ఊయల పాటకు పేరడీ.

మహిళా దినోత్సవ సందర్భంగా రాసిన పాట

పగలే వెన్నెలా ....జగమే ఊయలా...
పాటకు  పేరడీ

రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .



మహిళా మణులు ఈ, జగతికి రాణులుా 
మహిళ ఇలను సబలె గాని అబల కాదుా...॥

పుట్టినింట ఆనందము పంచు రాణిగా
మెట్టినింటను జ్యోతియై వెలుగు లక్ష్మి గా
కష్టసుఖములందు ఆమె తోడు నీడగా
నెరవేర్చును బాధ్యతలను అర్ధ భాగిగా
పెనిమిటి పిల్లల.. పాలిటి వరముగా
మగువే  గృహసీమను  ఏలు రాణిగా..॥

వేద వైద్య విజ్ఞానము లేలు బాటలో
విద్యలందు ఆరితేరె విజయ పథములో
నవరసమ్ము లేలు కళా రంగాలలో 
నడుముగట్టి నడచె స్త్రీ లు ప్రగతి బాటలో
పురుషుల నీడగా బాధ్యత తోడుగా
మహిళలె.. మహిని నిలచి జయము లేలెగా॥

తెల్లదొరల నొడ్డి పోరు నాటి జోరులో
స్వాతంత్ర్యము కోరి, శాంతి ,గాంధి బాటలో
బానిస సంకెళ్ళు తృుంచ ఉద్యమాలలో 
శక్తి రుాపులై నిలచిరి  స్త్రీ లు వేలలో
సాహస మేలినా మహిళలు ఎందరో
స్త్రీ శక్తికి రుాపాలై నిలిచె గెలుపులో  ॥

కత్తి పట్టెవీర నారి ఝాన్సి లక్ష్మి గా
దేశ మేలె ఇందిరమ్మ  ఎన్నో ఏళ్ళుగా
మహిళ సాధికారతకై ఉద్యమించెగా
 ఆకసాన సగ భాగిగ కీర్తు లేలెగా
మన చరితల పుటలలో
మకుటాయమానులై
మగువలె మహరాణిగ 
ఖ్యాతి గాంచెగా॥

మాతృ భాషాదినోత్సవ కవితలు 2022





21/02/2022.
మహతీ సాహితీ కవి సంగమం .కొరకు
అంశం : చిత్ర కవిత .
ప్రక్రియ :  వచన కవిత.
మ.సా.క.సం.19.
కవిత సంఖ్య : 1.

రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .

శీర్షిక  : తెలుగు జగతికి వెలుగు.

శ్రీకృష్ణదేవరాయలు ఏ బాష వాడైనా, 
తెలుగు భాషకే ఇచ్చిన నీరాజనం .
స్పష్టత, నేర్పు, భావాల, కూర్పులకు
"దేశ భాషలందు తెలుగు లెస్స "
అన్న గౌరవం ॥

అచ్చులు హల్లులులతో కుాడిన
అందమైన భావాల  నుడికారపు భాష 
హ్రస్వాలు దీర్ఘాలు పొల్లులు  నిండిన
అరవై అక్షరాల అధికారిక భాష ॥

 కళలు నిండు వనంలో కావ్య కథనాల బాట 
భావం నిండిన సాహిత్యాల  పుాదోట  -
తీయని పలుకుల  మాధుర్యపు ముాట.
తేనెలో ముంచిన వెన్న పుాసల తేట ॥
 
మనసులో నున్న  భావాలకు  
వన్నెతెచ్చు వేల అర్ధాల వెలగు బాట.
సంస్కృతపు తళుకులతో  
నిండు మెరుపుల ముద్దు మాట.
 వ్యవహారిక వెన్నెలై కురిసిన 
 అమృతం మన తెలుగు భాష ॥
 
భరత భవితల సాధికారతకు 
సాకారమైన  విద్యా రుాపం , 
 కావ్య కవన కథనాలలో నిండిన 
 భరత చరితల త్యాగధనం ॥
 భావమై కురియు చినుకు చల్లదనం 
తెలుగు భాషలో నిండు 
మాధుర్యపు కమ్మదనం. 
తేనె వంటి  తెలుగులొ
 దాగి ఉన్న తీయదనం ॥

ఏదేశమేగినా వినిపంచే 
భరత చరితల ఘన నీరాజనం
ఆప్యాయత అనురాగాల లో 
నిండైన అమ్మతనం
పలకరింతలల పులకరింతలలో
నిండు ప్రేమ నిర్మలత్వం 
నాటికీ నేటికీ అందరుా మెచ్చిన 
తెలుగుభాషలో దాగిన దేశ గౌరవం ॥

**************************
21/02/2022
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా...

సాహితీ బృందావన జాతీయ వేదిక కు,
ఉమెన్ రైటర్స్ కు  పంపినది.

రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .

శీర్షిక  : తెలుగు వెలుగు.

జలజల జారే  గిరుల ఝరుల లో
నదీమ తల్లులు పారే గలగలలో
ఎగిరే పక్షుల కువకువల వేదంలో
జే గుడి గంటల ప్రణవ నాదంలో
సవ్వడి చేసే అక్షర కన్యల పద
మంజీరాల గలగలలో
నిండిన అక్షర మంజరీ నాదం 
మన తెలుగు భాష నిండు వేదం  ॥

శృతి లయల సంగీత గీతులు
కవుల కలమేలు ఫల రసాల తోటలు
వేద పురాణాది గ్రంధపు  తేటలు
తెలుగు భాషా వనములో 
పండిన  పసిడి పచ్చని పంటలు॥

నదీమతల్లుల సంగమ క్షేత్రాలు
ముక్కోటి వేల్పుల జేగుడి గంటలు
వేల పోరాటాల వీర చరితలు
తెలుగు సిగ నలరించు 
సుమ సౌగంధపు కీర్తులు॥

సంస్కృతి , సాంప్రదాయాల సారం
సత్య ,శాంతి .సద్ధర్మాలకు నిలయం 
ఐకమత్యానికి ప్రతీకగా ఎగిరే కేతనం 
తెలుగు జాతి  నిండు దనానికి నిదర్శనం 
తేనె లొలుకు మన తెలుగు భాష ॥

**************************

01/ 03 / 2022 : 

నేను సైతం కవి పత్రిక సంచిక కొరకు.

అంశం : నేను సైతం : మాతృ భాష కొరకు,

21/02/2022
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా...

అంశం : నేను సైతం : మాతృ భాష కొరకు,

శీర్షిక :  పలుకు తేనెల తల్లి.
ప్రక్రియ : వచన కవిత.

రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .


గిడుగువారి గొడుగులో 
గ్రాంధిక మనే మసుగు తీసి
 దేశ వ్యవహారిక భాషగా వన్నెకెక్కి
 అందరి నోట పలుకు యాస గోస
 మన అందమైన తెలుగు బాష ॥

నన్నయ తిక్కన ఎర్రాప్రగడల 
రచనా శైలికి అక్షర పునాది వేసి
అష్ట దిగ్గజాల సాహిత్య వనంలో 
ఛందోబద్ధ కావ్య ,పద్య, గద్య 
కందమై,వేమన పద్యాలలో వేల
 అందాలు సంతరించుకుంటుా
కవన వనంలోవీర విహారం చేస్తున్న 
పలుకు తేనెల ముాట మన తెలుగు భాష॥

జానపదాల వేల కీర్తులతో 
 జన పదాల జల్లుగా కురిసి, 
 తెలుగింటి ఆడపడుచుగా 
అక్షర నీరాజనాలందుకుంటున్న 
ఆదర్శ సాంప్రదాయాల
 అద్భుత చరిత , అందమైన 
 యాస గల మన తెలుగు భాష ॥

హామీ: ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన .


************************

ఈ వేమన కవితా నిలయం కు పంపినది.
2102/2022.

శీర్షిక : దేశ భాషలందు మేటి భాష.

రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .


నాటి సంస్కృత భాష నుండి పుట్టి
నేటి వ్యవహారిక భాషగా మారి
జన పదాల అందమై, కావ్య కన్నెల
 గంధమై అలరారుతున్న
భవిత చరితల వెలుగు బాట
 మన తెలుగు భాష ॥

మేటి సాహిత్యపు మేలు సారమై  
అష్ట దిగ్గజాల పద్య గద్యాల 
రచనల లో  అంద ఛందాల 
మేలు కందమై అక్షరాల తోటలో 
పరిమళ గంధమై వికసించిన
సుకుమార సుందర పారిజాత 
సుమ బాల మన తెలుగు బాల ॥

సప్త స్వరాల సంగీత నాదమై 
అరువది నాలుగు కళలకు నిలయమై
కోటిరతనాల వీణగా వన్నె కెక్కిన
అందమైన భాష మన తెలుగు భాష॥

వేమన పద్యాలలో అలవోకగా
 అందాలు సంతరించుకుంటుా..
మేటి  కవుల కవన వనంలో , 
పరిమళాల గంధమై విహరిస్తున్న కావ్య-
 కవితా సుందరి మన తెలుగు భాష॥
 
 మనవైన సాంప్రదాయాల అందమై
  సమానత్వ విలువలకు బంధమై
  కీర్తి పతాకపు రంగుల బాటలో
  వేల భాషల కలుగోలుపు వేటలో
  ఐకమత్యానికి నెలవైన అందమైన 
  రంగుల పుాలతోట మన తెలుగు ॥భాష ॥
  
*********************

పంచపది =  110 
21/02/2022.
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

నేటి అంశం : మాతృభాషాదినోత్సవం.


 గిడుగువారి గొడుగులో వ్యవహారిక భాషగా
మారిన తెలుగువారి ఆత్మ గౌరవం  ॥

జానపదాల వేల కీర్తులతో జన పదాల
 జల్లై కురిసిన, నిండు చైతన్య  ధనం ॥

సప్త స్వరాల నాదమై, వేల సంకీర్తనల గాంధర్వ గానమై
 "కోటిరతనాల వీణగా "వన్నె కెక్కిన అక్షర వనం .
 
 అష్టదిగ్గజాల  ఛందోబద్ధ కావ్య రచనలకందమై ,
 "దేశ భాషలందు తెలుగు లెస్స" అని
  రాయలవారిచే  అనిపించుకుని కీర్తికెక్కిన ఘనం .

భరత మాత కీర్తి కిరీటంలో కలికితురాయైన  సకలకళా
సంపదల వేద విద్యా ఖని "మన తెలుగు భాష ఈశ్వరీ॥


ఎచటకుా పంపనిది.👇👇

జానపదాల వేల కీర్తులతో 
 జన పదాల జల్లుగా కురిసిన, చైతన్యం
పల్లె అందాల పిల్లగాలి చైతన్యం
 మన తేట తెల్లని తెలుగు భాష.॥
 
నన్నయ తిక్కన ఎర్రాప్రగడల 
శైలికి అక్షర పునాదియై..
గిడుగువారి గొడుగులో 
గ్రాంధిక మనే మసుగు తీసి
 దేశ వ్యవహారిక భాషగా వన్నెకెక్కిన
 అందరి భాష నేటి మన తెలుగు భాష ॥

మేటి సాహిత్యపు మేలు సారమై  
అష్ట దిగ్గజాల పద్య గద్యాల 
రచనల లో  అంద ఛందాల 
మేలు కందమై ఒదిగిన 
సుకుమార సుందర పారిజాత 
సుమ బాల మన తెలుగు బాల ॥
 
జలజల జారే  గిరుల ఝరుల లో
నదీమ తల్లులు పారే గలగలలో
ఎగిరే పక్షుల కువకువల వేదంలో
జే గుడి గంటల ప్రణవ నాదంలో
సవ్వడి చేసే అక్షర కన్యల పద
మంజీరాల గలగలలో
నిండిన పద మంజరీ నాదం 
మన తెలుగు భాష నిండుదనం  ॥

Friday, February 18, 2022

శార్ధుాల విక్రీడితము

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర.

అంశం:శార్దూలవిక్రీడితము

శీర్షిక : సరస్వతీ స్తోత్రం .

శ్రీవిద్యా వరదాయకీ గుణవతీ
శ్రీ శారదాంబాం భజే ॥

శ్రీవిశ్వేశ్వరి  బ్రహ్మ రాణి జయతే
శ్రీవిద్య సంధాయినీ ॥

యా వీణా ధరి గీత వాదనకరీ
యా వాద్య సత్పోషిణీ ॥

దేవీశ్రీ  పరదేవతే శరణు, వా-
గ్దేవీ నమొా  శారదే ॥

******************
శ్రీవేదా స్థిత నంద గోప కులజా
ధ్యాయే సదా వందితా॥

నిర్వేదా శిఖిపించ శోభిత ముఖా
సర్వేశ  దైత్యాంతకా॥

దేవేంద్రార్చిత పాద పంకజ  హరే ( వరా)
శ్రీవేణు గానాద్భుతా ॥

భావే  సర్వ జనేప్సితాది వరదా
సర్వేశ  ధ్యాయేత్సదా॥



నిజమైన దేశభక్తి

28/01/2022.
సాహిత్య , సాంస్కృతిక , విద్యా ఛానల్
(ప్రగతి కోసం కలం : ప్రజల కొరకు గళం .)
అంశం : నిజమైన దేశభక్తి.

నిర్వాహణ : వలిపే సత్య నీలిమ.
శీర్షిక : కళ్ళుతెరచిన కలలు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర


మారుతున్న పరిస్థితులకనుగుణంగా 
మారిపోతున్న మనం ..
మన "లో" నున్న మనిషికి సంకెళ్ళు వేశాం. 
కాలంతో పాటు ఉరుకులు పరుగులు తీస్తుా
అసలెందుకు బ్రతుకుతున్నామొా కుడా
తెలీని వేగంతో దుాసుకుపోతున్నాం.
పచ్చదనం పాడెకెక్కిన నేపధ్యంలో
కమ్ముకున్న విషవాయుప్రభావానికి
మనిషి జీవితం విషకణాల వికృత చేతుల్లో
పడి నలిగిపోతోంది.
స్వాతంత్ర్య పోరాటాలు కథలై పుటలు చేరేయి.
ఉద్యమకారుల చరితలు ఊరవతల
ఊపిరిలేని శిలలై నిలిచేయి.
మువ్వన్నెల ఝండా ముడతల మధ్య ,
వెలిసిన రంగుల చారలు ఐకమత్యాన్ని 
సవాలు చేస్తున్నాయి.
రాజులు మారేరు .రాజ్యాలు మారేయి.
కొత్త చట్టాలు వచ్చేయి . 
దొమ్మిలు దోపిడీలు పెరిగేయి.
మానభంగాల వ్యుాహాల్లో అబలలు
అభమన్యులై అంతమౌతున్నారు.
రౌడీయిజం రాజ్యమేలుతోంది. 
ఓటు హక్కు నోటు పెట్టుబడిగా మారింది.
 ప్రైవేటీకరణ పురివిప్పింది. 
 ఎంతోమంది స్వాతంత్రోద్యమకారులు 
 చిందించిన రక్తపుజోరుకు విడివడిన బానిస 
బ్రతుకు సంకెళ్ళు ,తాము ఎన్నుకున్న నాయకులపాలనలో తిరిగి హస్తాలకు
బానిస సంకెళ్ళు వేస్తున్నాయి. 
ఆ నిజమెరిగి ఆక్రోశిస్తున్న మనిషి "లో "మనిషి కళ్ళుతెరిచాడు.
వత్సరానికొక్కసారి ఎగిరే" మువ్వన్నె పతాకం "
ఎందరో దేశభక్తుల త్యాగ నిరతికి నిదర్శనంగా
రాజ వీధుల్లో రాజసంగా ఎగురుతోంది.
ఎన్నో అన్యాయాలకు బలౌతున్న మనిషు "ల్లో
చైతన్యం పుంజుకుంది. 
తను కుార్చున్న కొమ్మను తామే నరుక్కున్న చందంగా తమ "ఓటు హక్కును" తామే  దుర్వినియొాగ పరుస్తున్నందుకు తమను తామే నిందించుకున్నారు.
"వందేమాతరం",  జాతీయ గీత ప్రకంపనలకు 
రగులుతున్న "దేశభక్తి" ఉద్యమకారుల చరితల
బలిదానాలకు శలాం చేసింది.
ఏమైనా  సాధించగల "అస్త్రం" తమ చేతిలో "ఓటు" రుాపంలో తమ "హక్కైన" విషయ స్ఫురణకు 
వచ్చి ఏక నిశ్ఛయానికి వచ్చేరు జనం.
తాము తిరిగి బానిసత్వ సంకెళ్ళకు బందీ అవకుాడ దు.
తల్లి భారతి ఒడిని తంగేడు పుాల పరిమళం తోనింపుతారు.
 పచ్చని పైరు తల్లి చీరను తివాచీగా పరచి,
 మవ్వన్నెల ఝండాను ముద్దబంతిపుాలతో స్వాగతిస్తారు.
 విషకణాల విరుగుడుకై పచ్చని చెట్లను నాటి
  విశ్వ వనాలను విస్తృతం చేస్తారు.
  మన భారతీయ సంస్కృతి సాంప్రదాయ కన్నెలకు
  ఉగాది ఆహ్వానాలు పంపి ఊరంతా పల్లకిలో 
  ఊరేగిస్తారు. ఇప్పటికీ కళ్ళుతెరవకుండా 
  ఉంటే తమ వినాశనానికి తామే కారకులైనట్టు.
  మనలోనీ మార్పు  మనలో దాగిఉన్న 
  నిజమైన దేశభక్తికి నిదర్శనం .
  రండి ..మనమంతా ఒక్కటై మన జాతీయ ఝండాకు 
  వందన సమర్పణ చేద్ధాం. 
  స్వతంత్ర భారత పౌరులుగా మన దేశాన్ని 
  మనమే తీర్చి దిద్దుకుందాం.
  వందే.....మాతరం...వందే.....మాతరం.
  
  హామీ: 
  నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని
  నా స్వీయ రచన.

శ్రీ దుర్గాబాయి దేశ్‌ముఖ్

సాహితీ బృందావన జాతీయ వేదిక మరియు
నేనుసైతం...యుాట్యుాబ్ ఛానల్ వారు సంయుక్తంగా  చేయబోయే 
సంకలనం కొరకు

నా పేరు శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర లో ఉంటాను.

శీర్షిక  :మహిళా రత్నం శ్రీ " దుర్గాబాయి దేశ్ ముఖ్.

నాటినుండి నేటి వరకు గల చరిత్రలో ,
ఎందరో మహిళామణులు విద్య , వైద్య,  న్యాయ ,
సంగీత , సాహిత్యాది అనేక కళా రంగాలలోనే గాక ,
శాస్త్ర  సాంకేతిక వైజ్ఞానిక, రాజకీయ, స్వాతంత్ర్యాది
ఉద్యమాల లో పాల్గొని , తమ విశిష్ట ప్రతిభను 
చాటుకున్నారు.
వారందరుా మన భరతమాత కీర్తి కిరీటంలో 
కలికితురాయిలై , నేటికీ  చరిత్ర పుటల్లో
మహిళా శక్తికి స్ఫుార్తిదాయకులై నిలచేరు. 

జాతీయ మరియు అంతర్జాతీయ మహిళా-
దినోత్సవాల సందర్భంగా , సాహితీ బృందావన జాతీయ వేదికవారు నిర్వహిస్తున్న
 " మగువ మహారాణి " పోటీలకుగాను
 నేను తీసుకున్న అంశం నాటి మహిళా రత్నమైన
 శ్రీ " దుర్గాబాయి దేశ్ ముఖ్ " గారిది.

ఈమె మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబీకులైన
రామారావు క్రిష్ణవేణమ్మ  దంపతులకు రాజమండ్రిలో
జన్మించారు.
8 సంవత్సరముల వయస్సు లో ఆమెను ఆమె తల్లిదండ్రులు , ఆమె మేనమామకు ఇచ్చి వివాహం చేయ నిశ్ఛయించగా, ఆ వయసులోనే ఆమె ఆ వివాహాన్ని తిరస్కరించేరు.
12 సంవత్సరాల వయసుకే ఆమె హిందీ పాండిత్యాన్ని
సంపాదించి , రాజమండ్రిలో హిందీ పాఠశాలను
నెలకొల్పి , అన్ని వయసులవారికీ విద్యా బోధనను 
చేసేరు

మహాత్మాగాంధీగారు ఆంధ్రా పర్యటనకు వస్తున్నారని తెలిసిన  ఆమె ఎనలేని విరాళాలను సేకరించి ,
వాటితోపాటు ఆమె చేతికున్న బంగారు గాజులను కుాడా స్వాతంత్ర్య పోరాట విరాళంగా సమర్పించేరు.
ఆంధ్రా పర్యటనలో గాంధీగారు చేసిన హిందీ ఉపన్యాసాలను , తెలుగులోనికి అనువదించి 
ఆయన  ప్రశంసలను పొందేరు.
ఉప్పు సత్యాగ్రహంలో అరెస్టు కాబడి కుాడా , 
స్వాతంత్ర్యోద్యమాలలో  పాల్గొన్న ధీర వనిత
శ్రీ  దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారు.
ఇన్ని చేస్తుా కుాడా ఆమె తన చదువుకు ఆటంకం రానీయలేదు. విరామసమయాల్లో అమె చదువుకుంటుా  తన విద్యను సకాలంలో పుార్తిచేసి, 
న్యాయ కోవిదురాలిగా , ప్రఖ్యాత క్రిమినల్ లాయర్  గా
జగద్విఖ్యాతిగాంచేరు.

అనేక సాంఘీక సంక్షేమ  సంస్థలను ప్రారంభించి
స్త్రీ ల అభ్యున్నతికి కృషి చేసేరు.
చెన్నై లో ఆంధ్ర మహిళా సభను  
లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అనే బాల సంఘాన్ని
స్థాపించేరు.
ఆంధ్ర  విద్యాలయంలో మహిళా వసతి గృహాలను, హైదరాబాదులో  ఆంధ్ర మహిళా పత్రికను స్థాపించి
దానికి  సంపాదకత్వాన్ని వహించేరు.
రాష్ట్రమంతటా   ఎన్నో కళాశాలలు, వసతి గృహాలుా,
నర్సింగ్ హోమ్ లు, వృత్తి కేంద్రాలు నెలకొల్పారు.
చెన్నై లో 70 మంది కార్యకర్తలతో  ఉదయవనం అనే
సత్యాగ్రహ సిబిరాన్ని ఏర్పరచేరు.
స్వాతంత్ర్యానంతరం అమె భారత రాజ్యాంగ నిర్మాణ 
సభలోసభ్యురాలిగా పనిచేసేరు.
అటుపై C D దేశ్‌ముఖ్  గారితో వివాహానంతరం
అమె సాక్షారతాభవన్ ను స్థాపించగా..
ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఈమెకు గౌరవ
డాక్టరేట్ ను ప్రదానం చేసేరు.
పిదప భారత ప్రభుత్వంచే నెలకొల్పబడిన
కేంద్ర సాంఘీక సంక్షేమ బోర్డ్ కు , దిల్లీ లో ఉన్న
బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ లకు అద్యక్షురాలిగా
పని చేసారు.

కేంద్ర సాంఘీక సంక్షేమ బోర్డ్  వారు ఈమెకు 1998లో
ఈమె పేరున " డాక్టర్ దుర్గాబాయి దేశ్‌ముఖ్" వార్షిక అవార్డు ను నెలకొల్పి , దానిని మహిళా అభ్యున్నతికి
పాటుపడే స్వశ్ఛంద సంస్థలకై వినియొాగపరిచేరు.

దిల్లీ లో ఉన్న  బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు
2006లో ఈమె పేరున "దుర్గాబాయి దేశ్‌ముఖ్ -
కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్" ను నెలకొల్పారు.

ఇలా ఒక స్త్రీ గా, పిన్న వయసు నుండి కుాడా దేశానికి
ఎనలేని సేవలందించిన గౌరవనీయులు 
శ్రీ దుర్గాబాయి దేశ్‌ముఖ్  గారు 1981 మే వ తారీఖున
హైదరాబాదు లో దివంగతులై భరత మాత కీర్తి కిరీటంలో మణిరత్నమై చిరస్మరణీయులయ్యేరు.

"మగువ మహారాణి " పేరుతో మహిళలకు
అత్యున్నత వేదికను కల్పించి , మహోన్నతమైన మహిళా మణుల వీర చరితల సంస్మరణతో, మహిళా శక్తిని జాగృత  పరచే విధంగా , వచన, కవితా గానాలను చేసే అవకాశాలను కల్పిస్తుా ప్రోత్సహిస్తున్న 
సున్నితం ప్రక్రియ రుాపకర్త ,సాహిత్య పోషిణులుా ఐన గౌరవనీయులు శ్రీ నెల్లుట్ల సునీతగారికి , ఆమెకు సహకరిస్తుా కవులను ఉత్సాహపరుస్తున్న 
యుాట్యుాబ్ ఛానల్ నిర్వాహకులు
గౌరవనీయులైన శ్రీ దేవవరపు ఈశ్వర రావుగారికి
సాదర నమస్కారములతో
నా మనఃపుార్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.









ఇష్టపదిలో సమ్మక్క సారక్కల మేడారం జాతర

సమ్మక్క సారక్క
*మహతీ సాహితీ కవిసంగమం:*

తేది:17.02.2022
అంశం: *సమ్మక్క -సారక్క*
మసాక సంఖ్య: 19
కవిత సంఖ్య:03

శీర్షిక: *మేడారం జాతర*
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .

మేడరాజు కోయల మేలు కోరెడి రాజు
వేటాడ మృగముల వెదుక పాప దొరకెనుపు
మాఘ  పౌర్ణమి నాడు మంచి పేరు పెట్టెను
అల్లారు ముద్దుగా నామెపెంచ సాగెను॥

సరి ఆట పాటలా సమ్మక్క పెరిగెను
పగిడిద్దరాజుతో  పాపకు పెండ్లాయెను
సంతసముల వేడ్కగా సారమ్మయెపుట్టెను
ఆ దంపతులిరువురు ఆనందము నొందెను॥

కాకతీయ సామంతు కట్టలేదని సిస్తు
ప్రతాపరుద్రుడుా ప్రజ్ఞాశాలి రాజు
అసుాయతోడ నతడు అతనిని సాధించగ
పుారించెను పోరుకై పుార్ణ సమర శంఖము ॥

మాఘ  పౌర్ణమి నాడు మరి జరిగె పోరాటం
మరణించిరి పోరున మన అక్క కుటుంబము
కన్నీరు మున్నీరు కడు బాధ మిగిలినది
ఒంటరేై మిగిలినది  ఒక్కతౌ సమ్మక్క॥

కసి నిండు బాధతో కదన రంగము జేరి
పోరాడె సారక్క పోరునలసినదక్క
వెన్నుపోటు పొడచిరి వెళ్ళ నీక తరిమిరి
మధ్యలో సమ్మక్క   మాయమైపోయెను॥

తా ప్రతాపరుద్రుడు  తప్పు తెలుసుకొనెను
పుట్టవద్ద దొరకెను పుార్తి కుంకుమ భరిణె
సమ్మక్క రుాపుగా  సత్యమంచు కొలచెను
వనదేవిగ మారిన మన అక్కను కొలచెను ॥

సమ్మక్క కుతురే  సారమ్మదేవతగా
జనులంత కొలచితిరి జగమంత చాటితిరి.
మేలైన జాతరా మేడారము  జరిగెను
నాల్గేైన దినముల నాపండగ జరిగెను॥

అదెనందరు జేయు అతిపెద్ద జాతరా
కొలిచేటి గిరిజనుల  కొలువమ్మల  జాతరా.
సమ్మక్క సారమ్మ  సరి దేవతలుగను
వనమందు వెలసేరు వరమీయు వేల్పులుగ॥

కధను విన్న ఈశ్వరి కలసి చేసె పుాజలు
సమ్మక్క సారక్కల సందడి పండగలు
తరలిరారె తరుణులు తమ కోర్కెలు తీరగ
వనదేవతలువారి వరదాభయమందగ ॥





పేరడీ పాటలు..

ప్రక్రియ : బాలల గేయం.
అందాల ఓచిలకా... సినిమా పాట పేరడీ..
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

పల్లవి:
అందాల ఓ పాపా...
వినరావె నా మాటా.

అనుపల్లవి:
నే కధలెన్నొ చెపుతానుా..నీ
మది మంచె తలచేనుా..

చరణం. 1.
పెద్దల మాటవు వినవేలా
పిలచిన పలుకవు కులుకేలా..
ముద్దుపాపవని దరికిరమ్మని
పిలచిన విసుకది ఎందుకనీ
అక్లరెందుకే చదవమందుకే
బ్రతుకు భారమని
తలచుటెందుకే ॥ అందాల॥

చరణం 2.
ఆన్ లైన్ చదువులు చదవాలీ
మొాబైలు ఆటలె విడవాలీ
పనికిరానివీ చుాచుటెందుకే
వయసు మించినా మాటలెందుకే...
పెరుగు వయసులో మంచినేర్చితే..
అడుగు అడుగునా పుాలబాటలే ...॥ అందాల ॥

చరణం:3.
కలసిరానిదీ కాలమిదీ
కాలరాసినా బ్రతుకులివీ..
అడుగు తడబడే బ్రతుకు ఆటలో
తోడురారు నీకెవరు బాటలో
ఎదురుదెబ్బలకు ఓడిపోనిదీ
మేధ నిండిన మనిషి జన్మిది..॥అందాల ॥

చరణం 4.
అమ్మా నాన్నలె దైవాలుా
పెద్దలె జ్ఞాన దీపాలుా
వారి మాటలో వెలుగు బాట జని
మాట తీపితో  పొందు కీర్తినీ..
ధనము మించినది మంచి తలపులే
మంచి నడతలే మహిని గెలుపులే..॥అందాల ॥



మహిళా దినోత్సవ సందర్భంగా...
వినుడు వినుడు రామాయణ గాధా...పాటకు పేరడీ..
రచన : శ్రీమతి : జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .

శీర్షిక : మహిళలు మహారాణులు.

పల్లవి:

వినుడు వినుడు మన 
భారత నారీ జీవిత చరితలనుా
స్ఫుార్తి నిచ్చెడీ వీర వనితలా
త్యాగనిరతి  ఫలముా॥

అనుపల్లవి:
ఆలకించుచుా  ఆదరించు మన 
ఆదర్శ మహిళామణి  బాటల ॥వినుడు వినుడు॥

1.చరణం :
ఎందరెందరో వీర  వనితలా 
త్యాగ చరిత  గల భారతిదీ
 అసువులు బాసిన వీర నారులా 
నాటి ఫలితముల నేడు ఇదీ.
ఉద్యమ బాటను నడచి పోరినా
గెలుపుల దేశమిదీ
స్వాతంత్య్రమునే కోరి పోరు 
స్త్రీ శక్తికి సాక్షి ఇదీ
ఆంగ్ల పాలకుల కెదురు పోరాడు
వనితల చరితలివీ 
చెరగని గాధలివీ ॥

2. చరణం.
ఉద్యమ బాటను నడచి పోరినా
గెలుపుకు సాక్షులు మన స్త్రీ లు 
 స్వాతంత్య్రపు పోరాట బాట నడు
 వీర నారులకు  జేజేలుా   
 బానిసత్వ సంకెళ్ళు తెంపగా 
 పోరిరి వేవేలుా
ఆంగ్ల పాలకుల కెదురు పోరాడు
 శక్తుల కిడు జేలుా..
 పోరు బాటలో అసువులు బాసిన 
 స్త్రీ లకు జోహారుా
 వారికి  కైమొాడ్పుా.॥
 
 3. చరణం :
 బాల్య వివాహము సతిసహగమనము
 లాపిన  వారికి యైతోడు
 స్త్రీ ల కొరకు సంక్షేమ పథకములు
 సంస్థల నిడ పోరాడేరు .
 వేద, విజ్ఞాన ,శాస్త్ర విద్యలు  
 నేర్చిరి హక్కులుగా
 సాంకేతిక  రాజ్యాంగ చట్టముల
 బాటల నేలిరిగా
 వీర వనితల చరిత కీర్తులకు
ధీటుగ నిలచిరిగా॥
వనితల గెలుపిదెగా ॥
 ..
****************************

కవితా  ప్రక్రియ  కర్తలకు ధన్యవాదాలతో...  
బలేబలే అందాలుా సృష్టించావుా...
పాటకు పేరడీ..
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

భలే భలే అందాలు కురిపించాయిా
మదిని మురిపించాయిా
మనసు కానందం, పొంగె పద గంధం 
కవిత కన్నెల్లు ప్రతీదినం ॥

రాసిన వన్నీ రసమయ సుధలై
పుాసిన పుాలవోలే  వికసించేయిా..
మితమైన వరుసల ఆగమ సారమై
అందరి మనసుకుా హత్తుకున్నాయిా

 మకుటమ్ములు మంచిగా , మన్నిక నీయగా॥
 పదములె పరిమళాల జల్లులై
కవన వీధి విహరించాయిా ॥

విందులుగానిడు అంశము లెన్నో
జ్ఞానపు నిధులై   మది నిలిచాయిా
అభినందనలా బహుమతులెన్నో
విజయపు చిహ్నాలై ఊరించాయిా
సాహిత్యపు బడిలో సాధించిన బిరుదులే
మా మది కానందపు నిధులేై
కలలెన్నో పండించాయిా..॥

******************


18/02/2022.
మహిళా దినోత్సవ సందర్భంగా రాసిన పాట

పగలే వెన్నెలా ....జగమే ఊయలా...
పాటకు  పేరడీ
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .


మహిళా మణులు ఈ, జగతికి రాణులుా 
మహిళ ఇలను సబలె గాని అబల కాదుా...॥

పుట్టినింట ఆనందము పంచు రాణిగా
మెట్టినింటను జ్యోతియై వెలుగు లక్ష్మి గా
కష్టసుఖములందు ఆమె తోడు నీడగా
నెరవేర్చును బాధ్యతలను అర్ధ భాగిగా
పెనిమిటి పిల్లల.. పాలిటి వరముగా
మగువే  గృహసీమను  ఏలు రాణిగా..॥

వేద వైద్య విజ్ఞానము లేలు బాటలో
విద్యలందు ఆరితేరె విజయ పథములో
నవరసమ్ము లేలు కళా రంగాలలో 
నడుముగట్టి నడచె స్త్రీ లు ప్రగతి బాటలో
పురుషుల నీడగా బాధ్యత తోడుగా
మహిళలె.. మహిని నిలచి జయము లేలెగా॥

తెల్లదొరల నొడ్డి పోరు నాటి జోరులో
స్వాతంత్ర్యము కోరి, శాంతి ,గాంధి బాటలో
బానిస సంకెళ్ళు తృుంచ ఉద్యమాలలో 
శక్తి రుాపులై నిలచిరి  స్త్రీ లు వేలలో
సాహస మేలినా మహిళలు ఎందరో
స్త్రీ శక్తికి రుాపాలై నిలిచె గెలుపులో  ॥

కత్తి పట్టెవీర నారి ఝాన్సి లక్ష్మి గా
దేశ మేలె ఇందిరమ్మ  ఎన్నో ఏళ్ళుగా
మహిళ సాధికారతకై ఉద్యమించెగా
 ఆకసాన సగ భాగిగ కీర్తు లేలెగా
మన చరితల పుటలలో
మకుటాయమానులై
మగువలె మహరాణిగ 
ఖ్యాతి గాంచెగా॥




Thursday, February 17, 2022

మహిళా శక్తి

నమస్కారం . నాపేరు..
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్: మహారాష్ట్ర .


ఫిబ్రవరి 13 న జాతీయ" మహిళా దినోత్సవం"
మరియు  మార్చ్ 8 వ తారీకున 
"అంతర్జాతీయ మహిళా దినోత్సవం" సందర్భంగా...* 

' సాహితీ బృందావన జాతీయ వేదిక '
 " మగువ మహారాణి " అనే అంశంపై యూట్యూబ్ ఛానల్ లో  అంతర్జాతీయ స్థాయిలో..
మహిళలకు పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా -
నేను రాసిన కవిత.


ఆంక్షల సంకెళ్ళు తెంచుకొని 
అన్ని రంగాల లోనుా 
మగవాడితో సమానంగా 
ఎదుగుతున్న మహిళలు  
మహిళా శక్తికి నిదర్శనాలు.
హిమాలయాల శిఖరాగ్రాలు చేరి
అంబర యాత్రలతో అలరిస్తున్న స్త్రీ లు.
ఇంటా బయటా సమాన శక్తితో
పనిచేస్తున్న  వెలుగు దీపాలు.
బాధ్యతల బాటలో  
తొలగిస్తున్నారు ముళ్ళు.
బంధాల తోటలో వికసిస్తున్న
 అనుబంధపు పరిమళాల పుాలు.
 ఏలోటుా రానీయని ఆదర్శ గృహిణులు
 ఎందులోనుా తీసిపోని వీర నారీమణులు.
ఎన్నో రంగాల లో ఎందరో ప్రసిద్ధులైన
నారీమణులు మన భరత  మాత
మకుటంలో మెరిసే కలికితురాయిలు.
తరాలు కదిలిస్తే చాలు 
తరుణీ మణుల ఉద్యమ, వీర 
స్వాతంత్ర్య , విద్యా , వినయ సంపన్నులైన
వారి గాధలు చరిత్ర పుటల్లో చదువరులకు
చక్కని స్ఫుార్తినిస్తున్నాయి.

నాటి నుండి  నేటి వరకు 
జరుగుతున్న ఎన్నో 
పోరాటాలకు  సాక్షిగా  ఎన్నో
మహిళా ఆరక్షణా కేంద్రాలు.
న్యాయ పరమైన చట్టాలు ,
మహిళా సంక్షేమ పథకాలుా 
నెలకొన్న ఘనత మహిళల
విజయానికి నిదర్శనాలు.
ఎన్నో అర్హతలతో బాటు 
మరెన్నో రంగాల లో 
ముందడుగేస్తుా దుాసుకుపోతున్న 
మహిళామణులకు స్ఫుార్తి నిస్తుా 
ప్రతి సంవత్సరముా జరుగుతున్న 
"మహిళాదినోత్సవం "మహిళా
శక్తి ప్రేరణకు దోహదమై
ఆత్మ విశ్వాసానికి నెలవై  
ముందడుగు వేయిస్తున్నదనుటలో 
సందేహములేదు.
జై మహిళా శక్తి : జై మహిళా స్ఫుార్తి.