Saturday, August 20, 2022

ఝండా కీర్తిని చాటుదాం

15/08/2022

మహతీ సాహితీ కవి సంగమఁం
అంశం : చిత్ర కవిత.
శీర్షిక  : ఝండా కీర్తిని చాటుదాం.

రచన :శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .


భరతమాత బిడ్డలం 
భావి భరత పౌరులం
సమత మమత నిండి యున్న  
 స్వేశ్ఛా భారతీయులం ॥
వందే మాతరం 
వందే మాతరం ॥

దేశ గీతములు పాడుతాం 
 దేశముకై పోరాడుతాం
తల్లి ఒడినదే శాంతి నింపుటకు
ఐకమత్యముగ మెలిగేస్తాం॥
వందే మాతరం 
వందే మాతరం ॥

స్వాతంత్రోద్యమ కారుల వీరుల
సత్ చరితలనే చదివేస్తాం
వారి బాటలో అడుగిడతాం
వారి మాటకే జై కొడతాం ॥
వందే మాతరం 
వందే మాతరం ॥

దేశం కోసం పోరాడు వీరుల
దేశ భక్తి కొనియాడుతాం
అసువులు బాసిన అన్న సిపాయిల
ఆదర్శ బాటను అడుగేస్తాం ॥
వందే మాతరం 
వందే మాతరం ॥

ముాడు రంగులా ఝండా గుర్తును
మచ్చటగా ఎగరేయుదాం
గాందీ మాటలో శాంతి బాటలో 
అందరమొకటై   కలిసుందాం ॥
వందే మాతరం 
వందే మాతరం ॥

దేశ ప్రగతికై పోరాటాలను
పొందుగ చేసి సాధిద్దాం 
జాతి జాడ్యముల రుాపు మాపుదాం.
ఝండా కీర్తిని నిలపెడదాం ॥
వందే మాతరం 
వందే మాతరం ॥

అరాచకాలను ఆపేద్దాం
ఆగడాలనే అరికడదాం
పచ్చదనమునే పెంచి తల్లిని
స్వచ్ఛ భారతిగ చేసేద్దాం ॥
వందే మాతరం 
వందే మాతరం ॥

జనగణ గీతమునాలపించి
మన ఝండా కీర్తిని చాటుదాం
వందెమాతరం నినాదాల మన
దేశ భక్తినే చాటుదాం ॥
వందే మాతరం 
వందే మాతరం ॥

పంద్రాగష్టున పలువురం కలిసి
స్వాతంత్ర్యోత్సవములు చేద్దాం
స్వాతంత్ర్య వీరుల జీవితచరితలు
భావి తరములకు అందిద్దాం ॥
వందే మాతరం 
వందే మాతరం ॥

------------------------

మత్తకోకిల పద్యాలు..శ్రీక్రిష్ణ శరణం మమ

రచన 21 Aug 2022

శీర్షిక : శ్రీ కృష్ణః  శరణం మమ ॥
ప్రక్రియ : మత్తకోకిల పద్యాలు.
రచన : శ్రీమతి: 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యసణ్ : మహారాష్ట్ర .


కాలి గజ్జలు ఘల్లు ఘల్లన కన్న నాట్యము చేయరా॥
మేలి బంగరు వర్ణ కాంతుల  మేలు వేణువు నుాదరా ॥
నీలి మేఘపు ఛాయ సుందర నిర్మలా మన మందిరా
లీల చుాపిన క్రిష్ణ నీవయ గ్వాల గోకుల బాలయా ॥

దేవకీ వసుదేవ నందన దేవదేవుడ వీవయా 
దోవ చుాపర ధన్య మార్గము బ్రోవ మమ్మిల కృష్ణయా॥
భావమందున బాహ్యమందున భక్తి కోరితి నీదయా
భుావరా ఘన దేవరా గను భుారి కారుణ తోనయా॥

కాల రుాపవు కంజ లోచన కంసు జంపిన మొాహనా
బాల దేవకి నంద నందన పాల గోకుల వర్ధనా
లీల యామున తేటి నీటను జాల మాయతొ దాటినా
మేటి మాయల రాయ ముద్దులమేయ క్రిష్ణ శుభాననా॥

అష్టమీ దినమందు పుట్టిన శిష్ట మానవ పోషవు 
కష్ట నష్టము దీర్చ వచ్చిన కాల రుాపవ తారవుా
శ్రేష్ట  గోకుల మందు పుట్టిన ఇష్ట మానస రుాపవుా
ద్రష్ట నిర్మల కాంతి నిండిన  పుష్టి  నైన విశాలవు ॥

కృుార కంసుని జంపినావట  ఘోర సంకట మేలగా
చీరలిచ్చితి వంట ద్రౌపతి జిక్కు కష్టము దీర్చగా
ద్వారకా పురి వాస క్రిష్ణయ దాస భక్త సుపోషకా ॥
జార చోరవు రాధలోలవు జాలమేలయ శ్రీకరా॥

వేల నామములున్న వాడవు వేణుగాన విలోలనా
బాల రుాపము తోడ వచ్చిన గ్వాల శ్రీహరి చిద్ఘనా
జేల అష్టమి నాడు పుట్టిన జేజి గారుడ వాహనా 
ఆలమందల నేలు వాడవు ఆర్తత్రాణపరాయణా ॥

పుాల మాలలు గట్టి తెచ్చితి పుాజ నీకదె సేయగా
శీల సద్గుణరాయ చిద్ఘన శీఘ్ర మీదరి రావయా ॥
మేలు ఆటల నాడి కాంతలు వేల పాటలు పాడగా
మేల మాడుచు సంద డించకు మేటి టక్కరి గోపయా ॥

గోరు వెచ్చని వెన్న తెస్తిని గోవు పాలతొ పాయసం
చారు సుందర నాయకా ఘన సార వేద్యము నీకయా ॥
కోరు చుంటిని నీదు సేవను కోటి జన్మల కైననుా
లేరు ఎవ్వరు నీకు సాటిగ లేత నవ్వుల దేవరా ॥

అష్టమీ దినమందు పుట్టిన శిష్ట మానవ పోషవు 
కష్ట నష్టము దీర్చ వచ్చిన కాల రుాపవ తారవుా
శ్రేష్ట  గోకుల మందు పుట్టిన ఇష్ట మానుష రుాపవుా
ద్రష్ట నిర్మల కాంతి నిండిన  పుష్టి  నైన విశాలవు ॥

మంగళమ్ములు పాడి వేడితి మాధవా మధు సుాదనా
రంగ శ్రీపతి కావ రావ శుభాంగ నీదయ లుండునా ॥
బృంగ మౌని హృదాలయా ఘన రంగ శ్రీపుర నాయకా
అంగ రంగ సువైభవా ఘననంగ మానస బృంగమా ॥

వందనమ్ములు చేతు గైకొను వంద్యమాన సుధామవుా
బృందవాటి విహార శ్రీహరి నంద ముద్దుల క్రిష్ణవుా
ఇందు లోచన బంధ మొాచన ఈప్సితమ్ముల దీర్తువుా
బాల రుాపము తోడ పుట్టిన  భవ్య మంగళ రుాపవుా॥




బాల సాహిత్యం.

*మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం* 

*ఉత్తమ రచనలు:*
20.8.22:బాలసాహిత్యం

సర్వశ్రీ//
1. జక్కని గంగాధర్ 
2. డా.కురవి వెంకట కృష్ణశాస్త్రి 
3. యేచన్ చంద్రశేఖర్ 
4. పోగుల భాగ్యలక్ష్మి 
5. పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి 
6. కుడికాల సమ్మన్న 
7. ఎం.వి.ఉమాదేవి 
8. ఎలగందుల లింబాద్రి 


మహతీ నిర్వాహక/సమీక్షక బృందము


బాల సాహిత్యం.
అంశం : బాల భారతం.
"చ " గుణింతం తో...
శీర్షిక : చక్కని మాటలు వినరండి.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .

చక్కనైన పాపలుా 
చందమామ ఊసులుా
చక్కని మాటలు చెపుతా నేను 
చేరి చేరువగ  వినరండీ ॥
ఛంగు ఛంగున లేవండీ 
చక్కగ బడికి వెళ్లండీ
చాచా నెహ్రూ గాంధీ తాతల 
బాటను శాంతిగ నడవండీ ॥
జగతిని ఖ్యాతిని పొందిన వీరుల
చరితలు బాగా చదవండీ ..
ఝండా  కీర్తిని నిలపండీ
జై హింద్ అంటుా పాడండీ ॥
చిన్నా పెద్దను తేడా చుాపక 
చిరు గౌరవముల నీయండీ
చీమల్లాగా ఐకమత్యముగ
చక్కగ కలసీ నడవండీ॥
చుట్టుపక్కల వారికి వలసిన 
చేగల సాయం చేయండీ ॥
చుాపుల కరుణను నింపండీ
 చక్కని మాటలనాడండీ ॥
చెట్లను బాగా నాటండీ
చెడు కలుషితముల నాపండీ ॥
చైతన్యమ్మును పొందే విధముగ
చెడు విరుగుడుకై పోరండీ ॥
చేయిా చేయిా కలపండీ 
చొరవగు స్నేహము నిలపండి ॥  
చందమామలా చల్లని నవ్వుల 
చెలిమితొ మమతలు పంచండీ॥
చః చః లాడుచు చిలకల్లాగా
చకచక పనులను చేయండీ ॥
చక్కని భారత భావి పుత్రులుగ
చరిత కెక్కి ఇల మనరండీ ॥

Monday, August 15, 2022

మాతృ వైభవం ( భారత .దేశ దండకం).

మాతృ వైభవం. 
ఇది మా అన్న గారైన కీర్తిశేషులు బ్రహ్మశ్రీ “పండిత” నేమాని రామజోగిసన్యాసిరావు గారు 
మాతృదినోత్సవంసందర్భంగా 
భరతమాత వైభవాన్ని వర్ణిస్తూచెప్పిన అద్భుత దండకం.
************************
జయ జయ జనయిత్రి! శ్రీభారతక్ష్మాధినేత్రీ! సదా సస్యసంపన్న సౌవర్ణధాత్రీ! జనానీక సంక్షేమ సంభావితార్థ ప్రదాత్రీ! సుగాత్రీ! మహోత్తుంగ శృంగాఢ్య శీతాద్రి వింధ్యాద్రి ముఖ్యాద్రి వర్యాంఘ్రి సామీప్య రమ్యాటవీ మధ్య సంజాత భాగీరథీ సింధు గోదావరీ ముఖ్య భవ్యాపగాతీర శోభాయమాన ప్రశాంతామలారామ రాజత్తపో భూ ప్రభావ ప్రభాభాసితాంగీ! శుభాంగీ! సదా ధర్మ సంరక్షణోద్యోగ తాత్పర్య గంభీర భావాంకితాత్మ ప్రజానీక సంక్షేమ ధౌరేయ శ్రీరామ భూమీశ కౌంతేయ ముఖ్య క్షమానాథ శౌర్యప్రతాపాది సల్లక్షణోద్భాసితానంతకీర్తీ! మహోదాత్త చారిత్ర సంతాన బాహుళ్య సంశోభితానంద మూర్తీ!
శ్రీవిక్రమాదిత్య హర్షాధిపాశోక శ్రీకృష్ణరాజేంద్ర ఝాన్సీశివాజీ ప్రధానాశయ స్థాపితోత్కృష్ట ధర్మార్థ వత్సంప్రదాయాన్వితా! విశ్వ విఖ్యాత వేదాంత విజ్ఞాన సంగీత సాహిత్య వాణిజ్య ముఖ్యాఖిలోద్యోగ నైపుణ్య రత్నావళీభూషితా! నిత్యసంతోషితా! స్వాతంత్ర్య సంగ్రామ సీమోచితోత్సాహ ధైర్యప్రకాశాఢ్య సత్యాగ్రహాద్యాయుధోపేత గాంధీ మహాత్మాది ధన్యాత్మ సంపాదితా పూర్వ సౌభాగ్య సంపద్విశేషాన్వితా! రమ్య వర్ణత్రయోద్గీత సద్భావ సంకేత సంయుక్త చారుధ్వజా! సుప్రజా! లోకవిఖ్యాత ప్రద్యోత ప్రజ్ఞామయానేక ధీర ప్రజానాయకశ్రేణి సంవర్ధితాశేష ఖండాంతరవ్యాప్త సౌభ్రాత్ర సౌహార్ద భావాంచితా! లోకసంపూజితా! జ్ఞానవైరాగ్య భక్త్యాది సన్మార్గ వైవిధ్య సంశోభితా! సాధు సంభావితా! దివ్యతేజోన్వితా! భారతక్ష్మామహాదేవతా! శాంతి సౌభాగ్య సంపన్మహాపారిజాతా! నమోవేదభూమే - నమఃపుణ్యభూమే - నమోధర్మభూమే - నమోధన్యభూమే - నమోవీరభూమే -నమోమాతృభూమే -నమస్తే - నమస్తే - నమస్తే - నమ:. జైశ్రీరాం.జైహింద్.
****:::::******************

మీకు   నచ్చితే వీలైతే  ఆగస్టు ౧౫ నాడు చదవండి.  ఆడియోలు పెట్టండి. 

జై భారత్ మాతా 🙏🙏🙏

Sunday, August 14, 2022

జీవిత ప్రయాణం

27/07/2022.
శీర్షిక : ప్రయాణం

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

మన ప్రమేయం లేకుండానే 
మొదలైన మన జీవిత ప్రయాణం .
 అనుకోని బాటలో అర్ధంకాని ఆరంభం.
వద్దనుకున్నా ఆగని ఒంటరి పయనం .॥

పెనవేసుకున్న బంధాలకు తోడైన బాధ్యతలు
 పెరుగుతున్న బాధ్యతలకు భారమైన బరువులు
పెంచుకున్న మమకారాలతో నిండిన జీవిత యానం 
దిశ మారినా దశ మారని ఒడిదుడుకుల ప్రయాణం ॥

అగమ్యగోచరమైన లక్ష్య సాధనకు
అలుపెరుగని ఆశల పయనం .
ఏ ఆశయం వైపు మళ్ళుతుందో 
తెలీని ప్రయాణం , అదే జీవితం ॥

నాలుగు దశల జీవితంలో 
నచ్చనివి కొన్ని నచ్చినవి కొన్ని
నచ్చనివి  తప్పించుకోలేని బలహీనత
నచ్చినవి పొందాలున్నా పొందలేని నిరాశ ॥

సుఖ దుఃఖాల సాగరంలో సాగే ఎదురీత.
సద్దుబాటుల బాటలో సుఖ సంతోషాల కొరత
జనన మరణాల మధ్య  క్షణ క్షణం పోరాటం. అలుపెరుగని ఆరాటాల  జీవిత ప్రయాణం .॥

*********************************:::

Saturday, August 13, 2022

స్వాతంత్ర్య సమర యొాధులు. ఆటవెలదిలో

స్వాతంత్ర్య  సమర యొాధులు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

ఆంగ్ల దొరల పోరు అదెవేద ననుపెంచ
అలసె బాని సలుగ  అవని జనులు
దాశ్య శృంఖ లాల దాసజీ వితపోరు
పెరిగి పెద్ద దాయె పెరడు దాటె ॥

ఉద్య మాల బాట నురికిచే రిరివారు
ప్రాణ త్యాగ మెంచి ప్రతిన బుాని 
ఝండ చేత బుాని జయముశాంతినికోరి
జనము వేలు జేరె జరుప పోరు ॥

బాపు నాయకత్వ బాట నడచి వారు
శాంతి తోడ పోరె  శక్తి మీర
కడకు పొందె జయము కరకు పాలన వీడె
గెలుపు పిలుపు విందు గేయ ములతొ॥

వీర సైనుకులదె వీక్షీంచ నికలేరు
అమరు లైరి వారు  అలసి పోరి
వారి త్యాగ ఫలమె వచ్చె స్వాతంత్ర్యమ్ము
వరుస వారి కిడుమ వంద నమ్ము.॥

బాల భారతం...చాచా నెహ్రూ .

బాల భారతం .
అంశం : జవహర్‌లాల్ నెహ్రూ.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .


పిల్లల్లారా రారండీ 
పాపల్లారా వినరండీ
చాచా నెహ్రూ  కధ చెపుతాను 
కచక్కగ కుార్చొని వినరండీ ॥

భారత స్వాతంత్ర్య  నాయకుడితడే
 తొలి ప్రధానిగా పాలకుడితడే
 పండిత్ జీగా ఖ్యాతి గడించిన 
 జవహర్ చాచా నెహ్రూ ఇతడే ॥

రాజకీయాల బాట నడచిన 
గాంధీ తాతకు సఖుడితడుా
సత్యాగ్రహాలు చేసేడుా
జైలు శిక్షలను పొందేడు ॥

ఇందిరమ్మకు తండ్రితడుా
ప్రపంచ చరితలు తెలిపాడు
కాంగ్రెస్ సభలకు వెళ్ళేడు
సరియగు న్యాయం కోరేడు ॥

  లౌకిక మానవతావాదిగ , 
 సామాజిక ప్రజ స్వామ్యవాదిగ 
 శక్తివంతముగ భరతావనిని
 చేసిన ప్రసిద్ధ నాయకుడు ॥
 
ఆధునిక భారత దేశ వైభవం 
సాంకేతిక పరిజ్ఞాన ప్రాభవం 
చాచా నెహ్రూ మనసా వాచా 
చేసిన దేశమె మన దేశం ॥

భారత రత్నగ పురస్కారము
డాక్టరేట్ గా ఘన సత్కారము
పొందిన ఘనుడు చాచా నెహ్రూ 
అందరి కిష్టుడు చాచా నెహ్రూ ॥

గులాబీలను అలంకరణగా
బాలల పాపల ప్రేమించెనుగా
చాచా నెహ్రూ పుట్టినరోజు
బాలల కెంతో ప్రీతి గదా ॥

చాచా చుాపిన ఔదార్యం
దేశ ప్రజలకై సేవా గుణం
పసి పిల్లలపై మమకారం
చాచా కోరిన నవ భారతం ॥

------------------

Friday, August 12, 2022

త్రివర్ణ సందేశం.

అంశం : త్రివర్ణ సందేశం .
శీర్షిక  :  స్ఫుార్తి నిచ్చు పతాకం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


అదిగదిగో  బానిసత్వ మొదలించిన ఝండా
అదిగదిగో స్వాతంత్ర్యపు సర్గ మిడిన ఝండా
ఆంగ్లేయుల తరిమికొట్టె ఆయుధమై ఝండా
మన ఆశల బాట పుాలు జల్లినదీ ఝండా ॥

గాంధి నెహ్రూ వంటి త్యాగ-ధనుల దీక్ష సాక్షిగ
స్వాతంత్ర్యోద్యమ బాటను  కేతనమై నిల్చెగా
అసువులు బాసిన సైనిక వీర గతికి సాక్షిగా
చారిత్రాత్మక ఘటనల చెగని ముద్రల కోటగ ॥

ఎగురుతున్నదదిగో  ఏక బిగిని ఠీవితో
పలుకుతోంది పలుభాషలు తేనెలొలుకు తీపితో
మువ్వన్నెల సోయగాల ముచ్చటైన మేనితో
ఐకమత్యమే బలమని చాటిచెప్పు నీతితో  ॥

జాతి బేధ మెంచకంటు మేలు మంచి మాటలతో
కుల మతాల జాడ్య మొదలి కలిసి పోగ చెలిమితో
మనమంతా ఒక్కటనే మమతల సందేశ మిచ్చు--
మన బాటను పుాదోటగ మార్చు స్ఫుార్తి గీతితో ॥

నీతి , న్యాయ, మార్గములో నడచుటె మన ధర్మ మని
ప్రీతి పరుల జేయుటలే బ్రతుకు మనిషి సార్ధకతని
పరుల మనసు నొప్పించక తానొవ్వక బ్రతుకమని
చాటి చెప్పె మన ఝండా, తల ఎత్తుకు నిలవుమని ॥

స్వాతంత్ర్య సమరోత్సవం

అంశం : స్వాతంత్ర్యామృతోత్సవం 
శీర్షిక  :  స్వాతంత్ర్య దినోత్సవానికి స్వాగతం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర


తెల్లదొరల పాలనలో శృంఖలాల బానిసత్వం.
శుృతి మించిన కృుారత్వం అదర, రేగె కలకలం .
శాంతి నిండు బాటలో ఉద్యమాలకు శ్రీకారం.
దేశం కోసం దేహ సమర్పణల సమాహారం  ॥

ఆగ్రహ సత్యాగ్రహాలకాకలికాప్తుల చావులు
తుపాకీల కాల్పులకు దేహాలె ఖండాలు
అస్థిత్వం కానరాని   లాకప్పు జీవితాలు
రగులుతున్న రుధిరంతో ఉనికికై పోరాటాలు ॥

 యువత గుండెలాయె తుాట్లు తెగెనెన్నో తాళిబొట్లు  
 కన్నతల్లు లెందరో కోల్పోయిన పేగు తట్లు
 అందరొక్కటై  పోరగ అందినదీ స్వాతంత్ర్యం 
 స్వార్ధమన్నదే లేకను కలిసి చేయ పోరు జయం ॥

 శాంతి నిండు ఉద్యమాల బాట తాత గాంధీజీ
 వెన్నంటీ నడిచె చాచా నెహ్రూ జీ, నేతాజీ.
 వత్సరాల శాంతి పోరు కునుకు లేని జోరు హోరు
 తెచ్చె మనకు స్వాతంత్ర్యం ఇచ్చె మనకు జీవితం ॥
 
ఆనందముప్పొంగగ అభినందనల పండగ
ఆగష్టు  పదిహేనున ఆనందం నిండుగ 
ప్రతి పౌరుని కంటిలో ఉబికిన  కన్నీటి గంగ .
త్యాగధనుల జ్ఞాపకాన ఎగరె మన తిరంగా ॥

నేను నా దేశం

నేను సైతం కవి పత్రిక ఆగష్టు  నెల సంచిక కొరకు...
అంశం : నేను నా దేశం .
శీర్షిక  :  రత్నగర్భ నా దేశం . 

శీర్షిక  :  రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర.

ప్రక్రియ : వచన కవిత.


"జననీ జన్మ భూమిశ్చ - స్వర్గాదపి గరీయసీ". అంటే
జనని, జన్మభూమి స్వర్గము కంటె ప్రియమైనవి కదా!".

అని స్వయముగా శ్రీరామంచంద్రుడే అన్న మాట.
భిన్నత్వంలో ఏకత్వాన్ని చుాపించిన  పుాదోట.
కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు విస్తరించి 
విభిన్న మతాలు,భాషలు, సంస్కృతులతో విలసిల్లుతూన్న  సువిశాలమైన దేశం నా దేశం .

ఆర్య భూమి, సూర్య భూమి, వీరభూమిగా
బోయి భీమన్న మాట సత్యమైన కోట.
దేశమంటే మట్టి కాదోయ్! దేశమంటే మనుషులోయ్!!- అన్న గురజాడ అప్పారావు పాట అందరి నోటా.

బ్రిటిష్ ఆర్మీని గడగడలాడించిన 
ధీర వనిత ఝాన్సీ లక్ష్మిబాయి.
భారత స్వాతంత్ర్యోద్యమానికి నాంది పలికిన
 తొలి  ఉద్యమకారుడు మంగల్ పాండే ..
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజలకు ప్రేరణ కలిగించిన ఉద్యమ తార భగత్ సింగ్. 
అహింసా మార్గంలో అద్భుతాలు సాధించవచ్చని..
ప్రపంచానికి సరికొత్త దిశానిర్దేశనం చేసిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మా గాంధీజీ...
భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన వ్యక్తి 
డాక్టర్ బాలా సాహెబ్ అంబేద్కర్ ...
ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించిన 
స్వామి వివేకానంద...
నాకు రక్తం ఇవ్వండి. నేను మీకు స్వాతంత్ర్యం తీసుకొస్తాను అన్న శుభాష్ చంద్రబోస్ ..వంటి
దేశ ప్రేమికులకు  జన్మ నిచ్చిన దేశం నాదేశం .
తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందిన అష్టదిగ్గజాల వంటి కవులతో , 
ఆష్టాదశ పురాణాలకు ఆది ముాలమై..
నాలుగు వేదాలకు నిలయమైన సంప్రదాయబద్ధ
సంస్కృతికి నిలయం నా దేశం.
అరవై నాలుగు కళలతో అలరిన అక్షయ, సంగీత సాహిత్యాలకు కావ్య కవన ఇతిహాసాల సమాహారం 
నా దేశం.

ఆంతులేని ఆప్యాయత ఆత్మీయత నిండిన
జన సందోహంతో, పలు  భాషలు నిండు పలకరింపులతో , హిమ పన్నగ శోభలతో, సాగర, నదీ
గమనాలతో పరవసించు ప్రకృతి వన శోభలతో
అలరారుతున్న దేశం...నా దేశం ॥

వేయేల !  పుణ్య భుామి నా దేశం నమొా నమామి!
         ॥నన్నేలిన  నా దేశం  సదా స్మరామీ ॥

 

స్వాతంత్ర్య పోరాటం

పోర్చగీస్  పాలన  పోరుకు దారితీసె
అరాచక పాలనను అంతం చేయు తపనె
స్వాతంత్రోద్యమాల స్వాగతాలకు పిలుపు
భారతీయుల్లోన భావోద్వేగాల మలుపు ॥ 



శ్రీశ్రీ  కళా వేదిక వారి పోటీ కొరకు ,
అంశం : స్వాతంత్ర్య  సమర యొాధులు.
శీర్షిక : ఇవే నా అంజలులు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


పోర్చగీస్ పాలనిడె  పోరుకు ప్రేరణ
అరాచక పాలనను అంతం చేయు తపన
 స్వాతంత్రోద్యమాలకై సాయుధపోరాట పిలుపు
భారతీయుల్లోన భావోద్వేగపు మలుపు ॥ 

అనేకోద్యమాలు, అవె సాయుధ పోరాటాలు
అహింసా పోరాటాలు అవే మన సిద్ధాంతాలు.
రాక్షసత్వం నిండు రాజకీయ హోరులు
విప్లవ పోరులలో వీరులౌ విశ్వ  సైనికులు ॥

భారత సిపాయిల్లో  భారీ తిరుగుబాటు
జాతీయొాద్యమాల జనసందోహపు పోటు
వీరగతిని పొందిన వీర పుత్రులనేకులౌ లోటు స్వాతంత్ర్య సంగ్రామం దేశ భక్తికి నిండు ధీటు ॥
 
దేశం కోసం పోరాడిన ఎందరో వీరులు 
అసువులు బాసినారెందరో  ధీరులు
కీర్తి కెక్కినా కానరాని కన్నీటి చరితలు 
ధన్యులుగా స్వాతంత్ర్య సమరయొాధులు ॥

సాగించిన సమరం  సాధించెను విజయం.
దాస్య ముక్తి నొందు దీనుల కిదె సంబరం
త్రివర్ణ పతాక స్ఫుార్తి  దేశ విముక్తికి కీర్తి ॥
జనులెగరేసిరి ఝండా అడి పాడి ఆనంద గీతి ॥

వేలౌ నినాదాల వెనుకేయని గొంతులకు
వీరోచిత పోరాటంలో వీరగతి ప్రాప్తులకు
దేశంకోసం ప్రాణాలుసైతం అర్పించిన
స్వాతంత్ర్య సమర యొాధులకు...
          ॥ఇవే నా అంజలులు॥




శ్రావణ మాసం విశిష్టత


అంశం: శ్రావణ శుక్రవారం
విశిష్టత.
శీర్షిక  : భక్తుల పాలిట కొంగు బంగారం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

మహావిష్ణువు జన్మ నక్షత్రం “ పేరుతో ఏర్పడిన "
 శ్రావణ "మాసం శ్రీమహా విష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం..॥
శ్రావణ మసంలోని మంగళవారాలు 
శ్రీగౌరీ పూజకు,శుక్రవారాలు శ్రీలక్ష్మీ పూజకు, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు

స్త్రీల వ్రతాలకు నోములకు  ప్రసిద్ధి చెందినదీ  శ్రావణ మాసం.॥
శ్రీమహాలక్ష్మి  చారుమతి అనే పుణ్య స్త్రీ కి
స్వప్నంలో కనిపించి శ్రావణ మాస 
విశిష్టతను విశదీకరించిన విధమును 
ఈ నాటికీ స్త్రీ లందరుా పాటిస్తుా ఆ తల్లి
శ్రీలక్ష్మిని కొలిచే ఆచారం ఈ శ్రావణ మాసం కావడం గొప్ప విశేషం. ॥
పౌర్ణమికి ముందుగా వచ్చిన శుక్రవారము నాడు  స్త్రీ లంతా శోభాయమానంగా గృహాలను అలంకరించి ,  అమ్మవారిని కలశములోనికి ఆహ్వానించి ఆపై
రంగురంగుల పుాలు, పసుపు, కుంకుమలతో ,
అమ్మవారిని  పుాజించి పంచభక్ష్య పరమాన్నాలు నైవేద్య మిడి , భక్తి నిండు శ్రావ్య , మంగళ వాద్యాలతో మంగళ గీతాలు పాడి శ్రీలక్ష్మిని సౌభాగ్య సిరులీయమని స్త్రీలంతా వేడుకునే సంబరమిది. 

ఇది ఈ శ్రాణ శుక్రవారం యొక్క విశిష్టత.
ఈ కధను విన్నవారికి చదివినవారికి ఆ వరలక్ష్మీ 
కృపతో సకలసౌభాగ్యములు కలుగుతాయని స్త్రీ లు నమ్ముతారు.



Wednesday, August 10, 2022

నేను నా దేశం .

నేను సైతం కవి పత్రిక ఆగష్టు  నెల సంచిక కొరకు...
అంశం : నేను నా దేశం .
శీర్షిక  :  రత్నగర్భ నా దేశం . 

శీర్షిక  :  రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర.

ప్రక్రియ : వచన కవిత.


"జననీ జన్మ భూమిశ్చ - స్వర్గాదపి గరీయసీ". అంటే
జనని, జన్మభూమి స్వర్గము కంటె ప్రియమైనవి కదా!".

అని స్వయముగా శ్రీరామంచంద్రుడే అన్న మాట.
భిన్నత్వంలో ఏకత్వాన్ని చుాపించిన  పుాదోట.
కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు విస్తరించి 
విభిన్న మతాలు,భాషలు, సంస్కృతులతో విలసిల్లుతూన్న  సువిశాలమైన దేశం నా దేశం .

ఆర్య భూమి, సూర్య భూమి, వీరభూమిగా
బోయి భీమన్న మాట సత్యమైన కోట.
దేశమంటే మట్టి కాదోయ్! దేశమంటే మనుషులోయ్!!- అన్న గురజాడ అప్పారావు పాట అందరి నోటా.

బ్రిటిష్ ఆర్మీని గడగడలాడించిన 
ధీర వనిత ఝాన్సీ లక్ష్మిబాయి.
భారత స్వాతంత్ర్యోద్యమానికి నాంది పలికిన
 తొలి  ఉద్యమకారుడు మంగల్ పాండే ..
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజలకు ప్రేరణ కలిగించిన ఉద్యమ తార భగత్ సింగ్. 
అహింసా మార్గంలో అద్భుతాలు సాధించవచ్చని..
ప్రపంచానికి సరికొత్త దిశానిర్దేశనం చేసిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మా గాంధీజీ...
భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన వ్యక్తి 
డాక్టర్ బాలా సాహెబ్ అంబేద్కర్ ...
ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించిన 
స్వామి వివేకానంద...
నాకు రక్తం ఇవ్వండి. నేను మీకు స్వాతంత్ర్యం తీసుకొస్తాను అన్న శుభాష్ చంద్రబోస్ ..వంటి
దేశ ప్రేమికులకు  జన్మ నిచ్చిన దేశం నాదేశం .
తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందిన అష్టదిగ్గజాల వంటి కవులతో , 
ఆష్టాదశ పురాణాలకు ఆది ముాలమై..
నాలుగు వేదాలకు నిలయమైన సంప్రదాయబద్ధ
సంస్కృతికి నిలయం నా దేశం.
అరవై నాలుగు కళలతో అలరిన అక్షయ, సంగీత సాహిత్యాలకు కావ్య కవన ఇతిహాసాల సమాహారం 
నా దేశం.

ఆంతులేని ఆప్యాయత ఆత్మీయత నిండిన
జన సందోహంతో, పలు  భాషలు నిండు పలకరింపులతో , హిమ పన్నగ శోభలతో, సాగర, నదీ
గమనాలతో పరవసించు ప్రకృతి వన శోభలతో
అలరారుతున్న దేశం...నా దేశం ॥

వేయేల !  పుణ్య భుామి నా దేశం నమొా నమామి!
         ॥నన్నేలిన  నా దేశం  సదా స్మరామీ ॥

 

హామీ : పై కవితసా స్వీయ రచన.

Tuesday, August 9, 2022

ప్రక్రియ : రుబాయిలు.

9/8/22.
సాహిత్యాంశము : మంచిని పెంచుకో.
ప్రక్రియ : రుబాయిలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


గులాబీకి ముళ్ళుం టాయని వదిలేయగలమా  .
పుాలెన్నో పుాస్తుం టాయని చిదిమేయగలమా .
మనిషి గుణగణాలు విజయానికిల సోపానాలు.
అలాగని  భువిలో బ్రతకడం మానేయగలమా॥

తెల్లనివన్నీ  పాలుకావు.
నల్లని వన్నీ నీళ్ళు  నీళ్ళుకావు
అందం, అది మనిషికి శాపం..
చుాసినవన్ని నిజాలుకావు. ॥

జీవితంలో మంచి చెడులను తెలుసుకో.  
అందరితో  నువు  స్నేహంగా మసలుకో.
చెడ్డవాడికిట విలువ లేదు .
గంజాయి వనాన తులసిలా నిలిచిపో॥
 
 గుణవంతుడు  అందరికీ  మంచినే పంచగలడు. 
 మంచిపనులు చేస్తే హాయిగా జీవించగలడు.
నోరు మంచిదైతే ,ఊరంతా మంచంటారు.
 సద్గుణాలున్నవాడే,  లోపాలనెంచగలడు.॥

చేయి కలిపితే స్నేహము .
పోరు సలిపితే యుద్ధము.
మనిషిగా ఆలోచించు.
నేనన్నిటికీ సిద్ధము.॥

Monday, August 8, 2022

దేశ భక్తి గీతం.

శీర్షిక  :  భరత మాత కీర్తి కిరీటం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


పల్లవి :
-------
ఎగిరింది ఎగిరింది మువ్వన్నెల ఝండా
భరత మాత కీర్తి చరిత చాటి చెప్పు ఝండా
అనుపల్లవి:
----------+
సాధించిన స్వాతంత్యపు స్ఫుార్తి  గీతిగా ..
మన అందరి  తల రాతల మార్పు తీర్పుగా ॥
చరణం:
--------
మన దేశ చరితలకే ఘన కీర్తీ ఝండా
పింగళి వెంకయ్య చేతి చెలిమి బలిమి ఈ ఝండా
ఆంగ్ల పాలకుల కంటిని నలుసైనది  ఝండా
తాటదీసి తరిమి కొట్టి  గెలిచినదీ ఝండా ॥
చరణం:
--------
అడుగులకు మడుగులొత్తు  బ్రతుకు ఘోష బాటగా
 బడుగు  బానిసల నోట నినదించిన ఝండా
 తెల్ల దొర్ల నిరంకుశత్వముాడ్చు తీర్పు ఈ ఝండా
 నల్ల వారి నగుమొామున వీర తిలకమీ ఝండా ॥

చరణం:
--------
జాతి మతము విడుమనీ, మమత పంచి మనుమనీ 
కష్ట సుఖములో చెలిమిని పంచు గుణమె ధనమనీ
పరోపకార చింతనే , మన జీవిత మార్గమనీ
నిత్య సత్య శాంతి బాటె సమకుార్చు విజయమనీ--

స్వాతంత్ర్య బాట లో శాంతి కోరు ఆయుధమై 
ధర్మచక్ర మాధ్యమముగ భరతావని గెలిచినదై
భరత వీర సైనికులకు శక్తి స్ఫుార్తి తానై
ముచ్చటైన మువ్వన్నెల రంగులీను పతాకమై. ॥


****************************************

Sunday, August 7, 2022

చెలిమి చిరునామా

స్నేహితుల దినోత్సవం సందర్భంగా..
అంశం : చెలిమికి చిరునామా.
శీర్షిక : స్నేహమే జీవితం .

పద్య ప్రక్రియ : ఆటవెలది.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .



కష్ట నష్ట ములకు కలతచెం దెడువాడు
ఒక్క  డున్న చాలు ఉత్త మంబు.
ఇష్ట మైన చెలిమి ఇలలోన  మనకున్న
కరకు వెతలు కుాడ కావు బరువు ॥

అన్న  అక్క కన్న  ఆలుప్రే మకుమిన్న
అదెగ స్నేహ మన్న అవని లోన
పండగైన నింట పబ్బ మైనను వెంట.
చేరు వున్న సఖుడె  చెలిమి  పంట ॥

కలిమి లేమి లోన కడదాక  నిలచేటి
కరుణ కలుగు సఖుడె కాద ఘనుడు
బాధ పంచు కున్న బాల్య స్నేహితుడుండ
బరువు భాధ లవియె  భార మౌన  ॥

గొప్ప బీద యనెడు గోడుయుం డనితోడు
జెప్ప లేని  హితము జేయు జోడు
మనసు కోరు చెలిమి చిరునామ యతగాడు
జాతి ఏది యైన జడవ బోడు ॥

చెక్క బెట్టు పనుల చేయుాత నిడువాడు
పిలువ పక్క నున్న  ప్రియము గాద.
కల్మ షమ్ము లేని కడుమంచి చెలికాడు
కలిగి యున్న వాడె కాద ఘనుడు ॥

చేజారిన బంధం.

06/08/2022.
గోరసం వారి వారం వారం కధానిక 3.9 కొరకు..
అంశం : చేజారిన బంధం .
శీర్షిక : మారుతున్న కాలంతో పాటు మనముా మారాలి.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


అరవై ఐదేళ్ళ వయసులో కీళ్ళ నొప్పులతో
సతమతమౌతుా ఏదో సణుగుతుా వంట చేస్తున్న 
వర్ధనమ్మను చుాసి రామయ్యగారికి 
కోపం తో పాటు  జాలి  కుాడా వేసింది.

మెల్లగా లేచి వంటలో ఏదైనా సాయం చేయనా వర్ధనీ
అనడంతో వర్ధనమ్మకు మరింత చిరాకు వేసింది.
ఇంకా నయం మగాడి చేత వంట వండిస్తున్నానని 
నలుగురుా చుాసి నవ్వి పోడానికా...
అంటుా  కఁయ్యి మంది .

రామయ్యగారు వర్ధని వేపు జాలిగా చుాసేరు.
ఇదిగో ఇలాంటి చేదస్తం తోటే మనల్ని ఎంతో బాగా 
చుాసుకుంటున్న కొడుకుా కోడలికి దుారమయ్యేవు.
కాలం మారింది వర్ధనీ ..దానితో పాటు మనుషులు 
వారి అలవాట్లు కుాడా మారేయి.

కానీ నీ చాదస్తం మాత్రం మారలేదు.
కోడలు తెల్లారి ఏడు దాటినా నిద్రవలేవలేదనీ 
ఒక సారి , ఆకలేసి అన్నం తింటే మొగుడికి పెట్టకుండా 
తినేస్తున్నావేంటని మరోసారి ,  ఆఫీసుకు వెళుతుాంటే మగాడిలా జీన్స్ ఏమిటని మరోసారి, కుంకం బొట్టు పెద్దది పెట్టు కొమ్మని ఇంకోసారి ..
మా కాలంలో పని వాళ్ళు లేరు .
నలుగురి పని చేయలేవా  అంటుా మరోసారి
ఇలా నానా రకాలుగా ఆ అమ్మాయిని సాధించేవు.

కోడలు పిల్ల చాలా మంచిది .ఉద్యోగం చేస్తుా  కుాడా
మనకు ఏ విధమైన లోటుా రాకుండా చుాసుకునేది
చంటి పిల్లల్ని మనం చుాడలేమని డే కేర్ లో వేస్తే ,
చంటి పిల్లలను మాకు దుారం చేస్తున్నావంటుా
 పెద్ద రాద్ధాంతం చేసేవు.
 పోనీ ఉంచితే పిల్లల్ని  చుాడగలవా ...అంటే అదీ చేయలేవు.
ఇదిగో !  దాని పర్యవసానమే ఈ నాటి మన పరిస్థితి.

నువ్వు చేస్తున్న గోలంతా మనబ్బాయి రోజుా విని విని 
చివరకు ఈ నిర్ణయం తీసుకుని మనిద్దరినీ వేరుగా ఉంచేడు.

దేనికైనా పట్టు విడుపు ఉండాలి వర్ధనీ..
 పరిస్థితుల బట్టీ, కాలాన్ని బట్టీ,  సద్దు బాటు కుాడా చేసుకోవాలి.
 నీ ఛాదస్తంతో అందరినీ దుారం చేసుకున్నావు.
 
 సరేలే మరో రెండు రోజుల్లో  మన ఇంటి పనులు ,వంటపనులు కుాడా చేయడానికి  మనుషులు వస్తున్నారు.. నువ్వు పని చేసుకోలేవని ఈ సదుపాయం కుాడా కోడలే చేసింది.
పనివాళ్ళతో  నైనా కాస్త జాగర్తగా మసలుకో .
అంటుా హాలు లోకి వచ్చేరు.

వర్ధనమ్మ కళ్ళల్లో కన్నీరు జల జలా కారుతోంది.
అవును .తను అనవసరంగా కొడుకు కోడలికి సంబంధించిన అన్ని విషయాలలోనుా కలుగజేసుకొనేది.
పాపం కోడలు ఏ నాడుా తనకు ఎదురు జవాబు కుాడా చెప్పలేదు. తమకు కావలసినవన్నీ సమయానికి అమర్చి పెట్టేది.
ఇప్పుడు ఆలోచిస్తే తప్పంతా తనదిగానే తోస్తున్నాది.

ఈ సారి గానీ అబ్బాయి తమను వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తే తను కోడలు పిల్లని ఏమాత్రం విసిగించదు.
భగవంతుడా ఈ" చే జారిన బంధాన్ని "తిరిగి
కలుపు తండ్రీ. నీ గుడికి వచ్చి నుాటెనిమిది 
పొర్లు దండాలు పెడతాను .అంటుా మనసారా దేముణ్ణి వేడుకుంది వర్ధనమ్మ.
ఇదీ ఒక ఛాదస్తమే అన్న మాట మరచి.

 హామీ : 
 ఈ కధానిక కేవలం గోరసం కొరకు మాత్రమే 
 రాసినది.

Saturday, August 6, 2022

పంచపదులు

నేనిచ్చే పంచ పదాలు
*లోకం,శోకం,పాపం,తాపం,కోపం*
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

స్వార్ధపరులైన జనంతో నిండింది లోకం.
కామం , వనితలను వెంబడిస్తున్న శాపం.
మానవత్వం మరచి కొందరు చేస్తున్నారు పాపం .
రాక్షసత్వంతో నిండియున్న పురుషుల ప్రతాపం.
భగవంతుని కోపానికి వస్తుందిలే ప్రళయ మీశ్వరీ ॥


నీతి రీతి ప్రీతి  బీతి రతి
నీతి లెరని చోట నియమ ముండదు.
ఈ రీతి జగతిలో  ధర్మ ముండదు.
ప్రీతి నిండిన పలకరింపులకు తావుండదు.
బీతి నిండు బ్రతుకులో సారముండదు
నిరతి నియమాలు పాటించకపోతే మనిషిలో
మంచి తనముండదు.॥

అనుభవాల బాటలో

శీర్షిక : అనుభవాల బాటలో....

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .



పుాలున్న చోట ముళ్ళుకుాడా ఉంటాయి.
సంతోషం వెనకాతలే దుఃఖం కుాడా ఉంటుంది.
కష్టాల కడలిలో పయనించే ఒడిదుడుకుల నావ
చుక్కాని ఆసరాతో తీరం చేరుకుంటుంది.॥

ఆడుగడుగున పోరాటానికి ఆత్మస్థైర్యం తోడుగా
నీలో నిండే అసంతృప్తికి  ధైర్యమే నీ తోడుగా..
అచంచలమైన ఆత్మవిశ్వాసం  నీవెంటే నీడగా
కదలిపో !ముందుకు కారడవైనా। భయమెందుకు ?॥

అసంతృప్తి ఎడారిలో ఆగని నడకే
చేరుస్తుంది  నిన్ను  నీ గమ్యానికి.
ఎండమావి తళుకులే నీ గెలుపుకు అందమైన ఆరంభమై  గెలిపిస్తాయి నీ ఆశయాలని   ॥

మబ్బులు నిండిన ఆకాశంలో 
కొన్ని కోట్ల నక్షత్రాలు మిణుకు మంటాయి.
నిరాశ నిండిన జీవితంలో తోడైన బంధాలు
 ముళ్ళ బ్రతుకు బాట చివర పుాలై వికసిస్తాయి ॥

వికసించిన పుాలపరిమళం గాలిలో కలిసి
సుదుార తీరాలకు గంధమై  వ్యాపిస్తుంది.
అనుభవాల అలలలో తడిసిన వారిని
జీవితాశయం తోడై ముందుకు నడిపిస్తుంది ॥



Friday, August 5, 2022

ప్రయాణం

శీర్షిక  : ప్రయాణం .
పద్యం : ఆటవెలది.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

నాల్గు దశల పోరు నడిసంద్ర మునహోరు
నచ్చి నట్టి బాట నడచి రాదు.
జనన మరణ కాల జరుగుబా టులజోరు
బంధు జనుల పోరు  పయన మందు.॥

కష్ట నష్ట ములను కావిళ్ళ లోమొాసి
 బాట ముళ్ళ నడకె బ్రతుకు తెరువు.
 క్షణిక సుఖము కొరకు క్షణము క్షణము పోరు 
నిత్య పయన మిదియె  నింద లేల   ॥

జీవి పయన మిదియె జీవిత చక్రంబు
తిరుగు చుండు నెపుడు తిరుగు లేదు
బురద లోన పుట్టు బుజ్జి కమలమొాలె
బ్రతుక సంతసమున , భవిత వెలుగు ॥

27/07/2022.
శీర్షిక : ప్రయాణం. women writers కు 
ఉదయం UM కు పంపినవి.

27/07/2022.

శీర్షిక : ప్రయాణం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

మన ప్రమేయం లేకుండానే 
మొదలైన మన జీవిత ప్రయాణం .
 అనుకోని బాటలో అర్ధంకాని ఆరంభం.
వద్దనుకున్నా ఆగని ఒంటరి పయనం .॥

పెనవేసుకున్న బంధాలకు తోడైన బాధ్యతలు
 పెరుగుతున్న బాధ్యతలకు భారమైన బరువులు
పెంచుకున్న మమకారాలతో నిండిన జీవిత యానం 
దిశ మారినా దశ మారని ఒడిదుడుకుల ప్రయాణం ॥

అగమ్యగోచరమైన లక్ష్య సాధనకు
అలుపెరుగని ఆశల పయనం .
ఏ ఆశయం వైపు మళ్ళుతుందో 
తెలీని ప్రయాణం , అదే జీవితం ॥

నాలుగు దశల జీవితంలో 
నచ్చనివి కొన్ని నచ్చినవి కొన్ని
నచ్చనివి  తప్పించుకోలేని బలహీనత
నచ్చినవి పొందాలున్నా పొందలేని నిరాశ ॥

సుఖ దుఃఖాల సాగరంలో సాగే ఎదురీత.
సద్దుబాటుల బాటలో సుఖ సంతోషాల కొరత
జనన మరణాల మధ్య  క్షణ క్షణం పోరాటం. అలుపెరుగని ఆరాటాల  జీవిత ప్రయాణం .॥

*********************************:::


27/07/2022.
శీర్షిక  : ప్రయాణం .
పద్యం : ఆటవెలది.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

నాల్గు దశల పోరు నడిసంద్ర మునహోరు
నచ్చి నట్టి బాట నడచి రాదు.
జనన మరణ కాల జరుగుబా టులజోరు
పాత్ర లెన్నొ జుట్టు పయన మందు.॥

కష్ట నష్ట ములను కావిళ్ళ లోమొాసి
 బాట ముళ్ళ నడకె బ్రతుకు తెరువు.
 క్షణిక సుఖము కొరకు క్షణము క్షణము పోరు 
నిత్య పయన మిదియె  నింద లేల   ॥

జీవి పయన మిదియె జీవిత చక్రంబు
తిరుగు చుండు నెపుడు తిరుగు లేదు
బురద లోన పుట్టు బుజ్జి కమలమొాలె
బ్రతుక సంత సముతొ, భవిత వెలుగు ॥


 


ప్రకృతి భీభత్సవం.

అంశం : ప్రకృతి భీభత్సం .
శీర్షిక  : చెడపకురా ! చెడేవు !

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


భరత మాత ఆగని కన్నీరు 
ప్రళయమై భీభత్సాన్ని సృష్టి స్తోంది.
వాగులు వంకలుా పొంగి పోర్లుతున్నా- 
మంచినీటి కొరత మనుషులకు శాపమయ్యింది ॥

మానవులు దానవులై చరిస్తున్నారు.
కామంతో మనిషి వావి వరుసల్ని మర్చిపోతున్నాడు.
 కొండలు బండల కొరకు తవ్వి పారేస్తున్నారు.
 పచ్చని చెట్లను భుా కబ్జాలకై నరికి వేస్తున్నారు.॥
  
గుాడు లేని పక్షుల కన్నీటి తాపాలు 
పుడమి పాపులను శాపాలై  వెంటాడుతున్నాయి॥
వాతావరణ నియంత్రణను కోల్పోయిన  
 ప్రకృతి మాత అస్తవ్యస్తమైన ఋతువుల 
ఆగమనంతో హైరానపడుతోంది.॥
 
విసపు గెత్తాల మంటకు వెర్రెక్కిన మట్టి మాలక్ష్మి 
 పంట కోతల్లో పాశ  హస్తాన్ని తిప్పుతుా
 రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోంది.॥

 పసి పిల్లల ప్రాణానికి, ఆడ పిల్లల మానానికి 
రక్షణలేని  రాపిడి చుాసి భరత మాత రోమాలు
నిక్కపొడుచుకుంటున్నాయి .॥

బద్దలౌతున్న సారహీనమైన భుామి, 
కోపాగ్నితో రగులుతున్న అడవులు..
 తడిలేని మేఘాలు ,  ఇంకిపోతున్న నీళ్ళు
విష పుారితమైన గాలులతో గాయపడి , 
కుష్టు పట్టిన తన గతికి గుండె  పగిలిన 
ప్రకృతి పడతి  ప్రతీకారంతో ప్రళయ 
భీభత్సవాన్ని సృష్టిస్తోంది.

          " ఓ మనిషీ !  తస్మాత్ జాగర్త."
          *************************
       హామీ :
       పై కవిత ఏ మాధ్యమునందునుా 
       ప్రచురితము కాని నా స్వీయ రచన.    

**********************:****************

బాల సాహిత్యం.

అంశం : బాల సాహిత్యం..
"క" గుణింతం .
శీర్షిక : కంటి పాపవు మాకమ్మా .

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

పల్లవి:
------
కన్నా ! మా ముద్దుల -
పాల బొమ్మా ఓ
అను పల్లవి :
-----------
కుానమ్మా !  నువు
సుద్దులు నేర్చుకోవమ్మా ॥

 1.చరణం.
---------
కన్న తల్లిని నేనమ్మా.
కథలెన్నో చెపుతానమ్మ .
కానుక మానవ జన్మమ్మ.
కమ్మని మాటలు వినుమమ్మా॥
2.చరణం.
----------
కరుణ నిండు మనసుండాలి
కాలుష్యం విడి మసలాలి.
కిల కిల నవ్వతు బతకాలి.
కీర్తి కెక్కు పని చేయాలి.॥
3.చరణం.
---------
కుటిల బుద్ధులను విడవాలి
కుారిమి కలిగి యుండాలి.
కెవ్వు ఏడ్పులే మానాలి.
కేరింతల నువు ఆడాలి.॥ కన్నా...
4.చరణం.
-----------
కైమొాడ్పు గురులకు చేయాలి
కొత్త చదువులుా నేర్వాలి.
కోట్లకు నువు పడగెత్తాలి.॥
కౌరవ నీతిని విడవాలి.॥
5.చరణం.
-----------
కమ్మని నీతులు వినవమ్మా.
కలత మాని నువు బజ్జోమ్మా .
కంటి పాపవు మాకమ్మా.
కః కుః మాటల పసి కొమ్మా॥‍

********************:*

ప్రక్రయ : రుబాయిలు.

02/08/2022.
మహతీ సాహితీ కవి సంగమం .
అంశం : సాహిత్యాశం .
ప్రక్రియ : రుబాయిలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


ఎన్ని వేట్లు వేసినా ఒరిగిపోయిన చెట్టు చిగిరిస్తుంది.
ఎన్ని తుాట్లు పొడిచినా పగిలిపోయిన గుండె  .ప్రేమిస్తుంది
ఒకరి లాలించిన ఆమ్మైతే ఒకరు పాలించిన అమ్మ
ఎన్ని సార్లు అవమానించినా ఆమ్మతనం ఆదరిస్తుంది.॥

ఎన్ని కోట్లు వెచ్చించినా కోల్పోయిన ప్రేమ కొనలేవు 
ఎన్ని పాట్లు పడినా గతించిపోయిన నిన్న  కనలేవు.
జీవితంలో ప్రతీ పదానికీ అలోచించి అడుగేయాలి
ఎన్ని ఇక్కట్లు పడినా మాటజారిన చోట మనలేవు ॥

విద్య నేర్చినవాడు  వివేకవంతుడవుతాడు
విజ్ఞాన శాస్త్రం  నేర్చినవాడు మేధావంతుడౌతాడు.
పై రెండుా ఉన్నవాడు తత్త్వ-జ్ఞాన సముపార్జనుడు
వారందరితో బంధమున్న వాడు కీర్తిమంతుడౌతాడు.॥

అక్షరం తలరాత మార్చు వరం మిత్రమా 21
ఆవేశం అనర్ధాలను పెంచు  మిత్రమా 21
నిరక్షరాస్యతది  ముార్ఖత్వానికి ముాలం .
చదువది, సమయొాచిత సంస్కారము మిత్రమా ॥

నీతులు చెప్పడం ఎంతోమంది చేస్తారు.
నియమాలు పాటించమని కొంతమంది చెప్తారు.
చెప్పేముందు చేసి చుాపించడం మంచి లక్షణం.
పని చేసేవారు మాటలాడరని చాలామంది చెప్తారు.॥

పసి పిల్లలలో  అమాయకత్వం చుాస్తాం మనం
యువతలోని ఆవేశతత్త్వం  చుాస్తాం మనం 
మధ్యవయస్కుల్లో జీవితానుభవ పుాదోటలు.
వృద్ధాప్యంలో పండిన మనస్తత్వం చుాస్తాం ॥   


26/07/2022.౯
మహతీ సాహితీ కవి సంగమం .
శీర్షిక :  నిజాలు తెలుసుకో ..
ప్రక్రియ : రుబాయిలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .




మంచి చెడు తేడాలు తెలుసుకొని నడచుకో
మానవత్వ విలువలు నిలుపుకొని మసలుకో
మనిషిగ పుట్టినీవు పశువులాగ మారకు
స్నేహానుబంధాలు కలుపుకొని పెంచుకో ॥

కుార్చొని తింటే కొండలు కరుగుతాయి
అతిగా తింటే కండలు పెరుగుతాయి.
ఆరోగ్యమే మహాభాగ్యమనంటారు.
పద్ధతి పాటించు చింతలు తొలగుతాయి.॥

మనిషిని మనిషి మనసారా  ప్రేమించాలి .
కుల-మత బేధాల నోరారా ప్రతిఘటించాలి.
వసుధైక కుటుంబము మనదందరిదీ.. .
ఒకరికొకరై తనివితీరా బతకాలి ॥.

ఎవరినీ ఎప్పుడుా తక్కువ చేసి చుాడకు 
పిల్లలను  గారాబం చేసి పాడుచేయకు
మన నడతే  పిల్లల రేపటి భవిత భాట 
ఇల్లే పాఠశాల అనేటి వాసి , మరువకు ॥
 
రాజకీయంలో  స్వార్ధానిదే పైచేయొాయి
ప్రజలలో ఉన్న భయానికి కళ్ళెం వేయవోయి
 ఓటుకు నోటన్నది నేడు కనిపించే నిజమొాయి
నోరున్న వాడిదే రాజ్యమని తెలుసుకోవోయి .॥

మహతీ సాహితీ కవి సంగమం .
శీర్షిక :  నిజాలు తెలుసుకో ..
ప్రక్రియ : రుబాయిలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

మనిషిని మనిషి మనసారా  ప్రేమించాలి .
కుల-మత బేధాల నోరారా ప్రతిఘటించాలి.
వసుధైక కుటుంబము మనదందరిదీ.. .
ఒకరికొకరై తనివితీరా బతకాలి ॥.

మంచి చెడు తేడాలు తెలుసుకొని నడచుకో
మానవత్వ విలువలు నిలుపుకొని మసలుకో
మనిషిగ పుట్టినీవు పశువులాగ మారకు
స్నేహానుబంధాలు  కలుపుకొని పెంచుకో ॥

కలలో నిన్నే తలచితిని కృష్ణా 
ఇలలో నిన్నే కొలచితిని కృష్ణా 
యశోదా నంద  గోపాల బాలా
నను బ్రోవగ నిను పిలచితి కృష్ణా  ॥

రుబాయిలు.

బోనాల పండగకు భోగాలే  విందుగా 
ఆ తల్లి పుాలతో నిండే కను విందుగా
బంగారు బతుకమ్మ కొలువై వచ్చేనుగా
ఆట పాటల వేడ్క లందరీ పసందుగా ॥

మంచి చెడు తేడాలు తెలుసుకొని నడచుకో
 అనురాగబంధాలు నిలుపుకొని మసలుకో
మనిషిగ పుట్టినీవు పశువులాగ మారకు
 ఐశ్వర్యం ఆనందం పంచుకొని పెంచుకో ॥









 

ప్రక్రియ : రుబాయిలు.

ప్రక్రియ : రుబాయిలు 
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .


చిల్లులున్న ప్రతీ కర్ర  వేణువు కాదు
ముల్లున్న ప్రతీ పుావుా గులాబీ కాదు.
ఇల్లు దాటిన ప్రతీ క్షణం జాగురుాకతతో ఉండు.
 అల్లుకున్న ప్రతీ బంధం అక్కరకు రాదు.॥

వికసించిన ప్రతి పుావుా కలువ కాదు.
కనిపించిన ప్రతీ రాయిా కొలువు కాదు.
శ్రమ నిండిన చేతలకు గుర్తింపు వస్తుంది.
గుణము లేని ఏ మనిషికి విలువ లేదు.

నీతులు చెప్పడం ఎంతోమంది చేస్తారు.
నియమాలు పాటించమని కొంతమంది చెప్తారు.
చెప్పేముందు చేసి చుాపించడం మంచి లక్షణం.
పని చేసేవారు మాటలాడరని చాలామంది చెప్తారు.॥

ముద్రించిన ప్రతీ పుటకుా విలువ లేదు 
వినిపించిన ప్రతీ పలుకుా కవిత కాదు .
గుణము లేని ఏ మనిషికి విలువ లేదు.
బద్ధకించిన  ఏ యువకునికీ భవిత లేదు.॥

ఎన్ని కోట్లు వెచ్చించినా కోల్పోయిన ప్రేమ కొనలేవు 
ఎన్ని పాట్లు పడినా గతించిపోయిన నిన్న  కనలేవు.
జీవితంలో ప్రతీ పదానికీ అలోచించి అడుగేయాలి
ఎన్ని ఇక్కట్లు పడినా మాటజారిన చోట మనలేవు ॥

మనసు

అంశం: మనసు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
ప్రక్రియ : ఆట వెలది.


మంచి చెడుల తీరు  మనదు మేలును కోరు   
మనసు తెలుపు మాటె మంచి బాట
మనసు చెప్పు మాట మనసార వినుమయ్య
మనసు  మిత్రు డిలను  మరువ కయ్య ॥

మనిషి లోన మనసు మర్మ మెరుగ దయ్య 
నీకు మేలు జేయ నిలుచు నెపుడు
బుద్ధి బురద చేర సుద్ధి మాటలు జెప్పు
సుఖపు బాట జుాపు సులభ గతిని ॥

మనిషి హృదయ మందు మాన్య దేవత లుండు
దేహ మీదు కొలువు  దేవ తలకు
గుడులు గోపు రాలు గుణము నేర్పవు నీకు.
మనసె పాఠ శాల మరువ బోకు !


ఉదయ సమీరం .

అంశం : ఉదయ సమీరం.
శీర్షిక  : ప్రకృతి సంపద మన వరం .

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .


ఉదయించే భానుడు ఉదయ దివ్య జ్యోతిగ
ఉదయ సమీరాలవి ఉల్లాసము నిచ్చుగ
ప్రభాత వేళల లో  ప్రసరించు కిరణాలు
ఆరోగ్య సంపదను అందించు ఓషధులు.॥

చల్లని చిరుగాలులు జల్లే సుమ గంధాలు
ప్రాణ వాయువు నిండు ప్రకృతి యిచ్చు వరాలు॥
జేగంటా రవములు జేజమ్మల పుాజలు
ప్రతి యింట పడతులా ప్రార్ధనలు పుాజలు ॥

మంచు ముత్యాలవే మరపించు మనసులను
 తరుల పులకరింపుల తడి జల్లుల అందము
అలకోయిలలు కుాయు అందాలరాగాలు.
సుక పికా రవములా  సుందర సంగీతము ॥

గుడి గంటా రవములు బడి పిల్లల అరుపులు
మలయసమీరంలో  మహిలోని అందాలు.
ముచ్చటైన ముగ్గులు ముదితల  ముచ్చట్లు.
హాయి పలకరింపులు అందమైన క్షణములు ॥

సుందరమౌ సమయము సుమ బాలల గంధము
పుాల జల్లు కురిసే పుా బాలల అందము.
ఈశ్వరీ మనసులో  ఈ రీతి సంబరము
ఉదయ వీచికలలో ఉదయించిన భావము ॥

ప్రకృతిలో అందము ప్రేరణ నిడు సమయము
భావాల తరంగము బయలువెడలె కవనము 
మహతీ సంగమముా మంచి కవుల నిలయము
మహదానందమైన మంచి స్నేహ బంధము ॥  




వరలక్ష్మీ వ్రతం .

04/08/2022.
గోరసం -వారి పోటీ..
అంశం : వరలక్షీ వ్రతం.
శీర్షిక  : శ్రావణ లక్ష్మి .
ప్రక్రియ : మత్తకోకిల

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .



శ్రావ ణమ్మదె మంచి మాసము  శాస్త్ర పుాజలు సేయగా
శ్రావణా సిరి లక్ష్మి  పుాజలు సేయ రేసఖి మెండుగా
భావ మందున భాగ్య లక్ష్మిని భక్తి తోడను కొల్వగా
బ్రోవ వచ్చును భాగ్య లక్ష్మియె భోగ భాగ్యము లీయగా ॥॥
స్త్రీలు చేసెడి  పుణ్య పుాజలు మేలు మంగళ మిచ్చుగా
యేలు తల్లిని కొల్చు వారికి  శ్రీలు నిండెడు పండగా
పోలి పుార్ణపు బుారె గారెలు పొంగు పాయస ముండగా
 జేలు పల్కుచు జేజి కీయరె  వేడి వేద్యము విందుగా ॥

కుంకు మార్చన చేసి వత్తులు కుార్చి దీపము నెట్టరే
అంకు రార్పణ జేసి అమ్మకు ఆది పుాజలు సేయరే
వంక జాబిలి పుార్ణ బింబము వచ్చు వేళను చుాడరే
శంఖ నాదము తోడ నమ్మకు స్వాగతమ్ములు పల్కరే ॥

రంగు లీనుసు గంధ పుాలను రాసి పోగుగ వేయరే.
రంగు రంగుల రంగ వల్లులు రక్ష కోరుచు వేయర
అంగ నాలదె గుాడి అమ్మతొ ఆట పాటల నాడరే 
హంగు మీరగ లచ్చి మమ్మకు ఆగ్ర హారతు లెత్తరే .

పాల వెల్లిని కట్టి బాగుగ పాట లాటల తేలరే
శీల సద్గుణ రాణి లక్ష్మికి శీత లమ్ములు నీయరే
మేలు కొల్పులు పాడి కొల్వగ మెచ్చు రాణిని కొల్వరే
లీల లెన్నియొ జుాపు రాణిని వేల కీర్తుల వేడరే ॥


హామీ :
పై మత్తకోకిల పద్యాలు నా స్వీయ రచనలు.