Monday, October 31, 2022

శ్రీకృష్ణ శరణం మమ

ప్రక్రియ : మత్తకోకిల పద్యాలు.
రచన : శ్రీమతి: 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యసణ్ : మహారాష్ట్ర .


భక్తి  తోడను  గొల్వ  మేలగు  భాగ్య మిత్తువు నీవెగా
శక్తి యుక్తులు దెల్పి పేర్మిని సార మిత్తువు నీవెగా
రక్తి కట్టిన లీల గోకుల రక్ష కుండవు నీవెగా 
ముక్తి నిచ్చెడు బాల మొాహన ముద్దు క్రిష్ణుడవీవెగా॥

బాల గోకుల పాల వైతివి  బాల లీలలు చేయుచుా
ఆల మందల గాచి నావుర ఆట పాటల నవ్వుచుా
ఏల నీకుర జాలి మమ్ముల నేల శ్రీముర ళీధరా
శీల సద్గుణ రాయ సుందర శ్రీశ వేల్పువు మాకయా ॥

లీల లెన్నియొ జుాపి యుంటివి లీల మానుష రుాపవై
బాల మాపుర గోప బాలుడ భాగ్య వంతుల మేమయా
ఆల మందల గాచి నావిట ఆది  దేవవతారుడా
వేల దుష్టుల జంపి నాడవు వేణు గానవి లోలుడా॥

జోల పాడెద వీను విందుగ  జోఘ నాచ్యుత సుందరా
పాలు త్రాగుచు పవ్వళించర  బాల కృష్ణప సందుగా
పుాల గంధపు అత్తరుాలివె  పుాజ సేయగ తెస్తిరా
జాల మేల యశోద నందన  చాల వేచితి రావయా ॥

భక్తి తోడను గొల్చు వారికి  భాగ్య మిత్తువు నీనెగా 
ముక్తి మార్గము జుాపు దేవర ముాడ భక్తియె నాదిగా
శంఖ చక్ర గదా ధరా ఘన  సాధు సజ్జన పాలకా
శంక లేదయ నిన్ను నమ్మిన శోక నాశన కారకా ॥

భాగవాదుల భక్తి నెంచుచు భాగ్యమిచ్చెడు బాంధవా
ఆగమాది నుతా,పరాత్పర ఆగ్రహింపక రావయా
రాగ భోగపు మాయ జిక్కిన రాసి కర్మలు మావయా
వేగ  బ్రోవగ వచ్చి మాకిడవేల మొాక్షము దేవరా ॥


  
  19/08/2022

మహతీ సాహితీ కవి సంగమం.
ఐచ్ఛికం.
శీర్షిక : శ్రీ కృష్ణః  శరణం మమ ॥
ప్రక్రియ : మత్తకోకిల పద్యాలు.
రచన : శ్రీమతి: 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యసణ్ : మహారాష్ట్ర .


పుాల మాలలు గట్టి తెచ్చితి పుాజ నీకదె సేయగా
శీల సద్గుణ రాయ చిద్ఘన శీఘ్ర మీదరి రావయా ॥
మేలు ఆటల నాడి కాంతలు వేల పాటలు పాడగా
మేల మాడుచు సంద డించకు మేటి టక్కరి గోపయా ॥

గోరు వెచ్చని వెన్న తెస్తిని గోవు పాలతొ పాయసం
చారు సుందర నాయకా ఘన సార వేద్యము నీకయా ॥
కోరు చుంటిని నీదు సేవను కోటి జన్మల కైననుా
లేరు ఎవ్వరు నీకు సాటిగ లేత నవ్వుల దేవరా ॥

మంగళమ్ములు పాడి వేడితి మాధవా మధు సుాదనా
రంగ శ్రీపతి కావ రావ శుభాంగ నీ దయ లుండునా ॥
బృంగ మౌని హృదాలయా ఘన రంగ శ్రీపుర నాయకా
అంగ రంగసు వైభ వాఘన నంగ గానవి లోలనా॥

వంద నమ్ములు చేతు గైకొను వంద్య మానసు ధామవుా
బృంద వాటి విహార శ్రీహరి నంద ముద్దుల క్రిష్ణవుా
ఇందు లోచన బంధ మొాచన ఈప్సి తమ్ముల దీర్తువుా
బాల రుాపము తోడ పుట్టిన  భవ్య మంగళ రుాపవుా॥

కాల రుాపవు కంజ లోచన కంసు జంపిన మొాహనా
బాల దేవకి నంద నందన పాల గోకుల వర్ధనా
లీల యామున తేటి నీటను జాల మాయతొ దాటినా
మేటి మాయల రాయ ముద్దుల మేయ క్రిష్ణశు భాననా॥




శీర్షిక : శ్రీ కృష్ణః  శరణం మమ ॥
ప్రక్రియ : మత్తకోకిల పద్యాలు.
రచన : శ్రీమతి: 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యసణ్ : మహారాష్ట్ర .


కాలి గజ్జలు ఘల్లు ఘల్లన కన్న నాట్యము చేయరా॥
మేలి బంగరు వర్ణ కాంతుల  మేలు వేణువు నుాదరా ॥
నీలి మేఘపు ఛాయ సుందర నిర్మలా మన మందిరా
లీల చుాపిన క్రిష్ణ నీవయ గ్వాల గోకుల బాలయా ॥

దేవకీ వసుదేవ నందన దేవదేవుడ వీవయా 
దోవ చుాపర ధన్య మార్గము బ్రోవ మమ్మిల కృష్ణయా॥
భావమందున బాహ్యమందున భక్తి కోరితి నీదయా
భుావరా ఘన దేవరా గను భుారి కారుణ తోనయా॥

కాల రుాపవు కంజ లోచన కంసు జంపిన మొాహనా
బాల దేవకి నంద నందన పాల గోకుల వర్ధనా
లీల యామున తేటి నీటను జాల మాయతొ దాటినా
మేటి మాయల రాయ ముద్దులమేయ క్రిష్ణ శుభాననా॥

అష్టమీ దినమందు పుట్టిన శిష్ట మానవ పోషవు 
కష్ట నష్టము దీర్చ వచ్చిన కాల రుాపవ తారవుా
శ్రేష్ట  గోకుల మందు పుట్టిన ఇష్ట మానస రుాపవుా
ద్రష్ట నిర్మల కాంతి నిండిన  పుష్టి  నైన విశాలవు ॥

కృుార కంసుని జంపినావట  ఘోర సంకట మేలగా
చీరలిచ్చితి వంట ద్రౌపతి జిక్కు కష్టము దీర్చగా
ద్వారకా పురి వాస క్రిష్ణయ దాస భక్త సుపోషకా ॥
జార చోరవు రాధలోలవు జాలమేలయ శ్రీకరా॥

వేల నామములున్న వాడవు వేణుగాన విలోలనా
బాల రుాపము తోడ వచ్చిన గ్వాల శ్రీహరి చిద్ఘనా
జేల అష్టమి నాడు పుట్టిన జేజి గారుడ వాహనా 
ఆలమందల నేలు వాడవు ఆర్తత్రాణపరాయణా ॥

పుాల మాలలు గట్టి తెచ్చితి పుాజ నీకదె సేయగా
శీల సద్గుణరాయ చిద్ఘన శీఘ్ర మీదరి రావయా ॥
మేలు ఆటల నాడి కాంతలు వేల పాటలు పాడగా
మేల మాడుచు సంద డించకు మేటి టక్కరి గోపయా ॥

గోరు వెచ్చని వెన్న తెస్తిని గోవు పాలతొ పాయసం
చారు సుందర నాయకా ఘన సార వేద్యము నీకయా ॥
కోరు చుంటిని నీదు సేవను కోటి జన్మల కైననుా
లేరు ఎవ్వరు నీకు సాటిగ లేత నవ్వుల దేవరా ॥

అష్టమీ దినమందు పుట్టిన శిష్ట మానవ పోషవు 
కష్ట నష్టము దీర్చ వచ్చిన కాల రుాపవ తారవుా
శ్రేష్ట  గోకుల మందు పుట్టిన ఇష్ట మానుష రుాపవుా
ద్రష్ట నిర్మల కాంతి నిండిన  పుష్టి  నైన విశాలవు ॥

మంగళమ్ములు పాడి వేడితి మాధవా మధు సుాదనా
రంగ శ్రీపతి కావ రావ శుభాంగ నీదయ లుండునా ॥
బృంగ మౌని హృదాలయా ఘన రంగ శ్రీపుర నాయకా
అంగ రంగ సువైభవా ఘననంగ మానస బృంగమా ॥

వందనమ్ములు చేతు గైకొను వంద్యమాన సుధామవుా
బృందవాటి విహార శ్రీహరి నంద ముద్దుల క్రిష్ణవుా
ఇందు లోచన బంధ మొాచన ఈప్సితమ్ముల దీర్తువుా
బాల రుాపము తోడ పుట్టిన  భవ్య మంగళ రుాపవుా॥




సంగం సంగమేశ్వరాలయం.

శ్రీ శ్రీ కవన వేదిక వారి కవితా సంకలనం కోసం 
-----------------------------------------
 శ్రీ శ్రీ కవన వేదిక వారి "హరోం హర సంగాము సంగమేశ్వర"
కవితా సంకలనం కొరకై వ్రాసినది .

శీర్షిక : సంగం : సంగమేశ్వర దేవాలయం .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .

 ఏడు నదులు  కలిసే ఏకైక ప్రదేశం 
 పవిత్ర పుణ్య క్షేత్రం సంగమేశ్వరం.
 బలరాముడు ప్రతిష్టించిన లింగం.॥
 
నాగావళి- సువర్ణముఖి -వేదావతి  
ఒకేచోట సంగమించిన పవిత్ర స్థలంలో.
ద్వాపర యుగంలో కరువు, నష్టం. .
కళింగ దేశంలో నానా కష్టాలతో  జనం॥
 
చలించిన బలరాముని ప్రయత్నం 
నాగలితో భుామిని దున్నిన ఫలితం
గంగా ప్రవాహంతో  దేశం సుభిక్షం.॥

నాగలితో భుామిని దున్నిన ఫలితంగా
నాగావళి పేరుతో పవిత్ర నదీ ప్రవాహం .॥

నాగావళి , మరో ఉప నదితో కలసిన
ప్రదేశంలో ప్రతిష్టంచిన అద్భుత లింగం.
పవిత్ర పుణ్యక్షేత్రంగా ,"సంగం" .గ్రామం.
సంగమేశ్వరుని పేరుతో పవిత్ర శైవ క్షేత్రం॥

స్థల పురాణం ప్రకారం ,వినిపించే కథనం.
తండ్రి జమదగ్నిమహర్షి ఆజ్ఞ మేరకు 
తన తల్లి రేణుకాదేవిని  బలరాముడు
సంహరించి, పాప పరిహారార్ధం పవిత్ర
సంగమ స్థానంలో  చేసిన శివలింగ ప్రతిష్టాపనం॥

సంగమేశ్వరుని దర్శనం సర్వపాపహరణం.
ప్రతీ వత్సరం  బ్రహ్మోత్సవాల సంబరం , 
 శ్రీ కామాక్షిదేవీ సమేత సంగమేశ్వరస్వామి
 రోజుకొక వాహనంపై భక్తులకు దర్శనం .॥
  
 మహా శివరాత్రి పర్వదినంలో
బలరాముడు ప్రతిష్టించిన మహిమాన్విత
ఐదు పవిత్ర శివ లింగాల దర్శనం  
 పుణ్యప్రదం,సమస్త పాప ప్రక్షాళనం  .॥

మహాకురుక్షేత్ర యుద్ధానంతరం బలరాముడు  ప్రతిష్టించిన  పంచలింగ ఆలయాల్లో
 ముాడవదైన సంగమేశ్వరలింగం .
 భక్తుల కొంగుబంగారమైన పవిత్ర క్షేత్రం .॥
 

హామీ :
నా ఈ వచన కవిత ఏమాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.


*********************************
శీర్షిక  : పవిత్ర పంచారామాలు.
శ్రీ సంగమేశ్వర దేవాలయాలు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .

1
కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం.
ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి
 కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం 
 కలిగించే సంగమేశ్వర దేవాలయం.  ॥ వేలసంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం॥
2.
అహోబిలం కొండల్లో పుట్టిన సెలయేరు 
భవనాశిని నదిగా రూపాంతరం చెంది 
కృష్ణలో కలిసే స్థలం సంగమేశ్వరం .॥
3
ప్రజల పాప ప్రక్షాళన చేసిన గంగాదేవికి 
 కాకి రూపం రాగా, ఈ సంగమంలో 
 స్నానం చేసి హంసగా మారిన కథనం ,॥ 
 
 గంగమ్మ పాపాలు నివృత్తి అయినందున 
 నివృత్తి సంగమేశ్వరం అన్న  పేరుతో ప్రసిద్ధం.॥
 4.
 ఆరణ్య వాస సమయంలో లింగ ప్రతిష్ఠ 
 చేయ సంకల్పించిన ధర్మరాజు ॥
 
 లింగాల కోసం భీముని కాశీ ప్రయాణం. 
కాలయాపన ఐనందున వేప మొద్దుతో
చేసిన  శివలింగ  ప్రతిష్ఠ అద్వితీయం.॥
5.
నాగలితో భుామిని దున్నిన ఫలితంగా
నాగావళి పేరుతో పవిత్ర నదీ ప్రవాహం .॥

నాగావళి , మరో ఉప నదితో కలసిన
ప్రదేశంలో ప్రతిష్టంచిన అద్భుత లింగం.
పవిత్ర పుణ్యక్షేత్రంగా ,"సంగం" .గ్రామం.
సంగమేశ్వరుని పేరుతో పవిత్ర శైవ క్షేత్రం॥

 కోస్తా తీర ప్రాంతంలో పంచారామాలు
 ఇమల్లేశ్వరం, అమరేశ్వరం, సిద్దేశ్వరం,
 కపిలేశ్వరం, సంగమేశ్వరం పేర్లతో ప్రసిద్ధి. ॥
 
 భీముడు కాశీ నుండి తెచ్చిన లింగాలతో 
 వెలిసిన పంచేశ్వర పవిత్ర  క్షేత్రాలు 
 భక్తుల పాలిటి కొంగుబంగారాలు ॥
 



 
 

Saturday, October 29, 2022

చేజారిన బంధం. చిన్ని కధ

అంశం : చేజారిన బంధం .
శీర్షిక : మారుతున్న కాలంతో పాటు మనముా మారాలి.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


అరవై ఐదేళ్ళ వయసులో కీళ్ళ నొప్పులతో
సతమతమౌతుా ఏదో సణుగుతుా వంట చేస్తున్న 
వర్ధనమ్మను చుాసి రామయ్యగారికి 
కోపం తో పాటు  జాలి  కుాడా వేసింది.

మెల్లగా లేచి వంటలో ఏదైనా సాయం చేయనా వర్ధనీ
అనడంతో వర్ధనమ్మకు మరింత చిరాకు వేసింది.
ఇంకా నయం మగాడి చేత వంట వండిస్తున్నానని 
నలుగురుా చుాసి నవ్వి పోడానికా...
అంటుా  కఁయ్యి మంది .

రామయ్యగారు వర్ధని వేపు జాలిగా చుాసేరు.
ఇదిగో ఇలాంటి చేదస్తం తోటే మనల్ని ఎంతో బాగా 
చుాసుకుంటున్న కొడుకుా కోడలికి దుారమయ్యేవు.
కాలం మారింది వర్ధనీ ..దానితో పాటు మనుషులు 
వారి అలవాట్లు కుాడా మారేయి.

కానీ నీ చాదస్తం మాత్రం మారలేదు.
కోడలు తెల్లారి ఏడు దాటినా నిద్రవలేవలేదనీ 
ఒక సారి , ఆకలేసి అన్నం తింటే మొగుడికి పెట్టకుండా 
తినేస్తున్నావేంటని మరోసారి ,  ఆఫీసుకు వెళుతుాంటే మగాడిలా జీన్స్ ఏమిటని మరోసారి, కుంకం బొట్టు పెద్దది పెట్టు కొమ్మని ఇంకోసారి ..
మా కాలంలో పని వాళ్ళు లేరు .
నలుగురి పని చేయలేవా  అంటుా మరోసారి
ఇలా నానా రకాలుగా ఆ అమ్మాయిని సాధించేవు.

కోడలు పిల్ల చాలా మంచిది .ఉద్యోగం చేస్తుా  కుాడా
మనకు ఏ విధమైన లోటుా రాకుండా చుాసుకునేది
చంటి పిల్లల్ని మనం చుాడలేమని డే కేర్ లో వేస్తే ,
చంటి పిల్లలను మాకు దుారం చేస్తున్నావంటుా
 పెద్ద రాద్ధాంతం చేసేవు.
 పోనీ ఉంచితే పిల్లల్ని  చుాడగలవా ...అంటే అదీ చేయలేవు.
ఇదిగో !  దాని పర్యవసానమే ఈ నాటి మన పరిస్థితి.

నువ్వు చేస్తున్న గోలంతా మనబ్బాయి రోజుా విని విని 
చివరకు ఈ నిర్ణయం తీసుకుని మనిద్దరినీ వేరుగా ఉంచేడు.

దేనికైనా పట్టు విడుపు ఉండాలి వర్ధనీ..
 పరిస్థితుల బట్టీ, కాలాన్ని బట్టీ,  సద్దు బాటు కుాడా చేసుకోవాలి.
 నీ ఛాదస్తంతో అందరినీ దుారం చేసుకున్నావు.
 
 సరేలే మరో రెండు రోజుల్లో  మన ఇంటి పనులు ,వంటపనులు కుాడా చేయడానికి  మనుషులు వస్తున్నారు.. నువ్వు పని చేసుకోలేవని ఈ సదుపాయం కుాడా కోడలే చేసింది.
పనివాళ్ళతో  నైనా కాస్త జాగర్తగా మసలుకో .
అంటుా హాలు లోకి వచ్చేరు.

వర్ధనమ్మ కళ్ళల్లో కన్నీరు జల జలా కారుతోంది.
అవును .తను అనవసరంగా కొడుకు కోడలికి సంబంధించిన అన్ని విషయాలలోనుా కలుగజేసుకొనేది.
పాపం కోడలు ఏ నాడుా తనకు ఎదురు జవాబు కుాడా చెప్పలేదు. తమకు కావలసినవన్నీ సమయానికి అమర్చి పెట్టేది.
ఇప్పుడు ఆలోచిస్తే తప్పంతా తనదిగానే తోస్తున్నాది.

ఈ సారి గానీ అబ్బాయి తమను వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తే తను కోడలు పిల్లని ఏమాత్రం విసిగించదు.
భగవంతుడా ఈ" చే జారిన బంధాన్ని "తిరిగి
కలుపు తండ్రీ. నీ గుడికి వచ్చి నుాటెనిమిది 
పొర్లు దండాలు పెడతాను .అంటుా మనసారా దేముణ్ణి వేడుకుంది వర్ధనమ్మ.
ఇదీ ఒక ఛాదస్తమే అన్న మాట మరచి.

బాల సాహిత్యం."గ" గుణింతం.

06/08/2022.
మహతీ సాహితీ కవి సంగమం .
అంశం : బాల సాహిత్యం .
"గ"= గుణింతం.
శీర్షిక : మంచి మాటలు

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .

గబ గబ పొద్దున్న లేవాలి
గట్టిగ పాఠం చదవాలి .
గారాబం ఇక మానాలి.
ఘనమైన చదువులె చదవాలి ॥
.
గాంధీ బాటను నడవాలి.
గలగలనవ్వుతు బతకాలి.
గిల్లికజ్జాలాడక ఉండాలి.
గీతా లెన్నో నేర్వాలి.॥

గురువులు చెప్పేది వినాలి.
గుాటికి వేళకు చేరాలి.
గెలుపు పోరు నువు చేయాలి.
గేలి చేయకుమ ఎవ్వరినీ.॥

గైకొను పెద్దల దీవెనలుా
గొప్పల కెపుడుా పోరాదు.
గోమాతను పుాజించాలి.
గౌరవమందరి కీయాలి.॥

గంగను వృధాగ పోనీకు.
గం ,గః గుణింతా లెన్నో నేర్వాలి. 
ఘనమౌ భారత పుత్రుడవు.
ఘన కీర్తిని నువు పొందాలి ॥

స్ఫుార్తినిచ్చు పతాకం.

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా..

అంశం : త్రివర్ణ సందేశం .
శీర్షిక  :  స్ఫుార్తి నిచ్చు పతాకం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


అదిగదిగో  బానిసత్వ మొదలించిన ఝండా
అదిగదిగో స్వాతంత్ర్యపు సర్గ మిడిన ఝండా
ఆంగ్లేయుల తరిమికొట్టె ఆయుధమై ఝండా
మన ఆశల బాట పుాలు జల్లినదీ ఝండా ॥

గాంధి నెహ్రూ వంటి త్యాగ-ధనుల దీక్ష సాక్షిగ
స్వాతంత్ర్యోద్యమ బాటను  కేతనమై నిల్చెగా
అసువులు బాసిన సైనిక వీర గతికి సాక్షిగా
చారిత్రాత్మక ఘటనల చెగని ముద్రల కోటగ ॥

ఎగురుతున్నదదిగో  ఏక బిగిని ఠీవితో
పలుకుతోంది పలుభాషలు తేనెలొలుకు తీపితో
మువ్వన్నెల సోయగాల ముచ్చటైన మేనితో
ఐకమత్యమే బలమని చాటిచెప్పు నీతితో  ॥

జాతి బేధ మెంచకంటు మేలు మంచి మాటలతో
కుల మతాల జాడ్య మొదలి కలిసి పోగ చెలిమితో
మనమంతా ఒక్కటనే మమతల సందేశ మిచ్చు--
మన బాటను పుాదోటగ మార్చు స్ఫుార్తి గీతితో ॥

నీతి , న్యాయ, మార్గములో నడచుటె మన ధర్మ మని
ప్రీతి పరుల జేయుటలే బ్రతుకు మనిషి సార్ధకతని
పరుల మనసు నొప్పించక తానొవ్వక బ్రతుకమని
చాటి చెప్పె మన ఝండా, తల ఎత్తుకు నిలవుమని ॥

మనుజ తెలుసుకొనుమ మంచిమాట.

.

శుద్ధి లేని మాట శుభము నీకదికాదు
మనసు లేని యాత్ర మహిని వమ్ము ॥
బుద్ధి లేని మనసు బుధజను లనుబాయు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
22.
పొరలు సంతసమ్ము పొందు విద్యలనుండు.
పెద్ద వారి మాట చద్ది ముాట
పెరుగు నీదు విలువ పెంచ జ్ఞాన ధనము
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
23.
పట్టి పట్టి జుాచి పరధర్మ జులరోసి
పెంచ బోకు రణము నెంచు విధము
మానవత్వ మదియె మనిషి ధర్మ మిలను
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
24.
తేనె లొలుకు పలుకు  తేటగీ తులవిందు
తెలుగు భాష మనది తెలుగు వెలుగు
దేశ భాష , నిండు దేశ భక్తియె మెండు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
25.
పచ్చ దనము లెేక ప్రకృతి వికటించ
ప్రబలె రోగ బాధ ప్రజల లోన
కండ్లు విప్పు మయ్య గావ పుడమి నీవు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
26.
అడుగు వదల నట్టి  ఆకాస హార్మ్యాలు
తాగు నీరు మురిగె తావు లేక
జనులు పెరుగ పేరె కలుషితమ్ములుచాల
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
27.
కోరి చెట్లు గొట్టి  కొండ బండలు జేసి
కుార్చునున్న కొమ్మ కుాడి నరుకు
ముార్ఖుడైన మనిషి ముందడుగెటులేయు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
28.
గాలి నీరు లేక గతక గింజలు రాక
మహిని బ్రతుకు లాయె మట్టి పాలు.
భావి భరత చరిత భావించి అడుగేయ
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
29.
డబ్బు డబ్బు యంచు గబ్బులో కాలిడీ
కడుగ నీరు లేక కలత చెందు
కడకు సుఖము లేని కలిమి లేటికి నీకు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
30.
పాడి పంట లెల్ల పరుల కమ్మిన కీడు
పట్టి గొట్టు నిన్ను   పట్టు బట్టి
మాతృ భుామి నీది మర్మ మేటికి నీకు
మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
శీర్షిక  : మనుజ తెలుసుకొను మంచి మాట.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర.
31.
బ్రాహ్మణత్వ మిలను బహుదార్ల బ్రతుకాయె
నిలువు దోపి డీలె  నిత్య పుాజ 
పలుకసత్యమాడు  పాపమేటికి నీకు
మనుజ తెలుసుకొనుము మంచిమాట.॥
32.
  పట్టి కుాటి కొరకు పరుల పంచను జేరు -
పరువు లేని బ్రతుకు పబ్బ మేల ॥
  సొక్కు కృషిని పొందు సోకు సౌఖ్యము మెండు.
  మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
33.
పలుకు మంచి మాట  పరుల కింపగు బాట
పెక్కు మంత్ర ములవి పెంచు సిరులు
పలుకు శాంతి నేల పలుధర్మ  శాస్త్రాలు
.మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥
34.
ప్రాయ మపుడు జేయు పలు ధర్మ కర్మలుా
పెంచు పుణ్య మవియె పెక్కు నిధులు
గురుని గౌరవించు  గుణిగ పంచుము విద్య
.మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥
35.
పుట్టు విలువ రీతి పుణ్య సంస్కృతిడు నీతి
తెలుసు కొనుము యిలను తెలియ కున్న
జ్ఞాను లిడిన గ్రంధ  జ్ఞానవిద్యలబాట
మనుజ తెలుసు కొనుమ మంచి మాట.॥

*********::**************************
శీర్షిక  : మనుజ తెలుసుకొను మంచి మాట. 

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర.

31.
బ్రాహ్మణత్వ మిలను బహుదార్ల బ్రతుకాయె
నిలువు దోపి డీలె  నిత్య పుాజ  
 పలుకసత్యమాడు  పాపమేటికి నీకు 
మనుజ తెలుసుకొనుము మంచిమాట.॥
32.
  పట్టి కుాటి కొరకు పరుల పంచను జేరు -
 పరువు లేని బ్రతుకు పబ్బ మేల ॥
  సొక్కు కృషిని పొందు సోకు సౌఖ్యము మెండు.
  మనుజ తెలుసు కొనుము మంచి మాట॥
33.
పలుకు మంచి మాట  పరుల కింపగు బాట
 పెక్కు మంత్ర ములవి పెంచు సిరులు
 పలుకు శాంతి నేల పలుధర్మ  శాస్త్రాలు
 .మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥
 
 34.
 ప్రాయ మపుడు జేయు పలు ధర్మ కర్మలుా
పెంచు పుణ్య మవియె పెక్కు నిధులు
గురుని గౌరవించు  గుణిగ పంచుము విద్య 
.మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥
35.
పుట్టు విలువ రీతి పుణ్య సంస్కృతిడు నీతి
తెలుసు కొనుము యిలను తెలియ కున్న 
జ్ఞాను లిడిన గ్రంధ  జ్ఞానవిద్యలబాట
మనుజ తెలుసు కొనుమ మంచి మాట॥

మంచి బాట నెంచి మహిలోన  మసలేటి
మనిషి కాన రాడు మాయ గాదె
ధరణి గాచు నిధులు  ధర్మ - న్యాయములేగ
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

చేసి దుష్కృుతములు చేసి యన్యాయమ్ము
 కుాడ బెట్టి సొమ్ము కుళ్ళ బెట్టి
 ప్రజల ఉసురు తగులు ప్రారబ్ద మదియేల
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
 
ధర్మ చింతనేల ధన్యు డౌదువు నీవు
 న్యాయ మార్గ మిడిన మేయ కీర్తి
 మెచ్చు జనులు నిన్ను మేటి గుణుడవంచు
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
 
 మహిని న్యాయ బాట మదిని ధర్మపు చింత
 మనసు కిచ్చు శాంతి , మహిని సుఖము
 యశము లిచ్చు మేటి  యజ్ఞమ్ము  న్యాయము
 మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

చేయకన్యాయమ్ము చేటు నీకది జేయు.
పాప మదియె పండ  పట్టు చీడ
కర్మ ఫలిత మిలను కడుదుఃఖ తరమురా
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

నీతి బాటను నడచు నిత్య సంతోషుండు.
ప్రీతి జేసి పనుల ఖ్యాతి బడయు.
సుఖము నిచ్చు బ్రతుకు సుంతైన చాలుగా 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥



🙏🙏🙏🙏🙏

Thursday, October 27, 2022

ఉపేంద్రవజ్ర ప్రక్రియలో క్రిష్ణ స్తుతి

27/10/2022.
మహతీ సాహితీ కవి సంగమం .
అంశం : శ్రీ క్రిష్ణుడు.
శీర్షిక : శ్రీ క్రిష్ణ  శరణం మమ ॥
ప్రక్రియ : ఉపేంద్రవజ్ర.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .
ఉపేంద్రవజ్రకు గణములు-
IUI    U U I    IUI      U U 
 జ-      త-      జ-     గ-గ

నమొాస్తు  శ్రీకృష్ణ నరాయ ణాయా.
నమొాస్తు నందాత్మ జబాల కాయా.
నమొాస్తు లీలాది విహార పారా
నమొాస్తు శ్రీశాయ సుబాల కాయా ॥ 

నమొాస్తు  దేవాది భిరర్చి తాంఘ్రీం.
నమొాస్తు శాంఖాయు ధచక్ర పాణీం .
నమొాస్తు శ్రీవత్సస వక్ష సాయాం 
నమొాస్తు గోపీ జనపాల మేయం   ॥

నమొాస్తు క్రిష్ణంవర రుాపనంతం
నమొాస్తు భక్తాశ్రిత పారిజాతం .
నమాస్తు గోపీజనలోల బృంగం.
నమొాస్తు వేణుా స్వర గీతలోలం ॥

వికుంఠ వాసాయ అకుంఠ తీర్థం.
సుపాండ వాపక్ష సుపార్ధ మిత్రం.
సుగీత బోధాత్మక  దివ్య గాత్రం 
నమొా నమః శ్రీ పురవేనమస్తే ॥

సమస్త లోకైక సురక్ష కుక్షీం
సమస్త భక్తాగ్రజ  సేవితాక్షాం
సమస్త  సౌభాగ్య సుమంగ ళాయాం
సమస్త భుామండల నాయకాయాం ॥

అనంత శ్రీశేష శయాంగ నాయాం
అనంత సంకల్ప వికల్పనాయాం
దిగంత వ్యాప్తాయ దివాకరాయాం
దశాది రుాపాయ దయాపరాయాం ॥

సునీల దేహాయ శుభాంగ నాయాం
 సువేణు నాదాయ సుగాత్ర మిత్రాం
 సుహేమ భుాషాది సుశోభి తాయాం॥
సుభక్త పోషాయ సుదివ్య చిత్తాం॥

 చతుర్భు జాయాయ సనాత నాయాం
 అనంత నంతాయ అమొాఘకాయాం
 మధుర్వనే బృంద వనే విహాయాం
 వ్రజ జ్జనానందన నంద బాలాం ॥
 
 తమాల భుాషాతులసీ ప్రియాయాం
సుపీత వస్త్రాది  సుదివ్య నేత్రాం   
 చిదంబ రానంద  చరాచరాయాం
శమంత కాదివ్య మణి ప్రకాశాం ॥

కుచేలపాలం బహుబంధు మిత్రం 
సుసచ్చిదానంద  సుదివ్య  క్షేత్రం 
కురుాప కుబ్జాది సురుాప దాతం
నమొాస్తు శ్రీనీల ఘనాయ శ్యామాం  ॥

*****************************

Wednesday, October 26, 2022

స్తోత్రములు

" శ్రీరాజ  రాజేశ్వరీ " స్తోత్రం .
ఛందస్సు : ఇంద్రవజ్ర..
గురు శంకరాచార్యుల ఛందస్సు వైభవము
ఇంద్రవజ్రకు గణములు- 
UUI    UUI     IUI      U U 
త-     త-        జ-..     గ-గ, 
ప్రక్రియ : శ్లోకం.

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర .

---------------------
1.
మాతామ హారాజ్ఞి మతంగ కన్యే
శ్రీమన్మ హాదేవ  సుభాంగపర్ణే. 
శ్రీరాజ  రాజేశ్వరి వంద్యమాన్యే
పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥
2.
కస్తూరి  కాశ్యామల కోమలాంగే
శ్రీమన్మనోజ్ఞే  శ్రితపాద యుగ్మే
శ్రీరాజ రాజేశ్వరి రక్షసఘ్నే (చారు హాసే).
పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥
3.
వందే శుభాంబిక శ్రితాశ్రితాయే
చతుర్భుజే శంకరు వల్ల భాయే 
శ్రీరాజ రాజేశ్వరి దివ్య ముార్తే
పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥
4.
కాదంబ వాటీ కమలాలయాయే..
కస్తుారికా దివ్య సుగంధ మాల్యే
శ్రీరాజ  రాజేశ్వరి శ్యామలాంగే
పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥
5.
కామాక్షి  భుామండల నాయికాయై
వామే స్థితేశంక రురాణి మాన్యే
శ్రీరాజ  రాజేశ్వరి చిత్స్వరుాపే
పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥
6.
వాణీ రమా సేవిత పాద పద్మే
బ్రహ్మేంద్ర దేవాదిభి రర్చితాంఘ్రే
శ్రీరాజ  రాజేశ్వరి సిద్ధి ధాత్రే 
పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥
7.
అవ్యాజ కారుణ్య రసప్రవాహే..
ఆనంద కైలాశ గిరీసు నందే
శ్రీరాజ  రాజేశ్వరి సుదుర్ల భాయే
పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥
8.
 క్షేత్ర స్వరుాపే ధర దైత్య దుారే
ఉన్మేష ణాక్షీ కృతకర్మ సారే 
శ్రీరాజ  రాజేశ్వరి సుయజ్ఞ రుాపే
పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥
9.
శ్రీవేద వేద్యే స్థితి కారణేభ్యే
యంత్రస్వ రుాపేసు స్వతంత్ర రుాపే  
మాతేన వావర్ణ సుబిందు పుార్ణే
పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥
10.
చింతామ ణిద్వీప త్రికోణ మధ్యే
శ్రీచక్ర  మధ్యస్థి తమంత్ర మాన్యే
 హేబిందు రుాపే స్థిత సింహ వాహే
పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥

*****************************

శీర్షిక  : నమామి తం వినాయకం. 

ప్రక్రియ ...పంచ చామరం .(పద్యాలు.)

10వ అక్షరం యతిమైత్రి  ..ప్రాస నియమము గలదు
  గణాలు :    IUI  / UIU / IUI / UIU/  IUI / U
                    జ      ర        జ       ర      జ    గ

శీర్షిక  : నమామి తం వినాయకం. 

ప్రక్రియ ...పంచ చామరం .(పద్యాలు.)

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .

 గణేశాష్టకం .
-----------

1.
నమామి బాల భాస్కరం  నమొాస్తు గౌరి నందనం.
ఉమాసుతం వినాయకం ఉదార చిద్హ్రుదాలయం 
నమామి విఘ్న నాశకం  నమొా శివప్రియం వరం 
సుమంగళప్రదాయకాయ సుందరం గజాననం॥
2.
అపారపార  దివ్య జ్ఞాన  ఆశ పాశ నాశకం 
ఉపాసనాది మౌని వంద్య ఉజ్జ్వల ప్రకాశకం 
నిపాతకాది నిశ్వరం నినాద నాద మడ్వరం ॥
జపాది మంత్ర మొాదితం జగత్ప్రభుం వినాయకం ॥
3.
సరుాప కాబ్జనేత్ర  మిత్ర  సాధు సజ్జనావనం
స్వరుాప వక్రతుండమేయ స్వప్రకాశ  శోభితం 
విరాట్స్వరుాపనే ఘనం విశాల విశ్వ వ్యాపినం 
ధరా గుణాబ్ది శీల మంత్ర  దివ్య గం గజాననం॥
4.
భజేహ మీశ నందనం భజేసు భక్త చందనం 
అజేయ కాబ్జ నేత్ర , కుబ్జ కాయ నాగ్ర పుాజితం
 భుజే భుజంగ పాశ చాప భుాషణాస్త్ర శోభితం
భజే గణేశ వక్రతుండ  భవ్య దివ్య విగ్రహం ॥
5.
అనాధినాధ బంధురం అనేక భక్త సింధురం.
వినాయకా యగోచరం విశాలకాయ భీషణం
ఘనాద్ఘనాది పుాజితం గణేశ మొాదకప్రియం.
జనా-గణాది పాలనం జగత్ప్రభుం గణేశ్వరం ॥
6.      
ధవేసు సిద్ధి దాయకం  ధనాది భిప్రదాయకం
సువేష భుాష శోభితం సుగాత్ర గీత మొాదితం
భవేన్యపారశక్త్యనంత భాగ్య భక్త చింతితం . 
భువేశ్రియం దివాకరం దిశాద్దిగంత వ్యాపినం ॥
7.
యుగాది దివ్య శ్రీముఖం యుగస్వరుాపనేస్వయం
 సుగాత్ర పత్ర పుాజితం సువాద్య నాద మొాదితం  
 జగత్స్వరుాప జేయ జాయ జాగదంబ నందనం 
 నిగర్వ శర్వరీ ప్రియం నిజాద్గణాధి నాయకం ॥ 
8.
భజామవిఘ్నదాయకం  భయాసురారి భంజకం
అజామరాది కీర్తితం  అమంగళాది వారకం     
నజామి  మంత్ర తారకం నజామి తంత్ర  పుాజనం
గజాసు రాననం ఘనం   గణేశ్వరం నమామ్యహం  ॥

**************************************

ఉపేంద్రవజ్రకు గణములు-
IUI    U U I    IUI      U U 
 జ-      త-      జ-     గ-గ

అంశం : శ్రీ క్రిష్ణుడు.
శీర్షిక : శ్రీ క్రిష్ణ ద్వాదశ స్తోత్రం  ॥
ప్రక్రియ : ఉపేంద్రవజ్ర.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .

1.
నమొాస్తు  శ్రీకృష్ణ నరాయ ణాయా.
నమొాస్తు నందాత్మ జబాల కాయా.
నమొాస్తు లీలాది విహార పారా
నమొాస్తు శ్రీశాయ సుబాల కాయా ॥ 
2.
నమొాస్తు  దేవాది భిరర్చి తాంఘ్రీం.
నమొాస్తు శాంఖాయు ధచక్ర పాణీం .
నమొాస్తు శ్రీవత్సస వక్ష సాయాం 
నమొాస్తు గోపీ జనపాల మేయం   ॥
3.
నమొాస్తు క్రిష్ణంవర రుాపనంతం
నమొాస్తు భక్తాశ్రిత పారిజాతం .
నమాస్తు గోపీజనలోల బృంగం.
నమొాస్తు వేణుా స్వర గీతలోలం ॥
4.
వికుంఠ వాసాయ అకుంఠ తీర్థం.
సుపాండ వాపక్ష సుపార్ధ మిత్రం.
సుగీత బోధాత్మక  దివ్య గాత్రం 
నమొా నమః శ్రీ పురవేనమస్తే ॥
5.
సమస్త లోకైక సురక్ష కుక్షీం
సమస్త భక్తాగ్రజ  సేవితాక్షాం
సమస్త  సౌభాగ్య సుమంగ ళాయాం
సమస్త భుామండల నాయకాయాం ॥
6.
అనంత శ్రీశేష శయాంగ నాయాం
అనంత సంకల్ప వికల్పనాయాం
దిగంత వ్యాప్తాయ దివాకరాయాం
దశాది రుాపాయ దయాపరాయాం ॥
7.
సునీల దేహాయ శుభాంగ నాయాం
 సువేణు నాదాయ సుగాత్ర మిత్రాం
 సుహేమ భుాషాది సుశోభి తాయాం॥
సుభక్త పోషాయ సుదివ్య చిత్తాం॥
8.
 చతుర్భు జాయాయ సనాత నాయాం
 అనంత నంతాయ అమొాఘకాయాం
 మధుర్వనే బృంద వనే విహాయాం
 వ్రజ జ్జనానందన నంద బాలాం ॥
 9.
 తమాల భుాషాతులసీ ప్రియాయాం
సుపీత వస్త్రాది  సుదివ్య నేత్రాం   
 చిదంబ రానంద  చరాచరాయాం
శమంత కాదివ్య మణి ప్రకాశాం ॥
10
కుచేలపాలం బహుబంధు మిత్రం 
సుసచ్చిదానంద  సుదివ్య  క్షేత్రం 
కురుాప కుబ్జాది సురుాప దాతం
నమొాస్తు శ్రీనీల ఘనాయ శ్యామాం  ॥
11.
అనంత శ్రీశేష  శయాంగనాయై
చతుర్భు జాంగాయ శుభాంగనాయై 
 త్రిలోక  నాధాయ  విశాల కాయై 
 వికుంఠ నాధాయ నమొా నమస్తే ॥
12.
 కృష్ణా యభేద్యాయ రక్షాకృతాయై
దుష్టారి దుారాయ జయప్రదాయై
వికుంఠ  వాసాయ విశిష్ట ముార్త్యై
వికుంఠ నాధాయ నమొా నమస్తే ॥

*****************************
IUI    U U I    IUI      U U 
 జ-      త-      జ-     గ-గ




మీ పదాలు నా పంచపది*-206లో విజేతగా...

*సప్త వర్ణాల సింగిడి*
*మీ పదాలు నా పంచపది*-206
తేది:26.10.2022
*విజేతలు:* 
*1.కవి కిరీటి:* పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు
*2.కవి మణి:* వరలక్ష్మి యనమండ్ర గారు
*3.కవి వజ్ర*: దినవహి సత్యవతి గారు
*4.కవి రత్న*: డా జి భవానీ కృష్ణ మూర్తి గారు
*5.కవి తేజ:* VVV కామేశ్వరి గారు
*నిర్వహణ:కాటేగారు పాండురంగ విఠల్*
పంచపది రూపకర్త;హైదరాబాద్
*సహ నిర్వహణ:MV ధర్మారావు*

Monday, October 24, 2022

శీర్షిక : స్త్రీ అబల కాదు సబల . (దీపావళి కవిత 2022 )

శీర్షిక :  స్త్రీ  అబల కాదు సబల .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .

క్రీస్తు పుార్వం నుండే జరుగుతున్న 
ఎన్నో అరాచకాలు అన్యాయాలు
నిరంకుసత్వం నిండిన నిజాం పాలనలో
 ప్రబలిన బరువైన బానిసత్వాలు॥
 
 స్త్రీ లకు స్వాతంత్ర్యం లేని 
బ్రతుకు తీపినెరుగనీయని నియంత్రణలు 
ఆచారాల పేరుతో  అణచివేతలు
ఆధిపత్య సాధింపులతో నిండిన అగచాట్లు ॥

ఉద్యమాల బాటలో ఆహుతైన  దేశ ప్రేమికులు
స్త్రీ ల సంక్షేమానికై  ఉబ్నతి నిండిన పథకాలు.
నిరక్షరాస్యత నిండిన జనుల్లో చైతన్యం కలిగించే
 కధలు కావ్యాలు నిండిన విరివైన గ్రంధాలయుాలు॥

రామాయణాది  మహా కావ్యాలలో
మానవత్వపు విలువలు నిండిన 
పాలనా సమర్ధతల సందేశాలు 
గీతా బోధనలో చాటిన జన్మ కర్మ సిద్ధాంతాలు ॥

మన సంస్కృతి  సాంప్రదాయాలలో
సాధించవలసిన మనిషి నడవడికలు 
మన పండగలు పబ్బాలలో
చెడుపై  మంచి సాధించిన విజయాలు ॥

భగవంతుడనే  భావనకిచ్చే ప్రాధాన్యతలు -
లోకాతీత శక్తికి తలవంచిన రాక్షస  ప్రవృత్తులు
అమ్మగా, ఆది అవతారిణిగా స్త్రీ రుాపాలు
 వేల సాహసోపేత శక్తులకు నిదర్శనాలు ॥
 
నేటి చరిత్రలొ ఎన్నో సంకుచిత మనస్తత్వాలు
వావి-వరుసలు మరచిన పాపుల తాపాలు॥
పురుషాధక్యతకు నలిగిపోతున్న 
ఆబలల ఆత్మహత్యలు ॥

 నేటికినీ మారని చరితల సందేశాలు
 మార్గదర్శకత్వం చేస్తున్న పుస్తక పుటలు.
 మంచి నిండిన మార్పు కోరుతుా చేస్తున్న
శాంతియుత ప్రయత్నాల వ్యయ ప్రయాశలు ॥

  ప్రాశస్త్యత  నిండిన మన పండలు పబ్బాలు.
ప్రతీ వత్సరానికి వస్తున్న సదాచారాల సందేశాలు॥
మరచిన చరితలను వెలికితీసే ప్రయత్నాలు.
శక్తి రుాపిణిగా స్త్రీల అవతారాల ఆవశ్యకతలు 
భేద భావాలు చుాపని పురోగతికి సాధనాలు
నేటి రాజకీయ, సాంఘీక, వ్యవహారాల్లో
 మార్పు కోరికల పట్టు కొమ్మలు॥

 నేర్వండి,నేర్పండి మన చరితల్లో దాగిన నిజాలు.
 స్త్రీ  పురుష సమానతల సందేశాత్మక నినాదాలు.
 మన పండగల్లో దాగిన అతి కీలక విషయాలు
నేటి  స్త్రీ లందరుా అరాచకాలనణచివేసేందుకు
సిద్ధమైన సత్యభామలు.॥



Sunday, October 23, 2022

అంశం: దేదీప్యమైన దీపావళి.

24/10/2022.
గోరసం వారి దీపావళి కాంతులు అనే సమూహం కొరకు వ్రాసినది.

అంశం: దేదీప్యమైన దీపావళి.

శీర్షిక : అంతరార్ధ సందేశాల ఆనంద వేడుక.

అంశం :  దేదీప్యమైన దీపావళి .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .


వికశించిన విరులల్లె పసరిన  ప్రకృతి 
పచ్చదనపు వలువ వెలుగుల నిండు ప్రగతి.
అలరించు శోభలతో నిండిన అందమైన భారతి
సాంప్రదాయ  వేడుకలు నిండిన  మేలు సంస్కృతి ॥

నరకాసుర వధకు ప్రతీకగా ఆనంద వేడుకలు
దేదీప్యమైన దీపవళులు నిండిన ఆనంద వేదికలు.
ఈ పుడమి నిండిన దీప కాంతుల వేల వెలుగులు
మానసిక చీకట్లను పారద్రోలే మనవైన పండగలు ॥

మనిషిలోని దాగియున్న వేటాడే మృగాలు
తప్పు అనే చీకటి అమావాస్యకు ప్రతిరుాపాలు.
సత్యమనే బాటలో నిండిన కలుపు మొక్కలు.
ధర్మం నిండిన తుాణీరాల వేటుకు
 కుాలుతున్న పైశాచిక ముళ్ళు॥

ఆనందపు పలకరింపుల వరుస బంధాల్లో-
 అందరుా ఒక్కటైన ఆనంద క్షణాలు.
పండగ పలకరింపుల మానవ సంబంధాలు.
అందరు ఒక్కటైన సమత మమతల కాంతి పుంజాలు॥

నాగరికత పేరుతో  తిరిగే నగర పిశాచాలు.
తల్లి భారతి ప్రగతి బాటను శాసిస్తున్న అవరోధాలు.
అబలలనుకున్న స్త్రీ శక్తికి నిండైన నిదర్శనాలు 
దీపావళి పండగలో నిక్షిప్తమైన నిజమైన సందేశాలు ॥


హామీపత్రం: ఈ కవిత కేవలం గోరసం కొరకు మాత్రమే వ్రాసినది..ఈ కవిత మరే ఇతర మాధ్యమాలలో కానీ, సమూహాలలో కానీ ప్రచురితం కాలేదని హామీఇస్తున్నాను. 




Saturday, October 22, 2022

బాల సాహిత్యం .

22/10/2022.
మహతీ సాహితీ కవి సంగమం.
బాల సాహిత్యం .
ప " గుణింత పదాలతో..
శీర్షిక  : జన్మకు సార్ధకత .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర 


పలుకు తేనె లొలుకు  మెరుగు భాషల తల్లి 
పిలుపు వలపుల వల్లి  సమత మమతల మల్లి
పసిడి పంటల శోభ సాంప్రదాయపు మెరుగు
పడతి  భారతి మనకు  పంచు వెన్నెల వెలుగు ॥

పుాల వనములు నిండు పుడమి సారము నందు
పికము- సుకములు యున్న తరుల సిరులే మెండు  
పచ్చదనమును పంచు ప్రకృతి వనరులయందు
పలు ఓషధులు నిండు వన ముాలికలు మెండు

పరుగులిడెడు నదుల,ఝరులె యందముసుండు
పెక్కు సంపదలున్న ఖనిజ సంపద విందు.
పారు నీటిని నిండు జలరాసులెన్నెన్నొ
 పొంగు సాగరమందు దాగు నిధులను కండు॥
 
 పిల్ల పాపల బలము- పాడి యావుల పురము
పాలు వెన్నలు కురియు- పుష్కలంబుగ గనుము
- పలికేటి మంత్రములు పలు ధర్మ శాస్త్రములు
పరుల నొప్పించకుమను  -ఫల నీతి చంద్రికలు ॥

పుట్టు విలువల రీతి పలు సంస్కృతుల నీతి
పుణ్య గ్రంధ పఠనముతొ పట్టు నీ నడత 
పుణ్య చరితల కధలు జీవితాలకు వెలుగు
పుాజించు కొలువులకు  పుణ్య భుామియె నెలవు ॥

పలుకు మన భాషను పాటించు సంస్కృతిని 
పుడమి జన్మ మనది మన తల్లి భారతి
పేరు పేరున శుభము వాడ వాడలు ఘనము
ప్రజ్ఞాశాలుల జ్ఞాన  విద్య మేధల గనుము ॥

పెరుగు చద్ది ముాట పెద్దవారల మాట
పేచి వలదు చదువ పెద్దబాలశిక్ష
పొరలు సంతసమ్ము పొందు విద్యలనుండు.
పోరు పెట్టకెపుడు  జోరు నెపుడు ॥

పట్టి గౌరవించు మన జన్మ భుామిని
పాటించు  తల్లిదండ్రి జెప్పేటి మాటను.
పదములంటీ గురుల ఆశీస్సులను గొనుము
పలుక మంత్రములివియె  పలుధర్మాచరణములు ॥

పొందినట్టి జన్మ సార్ధకతను పొంద
పాటించు పద్ధతుల పరధర్మముల విడచి.
పరగ జాతులు వేరు ధర్మంబు లొక్కటే
పలుక సుభాషితములు పెరుగు మమత ॥


19)
శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి కల్యాణ్ గారు మీ 
శీర్షిక  : జన్మకు సార్ధకత .👌
పలుకు తేనె లొలుకు  మెరుగు భాషల తల్లి ----
పెక్కు సంపదలున్న ఖనిజ సంపద విందు.👌
పిల్ల పాపల బలము-
పాడి యావుల పురము👌
పలుకు మన భాషను
------
పేచి వలదు చదువ పెద్దబాలశిక్ష👌
 జన్మ సార్ధకతను పొంద
పలుక సుభాషితములు పెరుగు మమత ॥
👉 మీ సాహిత్యం మంచి విలువలతో చాలా బాగుంది. అభినందనలు 🙏🎉💐


బాల సాహిత్యం ..".ప " గుణింతాక్షరాలతో...

22/10/2022.
మహతీ సాహితీ కవి సంగమం 
అంశం : బాల సాహిత్యం .
ప " గుణింత పదాలతో..
శీర్షిక  : జన్మకు సార్ధకత .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర 


పలుకు తేనె లొలుకు  మెరుగు భాషల తల్లి 
పిలుపు వలపుల వల్లి  సమత మమతల మల్లి
పసిడి పంటల శోభ సాంప్రదాయపు మెరుగు
పడతి  భారతి మనకు  పంచు వెన్నెల వెలుగు ॥

పుాల వనములు నిండు పుడమి సారము నందు
పికము- సుకములు యున్న తరుల సిరులే మెండు  
పచ్చదనమును పంచు ప్రకృతి వనరులయందు
పలు ఓషధులు నిండు వన ముాలికలు మెండు

పరుగులిడెడు నదుల,ఝరులె యందముసుండు
పెక్కు సంపదలున్న ఖనిజ సంపద విందు.
పారు నీటిని నిండు జలరాసులెన్నెన్నొ
 పొంగు సాగరమందు దాగు నిధులను కండు॥
 
 పిల్ల పాపల బలము- పాడి యావుల పురము
పాలు వెన్నలు కురియు- పుష్కలంబుగ గనుము
- పలికేటి మంత్రములు పలు ధర్మ శాస్త్రములు
పరుల నొప్పించకుమను  -ఫల నీతి చంద్రికలు ॥

పుట్టు విలువల రీతి పలు సంస్కృతుల నీతి
పుణ్య గ్రంధ పఠనముతొ పట్టు నీ నడత 
పుణ్య చరితల కధలు జీవితాలకు వెలుగు
పుాజించు కొలువులకు  పుణ్య భుామియె నెలవు ॥

పలుకు మన భాషను పాటించు సంస్కృతిని 
పుడమి జన్మ మనది మన తల్లి భారతి
పేరు పేరున శుభము వాడ వాడలు ఘనము
ప్రజ్ఞాశాలుల జ్ఞాన  విద్య మేధల గనుము ॥

పెరుగు చద్ది ముాట పెద్దవారల మాట
పేచి వలదు చదువ పెద్దబాలశిక్ష
పొరలు సంతసమ్ము పొందు విద్యలనుండు.
పోరు పెట్టకెపుడు  జోరు నెపుడు ॥

పట్టి గౌరవించు మన జన్మ భుామిని
పాటించు  తల్లిదండ్రి జెప్పేటి మాటను.
పదములంటీ గురుల ఆశీస్సులను గొనుము
పలుక మంత్రములివియె  పలుధర్మాచరణములు ॥

పొందినట్టి జన్మ సార్ధకతను పొంద
పాటించు పద్ధతుల పరధర్మముల విడచి.
పరగ జాతులు వేరు ధర్మంబు లొక్కటే
పలుక సుభాషితములు పెరుగు మమత ॥

Monday, October 17, 2022

పంచ చామరం.పద్యాలు

శీర్షిక  : నమామి తం వినాయకం. 

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .

గణేశ స్తుతి :
-----------
నమామి బాల భాస్కరం  స్మరామి విఘ్న నాశకం
కృపానిధిం దయామయం కరోమి మంగళం శుభం .
భజామి పార్వతీ ప్రియం గజాననం గణేశ్వరం
గుణేశ్వరాసపీతవర్ణ కాయ గౌరినందనం   ॥

భజేగణేశ వక్ర తుండ ముాషికాసు వాహవే
సురుాపకాబ్జ నేత్ర మిత్ర  సాధు సజ్జనావనే
ఘనాసురుాప లంబ కుక్షి సార నేక దంతనే
దయా గుణాబ్ది శీల దివ్య మంత్ర గం గజాననే॥

సురుాప దువ్య శ్రీముఖం సమస్త విఘ్న వారకం
 సుగంధ పత్ర పుాజితం సరోజ పుష్ప భాసితం
 కరే క్షుపాశ శోభితం  గళేసు దివ్య  భుాషితం 
సురారి గర్వ భంజనం నతా గణాది పాలనం  ॥ 

కృష్ణ పింగ ళాక్షనే సువిశ్వ ధర్మ పాలనే
నమొాస్తు సర్వ శక్త్యపార నేభుజంగ భుాషణే 
సుమొాదకప్రియే ఘనే సువాద్య మొాదితే గుణే 
నమామి మంగ ళప్రదే ప్రణామ్య హం గజాననే ॥

అనాధ నాధ బంధురం అనేక భక్త సింధురం
అమేయ భక్త పోషకం నమామితం వినాయకం .
అగమ్య గోచరాంత కాల కాళ కాల భీషణం 
అకారుకారమంత్ర రుాపనేక దైత్య భంజనం ॥

సహిష్ణు జిష్ణవే శివం  బహిర్దశాది రుాపకం
భయానకం ధరంప్రభుం ధరిద్ర నాశకం శుభం ॥

సరస్వతీ స్తుతి.
---------------

నమొాస్తు వాణి కోమలే నమొాస్తు సర్వ మంగళే
నమొాస్తు బ్రహ్మ నాయికే నమొాస్తు హంస వాహికే
సువేద  మంత్ర పీఠికే   సువాద్య నాద మొాదితే
సుసత్యలోక వాసినే సమస్త దుఃఖ వారిణే  ॥ 
విలోల లోల లోచనే  విశుద్ధ జ్ఞాన  దాయినే

నమామి వాగ్వి లాశినీ  నమొాస్తు భ్రహ్మ ణీఘనీ
నమొాస్తు విద్య దాయినీ నమొాస్తు గీత మొాదినీ
నమొాస్తు సుస్వరాకృతే నమొాస్తు స్వప్రకాశికే
నమొాస్తు వీణ వాదకే నమొాస్తు వాణి పావకే॥



మహా సువిద్య గాన వాద్య మాల సుాత్ర ధారిణే
అకా రుకార గద్య పద్య   అక్షర స్వరుాపిణే.
సుద్ధ శబ్ద వాక్తరంగ  శాస్త్రమంత్ర రుాపిణే 
నమొా సమస్త వాగ్మయేన నంత విశ్వ వ్యాపినే ॥

గురు స్తుతి :
----------
అనేక శాస్త్ర మంత్ర సార వేద విద్య పాననం
ధరేణ దివ్య దేవతా స్వరుాప గర్వ కారణం.
సబ్రహ్మ విష్ణు ఈశ రుాప ధర్మ మార్గ కామనే
సదా స్మరామి గుర్వరం నమామి పాద పంకజం ॥


జయంతనంత జ్ఞాన పాన బ్రహ్మ పుత్ర పాహిమాం
దయాబ్ది సార తత్పరం గుణాబ్ది జ్ఞాన బోధనం
అనంతవాగ్విచక్షణాయ నంత సత్య మానసం 
సురాసురేశు గుర్వరం   నమామి పాద పంకజం ॥

సురాసురేంద్రవంద్య మాన సుాక్ష్మ సాదు దృక్పథం 
బృహస్పతాది దేవ వంద్య వాగ్విచక్ష సుందరం
సుసర్వవేదనన్త విద్య విద్వరాయ తేనమొా
సుబ్రహ్మ పుత్ర  పుాజ్యనే బృహద్రథాయ వందనం  ॥

**********

స గురుం నమామి పాద పంకజం ॥

 సబ్ర హ్మసు వి ద్యావిశారదాయ నమః

 
ప్రథమ్య గౌరి నందనం  ద్వితీయ నేక దంతనే
 తృతీయ క్రిష్ణ పింగళం చతుర్ధ భక్త వత్సలం 
 సపంచమంపరాత్పరేశ  దుష్ట విఘ్న నాశకం
 సుష ష్టమం గణాధిపాయ దివ్య పాద పంకజం 
 సుసప్త తాళవాద్య భేద్య గీత నాట్య రంజకం 
భయాష్ట కష్ట నాశకం దయాబ్ది సార సన్నుతం  
నవగ్రహాధిదేవ వంద్యతం గణాది పాల 

సఫాలచంద్ర శోభితం సుబాలకం వినాయకం
అవిఘ్న కార్య కారకం అజేయ సిద్ధి దాయకం
సయేక దంత నంత కాయ సమే సమొాద కప్రియం సు పుత్ర గౌరి శంకరం సు వక్త్ర దంతి శోభితం

బ్రతుకు పోరాటం. కవిత

17/10/2022.
మహతీ సాహితీ కవి సంగమం 
చిత్రకవిత -13
శీర్షిక : బ్రతుకు పోరాటం .

ప్రక్రియ : ఇష్టపది .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర 

కాయ కష్టముతోడ కన్నవారిని సాక
కదలి పోతున్నాడు కధకుడతడేచుాడు.
భుామి పుట్రలుపోయె భుక్తి కరువైపోయె
కాలు కడుపును, కలియె కాటు వేసిందాయె॥

నమ్మిన మట్టిలోని నాటిన విత్తనాలు 
 ఊపిరికే  బరువాయె ఉచ్చులై బిగువాయె
పంట రాబడిలేక  ఫలము దిగుబడి రాక
కర్షకుడే చితికెగ  కన్నీరై కురిసెగ ॥

 పడని చినుకు బరువై  పచ్చ దనము కరువై  
ఎడ్లు యెండిపోయెగ ఎగసి గుండె పగిలెగ
బీడు వారు భుామిని విడుచుటే నయమనీ
తలచి రైతు కదలెగ వలచు పల్లె నొదలెగ ॥

కల్లలైన కలలవె కన్నీరై  పారెను 
మారెను రోజులవని మనసు సర్ది జెప్పెను.
బ్రతుకుకు దారి లేక బంధాలు విడలేక
పట్న బాట వలసిడె  పలుక దుఃఖ మేలగ ॥

ముక్కు పచ్చలారని ముద్దుగారు పిల్లలు
మురిసి పయనమాయిరి ముచ్చట్లను తేలిరి.॥
చక్రాల చెక్కనదె  చేర్చిరెడ్ల(ఎడ్లు) వెనుకకు
ఎడ్ల మెడకు తాడిడి  ఎక్కె పీట వడి వడి.

అభము శుభము నెరుగరు అమాయకపు పిల్లలు 
తండ్రి బాధ నెరుగని తహ తహల పిల్లలు
గొడ్డు గోదల నొదలి గొంతు పెగలని మజిలి
దిగజారె వెన్నెముక దిక్కెవరుర మనకిక ॥

************************::::**********

Friday, October 14, 2022

బాల సాహిత్యం ....అబ్దుల్ కలామ్ .

15/10/2022
బాల సాహిత్యం 
అంశం : అబ్దుల్ కలాం 
శీర్షిక : పిల్లల్లారా రారండోయ్ ...
(గేయ కవిత)
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర 

ఆటలు ఆడీ పాటలు పాడీ 
అల్లరి చేసే పిల్లలుా..
అబ్దుల్ కలాము కధ చెపుతాను
 వినరారండే తల్లులుా ॥
 
భరత భుామిని తమిళనాడులో
ధనుష్కోటి శ్రీరామేశ్వరమున...
జన్మించెను శ్రీ అబ్దుల్ కలాము .
ఇస్లామ్ ఆతని మతము మాన్యము॥  ॥

ప్రొఫెసరుగా పని చేశాడుా..
రచనలు ఎన్నో రాసాడుా.
ఏరోస్పేసుకు ఇంజనీరుగా 
క్షిపణులెన్నొ కనుగొన్నాడు ॥

భారతదేశపు ఉన్నత పౌరుగ
పురస్కారముల నందాడు ॥
భారతరత్నగ ,బిరుదు అవార్డుల 
కీర్తి ప్రతిష్టలు పొందేడు ॥

 మంచి నడతలే  మన వ్యక్తిత్వము  
జ్ఞానమె,సంపదలన్నాడు.
నీతి -నిజాయతి ప్రతిఫలించుటే
మనిషి కందమిడు సిరులన్నాడు ॥

అపజయాలిడిన అనుభవాలె మన
బాటకు విజయపు పథమన్నాడు.
భువిని జన్మ ,నీ ఉనికి నడతలవి
చరితలకెక్కుటె ఘనమన్నాడు॥

 కలలు నిద్రలో గనుట మానుము
 కల సాకారము చేయుటె ధ్యేయము
 తలరాతలు మార్చును సంకల్పము
 గెలుపు బాటలో నడువన్నాడు॥
 
 నీతులు ఎన్నోచెప్పేడుా
 నిజమౌ గురువుగ నిలిచేడుా
 పిల్లల భవితకు స్ఫుార్తిగ నిలచి
 చివరిస్వాశనే వదిలాడుా ॥

అందరి మదిలో నిలిచాడు
ఆతని జయంతి ఈనాడు.
నిరాడంబరుడు నిత్య సంతోషుడు
కలాము చాచా అందరివాడు ॥

*********************** 
 
 






అబ్దుల్ కలాం ...బాల సాహిత్యం.

15/10/2022
మహతీ సాహితీ కవితా సంగమం
బాల సాహిత్యం 
అంశం : అబ్దుల్ కలాం 
శీర్షిక : పిల్లల్లారా రారండోయ్ ...
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర 



ఆటలు ఆడీ పాటలు పాడీ 
అల్లరి చేసే పిల్లలుా..
అబ్దుల్ కలాం కధ చెపుతాను
 వినరారండే తల్లులుా ॥
 
భరత భుామిని తమిళనాడులో
ధనుష్కోటి శ్రీరామేశ్వరమున...
జన్మించెను శ్రీ అబ్దుల్ కలాము .
ఇస్లామ్ ఆతని మతము మాన్యము॥  ॥

ప్రొఫెసరుగా పని చేశాడుా..
రచనలు ఎన్నో రాసాడుా.
ఏరోస్పేసుకు ఇంజనీరుగా 
క్షిపణులనే కనుగొన్నాడు ॥

భారతదేశపు అత్యున్నత పౌర 
పురస్కారమునుపొందాడు ॥
భారతరత్నగ ,అవార్డు జేతగ 
కీర్తి ప్రతిష్టలు పొందేడు ॥

వ్యక్తిత్వము సరి మంచి నడతలే
జ్ఞానపు  సంపదలన్నాడు.
అపజయాల ఆ అనుభవాలె మన
బాటకు విజయపు పథమన్నాడు.॥

జన్మించుటనీ గొప్పకాదు సరి-
మరణము  చరితను నిలుపన్నాడు.
నిజాయతీ ప్రతిఫలించు మొామే
మనిషి కందమిడు సిరులన్నాడు ॥

 కలలు నిద్రలో గనుట మానుము
 కల సాకారము నీ కర్తవ్యము
 తలరాతలు మార్చదినీ  ధ్యేయము .
 గెలుపు బాటలో నడువన్నాడు॥
 
 నీతులు ఎన్నోచెప్పేడతడు
 నిజమౌ గురువుగ నిలిచేడతడు
 పిల్లల భవితకు స్ఫుార్తిగ నిలచి
 చివరిస్వాశనే వదిలేడతడు ॥
 
 



శ్రీరాజ రాజేశ్వరీ స్తోత్రం

 14/10/2022.
మహతీ సాహితీ కవి సంగమం
నేటి ఐచ్ఛికంలో
" శ్రీరాజ  రాజేశ్వరీ " స్తోత్రం .
ఛందస్సు : ఇంద్రవ్రజ.
గురు శంకరాచార్యుల ఛందస్సు వైభవము
ఇంద్రవజ్రకు గణములు- త-త-జ-గ-గ, 
ప్రక్రియ : శ్లోకం.

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర .

---------------------
1.
మాతామ హారాజ్ఞి మతంగ కన్యే
శ్రీమన్మ హాదేవ  సుభాంగపర్ణే. 
శ్రీరాజ  రాజేశ్వరి వంద్యమాన్యే
పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥
2.
కస్తూరి  కాశ్యామల కోమలాంగే
శ్రీమన్మనోజ్ఞే  శ్రితపాద యుగ్మే
శ్రీరాజ రాజేశ్వరి రక్షసఘ్నే (చారు హాసే).
పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥
3.
వందే శుభాంబిక శ్రితాశ్రితాయే
చతుర్భుజే శంకరు వల్ల భాయే 
శ్రీరాజ రాజేశ్వరి దివ్య ముార్తే
పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥
4.
కాదంబ వాటీ కమలాలయాయే..
కస్తుారికా దివ్య సుగంధ మాల్యే
శ్రీరాజ  రాజేశ్వరి శ్యామలాంగే
పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥
5.
కామాక్షి  భుామండల నాయికాయై
వామే స్థితేశంక రురాణి మాన్యే
శ్రీరాజ  రాజేశ్వరి చిత్స్వరుాపే
పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥
[14/10 22:56] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: ⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️
*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*
*ప్రతిరోజూ కవితా పండుగే (14-10-2022)*

*ఉత్తమ రచనలు*

శ్రీ/శ్రీమతి:
----------------------------
1.యేచన్ చంద్రశేఖర్
2.ఎస్.రత్నలక్ష్మి
3.యర్ర శ్రీదేవి
4.సింహాద్రి వాణి
5.ముక్కా సత్యనారాయణ
6.ముత్యం వెంకటేశ్వరరావు
7.శిరీష వూటూరి
8.మేకల సైదులు
9.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు
10.మేడిశెట్టి యోగేశ్వరరావు
11.బత్తిన గీతా కుమారి
12.ఎం.వి.ఉమాదేవి
13.గంజి శ్రీనివాసులు
14.ప్రభా జ్యోత్స్న
15.టి.ఆర్.కె.కామేశ్వరరావు
16.మేడిశెట్టి యోగేశ్వరరావు
17.నారోజు వెంకట రమణ
18.పొర్ల వేణుగోపాలరావు
19.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
20.దీకొండ చంద్రకళ
21.డా.బల్లూరి ఉమాదేవి 

*పర్యవేక్షక,నిర్వాహక & సమీక్షక బృందము*
💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Thursday, October 13, 2022

శ్రీరాజ రాజేశ్వరీ " స్తోత్రం .

శ్రీరాజ  రాజేశ్వరీ " స్తోత్రం .
ఛందస్సు : ఇంద్రవ్రజ.
గురు శంకరాచార్యుల ఛందస్సు వైభవము
ఇంద్రవజ్రకు గణములు- త-త-జ-గ-గ, 
ప్రక్రియ : శ్లోకం.

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర .

---------------------
1.
మాతామ హారాజ్ఞి మతంగ కన్యే
శ్రీమన్మ హాదేవ  సుభాంగపర్ణే. 
శ్రీరాజ  రాజేశ్వరి వంద్యమాన్యే
పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥
2.
కస్తూరి  కాశ్యామల కోమలాంగే
శ్రీమన్మనోజ్ఞే  శ్రితపాద యుగ్మే
శ్రీరాజ రాజేశ్వరి రక్షసఘ్నే (చారు హాసే).
పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥
3.
వందే శుభాంబిక శ్రితాశ్రితాయే
చతుర్భుజే శంకరు వల్ల భాయే 
శ్రీరాజ రాజేశ్వరి దివ్య ముార్తే
పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥
4.
కాదంబ వాటీ కమలాలయాయే..
కస్తుారికా దివ్య సుగంధ మాల్యే
శ్రీరాజ  రాజేశ్వరి శ్యామలాంగే
పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥
5.
కామాక్షి  భుామండల నాయికాయై
వామే స్థితేశంక రురాణి మాన్యే
శ్రీరాజ  రాజేశ్వరి చిత్స్వరుాపే
పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥
6.
వాణీ రమా సేవిత పాద పద్మే
బ్రహ్మేంద్ర దేవాదిభి రర్చితాంఘ్రే
శ్రీరాజ  రాజేశ్వరి సిద్ధి ధాత్రే 
పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥
7.
అవ్యాజ కారుణ్య రసప్రవాహే..
ఆనంద కైలాశ గిరీసు నందే
శ్రీరాజ  రాజేశ్వరి సుదుర్ల భాయే
పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥
8.
 క్షేత్ర స్వరుాపే ధర దైత్య దుారే
ఉన్మేష ణాక్షీ కృతకర్మ సారే 
శ్రీరాజ  రాజేశ్వరి సుయజ్ఞ రుాపే
పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥
9.
శ్రీవేద వేద్యే స్థితి కారణేభ్యే
యంత్రస్వ రుాపేసు స్వతంత్ర రుాపే  
మాతేన వావర్ణ సుబిందు పుార్ణే
పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥
10.
చింతామ ణిద్వీప త్రికోణ మధ్యే
శ్రీచక్ర  మధ్యస్థి తమంత్ర మాన్యే
 హేబిందు రుాపే స్థిత సింహ వాహే
పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥



M . వెంకయ్యనాయుడు

అంశం : M. వెంకయ్యనాయుడుగారు.
శీర్షిక  : ప్రగతికెక్కిన చరిత

ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీత.
..
రచన : శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర .
8097622021

భారతీయ జనతాపార్టీ  అధ్యక్షుడు
గ్రామీణాభివృద్ధికై కేంద్రక్యాబినెట్ మంత్రిగా
రాజ్యసభ ఛైర్మన్ గా ప్రమాణస్వీకారం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥

అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో ప్రత్యేకత 
సంఘాధ్యక్షుడిగా సమాజ హిత .
ఆంధ్రోద్యమంలో ప్రముఖ పాత్ర
చుాడచక్కని తెలుగు సున్నితంబు. ॥

ఎమర్జెన్సీకి వ్యతిరేకిగా జైలుశిక్ష.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపోరు 
వక్తగా వక్తృత్వ నైపుణ్యత.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥

గ్రామ్ సడక్ యోజనలు
ప్రజా సంస్కరణల పథకాలతో
జనాదరణ పొందిన నాయకుడు
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥

మాతృబాషను  గౌరవించే వ్యక్తి
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుని శక్తి
పేదరికపు నిర్ముాలనకు స్ఫుార్తి.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥

Tuesday, October 11, 2022

శీర్షిక : మనుజ తెలుసు కొనుమ మంచి మాట .



⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*
*ఉత్తమ పద్యకవులు:(12-10-2022)*
శ్రీ/శ్రీమతి 

1. డా. కురవి వేంకట కృష్ణశాస్త్రి గారు
2. డా. వేదాల గాయత్రీదేవి గారు
3. మగటపల్లి రామచంద్రరావు గారు
4. గుడిపూడి రాధికారాణి గారు
5. ఎలగందుల లింబాద్రి గారు
6. కొంటికర్ల లలిత గారు
7. పోతుకుచ్చి రాజశేఖర్ గారు
8. పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు
9. ఎం.వి.ఉమాదేవి గారు
10. మీసాల చినగౌరినాయుడు గారు
11. గద్వాల సోమన్న గారు
12.డా.సూర్యదేవర రాధారాణి గారు
13. గడ్డం కృష్ణా రెడ్డి గారు
14. పోగుల భాగ్యలక్ష్మి గారు
15. సింహాద్రి వాణి గారు
*********************
*పర్యవేక్షక,నిర్వాహక & సమీక్షక బృందము*
💐💐💐💐💐💐💐💐💐💐💐💐

శీర్షిక  : మనుజ తెలుసు కొనుమ మంచి మాట .

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర .
.1.
కోర్కె లుండ వచ్చు కోర తగిన యంత
తీరు కొలది కోర్కె  తీరు హెచ్చు
కోర్కె తీరకున్న క్రోధంబు హెచ్చుగా
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
2.
ఆశ పోతు తనము ఆశయ లోపమ్ము
కలుగ జేయు నదియె కడుని రాశ
కడకు కోర్కె తీర కాని పనుల జేయు
లంచ గొండి యైన లక్ష ణముల ॥
3.
పులిని జుాచి నక్క పుార్తివాతల దేలు
చంద మదియె గాద చాలు ఆశ
స్వార్ధ గుణము పెరుగు స్వస్థతేలడు ప్రాణి
మనసు మలిన మౌను మహిని మనుజ ॥
4.
కడకు పతన మొందు  కర్మ మిగులు నీకు
మితము జీవి తమ్ము మిగులు భువిని
కోర్కె యున్న మనిషి కోల్పోవు సుఖమును
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
5.
విద్య లెన్నొ నేర్చి వినుతి కెక్కుము నీవు
జ్ఞాన ధనులు చెడరు జగము నందు
సాహితీ వనమదె సరికోర్కె విహరింప
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
6.
చిన్న తనము యంచు చిన్నతప్పులుజేయ
తప్పు లొప్పు లౌన తప్పు తప్పే.
తప్ప లెంచ నీక తగురీతి మనుటకై
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
7.
విషయ వినయము లవి విద్య తోడనెవచ్చు
సార విద్య నబ్బు సభ్య తిలను.
మంచి మాట నోట మంది మెచ్చిన బాట
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
8.
తల్లి తండ్రి గురువు  తగురీతి బోధించు
చక్క నైన మాట చద్ది ముాట.
అనుభవాలు నేర్పు నవెగాద సుఖబాట
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
9.
ప్రథమ పాఠ శాల ప్రారంభ మింటితో
తోడు తల్లి దండ్రె తొలి గురువులు.
గారవించుమెపుడు ఘనమైన రీతిలో
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
10.
సార మైన బ్రతుకు సజ్జనుండదె కోరు.
సద్గుణములు నేర్వ  సమయ మిడుమ.
సత్య మేగ జయము  సచ్చరిత యెధనము
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥

********************************

12/10/2022
మహతీ సాహితీ కవి సంగమం .
అంశం : నీతి.
శీర్షిక  : మనుజ తెలుసు కొనుమ మంచి మాట .
ప్రక్రియ : ఆటవెలది .
రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర .
11.
చిన్న పిల్ల లింట చిందులే యుచునున్న 
ముచ్చటౌను మనకు  ముద్దు మీర.
మాటలొచ్చు వయసు  మంచి మాటలు నేర్పు
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
12.
పిన్న వయసు లోనె పిలచి సుద్దులు నేర్ప
లోక మందు మసల లోటు రాదు.
మితము మాటలాడి మించుగౌ రవమంద
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
13.
కట్టు బొట్టు తీరు కడు సభ్యతల నేలు
భరత భుామి కీర్తి బడయు వెలుగు
సాంప్రదాయ ములవి సద్ధర్మ  పథములు
మనుజ తెలుసుకొనుమ మంచిమాట ॥
14.
అమ్మ చెల్లి అక్క యైనవా రనుచును
రక్త బంధములని రక్షణిడుచు
పరుల స్త్రీల జుాడ పరాచికములేల..?
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
15.
ఆడ పిల్ల లింట నా లక్ష్మి రుాపాలు.
మెట్టి నింటి వారి మేలు కోరు
అన్ని రుాపు లేలు నాశక్తి రుాపాలు
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
16.
పొల్లు మాట లాడి పోట్లాట లిడునట్టి
నరుని గుణము  మహిని నగవు పాలు.
మంచి నడత తోడ మహిలోన మననీవు.
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
17.
మితము మాటలాడు మీరజాలకు హద్దు
హీన పడని మాట హితవు నీకు.
అతిగ మాటలాడ అలుసౌదు విలలోన.
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
18.
అమ్మ అక్క చెల్లి యనురక్త బంధమ్ము..
లాదరింతువు గద యవని నీవు
యెదుటి, స్త్రీలను గన యేటికిీ మేలము  
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
19.
ఆడ పిల్ల లింటి, అమ్మతల్లులు వారు
శక్తి రుాపు దాల్చు .శతృ వెదుట .
వారు శాపము నిడ  వదలిపోవుసిరులు
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
20.
కల్ల మాటలాడి కపటివై మెలగుచుా
చేయు బాస లెల్ల చెడపు నిన్ను.
నమ్మ రెవరు సుమ్మ నామాట నిజమన్న 
మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥

*********************************


ఒంటరితనం ...మినీ కధ .

అంశం : ఒంటరితనం.
శీర్షిక  : ఒంటరితనం ఒక శాపం

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ :  మహారాష్ట్ర .


ఆసుపత్రిలో స్పెషల్  వార్డ్ లో మెత్తటి పరుపు పై పడుక్కున్నా..అసహనంగా కదులురున్నారు రావుగారు.
భార్య పిల్లలు గుర్తుకు వస్తున్నారు.
కొన్ని నెలలైంది వాళ్ళని చుాసి.
అన్ని సదుపాయాలుా సమకుార్చేరు. 
కానీ ఏం ?
లాభం ..
తనను ఒంటరివాణ్ణి చేసి వదలి వెళ్ళేరు.
కానీ ఈ వయసులో తనీ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాడు. తన బేగ్ లో పిల్ల 
లు సంతకం చేసిన "చెక్" లు ఉన్నాయి.
ఎంత డబ్బు  కావాలన్నా "డ్రా" చేసుకోమన్నారు.
డబ్బిచ్చేస్తే సరిపోతుందా........
డబ్బిస్తే.....
సడన్ గా తన మాట తనకే అప్పజెప్పిన ఫీలింగ్ ...
కళ్ళు ముాసుకున్న రావు గారికి గతమంతా 
ఒక్కసారి కళ్ళముందు కదిలింది.

తమ తండ్రి ,తాత, ముత్తాతలు చాలా డబ్బు గలవాళ్ళు.
డబ్బుగల అహంకారం తనలో కుాడా చాలా ఉండేది.
ఎవరినీ లక్ష్యపెట్టేవాడు కాదు.
తనకంటుా ఒక్క స్నేహితుడు కుాడా  ఉండేవాడు కాదు. డబ్బు చాలా మందిని తన చుట్టుా తిప్పించింది. అందుకనే మనిషి విలువ తెలియలేదు. డబ్బుంటే చాలు.అన్ని ఆనందాలుా వాటంతట అవే తన సొంతమౌతాయన్న భావన తన మనసులో స్థిరపడిపోయింది.
తను తన పెళ్ళైన నలభైయ్యేళ్ళ జీవితంలో 
డబ్బెలా సంపాదించాలా....అనే ఆలోచించేడు.
భార్యతో ఒక్కసారైనా సమంగా మాట్లాడడంగానీ , బయటకు తీసుకెళ్ళడంగానీ చెయ్యలేదు. దాంతో వంటరైన ఆమె
నాలుగు గోడల మధ్య  పని నిండిన రాట్న మయ్యింది. .
తనను ఒక్కసారైనా బయటకు తీసుకెళ్ళమని ప్రాధేయపడింది. చేతిలో కొంత డబ్బు పెట్టి" నీకు కావలసిన చోటికి నువ్వే వెళ్ళు" అన్నాడు.
"మీరు లేకపోతే  నాకేం సరదా" ..అంది.
డబ్బిచ్చానుగా...అన్నాడు.
ఒంటరితనం నిండిన బాధతో వచ్చిన  ఆమె కన్నీళ్ళకు తను అప్పుడు విలువ ఇవ్వ లేదు..
పిల్లలు పుట్టేరు.  పెద్దవాళ్ళవుతున్నారు.చదువు విషయంలో నాన్నగా దండించడం తోపాటు 
కొంచం ఎక్కువగానే భయం కుాడా  ఉంచేడు. 
అలాగే పెరిగేరు , మంచి ఉద్యోగస్తులయ్యారు కుాడా..
ఐనా  తన దగ్గర భయం అలాగే ఉండడాన్ని చుాసి సంతోషించేడు. గర్వపడ్డాడు కుాడా...
చిన్పప్పటి నుంచి వారి ఇష్టాఇష్టాలకు విలువివ్వలేదు. తన మాటే శాశనంగా వారిని నడిపించేడు. బయటి ప్రపంచంలోకి సరదాగా ఎప్పుడుా తీసుకెళ్ళ లేదు. చాలా సార్లు" ఎక్కడికైనా వెళ్దాం నాన్నా "అంటుా  బతిమలాడేవారు. తను ససేమిరా అనేవాడు.  డబ్బు కట్టలు చుాపించి "ఇది దగ్గరుంటే అన్నీ ఉన్నట్టే   ముందు ఇది సంపాదించండి" అన్నాడు. అంతేకాదు తను వాళ్ళతో నవ్వుతుా మాట్లాడలేదు.
కలిసి భోజనం చేయలేదు.
ఇంట్లో ఉన్నా ఎప్పుడుా సరదాగా మాట్లాడలేదు. 
తను మాత్రం బయట చాలా తిరిగేవాడు.తినేవాడు.
స్నేహితులంటే ఎలాగుంటారో తెలీదు తనకు. 
ఆందరుా డబ్బు దాసులే...ఎవరినీ లెక్కచేసేవాడు కాదు. అదే జీవితమనుకున్నాడు
తన  పదవీ విరమణకు ఆఫీసులొ ఎవరుా తనను అభినందించలేదు.
తన చుట్టుాచేరినవారెవ్వరుా తను ఆఫీస్ వదలి
వెళిపోతున్నందుకు బాధపడినట్టు కనపడలేదు

అదిగో...ఆరోజు ఏదోలా అనిపించి కళ్ళంట నీళ్ళు చిమ్మాయి. దానినే బాధ అంటారా.?..ఏమొా...?
గబ గబా కళ్ళొత్తుకొని ఇంటికి బయలుదేరేడు.
అప్పటికే కొడుకులకు పెళ్ళిళ్ళయ్యాయి. 
భార్య పిల్లలుా కోడళ్ళుా  మనవలుా ...అందరుా 
అప్పటి వరకు కిల కిలా నవ్వుతుా, గలగలా మాట్లాడుకుంటున్నవారంతా తనొచ్చేసరికల్లా తలో ముాలకీ వెళ్ళిపోయేరు....
చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు.

ఆ రోజు....
ఇంటికి వచ్చి చెప్పేడు. తనింక ఆఫీసుకు వెళ్ళడని.
రిటైర్ అయ్యాడని...
ఎవరి ముఖాల్లోనుా ఆనందం కనపడ లేదు.
భార్య  మౌనంగా కిచన్ లోకి వెళ్ళిపోయింది.
పిల్లలు వాళ్ళ రుాముల్లోకి వెళ్ళిపోయేరు.
కోడళ్ళు కనపడేలేదు. మనవలు తనకంట ఎప్పుడుా పడరు.
అదిగో ఆప్పుడొచ్చాయి కన్నీళ్ళు.
ఎందుకో ఏమిటో తెలీని బాధ...
రోజులు గడుస్తున్నాయిఅన్నీ సమయానికి అందుతున్నాయి.
కానీ  ఒంటరితనం ...భరించ లేకపోతున్నాడు.
ఎవరుా తనతో మాట్లాడినవాళ్ళు లేరు.
"టీ కావాలా ... టిఫిన్ తింటారా...అన్నం వడ్డించేను రండి " అన్న మాటలు తప్ప.
కొన్నాళ్ళు బయటకు వెళ్ళేడు.కానీ 
ఎవరితోనుా కలవడం తెలియ లేదు. అందికే
ఎవరుా మాట్లాడేవారు కాదు తనతో...
అందరుా గుంపులుగా కుార్చొనుంటే తనొక్కడే ఒంటరిగా....
అదిగో అప్పుడే నిజమైన స్నేహం విలువ  తెలిసింది.
మనిషికి మనిషి  ఎంత అవసరమొా తెలిసింది.

ఒంటరితనం ఆలోచనల్లోకి , ఆలోచన బాధలోకి , బాధ భయంలోకి మారేయి.
కానీ తన ఒంటరితనంలో మార్పు రాలేదు.
ఒకరోజు నోరు విడిచి పిల్లల్ని  అడిగేడు ".ఎక్కడికైనా వెళ్దామా."..అని. 
నోట్ల కట్టలు తెచ్చి నాముందుంచి...
"ఎక్కడికెళ్ళాలనిపిస్తే  వెళ్ళండి నాన్నా ..అఫీసులు, పిల్ల ల చదువులుా ఉన్నాయి.మాకు కుదరదు అన్నారు.
అదిగో అప్పుడు తెలిసింది బాధకి అర్ధం ..
బ్రతుక్కి అర్ధం..జీవిత సత్యం...
జీవితంలో ధనం నిండిన  అహంకారంతో
తనేం పోగొట్టుకున్నాడో తెలుసుకున్నాడు.
అందరుా ఉన్నా ఎవ్వరుాలేని ఒంటరితనం...
భరించలేని స్థితిలో  ఒక రోజు రోడ్డుపై పడిపోయేడు.
అంతే మరి లేవలేకపోయేడు.
వెన్నెముక విరిగిందన్నారు..మరి తిరగలేవన్నారు.
పిల్ల లు ఖరీదైన ఆసుపత్రిలో తనను జాయిన్ చేసేరు. నోట్ల కట్టలుా చెక్కు బుక్కులుా తనకందించేరు.
అన్ని సదుపాయాలతో ఒంటరిగా మిగిలిపోయేడు..
ప్రతీ రోజుా ఎవరైనా తనకోసం వస్తారేమొా 
అన్న అశతో ..కొన్ని .నెలలబట్టీ ఎదురు చుాస్తున్నాడు.
"ఒంటరిగా..".....
********************************


10/07/2022.
అంశం : ఒంటరితనం.
శీర్షిక  : ఒంటరితనం ఒక శాపం.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ :  మహారాష్ట్ర .


ఆసుపత్రిలో స్పెషల్  వార్డ్ లో మెత్తటి పరుపు పై పడుక్కున్నా..అసహనంగా కదులురున్నారు రావుగారు.
భార్య పిల్లలు గుర్తుకు వస్తున్నారు.
కొన్ని నెలలైంది వాళ్ళని చుాసి.
అన్ని సదుపాయాలుా సమకుార్చేరు. 
కానీ ఏం ?
లాభం ..
తనను ఒంటరివాణ్ణి చేసి వదలి వెళ్ళేరు.
కానీ ఈ వయసులో తనీ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాడు. తన బేగ్ లో పిల్ల 
లు సంతకం చేసిన "చెక్" లు ఉన్నాయి.
ఎంత డబ్బు  కావాలన్నా "డ్రా" చేసుకోమన్నారు.
డబ్బిచ్చేస్తే సరిపోతుందా........
డబ్బిస్తే.....
సడన్ గా తన మాట తనకే అప్పజెప్పిన ఫీలింగ్ ...
కళ్ళు ముాసుకున్న రావు గారికి గతమంతా 
ఒక్కసారి కళ్ళముందు కదిలింది.

తమ తండ్రి ,తాత, ముత్తాతలు చాలా డబ్బు గలవాళ్ళు.
డబ్బుగల అహంకారం తనలో కుాడా చాలా ఉండేది.
ఎవరినీ లక్ష్యపెట్టేవాడు కాదు.
తనకంటుా ఒక్క స్నేహితుడు కుాడా  ఉండేవాడు కాదు. డబ్బు చాలా మందిని తన చుట్టుా తిప్పించింది. అందుకనే తనకు మనిషి విలువ కుాడా తెలియలేదు. డబ్బుంటే చాలు అన్ని ఆనందాలుా వాటంతట అవే తన సొంతమౌతాయన్న భావన తన మనసులో స్థిరపడిపోయింది.
తను తన పెళ్ళైన నలభైయ్యేళ్ళ జీవితంలో 
డబ్బెలా సంపాదించాలా....అనే ఆలోచించేడుగానీ
భార్యతో ఒక్కసారైనా సమంగా మాట్లాడడంగానీ , బయటకు తీసుకెళ్ళడంగానీ చెయ్యలేదు. దాంతో వంటరైన ఆమె
నాలుగు గోడల మధ్య  పని నిండిన రాట్న మయ్యింది. .
తనను ఒక్కసారైనా బయటకు తీసుకెళ్ళమని ప్రాధేయపడింది. చేతిలో కొంత డబ్బు పెట్టి" నీకు కావలసిన చోటికి నువ్వే వెళ్ళు" అన్నాడు.
"మీరు లేకపోతే  నాకేం సరదా" ..అంది.
డబ్బిచ్చానుగా...అన్నాడు.
ఒంటరితనం నిండిన బాధతో వచ్చిన  ఆమె కన్నీళ్ళకు తను అప్పుడు విలువ ఇవ్వ లేదు..
పిల్లలు పుట్టేరు.  పెద్దవాళ్ళవుతున్నారు.చదువు విషయంలో నాన్నగా దండించడం తోపాటు 
కొంచం ఎక్కువగానే భయం కుాడా  ఉంచేడు. 
అలాగే పెరిగేరు , మంచి ఉద్యోగస్తులయ్యారు కుాడా..
ఐనా  తన దగ్గర భయం అలాగే ఉండడాన్ని చుాసి సంతోషించేడు. గర్వపడ్డాడు కుాడా...
చిన్పప్పటి నుంచి వారి ఇష్టాఇష్టాలకు విలువివ్వలేదు. తన మాటే శాశనంగా వారిని నడిపించేడు. బయటి ప్రపంచంలోకి సరదాగా ఎప్పుడుా తీసుకెళ్ళ లేదు. చాలా సార్లు" ఎక్కడికైనా వెళ్దాం నాన్నా "అంటుా  బతిమలాడేవారు. తను ససేమిరా అనేవాడు.  డబ్బు కట్టలు చుాపించి "ఇది దగ్గరుంటే అన్నీ ఉన్నట్టే   ముందు ఇది సంపాదించండి" అన్నాడు. అంతేకాదు తను వాళ్ళతో నవ్వుతుా మాట్లాడలేదు.
కలిసి భోజనం చేయలేదు.
ఇంట్లో ఉన్నా ఎప్పుడుా సరదాగా మాట్లాడలేదు. 
తను మాత్రం బయట చాలా తిరిగేవాడు.తినేవాడు.
స్నేహితులంటే ఎలాగుంటారో తెలీదు తనకు. 
ఆందరుా డబ్బు దాసులే...ఎవరినీ లెక్కచేసేవాడు కాదు. అదే జీవితమనుకున్నాడు
తన  పదవీ విరమణకు ఆఫీసులొ ఎవరుా తనను అభినందించలేదు.
తన చుట్టుాచేరినవారెవ్వరుా తను ఆఫీస్ వదలి
వెళిపోతున్నందుకు బాధపడినట్టు కనపడలేదు

అదిగో...ఆరోజు ఏదోలా అనిపించి కళ్ళంట నీళ్ళు చిమ్మాయి. దానినే బాధ అంటారా.?..ఏమొా...?
గబ గబా కళ్ళొత్తుకొని ఇంటికి బయలుదేరేడు.
అప్పటికే కొడుకులకు పెళ్ళిళ్ళయ్యాయి. 
భార్య పిల్లలుా కోడళ్ళుా  మనవలుా ...అందరుా 
అప్పటి వరకు కిల కిలా నవ్వుతుా, గలగలా మాట్లాడుకుంటున్నవారంతా తనొచ్చేసరికల్లా తలో ముాలకీ వెళ్ళిపోయేరు....
చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు.

ఆ రోజు....
ఇంటికి వచ్చి చెప్పేడు. తనింక ఆఫీసుకు వెళ్ళడని.
రిటైర్ అయ్యాడని...
ఎవరి ముఖాల్లోనుా ఆనందం కనపడ లేదు.
భార్య  మౌనంగా కిచన్ లోకి వెళ్ళిపోయింది.
పిల్లలు వాళ్ళ రుాముల్లోకి వెళ్ళిపోయేరు.
కోడళ్ళు కనపడేలేదు. మనవలు తనకంట ఎప్పుడుా పడరు.
అదిగో ఆప్పుడొచ్చాయి కన్నీళ్ళు.
ఎందుకో ఏమిటో తెలీని బాధ...
రోజులు గడుస్తున్నాయిఅన్నీ సమయానికి అందుతున్నాయి.
కానీ  ఒంటరితనం ...భరించ లేకపోతున్నాడు.
ఎవరుా తనతో మాట్లాడినవాళ్ళు లేరు.
"టీ కావాలా ... టిఫిన్ తింటారా...అన్నం వడ్డించేను రండి " అన్న మాటలు తప్ప.
కొన్నాళ్ళు బయటకు వెళ్ళేడు.కానీ 
ఎవరితోనుా కలవడం తెలియ లేదు. అందికే
ఎవరుా మాట్లాడేవారు కాదు తనతో...
అందరుా గుంపులుగా కుార్చొనుంటే తనొక్కడే ఒంటరిగా....
అదిగో అప్పుడే నిజమైన స్నేహం విలువ  తెలిసింది.
మనిషికి మనిషి  ఎంత అవసరమొా తెలిసింది.
*******:::***:::::::::::::::

10/07/2022.
అంశం : ఒంటరితనం.
శీర్షిక  : ఒంటరితనం ఒక శాపం.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ :  మహారాష్ట్ర .


ఆసుపత్రిలో స్పెషల్  వార్డ్ లో మెత్తటి పరుపు పై పడుక్కున్నా..అసహనంగా కదులురున్నారు రావుగారు.
భార్య పిల్లలు గుర్తుకు వస్తున్నారు. కొన్ని నెలలైంది వాళ్ళని చుాసి.అన్ని సదుపాయాలుా సమకుార్చేరు. 
కానీ ఏం లాభం ..?
తనను ఒంటరివాణ్ణి చేసి వదలి వెళ్ళేరు.
కానీ ఈ వయసులో తనీ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాడు. తన బేగ్ లో పిల్ల 
లు సంతకం చేసిన "చెక్" లు ఉన్నాయి.
ఎంత డబ్బు  కావాలన్నా "డ్రా" చేసుకోమన్నారు.
డబ్బిచ్చేస్తే సరిపోతుందా........
డబ్బిస్తే.....
సడన్ గా తన మాట తనకే అప్పజెప్పిన ఫీలింగ్ ...
కళ్ళు ముాసుకున్న రావు గారికి గతమంతా 
ఒక్కసారి కళ్ళముందు కదిలింది.
తమ తండ్రి ,తాత, ముత్తాతలు చాలా డబ్బు గలవాళ్ళు.
డబ్బుగల అహంకారం తనలో కుాడా చాలా ఉండేది.
ఎవరినీ లక్ష్యపెట్టేవాడు కాదు.
తనకంటుా ఒక్క స్నేహితుడు కుాడా  ఉండేవాడు కాదు. డబ్బు చాలా మందిని తన చుట్టుా తిప్పించింది. అందుకనే మనిషి విలువ తెలియలేదు. డబ్బుంటే చాలు , అన్ని ఆనందాలుా వాటంతట అవే తన సొంతమౌతాయన్న భావన తన మనసులో స్థిరపడిపోయింది.
బయటి సుఖాలకు అలవాటు పడిన తను ఇంటి పనుల నిమిత్తమై ఒక బీదింటి అమ్మాయిని భార్యగా తెచ్చుకున్నాడు.
తను తన పెళ్ళైన నలభైయ్యేళ్ళ జీవితంలో 
డబ్బెలా సంపాదించాలా....అనే ఆలోచించేడు తప్ప
భర్తగా తన భార్యతో  ఒక్కసారైనా సమంగా మాట్లాడడంగానీ , బయటకు తీసుకెళ్ళడంగానీ చెయ్యలేదు. దాంతో వంటరైన ఆమె నాలుగు గోడల మధ్య  బందీ ఆయింది. పనికి బానిసయ్యింది.
ఒంటరితనం భరించలేక తనను ఒక్కసారైనా బయటకు తీసుకెళ్ళమని ప్రాధేయపడింది. చేతిలో కొంత డబ్బు పెట్టి" నీకు కావలసిన చోటికి నువ్వే వెళ్ళు" అన్నాడు.
"మీరు లేకపోతే  నాకేం సరదా" ..అంది.
"డబ్బిచ్చానుగా"...అన్నాడు.
 ఒంటరితనం నిండిన బాధతో వచ్చిన  ఆమె కన్నీళ్ళకు తను అప్పుడు విలువనివ్వ లేదు..
పిల్లలు పుట్టేరు.  పెద్దవాళ్ళవుతున్నారు.చదువు విషయంలో నాన్నగా దండించడం తోపాటు 
కొంచం ఎక్కువగానే భయం కుాడా  ఉంచేడు. 
అలాగే పెరిగేరు , మంచి ఉద్యోగస్తులయ్యారు కుాడా..
ఐనా  తన దగ్గర భయం అలాగే ఉండడాన్ని చుాసి సంతోషించేడు. గర్వపడ్డాడు కుాడా...
చిన్పప్పటి నుంచి వారి కష్టా-ఇష్టాలకు విలువివ్వలేదు. తన మాటే శాశనంగా వారిని నడిపించేడు. బయటి ప్రపంచంలోకి సరదాగా ఎప్పుడుా వాళ్ళని తీసుకెళ్ళ లేదు. చాలా సార్లు" ఎక్కడికైనా వెళ్దాం నాన్నా "అంటుా  బతిమలాడేవారు. తను ససేమిరా అనేవాడు.  డబ్బు కట్టలు చుాపించి "ఇది దగ్గరుంటే అన్నీ ఉన్నట్టే   ముందు ఇది సంపాదించండి" అనేవాడు. అంతేకాదు తను వాళ్ళతో ఎప్పుడుా నవ్వుతుా మాట్లాడలేదు.
కలిసి భోజనం చేయలేదు.
 కానీ, తను మాత్రం బయట చాలా తిరిగేవాడు.
 తినేవాడు. తాగేవాడు.
స్నేహితులంటే ఎలాగుంటారో తెలీదు తనకు. కానీ
అందరుా తన డబ్బుకి దాసులే...అదే అహంకారంతోఎవరినీ లెక్కచేసేవాడు కాదు. అదే జీవితమనుకున్నాడు.
తన  పదవీ విరమణ తర్వాత తన చుట్టుాచేరినవారెవ్వరుా తను ఆఫీస్ వదలి
వెళిపోతున్నందుకు బాధపడినట్టు కనపడలేదు.
అదిగో...ఆరోజు ఏదోలా అనిపించి కళ్ళంట నీళ్ళు చిమ్మాయి. దానినే బాధ అంటారా.?..ఏమొా...?
గబ గబా కళ్ళొత్తుకొని ఇంటికి బయలుదేరేడు.
అప్పటికే కొడుకులకు పెళ్ళిళ్ళయ్యాయి. 
భార్య పిల్లలుా కోడళ్ళుా  మనవలుా ...అందరుా 
అప్పటి వరకు కిల కిలా నవ్వుతుా, గలగలా మాట్లాడుకుంటున్నవారంతా తనొచ్చేసరికల్లా తలో ముాలకీ వెళ్ళిపోతుా ఉంటే....
 చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు.
ఆ రోజు....ఇంటికి వచ్చి చెప్పేడు. తనింక ఆఫీసుకు వెళ్ళడని.రిటైర్ అయ్యాడని...
ఎవరి ముఖాల్లోనుా ఆనందం కనపడ లేదు.
భార్య  మౌనంగా కిచన్ లోకి వెళ్ళిపోయింది.
పిల్లలు వాళ్ళ రుాముల్లోకి వెళ్ళిపోయేరు.
కోడళ్ళు కనపడేలేదు. మనవలు తనకంట ఎప్పుడుా పడరు. తాతా అన్న మాట తనెప్పుడుా వినలేదు.
అదిగో ఆప్పుడొచ్చాయి కన్నీళ్ళు. 
ఎందుకో ఏమిటో తెలీని బాధ...
రోజులు గడుస్తున్నాయి. అన్నీ సమయానికి అందుతున్నాయి.
కానీ  ఒంటరితనం ...భరించ లేకపోతున్నాడు.
ఎవరుా తనతో మాట్లాడినవాళ్ళు లేరు.
"టీ కావాలా ... టిఫిన్ తింటారా...అన్నం వడ్డించేను రండి "అనే బానిసగా చుాసిన భార్య  మాటలు తప్ప.
కొన్నాళ్ళు బయటకు వెళ్ళేడు.కానీ 
ఎవరితోనుా కలవలేక పోయాడు. ఈనాడుా తన దగ్గర బోలెడంత డబ్బుంది. కానీ తనడబ్బుతో ఎవరికీ అవసరం లేకపోయింది. కానీ తనకిప్పుడు మనుష్యులు , మనిషి ప్రేమ కావాలి . ఎలా...?
ఇంట్లో ఎవరుా మాట్లాడేవారు కాదు తనతో...
అంత వరకు తనవెంట తిరిగిన ప్రతీ ఒక్కడుా 
పిల్లల దగ్గర సెటల్ అయ్యేమంటుా దుారమయ్యేరు.
అందరుా గుంపులుగా కుార్చొనుంటే తనొక్కడే ఒంటరిగా....
అదిగో అప్పుడే నిజమైన స్నేహం విలువ  తెలిసింది.
మనిషికి మనిషి  ఎంత అవసరమొా తెలిసింది.
స్వార్ధం, అహంకారముా నిండిన తన ప్రవర్తనకు జరుగుతున్న వర్తమానం సాక్ష్యమయ్యింది.
ఒంటరితనం ఆలోచనలుగా , ఆలోచనలు బాధగా, బాధ భయంగా మారింది .
 తన ఒంటరితనం మరింత పెరిగినట్టయింది.
 ఒకరోజు నోరు విడిచి పిల్లల్ని  అడిగేడు ".ఎక్కడికైనా వెళ్దామా."..అని. 
నోట్ల కట్టలు తెచ్చి నాముందుంచి...
"ఎక్కడికెళ్ళాలనిపిస్తే  వెళ్ళండి నాన్నా ..అఫీసులు, పిల్లల చదువులుా ఉన్నాయి.మాకు కుదరదు అన్నారు.
అదిగో అప్పుడు తెలిసింది బాధకి అర్ధం ..
బ్రతుక్కి అర్ధం..జీవిత సత్యం...
జీవితంలో ధనం నిండిన  అహంకారంతో
తనేం పోగొట్టుకున్నాడో తెలుసుకున్నాడు.
అందరుా ఉన్నా ఎవ్వరుాలేని ఒంటరితనం...
భరించలేని స్థితిలో  ఒక రోజు రోడ్డుపై నిలువునా పడిపోయేడు.
అంతే మరి లేవలేకపోయేడు.
వెన్నెముక విరిగిందన్నారు..మరి తిరగలేవన్నారు.
పిల్లలు ఖరీదైన ఆసుపత్రిలో తనను జాయిన్ చేసేరు. నోట్ల కట్టలుా చెక్కు బుక్కులుా తనకందించేరు.
అన్ని సదుపాయాలతో ఒంటరిగా మిగిలిపోయేడు..
బతకడానికి డబ్బు కావాలి , గానీ డబ్బే బతుకు కాదు.
డబ్బుతో ఎన్ని కొన్నా ఆనందాన్ని మాత్రం  కొనలేమన్న నిజం నిప్పులా కాలుస్తోంది. ఐనా..
రావుగారు  ప్రతీ రోజుా ఎవరైనా తనకోసం వస్తారేమొా 
అన్న అశతో ..కొన్ని .నెలలబట్టీ ఎదురు చుాస్తునే ఉన్నారు..
"ఒంటరిగా..".....


సీస పద్యం.

అంశం : దత్తపది:  -  తతి - మతి -  వతి - గతి* 
ప్రక్రియ : సీసపద్యము.


తరలివ చ్చెనదివొ (తతి)గుాడి గణపతి
విఘ్నము లనుబాప విశ్వ మునకు
పా(ర్వతీ )పుత్రుడుా  పసుపుబొ మ్మతగాడు
బుద్ధి బాలుడతడె భువిని వేల్పు ॥

సార(మతి)కి నిండు సాక్షి భుాతమువాడు
జ(గతి)నే లెడువాడు జయము మనకు
గురుగణ (తతి)తోడ గుాడి యుండెడు వాడు
పుణ్య(వతి) సతీ పుత్రు డతడు ॥

ప్రక్రియ : ఆటవెలది.

ప్రథమ పుాజ్యు నిగను  ప్రాశస్త్యమును పొంది
విఘ్నహరు నిగను  విశ్వ మేలె
పార్వతీ సుతుండ పాహీగ ణాధిపా
కావు మయ్య మమ్ము కరుణ తోడ ॥

ఇదేనా (నా) దేశ ప్రగతి.

శీర్షిక  : ఇదే నా దేశ ప్రగతి.
ప్రక్రియ:  ఆటవెలది.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.మహారాష్ట్ర .


విశ్వ మంత జుాడ విందాయె కనులకుా
జ్ఞాన హీను లెల్ల జగతి నిండె
మేధ తోడ వారు మేడ మిద్దెలు గట్టె
చంద మామ జేరి చిందు లేసె ॥

తెలివి మీరి వారు తెగ నరికె జెట్లను
కలుషి తమ్ము జేసె  గంగ నీరు
పెరుగ జనులు పెరిగె పెంట కుప్పలు చాల
పర్యవరణ మెంతొ  ప్రబలె జగతి ॥

పీల్చ గాలి లేదు పిట్ట కుాతలు లేవు
చెట్టు జాడ లేక చెదరె భూామి
కంపెనీలు పెరిగి కల్మషాలవి నిండె
కణము లెన్నొ పుట్టి కాటు వేసె ॥

కామ మెంతొ పెరిగె కాలమెంతయొ మారె
పెరిగె స్వార్ధ పరులు పెక్కు గతుల
భరత భవిత నలిగె భాగ్యహీ నతగల్గె
 బ్రతుకు లెన్నొ భువికి భార మాయె ॥

తినగ తిండిలేదు తిరుగాడ పనిలేదు
బ్రతుక, చెడెను మనిషి బాధ మరువ
రోగ హీను లెల్ల రోజు రోజుకు హెచ్చె
విలువ లెన్నొ తరిగె విశ్వమందు ॥

వావి వరుస మరచి  వక్రమా ర్గములెంచి
విలువ, నీతి మాట  విస్మ రించి
జనులు మృగము రీతి జగతిలో చరియించ
భరత మాత కలలె  భగ్న మాయె ॥

మత్తకోకిల పద్యాలు ...(వర్షం ).

అంశం : వర్షం.
ప్రక్రియ : మత్తకోకిల .పద్యం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .



ఆక సమ్మున మేఘ  మొచ్చిన ఆశ పొందును వాడెగా
సేక రించును విత్త నమ్ముల సేద్య మాతడు సేయగా 
ఆక లైనను దాహ మైనను ఆగ డాతడె రైతుగా..
రుాక లప్పులు జేసి పంటకు రుాప మిచ్చును నిండుగా॥

అన్న దాతలకార్తి దీర్చును  ఆకసమ్మున మేఘుడే
చిన్ని వర్షపు జల్లు చుాడగ చిందు లేయును వారులే 
అన్న దేశపు వెన్ననంటిమి ఆతడుా మన దేముడే
మన్ను లోపల పండు బంగరు మాన్య మందరి విందులే ॥
మట్టి తల్లిని నమ్ము నాతడు మంచి పంటల నేలగా
గట్టి యత్నము జేసి పంటను గాచు కష్టము తోడుగా
పెట్టు దుడ్డుకు రాదు లాభము  వెట్టి చాకిరి దండగా
వట్టి చుక్కల వర్ష మేలగ వచ్చు దుఃఖము మెండుగా ॥

వాగు నిండెడు నీటి కోసము  వర్ష మాతనె కోరుగా
బాగు కోరును అందరీ సుఖ  భాగ్య దాతయె రైతుగా
పోగు ధాన్యపు రాసి పొందగ పోరు సల్పును వాడెగా
సాగు దుక్కికి  సారమిచ్చెడు సార వర్షమె  తోడుగా॥

*****************************::::

మొత్తం రుబాయిలు.



తేది: 30-8-2022.
ప్రక్రియ : రుబాయిలు
శీర్షిక : విలువలను తెలుసుకో

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి :
కల్యాణ్ మహారాష్ట్ర .

వృద్ధులెైన తల్లిదండ్రుల -
నగౌరవము పరచవద్దు.
తోడబుట్టు వారినెపుడు 
అవమానము చేయవద్దు.
మంచిగుణము మానవులకు 
సధ్ధనమని మరచిపోకు.
మానవత్వ మదినిండిన
దృక్పథమును విడువవద్దు ॥

ఇరుగుపొరుగు వారితోడ 
స్నేహముతో మెలగాలిగ
ధర్మమైన మార్గములో 
సహనముతో నడవాలిగ
దేశభక్తి నిండినట్టి
సద్భావన కలిగియుండి
న్యాయమైన బాటలోన
నియమముతో నిలవాలిగ ॥

మన సంస్కృతి, సంస్కారము,
మనదేశపు గౌరవములు ॥
సమతమమత కలుగుటలే
మనభావపు సద్ధనములు ॥
చేయి చేయి కలిపినడచి
కష్ట-సుఖము పంచుకొనుము
మనుజులకివి మేలుజేయు
మంచివైన సద్గుణములు
****************
నీకోసం అన్నివదలి వస్తానుగ ఓచెలియా
మరపించే ప్రేమపంచి ఇస్తానుగ ఓచెలియా
అందరినీ వదలివచ్చి ననుజేరిన నాదానివి
మనసైనది నీవుకోర తెస్తానుగ  ఓచెలియా ॥


అంశం : సాహిత్యాశం .
ప్రక్రియ : రుబాయిలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


ఎన్ని వేట్లు వేసినా ఒరిగిపోయిన చెట్టు చిగిరిస్తుంది.
ఎన్ని తుాట్లు పొడిచినా పగిలిపోయిన గుండె  .ప్రేమిస్తుంది
ఒకరి లాలించిన ఆమ్మైతే ఒకరు పాలించిన అమ్మ
ఎన్ని సార్లు అవమానించినా ఆమ్మతనం ఆదరిస్తుంది.॥

ఎన్ని కోట్లు వెచ్చించినా కోల్పోయిన ప్రేమ కొనలేవు 
ఎన్ని పాట్లు పడినా గతించిపోయిన నిన్న  కనలేవు.
జీవితంలో ప్రతీ పదానికీ అలోచించి అడుగేయాలి
ఎన్ని ఇక్కట్లు పడినా మాటజారిన చోట మనలేవు ॥

విద్య నేర్చినవాడు  వివేకవంతుడవుతాడు
విజ్ఞాన శాస్త్రం  నేర్చినవాడు మేధావంతుడౌతాడు.
పై రెండుా ఉన్నవాడు తత్త్వ-జ్ఞాన సముపార్జనుడు
వారందరితో బంధమున్న వాడు కీర్తిమంతుడౌతాడు.॥

అక్షరం తలరాత మార్చు వరం మిత్రమా 21
ఆవేశం అనర్ధాలను పెంచు  మిత్రమా 21
నిరక్షరాస్యతది  ముార్ఖత్వానికి ముాలం .
చదువది, సమయొాచిత సంస్కారము మిత్రమా ॥

నీతులు చెప్పడం ఎంతోమంది చేస్తారు.
నియమాలు పాటించమని కొంతమంది చెప్తారు.
చెప్పేముందు చేసి చుాపించడం మంచి లక్షణం.
పని చేసేవారు మాటలాడరని చాలామంది చెప్తారు.॥

పసి పిల్లలలో  అమాయకత్వం చుాస్తాం మనం
యువతలోని ఆవేశతత్త్వం  చుాస్తాం మనం 
మధ్యవయస్కుల్లో జీవితానుభవ పుాదోటలు.
వృద్ధాప్యంలో పండిన మనస్తత్వం చుాస్తాం ॥   
******
నీమురళి పాటలలో  రాగమై  పాడనా 
 నీపాద సవ్వడుల   మువ్వనై ఆడనా
 నీరాక  నిరీక్షణ  నలసినాను దేవరా
 నీ కరుణ చుాపులకు రాధనై వేడనా  ॥

గురువులకు ఎల్లపుడు కైమొాడ్చు భక్తితో
 రైతన్న లెప్పుడును  చమటోడ్చు శక్తితో
కష్టమున సుఖముంది తెలుసుకొని మసలుకో 
 శ్రామికుడు  ఎల్లపుడు శ్రమకోర్చు యుక్తితో

దేశంలో ఎవ్వరికీ  బ్రతికేందుకు దారిలేదు.
పాలించే  ప్రతినిధులకు ప్రగతిబాట  తీరులేదు. అడుగడుగున ఆధిపత్య పధికారపు పోరుజోరు.
బడుగుజీవి బ్రతుకుతీరు బాగుపడే ఆశలేదు.॥

 బడుగుజీవి మురికివాడ  తాగునీటి  చెమ్మలేదు
అన్నదాత అగచాట్లను ఆదుకొనే  అమ్మలేదు
ఓటుహక్కు నోటుకమ్మి బ్రతుకంతా ఓడిపోకు
నిండియున్న స్వార్ధాన్నదె ఊరికనే నమ్మలేదు

న్యాయపోరు చేయువారయ బ్రతుకునెపుడు అమ్మలేరు
అజ్ఞానము నిండియున్న మనిషినెవరు నమ్మలేరు 
 విధియాడిన  ఆటలోన మనిషేఒక తోలుబొమ్మ
స్వార్ధపరులు మనుషులెపుడు మార్పుతీర్పు కోరలేరు ॥

********

అంశం : రుబాయిలు .


రచన :
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర


మనసుకు నచ్చని మాటలు వినుటది కష్టము
మనసుకు నచ్చిన పాటలు  వినుటది ఇష్టము
పలువురు మెచ్చే నడతలు కీర్తికి బాటలు
మనుజులు మెచ్చని పనులవి చేయుట నష్టము ॥

జీ ఎస్ టీ వల్లమనకు లాభములవి ఉన్నాయా
ప్రైవేటీ  కరణవల్ల  కష్టాలవి  పోతాయా
అట్టికేంద్ర నిర్ణయాలు అందరికీ సమ్మతమా  
నిర్ణయాల బాటలోన ఉన్నవుాడ్చి పోయేయా ॥

బడుగువారి భాధలకిడు అర్ధాలవను వినగరావు
జాతిమతపు జడ్యాలకు యుద్ధాలను మనగరావు.
నీస్వార్దం మనుషులతో ఆటలాడు కుంటున్నది.
చితికిపోవు జీవితాల చింతలనువు  కనగరావు .
*********
9/8/22.
సాహిత్యాంశము : మంచిని పెంచుకో.
ప్రక్రియ : రుబాయిలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
**********************
మహతి సాహితీ కవి సంగమం
9/8/22.
సాహిత్యాంశము : మంచిని పెంచుకో.
ప్రక్రియ : రుబాయిలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


గులాబీకి ముళ్ళుం టాయని వదిలేయగలమా  .
పుాలెన్నో పుాస్తుం టాయని చిదిమేయగలమా .
మనిషి గుణగణాలు విజయానికిల సోపానాలు.
అలాగని  భువిలో బ్రతకడం మానేయగలమా॥

తెల్లనివన్నీ  పాలుకావు.
నల్లని వన్నీ నీళ్ళు  నీళ్ళుకావు
అందం, అది మనిషికి శాపం..
చుాసినవన్ని నిజాలుకావు. ॥

జీవితంలో మంచి చెడులను తెలుసుకో.  
అందరితో  నువు  స్నేహంగా మసలుకో.
చెడ్డవాడికిట విలువ లేదు .
గంజాయి వనాన తులసిలా నిలిచిపో॥
 
 గుణవంతుడు  అందరికీ  మంచినే పంచగలడు. 
 మంచిపనులు చేస్తే హాయిగా జీవించగలడు.
నోరు మంచిదైతే ,ఊరంతా మంచంటారు.
 సద్గుణాలున్నవాడే,  లోపాలనెంచగలడు.॥

చేయి కలిపితే స్నేహము .
పోరు సలిపితే యుద్ధము.
మనిషిగా ఆలోచించు.
నేనన్నిటికీ సిద్ధము.॥


సవరించి పంపినవండీ..🙏
***********************
పరిమళిస్తున్న పుాబాలలను  చిదిమేయగలమా మానవత్వం నశించిందనిబ్రతకడంమానేయగలమా॥

11/10/2022.
మహతీ సాహితీ కవి సంగమం.   19 ని పంపాలి.
అంశం: రుబాయిలు.
శీర్షిక : జీవిత సత్యాలు.

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర .



కలసీ-మెలసి మీరుంటేను  కలదు సుఖం.
 ఒంటరివైన క్షణములోన  వలదు దుఃఖం.
 సుఖ దుఃఖములు అన్నవన్నీ  కర్మఫలాలు   .
కర్మభోగం నమ్మనంటే దాగదు నిజం ॥

మతజాడ్యం విడువునీవు  అందరునుా సమానమే
కష్టానికి  తోడుంటే  అందరముా నీవారమె 
బీద గొప్ప బేధాలవి సమాజముకు చెడుపుగదా
సమానత్వ బాటనునడు-అనుభవముా ఆనందమే॥





11/10/202
అంశం: రుబాయిలు.
శీర్షిక : జీవిత సత్యాలు.

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర .

మాపాపాయి నన్నుపిలచీ నన్నేహత్తుకు నిదురపోయింది
మరంతలోనే చుాస్తుండగానె ఎంతోఎత్తుకు ఎదిగిపోయింది.
నా అనుకున్నది  నన్నొదిలి యెటుా వెళ్లదనుకున్న ..
ప్రేమపేరుతో పెళ్ళిచేసుకొని వయసిడుమత్తుకు
లొంగిపోయింది ॥

పసిపిల్ల లల్లరులు  ఇంటింటి-కందాలు .
అమ్మాయి లందరుా  వేరింటి బంధాలు
ఆడ మగ అనుమాట ఎప్పుడుా అనబోకు
ఇద్దరుా అమ్మ ఒడి పండంటి గంధాలు ॥

*****************************:::**
 రుబాయిలు.

బోనాల పండగకు భోగాలే  విందుగా 
ఆ తల్లి పుాలతో  నిండెనులే విందుగా
బంగారు బతుకమ్మ కొలువైన సందడులే
ఆట పాటల వేడ్క లేలెనులే పసందుగా ॥










Sunday, October 9, 2022

పోష్ట్ బాక్స్ .


🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊

కవిశేఖరులకు నమస్కారాలు

ఈరోజు నుండి *ఉత్తమ రచనలకు (10)* మాత్రమే "ప్రశంసాపత్రాలు" అందించబడుతాయి.
సహకరించగలరు.

*పర్యవేక్షక,నిర్వాహక &సమీక్షక బృందము*
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️


10/10/2022.
 .
అంశం : పోష్ట్ బాక్స్ .

శీర్షిక : అలనాటి జ్ఞాపకాలు .

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర .

చిన్న నాటి గుర్తులు తీపి జ్ఞాపకాలు .
ఎన్నెన్నో గలవు యెంచి చుాడ వేలు.
అందలో నొకటిగా పొిష్ట్ బాక్స్ చాలు
జ్ఞప్తి కొచ్చె మంచి మధురమైన స్మృుతులు ॥ 

పొిష్ట్ మేన్ కొరకు రోజు ఎదురు చుాపులు
తాత బామ్మల మాట కాగితాల ఊసులుా
అరచేతి కొలతో అవె కార్డ్ కొలతలుా
అందులోన కానవచ్చు ముత్యాల సరాలు॥

ఉభయకుశలోపరితో మెదలు వాక్యపు విందు
కష్టసుఖముల గోడు  కళ్ళకు గట్టిన తీరు
కారేటి కన్నీరు కలచు హృదయము చుాడు
బంధాను బంధాల ప్రేమ లపుడే మేలు .॥

ప్రతి వారపు పలకరింపు ప్రతి మాటకు పులకరింపు .
ప్రతి పదముా చిలకరించుననురాగపు  ఆదరింపు ॥

రాసేటి ఉత్తరము రంగులీను పెట్టెలో
పరుగు లెట్టి వేయుటకు పది పైసలు జేబులో
అందమైన ఎర్ర పెట్టె కందినట్టి కంతలో
కార్డు కవరు జారిపోవు కనిపించని రీతిలో ॥

ఎటుల చేరునో ఏమొా వలయు చోటు పత్రము
తాళమేయు పెట్టె నుండి కదలుటే విచిత్రము.
చిన్న వయసు పోరాటము తెలుసుకొనుటకారాటము
"పోష్ట్ మేన్ "వచ్చు వరకు వేచి యుండు వారలము ॥

ఎర్ర పెట్టె కున్న తలుపు  కున్నదిలే తాళము
అది తెరచిన జాలువారు కార్డ్ కవరు లనేకము.
అన్ని పట్టి కట్టగట్టి జోలె నిండ జక్క బెట్టి 
పోష్ట్ తాత పొివు చుండ చుాచు దినములనేకము ॥

ఇంతమంది రాయు కథలు ,కవితలు కావ్యాలన్నీ
చిన్ని తుప్పు సైకిలెక్కి చేరవేయు నెటులనో...
ఉత్తరాలు ఇచ్చినాక వీధి  ఊసులాడు నతడు 
నాన్న యుచ్చు రుాపాయే నవ నిధులుగ 
దలచి మురియు॥

ఇంటింటి సిపాయిగా సమాచార మిడు ఆప్తుడు
పొిష్ట్ బాక్స్ అతని గుండె ఉత్తరాలె ఊపిరందు
బ్రతుకు తెరువు బంటతడు ఇల్లిల్లుా తిరుగుచుండు
 ఉత్తరాలు ఇచ్చి పంచు సంతసాల విశేషాలు ॥

నాటి జ్ఞాపకాలు నేడు చరవాణి  పాలాయె
వేచి యుండుటలో ప్రేమను జనులందరు కోల్పోయె.
ఆనాటి సంతసాలు  రాత ప్రతులు లేవాయె
నేటి మనిషి జీవితమే యాంత్రికమౌ బ్రతుకాయె॥

*****************************************

[10/10 23:40] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*మహతీసాహితీ కవిసంగమము , కరీంనగరము*
*ప్రతిరోజూ కవితా పండుగే* 

 *10/10/2022" (సోమవారం)*

*ఉత్తమ చిత్రకవితలు:*
🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚

*శ్రీమతి/శ్రీ*
1.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు  
2.మేడిశెట్టి యోగేశ్వరరావు గారు 
3.దొంతరాజు విజయలక్ష్మి గారు 
4 వి విజయశ్రీ దుర్గ గారు 
5.మరుదాడు అహల్యాదేవి గారు
6.మాకన వెంకట ఉమాదేవి గారు 
7.వి.టి.ఆర్. మోహనరావు గారు 
8.పోగుల భాగ్యలక్ష్మి గారు
9.యం జితేంద్ర గారు
10.గంపా శ్రీదేవి గారు.

*పర్యవేక్షణ :డా. అడిగొప్పుల సదయ్య గారు* 
నిర్వహణ: *శ్రీ దాసరి చంద్రమౌళి గారు*
సమీక్షణ: *శ్రీ తెలికిచర్ల రాజకృష్ణ కామేశ్వరరావు గారు*
[10/10 23:48] +91 94418 71767: *నేను గత ఒకటిన్నర సంవత్సరాలుగా సమీక్షలు చేస్తున్నాను,  కానీ ఈ రోజు వచ్చినన్ని  (102 కవితలు)* *కవితలు ఏ రోజు రాలేదు. ఓపికగా, ఆనందంగా కాలాతీతమైనా కూడా పూర్తి చేయ కలిగాను. ఈ రోజు* *చాలా ఆనందంగా ఉంది. నా సమీక్షలలో లోపాలున్నా మంచి మనసుతో మన్నించండి. నాకు* 
*ఈ అవకాశం ఇచ్చిన శ్రీ సదయ్య గారికి, ఈ రోజు నిర్వాహకులు చంద్ర మౌళి గారికి కృతజ్ఞతలు.* *సమూహంలోని ఇతర నిర్వాహకులకు, సమీక్షకులకు కూడా  కృతజ్ఞతలు.*

 *అందరికీ శుభరాత్రి.*
*కామేశ్వర రావు*



 

 

బ్రతుకు జట్కా బండి.

అంశం : బ్రతుకు జట్కా బండి.
శీర్షిక  : మారుతున్న కాలంలో మనిషి బ్రతుకు.

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.


జీవిత చక్రం  ఒడిదుడుకుల పట్టాలపై 
గమ్య మెరుగని బాటలో చేసే ప్రయాణం.
సుఖ సంతోషాల వెతుకులాటలో 
అలసిన జీవితాల ఆక్రోశం ॥

అధికార దాహపు అహంకారం
ప్రజల బలహీనతలకు వెలకట్టి
నోట్లు కురిపించి  ఓట్లను  కొని
అక్రమాల బాటలో అల్లర్లు సృష్టి స్తున్నాది ॥

గద్దెకెక్కిన  ఘనులందరుా దేశ సంపత్తిని 
వేలం వేస్తుా  భరత భవితల జీవితాన్ని 
బ్రతుకు వేదనలకు గురిచేస్తున్నారు॥

 స్వార్ధం   నిండిన మనిషి జీవితం
 ధన దాహానికి బానిసై తన - పర అనే
బంధాలకు  ఉద్వాసనలిడింది .
ఆటవిడుపులేని అహం హద్దులు దాటింది ॥

మారుతున్న కాలం తో పాటు 
మారే మనుషుల మనస్తత్వం 
మగువ  మదిరలకు దాసొిహమై
బంధానుబంధాలను మట్టి కరిపిస్తోంది ॥
 
అడిగినవాడు అసలు పత్తా ఉండడు.
అడగనివాడికి అసలు బ్రతుకే ఉండదు.
భయం నిండిన బడుగు జీవితాలు
బ్రతుకు తెరువు లేక బానిసలౌతున్నారు॥

 బానిసత్వపు సంకెళ్ళు విడిన ఆనందం 
 అనుభవంలోకి  వచ్చిందన్న భావం
 తలపులో మలుపు తిరగకు ముందే
 మాట, స్వాతంత్ర్యాన్ని కోల్పోయింది ॥

బ్రతుకు జట్కా బండిలో  నలిగిపోతున్న 
జనుల చితుకు జీవితాలకు  ముక్తి లేదు.
మననుద్ధరించేందుకు మరో  ఉద్యమ వీరుడు
మళ్ళీ ఈ భువిలో పుట్ట బోడు ॥

*************::*********************


Friday, October 7, 2022

మణిపుాసలు.

సృష్టి కర్త : వడిచెర్ల సత్యం.

శీర్షిక  : ఆమె

రచన : శ్రీమతి పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .

1.
పుట్టింటి దీపాలు.
అత్తింటికి వెలుగులు.
ఆ యింటి వంశముకు.
జన్మనిచ్చు అమ్మలు ॥
2.
సృష్టి కి ప్రతి సృష్టిని
చేసేది ఆడదని
తెలిసి గౌరవించరు
అవని యామె అబలని ॥
3.
అక్కగా చెల్లిగా
అమ్మగా అలిగా
అన్ని రుాపాలలో
నలరించు నామెగా॥
4.
చదువులో వాణిగా
సిరినిచ్చు లక్ష్మి గా
వేల్పు స్త్రీ రుాపమై
భువి నవతరించెగా ॥
5.
స్త్రీ లేని జన్మేది  ?
పుట్టి గిట్టుటేది..?
ఇలనమ్మ లేనిదే
సృష్టికి తావేదీ .?॥
6.
ఆలిగా  అర్హతలు
అందరికీ సేవలు
ఊడిగపు చాకిరీ
కోడలిగా  బాధ్యతలు ॥
7.
విలువ లేని మనిషిగ
ఆడ దన్న అలుసుగ
వెకిలి చుాపుల వేడ్క.
నంగట్లో బొమ్మగ ॥
8.
శీలముకు విలువిడరు
బ్రతుకుటకు దారిడరు
ఆట బొమ్మగ జేసి
కాముకులు చెలగెదరు ॥
8.
ముందడుగు వేయనీ
చదువులే చదవనీ
సమాన భావముతో
గౌరవించు  ఆమెని ॥
9
పురుషాధిక్యతనీ
పుడమి సమసిపొినీ
అడుగులో అడుగేసి
అతివలను నడువనీ ॥


Monday, October 3, 2022

ప్రక్రియ. మణిపుాసలు.

ప్రక్రియ : మణిపుాసలు
సృష్టి కర్త : వడిచెర్ల సత్యం.
శీర్షిక  : అమె.


రచన : శ్రీమతి పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .

1.
పుట్టింటి దీపాలు.
అత్తింటికి వెలుగులు.
ఆ యింటి వంశముకు.
జన్మనిచ్చు అమ్మలు ॥
2.
సృష్టి కి ప్రతి సృష్టిని
చేసేది ఆడదని
తెలిసి గౌరవించరు
అవని యామె అబలని ॥
3.
అక్కగా చెల్లిగా
అమ్మగా అలిగా
అన్ని రుాపాలలో
నలరించు నామెగా॥
4.
చదువులో వాణిగా
సిరినిచ్చు లక్ష్మి గా
వేల్పు స్త్రీ రుాపమై
భువి నవతరించెగా ॥
5.
స్త్రీ లేని జన్మేది  ?
పుట్టి గిట్టుటేది..?
ఇలనమ్మ లేనిదే
సృష్టికి తావేదీ .?॥
6.
ఆలిగా  అర్హతలు
అందరికీ సేవలు
ఊడిగపు చాకిరీ
కోడలిగా  బాధ్యతలు ॥
7.
విలువ లేని మనిషిగ
ఆడ దన్న అలుసుగ
వెకిలి చుాపుల వేడ్క.
నంగట్లో బొమ్మగ ॥
8.
శీలముకు విలువిడరు
బ్రతుకుటకు దారిడరు
ఆట బొమ్మగ జేసి
కాముకులు చెలగెదరు ॥
8.
ముందడుగు వేయనీ
చదువులే చదవనీ
సమాన భావముతో
గౌరవించు  ఆమెని ॥
9
పురుషాధిక్యతనీ
పుడమి సమసిపొినీ
అడుగులో అడుగేసి
అతివలను నడువనీ ॥







మావేల్పువై గాచు దుర్గమ్మ పాహిమాం

శీర్షిక :  మా వేల్పుయై గాచు దుర్గ మాయమ్మ.
ప్రక్రియ : ఇష్టపది .

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

ముల్లోకముల నేలు ముార్తి నీవేనమ్మ
ముగురమ్మలకు నీవె గాద ముాలపుటమ్మ.
 నవరాత్రు లందున కొలువైన దుర్గమ్మ 
 పదునాల్గు లోకాల పాలించు మాయమ్మ ॥
 పాహిమాం ....పాహిమాం.....

పసుపు బొమ్మను జేసి ప్రాణాలు పోసేవు
విఘ్నములు బాపేటి  వినాయకుని జేసేవు
రిద్ధి సిద్ధుల నొసగు బుజ్జి గణపతి నిచ్చి 
మా యిడుములను బాపి మమ్మాదుకున్నావు 
పాహిమాం ....పాహిమాం.....

దుష్టులను దునిమేటి దుర్గ నీవేనమ్మ
దురితములు బాపేటి దుఃఖ భంజనివమ్మ
మంగళములిచ్చేటి మాంగళ్య గౌరివ
శివుని పట్టపు రాణి సింహ వాహినివమ్మ..
పాహిమాం .....పాహిమాం ....

తొమిదౌ రుాపాల తోడు నీవేనమ్మ 
ఆది శక్తివి నీవు అమ్మ మాయమ్మ 
అస్త్ర- శాస్త్రాదులను అష్ట భుజముల దాల్చి
అరి నాశనముజేయ అవని వెలసేవమ్మ 
పాహిమాం .....పాహిమాం ....

అవమానమున నలిగి యగ్ని దుాకిన తల్లి 
అష్ట దశ  పీఠముల అలసి వెలసే మల్లి -- 
ఖండ రుాపిణి గావు మండాండ బ్రహ్మాండ-
పిండరుాపిణి వమ్మ పిలువ పలికేవమ్మ 
పాహిమాం .....పాహిమాం ....

ఆశ్వయుజ మాసాన  అద్భుతానందవై
అవని దర్శన మిచ్చు ఆర్త త్రాణవు సుమ్మ
నవరుాపములతోడ నవావర్ణ నాయకివై
విజయమ్ము లొసగేటి విజయ రుాపిణివమ్మ॥
 పాహిమాం .....పాహిమాం ....
 

శీర్షిక : ముగురమ్మల ముాలపుమ్మ.

అంశం : నవరాత్రుల కధ .
శీర్షిక : ముగురమ్మల ముాలపుమ్మ.
ప్రక్రియ : ఇష్టపది .

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

కలికి యలుకలకొలికి  కధను చెపుతారండి.
ఆ తల్లి దుర్గమ్మ యవని వెలసిన రీతి.
నవమి నాటీ వరకు నా తల్లి రుాపులను.
నమ్మికతొ కొలవండి నడుగ వరమిడు సుండి ॥

తొమ్మిదౌ రుాపాల  తొలి పుాజ దొర తల్లి.
హిమవంతు గుణ పుత్రి  హిత కార్య శుభగాత్రి.
పరమ పావని యమ్మ పరమేశు సతి సుండి
పర్వతేశుని పుత్రి పాహి పార్వతి  యండి ॥

చింతా మణి  ద్వీప చిత్స్వరుాపిణిగాను
మణిమయ ద్యుతులతో  మాత మెరసేనమ్మ  
జంట నీశుని జేరి జగమంత గాచేటి.
 జగదీశ్వరిని బ్రోచు జగదంబ మాయమ్మ ॥

మునిజనులు ఋషిగణులు మురిసి మిమ్ముల కొలువ
 ముల్లోక ముల గాచి మురిసేవు మా తల్లి
 నీ రుాపు నిశి నందు  నిత్యమ్ము పుాజించి
 పరమేశ్వరుని పవలు పలు నామముల పిలచి ..
  కొలిచి  మురియుచు వారు  కోర నొక వరమునుా
  
 కోర్కె దీర్చెను శివుడు కొంగు బంగరు తండ్రి 
 సుార్యోదయమ్ము  సతి సుప్రభాతము పాడి
రాత్రి శంభుని కొలచి రానంద నాట్యముల ॥

సతి యానతిని గొనక  సమ్మతీయగ శివుడు
 తారుమారాయెనుగ  తరుణి సతి పుాజలుా
  తథ్య మలకలకొలికి తానలిగె శివశక్తి
భీకరమ్ముగ మారి  బిల్వ వృక్షము నెక్కి  ॥

అంత రంగమునందు అలరు భయమున వారు 
శాంతింపగను  వేడ శరణు కోరిరి శివుని.
పవలు రాత్రుల యందు పరమేశ్వరిని గొల్చి
 సతి నలుక విడుమని  శరణనిరి శాంకరిని ॥

 వేల నామము లిడుచు  వేదఘోషల వేడ 
 పట్టు విడువదె కాళి  పంతాల సుకుమారి.
 ఆరైన దినములుా అలసి పుాజలు జేసి
శాంకరిని శాంతింప శంకరుని కోరితిరి ॥

  దినము రాత్రుల పుాజ  దివ్యముగ నెరపంగ 
   దివ్య మంగళ గౌరి  దిగవచ్చె నోయమ్మ.
   తొమ్మిదౌ దినములు తోయజాక్షిని కొలువ
   నవదుర్గ రుాపిణై నవని వెలసెను కొమ్మ ॥
   
ఆలుక దీరిన దినము ఆశ్వయుజ మాసమ్ము 
ఆ తల్లి కిష్టమగు ఆనంద శుభ దినము
తల్లి రుాపుల గొలచి తరియించిరా జనము
ధరణి దరిశన మిడగ ధన్యులైతిమి మనము ॥

నవరాత్రులౌ కధను నమ్మి జెప్పితి మీకు
నవరసపు నళినాక్షి నను బ్రోవు గుణరాశి--
అలరు గంధము పుాసి  అర్చించ రారండి
నను గుాడి పుాజించి  నమము లిడి వేడండి॥

******************::::****************