Saturday, July 30, 2022

రుబాయిలు.

26/07/2022.౯
మహతీ సాహితీ కవి సంగమం .
శీర్షిక :  నిజాలు తెలుసుకో ..
ప్రక్రియ : రుబాయిలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


మంచి చెడు తేడాలు తెలుసుకొని నడచుకో
మానవత్వ విలువలు నిలుపుకొని మసలుకో
మనిషిగ పుట్టినీవు పశువులాగ మారకు
స్నేహానుబంధాలు పెంచుకొని కలుపుకో  ॥

కుార్చొని తింటే కొండలు కరుగుతాయి
అతిగా తింటే కండలు పెరుగుతాయి.
ఆరోగ్యమే మహాభాగ్యమనంటారు.
పద్ధతి పాటించు చింతలు తొలగుతాయి.॥

మనిషిని మనిషి మనసారా  ప్రేమించాలి .
కుల-మత బేధాల నోరారా ప్రతిఘటించాలి.
వసుధైక కుటుంబము మనదందరిదీ.. .
ఒకరికొకరై తనివితీరా బతకాలి ॥.

ఎవరినీ ఎప్పుడుా తక్కువ చేసి చుాడకు 
పిల్లలను  గారాబమెక్కువ చేసి పాడుచేయకు
మన నడతే  పిల్లల రేపటి భవిత భాట 
ఇల్లే పాఠశాల అనేటి వాసి , మరువకు ॥
 
రాజకీయంలో  స్వార్ధాన్ని  విడవవోయి
ప్రజలలో ఉన్న భయాన్ని పారద్రోలవోయి.
 ఓటుకు నోటన్నది నేటి నిజమొాయి
నోరున్న వాడిదే రాజ్యమన్న నిజాన్ని తెలుసుకోవోయి .॥

మహతీ సాహితీ కవి సంగమం .
శీర్షిక :  నిజాలు తెలుసుకో ..
ప్రక్రియ : రుబాయిలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

మనిషిని మనిషి మనసారా  ప్రేమించాలి .
కుల-మత బేధాల నోరారా ప్రతిఘటించాలి.
వసుధైక కుటుంబము మనదందరిదీ.. .
ఒకరికొకరై తనివితీరా బతకాలి ॥.

మంచి చెడు తేడాలు తెలుసుకొని నడచుకో
మానవత్వ విలువలు నిలుపుకొని మసలుకో
మనిషిగ పుట్టినీవు పశువులాగ మారకు
స్నేహానుబంధాలు  కలుపుకొని పెంచుకో ॥

కలలో నిన్నే తలచితిని కృష్ణా 
ఇలలో నిన్నే కొలచితిని కృష్ణా 
యశోదా నంద  గోపాల బాలా
నను బ్రోవగ నిను పిలచితి కృష్ణా  ॥

**************************


29/07/2022.
మహతీ సాహితీ కవి సంగమం.
ప్రక్రియ : రుబాయిలు
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

అక్షరమంటే   దేశ  భవితల సోపానం
అక్షరమంటే  దేశ  చరితల  విజ్ఞానం
అక్షరమంటే అచ్చులు హల్లుల సమాహారం
అక్షరమంటే కథా కవితల భావ సంగమం ॥

కవితంటే మనోభావాల మన్ననకు ఆకారం
కవితంటే కళల కల్పనకు సాకారం
కవితంటే సుఖ దుఃఖాల భావ గమనం 
కవితంటేభావ వ్యక్తీకరణకు సుాక్షరుాపం

జీవితం, అనుభవాలు నిండే పాఠశాల
వయసు అనుభవాలతో పండే యొాగశాల
బాల కౌమార యవ్వన వృద్ధాప్య  దశలకు
శరీరం పోషణనిచ్చే రస పానాలుండే పాకశాల ॥

ఇంద్రియాలు ఆలోచనావగాహనల సహకారాలు
అవయవాలు శరీరానికి సహకరించే సాధనాలు
శరీరాలు రక్త మాంస పురీష ముాత్ర నిలయాలు .
ఆత్మలు సత్ చిత్ ఆనంద భావాలకు ఆలయాలు ॥


మనిషిని మనిషి మనసారా  ప్రేమించాలి .
కుల-మత బేధాల నోరారా ప్రతిఘటించాలి.
వసుధైక కుటుంబము మనదందరిదీ.. .
ఒకరికొకరై తనివితీరా బతకాలి ॥.

మంచి చెడు తేడాలు తెలుసుకొని నడచుకో
మానవత్వ విలువలు నిలుపుకొని మసలుకో
మనిషిగ పుట్టినీవు పశువులాగ మారకు
స్నేహానుబంధాలు  కలుపుకొని పెంచుకో ॥

కలలో నిన్నే తలచితిని కృష్ణా 
ఇలలో నిన్నే కొలచితిని కృష్ణా 
యశోదా నంద  గోపాల బాలా
నను బ్రోవగ నిను పిలచితి కృష్ణా  ॥

********************************





Tuesday, July 19, 2022

అంశం : వర్షం. ప్రక్రియ : మత్త కోకిల.

20/07/2022
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : వర్షం.
ప్రక్రియ : మత్తకోకిల .పద్యం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
మ.సా.క.సం. : 19.
కవిత సంఖ్య : 1.


ఆక సమ్మున మేఘు డొచ్చిన ఆశ పొందెడు వానిగా
సేక రించును విత్త నమ్ముల సేద్య మాతడు సేయగా 
ఆక లైనను దాహ మైనను ఆగ డాతడె రైతుగా..
రుాక లప్పులు జేసి పంటకు  రుాప మిచ్చును వాడెగా॥

అన్న దాతకు ఆర్తి దీర్చెడు దాకసమ్మున మేఘమే
చిన్ని వర్షపు జల్లు చుాడగ చిందు లేసెడు అందమే
అన్న దేశపు వెన్ను అంటిమి ఆతడే మన దైవమే
మన్ను లోపలి పంట బంగరు మాన్య మాతడి కష్టమే॥

మట్టి తల్లిని నమ్ము నాతడు మంచి పంటల నేలగా
గట్టి యత్నము జేసి పంటను గాచు కష్టము తోడుగా
పెట్టు దుడ్డుకు రాదు లాభము  వెట్టి చాకిరి దండగా
వట్టి చుక్కల వర్ష మేలగ వచ్చు దుఃఖము మెండుగా ॥

వాగు నిండెడు నీటి కోసము  వర్షమాతనె కోరుగా
బాగు కోరును అంద రీసుఖ  భాగ్య దాతయె రైతుగా
పోగు ధాన్యపు రాసి పొందగ పోరు సల్పెడు వాడుగా
సాగు దుక్కికి సార మీయగ సాయ మెవ్వరు లేరుగా ॥





Saturday, July 9, 2022

ఒంటరితనం ఒక శాపం.

10/07/2022.
అంశం : ఒంటరితనం.
శీర్షిక  : ఒంటరితనం ఒక శాపం.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ :  మహారాష్ట్ర .


ఆసుపత్రిలో స్పెషల్  వార్డ్ లో మెత్తటి పరుపు పై పడుక్కున్నా..అసహనంగా కదులురున్నారు రావుగారు.
భార్య పిల్లలు గుర్తుకు వస్తున్నారు.
కొన్ని నెలలైంది వాళ్ళని చుాసి.
అన్ని సదుపాయాలుా సమకుార్చేరు. 
కానీ ఏం ?
లాభం ..
తనను ఒంటరివాణ్ణి చేసి వదలి వెళ్ళేరు.
కానీ ఈ వయసులో తనీ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాడు. తన బేగ్ లో పిల్ల 
లు సంతకం చేసిన "చెక్" లు ఉన్నాయి.
ఎంత డబ్బు  కావాలన్నా "డ్రా" చేసుకోమన్నారు.
డబ్బిచ్చేస్తే సరిపోతుందా........
డబ్బిస్తే.....
.సడన్ గా తన మాట తనకే అప్పజెప్పిన ఫీలింగ్ ...
కళ్ళు ముాసుకున్న రావు గారికి గతమంతా 
ఒక్కసారి కళ్ళముందు కదిలింది.
తమ తండ్రి ,తాత, ముత్తాతలు చాలా డబ్బు గలవాళ్ళు.
డబ్బుగల అహంకారం తనలో కుాడా చాలా ఉండేది.
ఎవరినీ లక్ష్యపెట్టేవాడు కాదు.
తనకంటుా ఒక్క స్నేహితుడు కుాడా  ఉండేవాడు కాదు. డబ్బు చాలా మందిని తన చుట్టుా తిప్పించింది. అందుకనే మనిషి విలువ తెలియలేదు. డబ్బుంటే చాలు.అన్ని ఆనందాలుా వాటంతట అవే తన సొంతమౌతాయన్న భావన తన మనసులో స్థిరపడిపోయింది.
బయటి సుఖాలకు అలవాటు పడిన తను ఇంటి పనుల నిమిత్తమై ఒక బీదింటి అమ్మాయిని భార్యగా తెచ్చుకున్నాడు.
తను తన పెళ్ళైన నలభైయ్యేళ్ళ జీవితంలో 
డబ్బెలా సంపాదించాలా....అనే ఆలోచించేడు తప్ప
భార్యగా ఆమెతో ఒక్కసారైనా సమంగా మాట్లాడడంగానీ , బయటకు తీసుకెళ్ళడంగానీ చెయ్యలేదు. దాంతో వంటరైన ఆమె నాలుగు గోడల మధ్య  బందీ ఆయింది. 
తనను ఒక్కసారైనా బయటకు తీసుకెళ్ళమని ప్రాధేయపడింది. చేతిలో కొంత డబ్బు పెట్టి" నీకు కావలసిన చోటికి నువ్వే వెళ్ళు" అన్నాడు.
"మీరు లేకపోతే  నాకేం సరదా" ..అంది.
"డబ్బిచ్చానుగా"...అన్నాడు.
 ఒంటరితనం నిండిన బాధతో వచ్చిన  ఆమె కన్నీళ్ళకు తను అప్పుడు విలువనివ్వ లేదు..
పిల్లలు పుట్టేరు.  పెద్దవాళ్ళవుతున్నారు.చదువు విషయంలో నాన్నగా దండించడం తోపాటు 
కొంచం ఎక్కువగానే భయం కుాడా  ఉంచేడు. 
అలాగే పెరిగేరు , మంచి ఉద్యోగస్తులయ్యారు కుాడా..
ఐనా  తన దగ్గర భయం అలాగే ఉండడాన్ని చుాసి సంతోషించేడు. గర్వపడ్డాడు కుాడా...
చిన్పప్పటి నుంచి వారి కష్టా-ఇష్టాలకు విలువివ్వలేదు. తన మాటే శాశనంగా వారిని నడిపించేడు. బయటి ప్రపంచంలోకి సరదాగా ఎప్పుడుా తీసుకెళ్ళ లేదు. చాలా సార్లు" ఎక్కడికైనా వెళ్దాం నాన్నా "అంటుా  బతిమలాడేవారు. తను ససేమిరా అనేవాడు.  డబ్బు కట్టలు చుాపించి "ఇది దగ్గరుంటే అన్నీ ఉన్నట్టే   ముందు ఇది సంపాదించండి" అనేవాడు. అంతేకాదు తను వాళ్ళతో ఎప్పుడుా నవ్వుతుా మాట్లాడలేదు.
కలిసి భోజనం చేయలేదు.

 కానీ, తను మాత్రం బయట చాలా తిరిగేవాడు.
 తినేవాడు. తాగేవాడు.
స్నేహితులంటే ఎలాగుంటారో తెలీదు తనకు. 
ఆందరుా డబ్బు దాసులే...ఎవరినీ లెక్కచేసేవాడు కాదు. అదే జీవితమనుకున్నాడు.
తన  పదవీ విరమణకు ఆఫీసులొ ఎవరుా తనను అభినందించలేదు.
తన చుట్టుాచేరినవారెవ్వరుా తను ఆఫీస్ వదలి
వెళిపోతున్నందుకు బాధపడినట్టు కనపడలేదు.


అదిగో...ఆరోజు ఏదోలా అనిపించి కళ్ళంట నీళ్ళు చిమ్మాయి. దానినే బాధ అంటారా.?..ఏమొా...?
గబ గబా కళ్ళొత్తుకొని ఇంటికి బయలుదేరేడు.
అప్పటికే కొడుకులకు పెళ్ళిళ్ళయ్యాయి. 
భార్య పిల్లలుా కోడళ్ళుా  మనవలుా ...అందరుా 
అప్పటి వరకు కిల కిలా నవ్వుతుా, గలగలా మాట్లాడుకుంటున్నవారంతా తనొచ్చేసరికల్లా తలో ముాలకీ వెళ్ళిపోతుా ఉంటే....
 చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు.

ఆ రోజు....
ఇంటికి వచ్చి చెప్పేడు. తనింక ఆఫీసుకు వెళ్ళడని.
రిటైర్ అయ్యాడని...
ఎవరి ముఖాల్లోనుా ఆనందం కనపడ లేదు.
భార్య  మౌనంగా కిచన్ లోకి వెళ్ళిపోయింది.
పిల్లలు వాళ్ళ రుాముల్లోకి వెళ్ళిపోయేరు.
కోడళ్ళు కనపడేలేదు. మనవలు తనకంట ఎప్పుడుా పడరు.
అదిగో ఆప్పుడొచ్చాయి కన్నీళ్ళు.
ఎందుకో ఏమిటో తెలీని బాధ...
రోజులు గడుస్తున్నాయి. అన్నీ సమయానికి అందుతున్నాయి.
కానీ  ఒంటరితనం ...భరించ లేకపోతున్నాడు.
ఎవరుా తనతో మాట్లాడినవాళ్ళు లేరు.
"టీ కావాలా ... టిఫిన్ తింటారా...అన్నం వడ్డించేను రండి " అన్న భార్య అనే బానిస మాటలు తప్ప.
కొన్నాళ్ళు బయటకు వెళ్ళేడు.కానీ 
ఎవరితోనుా కలవడం తెలియ లేదు. అందికే
ఎవరుా మాట్లాడేవారు కాదు తనతో...
అంత వరకు తనవెంట తిరిగిన ప్రతీ ఒక్కడుా 
పిల్లల దగ్గర సెటల్ అయ్యేమంటుా దుారమయ్యేరు.
అందరుా గుంపులుగా కుార్చొనుంటే తనొక్కడే ఒంటరిగా....
అదిగో అప్పుడే నిజమైన స్నేహం విలువ  తెలిసింది.
మనిషికి మనిషి  ఎంత అవసరమొా తెలిసింది.

ఒంటరితనం ఆలోచనల్లోకి , ఆలోచన బాధలోకి , బాధ భయంలోకి మారేయి.
కానీ తన ఒంటరితనంలో మార్పు రాలేదు.
ఒకరోజు నోరు విడిచి పిల్లల్ని  అడిగేడు ".ఎక్కడికైనా వెళ్దామా."..అని. 
నోట్ల కట్టలు తెచ్చి నాముందుంచి...
"ఎక్కడికెళ్ళాలనిపిస్తే  వెళ్ళండి నాన్నా ..అఫీసులు, పిల్ల ల చదువులుా ఉన్నాయి.మాకు కుదరదు అన్నారు.
అదిగో అప్పుడు తెలిసింది బాధకి అర్ధం ..
బ్రతుక్కి అర్ధం..జీవిత సత్యం...
జీవితంలో ధనం నిండిన  అహంకారంతో
తనేం పోగొట్టుకున్నాడో తెలుసుకున్నాడు.
అందరుా ఉన్నా ఎవ్వరుాలేని ఒంటరితనం...
భరించలేని స్థితిలో  ఒక రోజు రోడ్డుపై నిలువునా పడిపోయేడు.
అంతే మరి లేవలేకపోయేడు.
వెన్నెముక విరిగిందన్నారు..మరి తిరగలేవన్నారు.
పిల్లలు ఖరీదైన ఆసుపత్రిలో తనను జాయిన్ చేసేరు. నోట్ల కట్టలుా చెక్కు బుక్కులుా తనకందించేరు.
అన్ని సదుపాయాలతో ఒంటరిగా మిగిలిపోయేడు..
బతకడానికి డబ్బు కావాలి , గానీ డబ్బే బతుకు కాదు.
డబ్బుతో ఎన్ని కొన్నా ఆనందాన్ని మాత్రం  కొనలేమన్న నిజం నిప్పులా కాలుస్తోంది. ఐనా..
రావుగారు  ప్రతీ రోజుా ఎవరైనా తనకోసం వస్తారేమొా 
అన్న అశతో ..కొన్ని .నెలలబట్టీ ఎదురు చుాస్తునే ఉన్నారు..
"ఒంటరిగా..".....


హామీ :
నా ఈ కధ ఏ మాధ్యునందునుా ప్రచురితముకానినా స్వీయ రచన.





Saturday, July 2, 2022

ఎదురింట్లో ఏమైంది...(కధానిక )

03/07/2022

అంశం : ఎదురింట్లో ఏమైంది ?

శీర్షిక : సాటి వారికి సాయం చేయండి.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

రాధ మాటి మాటికి పీప్ హోల్ లోంచీ బయటకు చుాస్తోంది. ముాడు రోజులై ఎదురింటి తలుపు వేసే ఉంది.
అందులో ఇద్దరు వయసు మళ్ళిన దంపతులున్నారు.
ఇండివిడ్యువల్ ఇల్లు అవడంతో పెరట్లో చాలా చెట్లే కాక చిన్న పార్క్ లాగ ఉంటుంది.
ఉయ్యాల , జారుడు బల్ల , స్విమ్మింగ్ పుాల్ అక్కడి 
ముఖ్య ఆకర్షణలు.
రోజుా సాయంత్రమయ్యేసరికి ఈ సొసైటీలో చాలా మంది పిల్లలు  అక్కడే ఆడుకునేవారు.
మేము కొత్తగా అక్కడ ఇల్లు కొనుక్కొని వారం క్రితమే అక్కడికి వచ్చాము.  మా పిల్లలకి విషయం తెలిసి తాము కుాడా ఎదురుంటి పార్క్ లో ఆడుకుంటామన్నారు.
కొత్తగా వచ్చాము కదా ...అందరితోనుా పరిచయం చేసుకుందాము.అపుడు వెళ్దురుగాని అని పిల్లలతో 
చెప్పాను. చుట్టు పక్కల కొంతమంది ఆ ముసలివాళ్ళు
చాలా మంచి వాళ్ళని  , తాము  తమ పిల్లలను అక్కడే వదిలి  హాయిగ తాము  బయటి పనులు కుాడా చేసుకుంటున్నామని చెప్పేరు.
తను కుాడా వాళ్ళని  పరిచయం చేసుకుని పిల్లలను  
ఆక్కడికే పంపిస్తే, తనకు కుాడా కొంచం రిలాక్స్ గా ఉంటుందని ,పిల్లలు ఎక్కడో ఆడుకుంటున్న టెన్షన్ కుాడా  ఉండదని  అనుకుంది. 
కానీ ఇంతలోనే వాళ్ళు ఏ పిల్లలొచ్చినా తలుపులు తీయడం మానీసేరని ..
పిల్లలను కసురుకుంటున్నారని చెప్పుకుంటుా 
అంత వరకు వారితో తీయగా మాట్లాడుతుా 
పిల్లల్ని .గంటలు గంటలు వదిలి బయట హాయిగా తిరిగిన వాళ్ళు వారిని పట్టించుకోవడం మానీసేరు. కనీసం పలకరించడం కుాడా మానీసేరు.
ఐతే ముాడు రోజులై వాళ్ళు తలుపులు కుాడా తీయలేదు.  ఇంతకీ " ఎదురింట్లో ఏమైందో..."
రాధకి అర్ధం కుాడా కాలేదు. 
ఆరోజు రాధకి అసహనంగా ఉండి తలుపు తీసుకొని
వెళ్ళి ఎదురింటి తలుపు తట్టింది. ఎన్ని సార్లు కొట్టినా ఎవరుా తలుపు తీయకపోయేసరికి రాధకి అనుమానమొచ్చి ఇరుగు పొరుగులకు చెప్పింది 
అందరుా ఆలోచించుకొని పోలీసులకు ఫోన్ చేసేరు.
తలుపులను తెరిపించి చుాస్తే ఇంకేముంది.
ముసలాళ్ళిద్దరుా లేవలేని అపస్మారక స్థితిలో ఉన్నారు.
రాధ ఏంబులెన్స్ కు ఫోన్ చేసి వారిని పోలీసుల సహాయంతో ఆసుపత్రికి తరలించింది. 
అక్కడి రిపోర్ట్ ల బట్టీ వారికి కరోనా సోకిందని 
ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం , మరొకరు ఇంట్లో చుాసేవాళ్ళు లేకపోవడంతో, రెండవ వారికి కుాడా కరోనా సోకిందని, ఆహారం పెట్టేవారు లేక ఇద్దరుా అపస్మారక స్థితిలోకి వెళ్ళేరని చెప్పడంతో రాధ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
ఎంత తప్పు జరిగింది.
వారిలో ఒకరికి కరోనా సోకడంతో వాళ్ళు పిల్లలను రావద్దని చెప్పి ఉంటారు.
నిజా నిజాలు తెలుసుకోకుండా పిల్లలు చెప్పిన మాటలు మాత్రమే విని ,అంతవరకు వాళ్ళని పొగిడిన వాళ్ళు, పిల్లలను వారి దగ్గరే వదిలి షికార్లు కొట్టిన వారంతా వాళ్ళని వెలి వేసినట్టు చుాసేరు.
కనీసం వాళ్ళు తలుపులు ముాడు రోజుల బట్టీ 
ఎందుకు తెరవలేదో అన్న మాట కుాడా పట్టించుకో లేదు.
సమయానికి తాను  చుాసి పట్టించుకోకపోతే  
మనిషి సాయం లేక ,తిండిలేని కారణంగా రెండు ప్రాణాలు  బలయ్యేవి.
మనుషులకు స్వార్ధం ఉండవచ్చు కానీ కాసింత
మానవత్వం కుాడా ఉండాలికదా..
ఇద్దరు ముసలాళ్ళు ఇంత మంది పిల్లలని, వారి అల్లరిని ఎన్ని రోజులు భరించేరో అన్ని మర్చపోయి...
అందరుా కట్టగట్టుకొని వారింటికి రావడం మానీసేరు...ఛీ ఛీ.. మానవ నైజం..ఎంత చెడ్డది"
 రేప్పొద్దున్న తమకిలా జరిగితే.....ఆలోచిస్తున్న
 రాధ వెంటనే నిశ్ఛయించుకొంది.తను తన పిల్లలకు
సాటి మనిషికి చేయవలసిన సహాయం గురించి , ఐకమత్యం గురించి , మనుషుల మధ్య ఉండవలసిన సత్సంబంధాల గురించి అవకాశం దొరికినపుడల్లా చెప్పాలని...
వారిలో ఇతరులకు  సహాయం చేసే గుణాన్ని పెంచాలని....