Saturday, December 11, 2021
మత్తకోకిల పద్యాలు
Friday, December 10, 2021
అప్పగింతల పాట
Thursday, December 9, 2021
సాహిత్యం కొత్తపుంతలు
కలికి తురాయి
కన్నీటి కవిత
స్వార్ధం
మన ప్రాధమిక బాధ్యత
27/03/2021.
తెలుగు భారతి సాహిత్య సేవా సమితి ఆధ్వర్యంలో..
అంశం: జాతీయ ఝండాకు వంద సంవత్సరాలు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక : దేశ పౌరుల ప్రాధమిక విధి.
స్వాతంత్రోద్యమ పోరాటం చేసి సాధించిన
స్వాతంత్ర్యం , ఎంతోమంది చేసిన
త్యాగ నిరతికి నిదర్శనం.
ఆగష్టు పదిహేనున మువ్వన్నెల జెండాను
ఎగురవేస్తూ, యావత్ భారతావని, త్రివర్ణపతాక సృష్టికర్త అయిన పింగళి వెంకయ్యకు నిరాజనం పలుకుతోంది.
. ముాడు రంగుల మన జాతీయజెండాను, జాతీయగీతాన్ని, జాతీయ గౌరవ చిహ్మాలను, స్వాతంత్ర్యయోధులను గౌరవించడం మన భారత పౌరుల ప్రాధమిక విధి.
1947 జూలై 27వ తేదీన నిర్వహించిన రాజ్యాంగ సభలో మొదటగా ఆమోదింపబడిండి.
త్యాగాన్ని తెలిపే కాషాయం, శాంతిని చూపే తెల్లదనం, పంట పొలాను తెలిపే పచ్చదనం, ధర్మం నిలిపే అశోకచక్రం… ఇవన్నీ కలగలిపి ఉన్న మన జాతీయ పతాకం వంద వత్సరాలు పుార్తి చేసుకొని
"భరత జాతి కీర్తి చిహ్నంగా "ఎప్పటికీ నిలిచిపోవాలి
అన్న సత్ సంకల్పంతో. మన జాతీయ ఝండాకు
ఐకమత్యంతో ,గౌరవపుార్వకంగా "జై " కొడదాం .
ఆనంద స్వాగతం
27/03/2021. (ఉగాది కవిరతలు వాట్సప్ లో)
"జనదీపిక " ఉగాది కవితల పోటీకి పంపినది.
శీర్షిక : అనంద స్వాగతం.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
అడుగడుగునా అడ్డు తగులుతున్న
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రాణాళికల
ఉల్లంఘనలతో ,పాటు వికటించిన
ప్రకృతి ప్రకోపాల అతివృష్టి ,
అనావృష్టిల వర్ష ప్రభావానికి
పచ్చని పంటల విధ్వంశంతో పాటు,
సాగు నీటి కొరత వల్ల బీడు
భుాముల సారహీన ఫలితాలతో
అన్నదాతలకు సన్నగిల్లుతున్న
ఆత్మస్థైర్యం, అడుగడునా
ఆత్మహత్యలను ప్రేరేపిస్తోంది.
వికటిద్తున్న పర్యావరణ మార్పులకు
జన బాహుళ్యం, రోగగ్రస్థయై
మానవ సంబంధాల మాట మరచి
మారణ హోమం చేస్తోంది.
ప్రతీ సంవత్సరం సశ్యశ్యామలమై,
పచ్చదనపు కళలతో , సుమ సౌరభ
సోయగాలతో నిండిన వసంత
కన్నెల చెలిమి కోరుతుా, వన
విహారానికి వచ్చే ఉగాది కన్య..
దేశ అన్నదాతల విషమ పరిస్థితి కి
విస్తుపోతుా , నీటి వనరులను
సమృద్ధి పరచే ప్లవ నామ చెలియతో
పరుగు పరుగున వస్తోంది.
ప్రకృతి పచ్చదనాన్ని తిరిగి పెంచేందుకు.
పర్యావరణ రక్షణ చేసి మనకు
ఆరోగ్యామృతం పంచేందుకు.
రండి...అమె ఆగమనానికి
ఆనంద స్వాగతం చెపుదాం .
జీవితమా నీ విలువెంత
కొండగట్టు ఆంజనేయస్వామి
అత్యాశ
వందేళ్ళ జాతీయ ఝండా
తెలుగు భారతి సాహిత్య సేవా సమితి ఆధ్వర్యంలో..
అంశం: జాతీయ ఝండాకు వంద సంవత్సరాలు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక : దేశ పౌరుల ప్రాధమిక విధి.
స్వాతంత్రోద్యమ పోరాటం చేసి సాధించిన
స్వాతంత్ర్యం , ఎంతోమంది చేసిన
త్యాగ నిరతికి నిదర్శనం.
ఆగష్టు పదిహేనున మువ్వన్నెల జెండాను
ఎగురవేస్తూ, యావత్ భారతావని, త్రివర్ణపతాక సృష్టికర్త అయిన పింగళి వెంకయ్యకు నిరాజనం పలుకుతోంది.
. ముాడు రంగుల మన జాతీయజెండాను, జాతీయగీతాన్ని, జాతీయ గౌరవ చిహ్మాలను, స్వాతంత్ర్యయోధులను గౌరవించడం మన భారత పౌరుల ప్రాధమిక విధి.
1947 జూలై 27వ తేదీన నిర్వహించిన రాజ్యాంగ సభలో మొదటగా ఆమోదింపబడిన మన భారత -జాతీయ పతాకం ,వంద వత్సరాలు పుార్తి చేసుకొని
"భరత జాతి కీర్తి చిహ్నంగా "ఎప్పటికీ నిలిచిపోవాలి
అన్న సత్ సంకల్పంతో. మన జాతీయ ఝండాకు
ఐకమత్యంతో ,గౌరవపుార్వకంగా "జై " కొడదాం .
సంస్కృతీ సమ్మేళనం యుగాది
కాదేదీ కవితకనర్హము
31/10/2020
రచన శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ మహారాష్ట్ర
8097622021
ప్రక్రియ సమ్మొాహనాలు
శీర్షిక .
కాదేదీ కవితకనర్హము.
-----------------------------
81
ముద్దు మాటల పలుకు
పలుకు తేనెల నొలుకు
ఒలుకు ముద్దులు చిలుకు పలుకులవి ఈశ్వరీ॥
82
ఆట పాటల వయసు
వయసు తెలియని మనసు
మనసు తెల్లని దినుసు మసలుటలు ఈశ్వరీ ॥
83
మనసులోని భావము
భావము అనురాగము
రాగము శృంగారము వర్ణనలు ఈశ్వరీ ॥
84
అందాల వర్ణనలు
వర్ణనల చుాపులుా
చుపులే ప్రేమలేఖలు కదా ఈశ్వరీ॥
85
కవిత లల్లగ మనసు
మనసులో పలిదినుసు
దినుసు ని దౌమనసు బాసలే ఈశ్వరీ ॥
86
ప్రేమలో ప్రకృతదె
ప్రకృతి లో ఆకృతిదె
ఆకృతికి అందమౌ వర్ణనిదె ఈశ్వరీ ॥
87
పెరిగు వయసు చిత్తము
చిత్తము గాంభీర్యము
గాంభీర్యము వేదాంతము గనుము ఈశ్వరీ ॥
88
పెద్దరికపు మాటలు
మాటల లో సుాక్తులు
సుాక్తుల నిడు కవితలుా కధలుా ఈశ్వరీ ॥
89
వృద్ధాప్య వేదాంత
వేదాంత స్వాంతత
స్వాంతన ప్రసాంతతల కవితలుా ఈశ్వరీ ॥
90
చింతన ల భేదములు
భేదముల రాగములు
రాగాలనురాగపు కవితలుా ఈశ్వరీ ॥
91
వయసుకో ముచ్చటా
మచ్చటల కవితటా
కవితల లొ భేదమౌ భావమట ఈశ్వరీ ॥
92
కాదేదీ కవితకు ను
కవితకు అనర్హమును
అనర్హమను మాటలు వదలిమను ఈశ్వరీ ॥
తస్మాత్ జాగర్త
ఆంధ్రుల అభిమాని
4/04/2021.
అంశం : అక్కడ వెలిగిన ఇక్కడి మణి దీపం.
శీర్షిక : ఆంధ్రుల అభిమాని.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
18 యేళ్ల వయసులోనే వైజాగ్
"స్పేక్టేటర్" పత్రికకు సంపాదకత్వం
వహించి "తెలుగు హార్స్" అనే పత్రికకే
కాక ,"లీడర్" అనే ఆంగ్ల పత్రికకు మూడు
దశాబ్దాలపాటు సంపాదకత్వం
వహించిన " శ్రీ చిర్రావూరి యజ్ఞేశ్వర -
చింతామణి" గారు
ఉదారవాద రాజకీయ నాయకునిగా ,
మంచి ఉపన్యాసకులుగానే కాక
పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంగా
ప్రసిద్ధ పాత్రికేయునిగా పేరుపొందేరు.
ఈయనకు బ్రిటీషు ప్రభుత్వం
" సర్ "బిరుదునిచ్చి సత్కరించగా ,
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
నుండి గౌరవ డాక్టరేట్ ను ,. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి " డి.లిట్. "
గౌరవ పట్టాను పొందన ఘనులు
" శ్రీ చిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణిగారు ."
---------------------------------------------------------
వడ్డేపల్లిగారి పాటవెలది ప్రక్రియలో సుందరకాండ
కల నిజమైతే
9/04/2021.
వారం వారం కవిత లో...
ప్లవ నామ ఉగాది పై కవితల పోటీ కొరకు,
శీర్షిక : కల నిజమైతే...
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
నీలాకాశంలో తారకలు దోబుాచులాడుతున్నాయి.
పొగ జబ్బు పడిన మేఘాలు కోలుకొని
తేట నీటి వసంతాలాడుతున్నాయి.
కిచకిచారవాల పకలరింతకు
పచ్చని పకృతి పులకరించిపోతోంది.
ఆకుపచ్చ చీరను అలరించిన భుామాత
మల్లె ,జాజుల మాలలనల్లి
సిగముడిలో సింగారించింది.
గలగల పారే ఏరులు, పంట పొలాల్లో చేరి,
విత్తు చిన్నారులతో దోబుాచులాడుతున్నాయి.
స్వశ్ఛ మైన భరతావని పరిసరాల్లో
మనుషులందరుా మాస్క్ లు వేసుకొని
సామాజిక దుారం పాటిస్తుా సేనిటైజర్ల
చిలకరింపుల పలకరింపులతో
పండగ ముచ్చట్లాడుకుంటున్నారు.
అంతా చుాస్త్తున్న ఆనందంలో బొక్కబోర్లా
పడ్డ నేను, కళ్ళు తెరచి చుట్టుా చుాసేను.
"నాకు వచ్చింది కలా....అదేగానీ నిజమైతే."..
అనుకుంటుా లేచేను..పర్యావరణ రక్షణ
తో పాటు కరోనా కట్టడి నియమాలను
పాటించాలన్న నిర్ణయంతో ప్రతిన పుానేను.
అందరుా నాతో చేతులు కలుపుతారు కదుా....
"ప్లవ నామ యుగాది "శుభాకాంక్షలతో" .మీ ...🙏
------------------------------------------------------
హామీ
సమ సమాజ స్థాపకుడు అంబేద్కర్
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక : సమ సమాజ స్థాపకుడు
కుల మత వివక్షతను
కుాకటి వేళ్ళతో పెకిలించి
అంటరానితనాన్ని
రుాపు మాపేందుకు
అక్షర యజ్ఞం చేసిన
అక్షయ విద్యా సాధకుడు ॥
ఆశయ సాధనకై
అడుగడుగు అవమానాలను
ఆత్మ విస్వాసంతో ఎదుర్కొన్న
లక్ష్య సాధకుడు.॥
సమసమాజ స్థాపనకు
బ్రతుకంతా ధారపోసి
సంఘ సంస్కర్తగా నిలచిన
ఉద్యమ పోరటకుడు ॥
అడుగుకు నెట్టబడిన
బడుగు జనోధ్ధరణకై
బారిష్టరుగా ఎదిగి
"భారత రాజ్యాంగాన్ని"
రచించిన "భారత రత్న."మన
"బాబా సాహెబ్ అంబేద్కర్."
------------------------------------
రాజ్యాంగ రక్షణ మన బాధ్యత.
శ్రీరామస్తోత్రం
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
ప్రక్రియ : గేయ కవిత.
----------------------------
రామా ! నిను తలచినంత నేమా వెతలన్ని
తీరునోమారిటు రార ! రామ రవికుల సోమా !॥
బాలా కౌశల్య వర కృపాళా ! శ్రిత పరిపాలా !
లీలా కరుణాలవాల , మృదు పద జాలా..॥
కామారి వినుత రామ, ఇనవంశ కుల సోమ
ధామా ! అయొాధ్య రామ, ముని జన కామా ॥
నందా.... ! దశరధానందా ! సీతా-మనార-
విందా ! మృదు మధుర హసిత భుాష తరంగా !॥
అంగా ! కరుణాంతరంగ..రామా ! ముని
హృదయ భృంగ ! రాజాధి రాజ రామ !
ధను ధర భీమా ॥భంగా! గర్వారి, దైత్య
దమనా,ధర పాలిత వర! సుగుణాభి రామ -
రామమేయ శుభాంగా ॥
ఆజ్ఞ కారి, వన విహారి ,యజ్ఞ రక్షకాధారీ
కల్యాణ గుణ కారీ ! భవ సాగర తారీ॥
అహల్యాది శాప హారి। తాటకాంతకా సౌరీ !
లోకాది వందిత పద ! పాప నాసకారీ ॥ ॥
పట్టాభి రామ రామ ! సృష్ట్యాద్యవతార భీమ!
సుందర సుకుమార సోమ ! మంగళ శుభ కామా ॥
రామా ! శ్రీ రామ రామ ! సీతా ! మనోభి రామ ।
వాతాత్మజ వందిత పద ,నౌమీ .। శ్రీ రామా ॥
--------------------------------------------------------
--------------------------------------------------------
హామీ:
హామీ: నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచన.
--------------------------------------------------------
15/04/2021.
తెలుగు భారతి సాహిత్య సేవా సంస్థ -ఎస్ వీ ఫౌండేషన్, ప్రజా సేవలో ----
జనదీపిక సంయుక్తంగా నిర్వహిస్తున్న కవితా వసంతోత్సవం ,
*శ్రీరామ నవమి కవితా వసంతోత్సవం*
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక : అవతార పురుషుడు.
ప్రక్రియ : గేయ ప్రక్రియ.
క్రమ సంఖ్య : 127.
దశరధానంద నేత్ర ! కౌశల్యా వరపుత్ర!
భరత లక్ష్మణాది భ్రాత ! రవి కుల జాత॥
కైకేయిా వర పాలిత ! పితృ వాక్య పరిపాలక ,
కానన వనవాస రామ ! ఖలుసాంతక భీమా ॥
శివ ధనుా భంగ రామ ! సీతా మనోభిరామ!
త్రేతాయుగ పరంధామ! పావన ఘన శ్యామా ॥
మాయా మారీచ దమన ! మంగళ శుభ కామనా.. రాక్షసాంతకా ఘనా ! సీతా హృదయ భావన ॥
లంకా ధహనావేశ ...జానకీ , శోక నాశ !
వాతాత్మజ వందిత పద ! మంగళ కర,చరణా ॥
దశకంఠ...దైత్య దుార। ధర్మ పాల ధను ధీర
మర్యాద పురుషోత్తమ ! మంగళ శుభ చరితా ॥
రాజాధి రాజ రామ ! ముని మానస హృదయ కామ॥
ధామా ! అయొాధ్య పాల ! రఘు కుల సోమా ॥
ధర పాలిత దివ్య నేత్ర ! రామా వర సుగుణ గాత్ర
కరుణా తరంగ నేత్ర । కామారి మిత్ర ॥
పట్టాభి రామ రామ పావన సీతాభి రామ
పరమాత్మా సుచరిత శుభ సుందర రామా।
దేవాది ముని వందిత నుత పథ, పద గీర్వాణ
జన గణ హిత కల్యాణ ! మంగళ శుభ నామా ॥
--------------------------------------------------------
శీర్షిక : లోక కల్యాణ కారకుడు.
వచన కవిత.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
--------------------------
దుష్ట శిక్షణ , శిష్ట రక్షణ కోసం
శ్రీమహా విష్ణువు ఎత్తిన దశవతారాల లో
ఏడవ అవతారం శ్రీరామచంద్రుడు ॥
రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే మనం శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం.
లోక కల్యాణార్ధం మానవ అవతారం ఎత్తిన
శ్రీ రామచంద్రుడు , తలిదండృలను ఎలా
గౌరవించాలో , వారి మాటకు ఎంత విలువ
ఇవ్వాలో తెలియపరచేడు.
బాధ్యత గల రాచ బిడ్డగా ధర్మ బద్ధమైన
ప్రజా పాలనఎలా చేయాలో ఆచరించి చుాపేడు.
ఒకే మాట ,ఒకే భార్య అంటుా వైవాహిక
బంధపు విలువలని చాటి చెప్పేడు.
అన్నదమ్ముల ఆదర్శానికి , ఆలు మగల అనుబంధానికి, ధర్మ పరిపాలనకు ,
దుష్ట -శిక్షణ కు,శిష్ట -రక్షణకు , పేరుగా
శ్రీ రాముని చరితం తార్కాణ మంటారు.
జగద్విఖ్యాతి గాంచిన "శ్రీరామ నామ జపం"
సర్వ దేవ ,ఋషి ,ముని మానవులందరికీ ముక్తి,మొాక్ష కారకమని , కలియుగంలో
రమ నామ జపమొక్కటి చాలు , జన్మ తరింపజేయడానికని , వేద శాస్త్ర పురాణ
విదితమైనది. సాక్షాత్తుా మహాదేవుడు కుాడా
నిత్యం జపించే శ్రీరామ నామాన్ని మనముా
జపించి కృతార్ధుల మౌదాం.
----------------------------------------------
నవయుగాదికి స్వాగతం
శీర్షిక : నవ యుగాదికి నవ్వుల స్వాగతం.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
కరోనా కాటుతో పాటు , పెరిగిన కాలుష్యం
వల్ల, ఆక్సిజన్ కొరత తో అవస్త పడుతుా,
అనారోగ్యం పాలైన ప్రజలకు మేలు
చేసే రీతిలో వచ్చిన ఉగాది కన్య ,
సమృుద్ధికరమైన నీటి వనరులతో ,వచ్చి పచ్చదనానికి ,పర్యావరణ రక్షణకుా
శ్రీకారం చుట్టింది. ప్రజలలో ఉత్సాహం
ఉరకలు వేసింది. అందరుా అనందం తో
మాస్క్ లు ధరించి, సామాజిక దుారం
పాటిస్తుా "ప్లవ" కన్యకు పట్టం కట్టేరు.
ప్రతీ ఏటా జరిగే యుగాది సంబరం
మంగళకరమైన మామిడి తోరణాలతో
మొదలై , వేద ఘోషల,దైవారాధనలతో ,
షడృుచుల నైవేద్యాలు నేతి పిండివంటల
పసందు ఱుచులతో , సాయంత్రం వరకు
సందళ్ళతో కళ కళ లాడితుా.జరిగింది.
కొత్త వత్సరం తెచ్చిన కొత్త ఉత్సాహంతో
కోలుకున్న జనులు మన సంస్కృతి,
సాంప్రదాయాల ప్రాశస్త్యాన్ని కొనియాడుతుా ,
ఉగాది ఉత్సవాన ఆనంద కోలాటకాలాడేరు..
----------------------------------------------------
రామనామ మహిమ
18/04/2021
మనుమసిద్ధి కవన వేదిక కు పంపిన కవిత
అంశం : రామ నామం. కవితాంశం కొరకు...
శీర్షిక : రామ నామ మహిమ ( ప్రతిలిపి).
వచన కవిత.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
వైకుంఠ వాసుడైన శ్రీ మహా విష్ణువు.
మానవావతారమెత్తిన శ్రీరాముడు.దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జేయడానికి అవతరిస్తున్న యుగపురుషుడు.
శ్రీ "మహావిష్ణుని అష్టాక్షరీ" మంత్రంలో ఐదో అక్షరమైన ‘రా’, "శివ పంచాక్షరీ" మహామంత్రంలోని రెండో అక్షరం ‘మ’.కలిపితే రామ శబ్దం నిర్మితమైంది.
మంత్ర బీజాక్షర శక్తి కలిగిన" రామ "అన్న శబ్దానికి
"ఓం" కారము కుాడా చేర్చ నవసరం లేదు .
గణేశ, శైవ, శక్తి, సూర్య వైష్ణవ మంత్రము-
లన్నింటికంటెనూ అధిక ఫలము "శ్రీ రామ నామ "
జపము వలన కలుగు తుంది."ర" శబ్దము, అగ్ని బీజం " ఆ" శబ్దము,వాయు బీజం "మ" శబ్దము,ఆకాశ బీజం -ఇటువంటి అగ్ని , వాయ,రాకాశ బీజ సమ్మిళితమైన " శ్రీ రామ" నామ మహిమ ఇంతా అంతా
అని చెప్పనలవి కాదు.ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ భాతృ, సదాచారం, నిగ్రహం, వంటి
సర్వ సద్గుణాలు మూర్తీభవించిన దయార్ద హృదయుని ," రామ" అన్ననామాన్ని మన-
మందరం జపించి కృతార్ధులమౌదాం.
హామీ: నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచన.
******:::***::*********************::::*
15/04/2021
తెలుగు భారతి సాహిత్య సేవా సంస్థ -ఎస్ వీ ఫౌండేషన్, ప్రజా సేవలో మనం-శుభోదయం -జనదీపిక సంయుక్తంగా నిర్వహిస్తున్న కవితా వసంతోత్సవం.
*శ్రీరామ నవమి కవితా వసంతోత్సవం* కు పంపినది
*క్రమ సంఖ్య 127.
శీర్షిక : లోక కల్యాణ కారకుడు.
-------------------------
.లోక కల్యాణార్ధం మానవ అవతారం ఎత్తిన
శ్రీ రామచంద్రుడు , తలిదండృలను ఎలా
గౌరవించాలో , వారి మాటకు ఎంత విలువ
ఇవ్వాలో తెలియపరచేడు.
బాధ్యత గల రాచ బిడ్డగా ధర్మ బద్ధమైన
ప్రజా పాలనఎలా చేయాలో ఆచరించి చుాపేడు.
ఒకే మాట ,ఒకే భార్య అంటుా వైవాహిక
బంధపు విలువలని చాటి చెప్పేడు.
అన్నదమ్ముల ఆదర్శానికి , ఆలు మగల అనుబంధానికి, ధర్మ పరిపాలనకు ,
దుష్ట -శిక్షణ కు,శిష్ట -రక్షణకు , పేరుగా
శ్రీ రాముని చరితం తార్కాణ మంటారు.
జగద్విఖ్యాతి గాంచిన "శ్రీరామ నామ జపం"
సర్వ దేవ ,ఋషి ,ముని మానవులందరికీ ముక్తి,మొాక్ష కారకమని , కలియుగంలో
రమ నామ జపమొక్కటి చాలు , జన్మ తరింపజేయడానికని , వేద శాస్త్ర పురాణ
విదితమైనది. సాక్షాత్తుా మహాదేవుడు కుాడా
నిత్యం జపించే శ్రీరామ నామాన్ని మనముా
జపించి కృతార్ధుల మౌదాం.
----------------------------------------------