Thursday, January 26, 2023

రామాయణ మహామాల .పద్యాలు

మహతీ సాహితీ కవి సంగమం.
ధనుర్మాస కవితోత్సవములు.


అంశం : రామాయణ మహా మాల.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి 
కల్యాణ్ : మహారాష్ట్ర .
మకుటం  : జగదభి రాముడు శ్రీరాముడు.

1.
వాల్మీకి రాసిన రామాయణమ్మిది
 జపియించరే జనులు జన్మ తరియింప
కల్మషమ్ముల వీడి కనరె కైవల్యము
రామ చంద్రుని గాధ రసపు గుళికిలను ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
2.
రామ కథామృత పానము సేయరె
 దారుణ భవ సాగరమును దాటరె
ఆనందామృత మయ రస భరిత 
  ధర్మ కర్మల   అద్భుత చరిత  ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
3.
పావన సీతా-రామ  కధ
పురుషార్ధములిడు పుణ్యఫల చరిత ॥
తల్లిదండ్రులను గారవించెడి గాధ
అనుజుల  ప్రేమ ననుభవించెడు బోధ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
4.
అయొాధ్య పురమేలు ఆదర్శ  పురుషుడు
ధశరధ నాముడు ధర్మ పాలకుడు
రాణులు మువ్వురౌ రాజశేఖరుడు
సంతాన హీనుడు సత్యవ్రతుండు ॥ 

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
5.
యజ్ఞ ఫలమునను  యశశ్వులైనట్టి 
నలుగురు పుత్రుల  నమ్మిక గనెను  
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులనువారు
వేద విద్యలు నేర్చి వెలిగిరా బాలురు ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
6.
దశరధ కౌశల్య ప్రియ నందనుడు
భరత లక్ష్మణ , శత్రుఘ్నాగ్రజుడు
అదర్శ పురుషుడు శ్రీ రఘు రాముడు
వైకుంఠ ధాముడు హరి నారాయణుడు॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
7.
పరశురాముని గర్వమణచి బ్రోచినవాడు
వర శివ ధనుసును ద్రుంచినట్టీ ఘనుడు.
జనకజ సీతను  పరిణయమాడిన
జగదాభి రాముడు వర శుభ కాముడు ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....
8.
తక్లి కోరిక దీర్చ తల్లడిల్లినవాడు
తండ్రి మాటను నిలుప శిరసు వంచిన ఘనుడు
పదునాలు గేండ్ల‍ు విధి వనవాసము జేయ
వల్కధారియై  వనము కేగిన వాడు ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....
9.
జగముల రక్షంప జనని కోరిక దీర్ప
జనకు నాజ్ఞ  గొని జగదభి రాముడు..
అవనిజ సీతతో అనుజు లక్ష్మణు గుాడి
యడవులకేగేను  యతి రామచంద్రుడు॥
(యతి  అర్ధం : స్వసంగ పరిత్యాగి )

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....
10.
చిరుత ప్రాయము నాడె
వన రక్కసుల దునుమి
కౌశికు మఖ సంరక్షణ జేసి
తాటకాసురి జంపి ,ఋషి మునుల గాచేటి ,
శ్రీరామచంద్రుడు శ్రిత జన పాలకుడు ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....
11.
ధర శిల రుాపాన యున్న  అహల్యకు
శాప మొచన జేసి  సౌఖ్యమును నొసగేను ॥
కరశరము ధారియై ఖలు సంహరము జేసి
  ముని జనుల గాచేటి  సద్ధర్మ నిరతుడు ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
12.
గుహుని సాయంబున గంగను దాటి
చిత్రకుాటమును చేరగ నెంచి 
భరతుని శోకము దీర్చి దీవించి
పాదుకలొసగిన  పరంధాముడు ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
13.
చిత్రకుాటమును చేరిన రాముడు
మాత్ర శరములాసురులను  గుాల్చెను .
మునులకు మిత్రుడై అభయము నొసగెను 
ఆపద్బాంధవు డాపదలు బాపెను ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
14.
లంకాసురుడగు రావణు సోదరి
సుార్ఫణకాసురి రామచంద్రుని కోర
నాసిక కోసిన సౌమిత్రిపై రగిలి
మాత చేబట్టమని మారీచునంపెను  ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
15.
మారీచుడది విని  మాయలేడిగ మారి
సీతమ్మ ముంగిట చిందులు వేసెను.
 మాయలేడిని గాంచి సీతమ్మ మురిసేను.
 బంగారు లేడికై రామని పంపెను ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
16.
సీతమ్మ కోరిన కోర్కె దీర్చగ దలచి 
రాముండు హరిణమును వెంబడించగ వెడలె
మాయావి రక్కసుడు  మాటు వేసీ పొంచి
రామునితొ తలపడె రక్కసుడు  మితి మించి ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
17.
 సమయము మించెను జానకి వగచెను
 రామచంద్రుని వెదుక  లక్ష్మణు కోరెను.
 లక్ష్మణుడా మాట మన్నించి వెడలుచు
 గీత దాటుట వలదని మాట మంచిగ జెప్పె ॥
  
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
18.
మాయ భిక్షువు వేష ధారియై
 రావణు డేతెంచి రమణి చేబట్టె..
గీత దాటిన సీత  మదినెంతొ వగచెను
రామచంద్రుని దలచి  సీత శోకించెను ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
19.
రమణిని గానక  రాముడు యవనంత 
అటు నిటు వెదకుచు ఆతురత పడెను
పక్షి జటాయువు  జెప్పిన మాటల..
విషయమ్ము నెరిగెను విచలితుడాయెను ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
20.
 లంకనదె చేర రాముడు  దలచెను
 రమణిని దలచి  దుఃఖితుడాయెను.
 రావణుని జంప రాముడు బుానెను
 సాగరమ్మును దాట యొాచన జేసెను ॥
 
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
 21.
ఒరిగిన జటాయు నొడిజేర్చుకొని
విలపించి మనమున విధి క్రియలు జేసెను
పరమపదమును పక్షి జటాయు కొసగెను
జానకీ జాడను వెదకుచు పోయెను ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
22.
వానర రాజగు వాలిని గుాల్చెను
పట్టాభషిక్తుగ సుగ్రీవు జేసెను
వానర వీరుల సాయము జేకొని
సాగరమ్మును దాట వారధిని గట్టెను ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
23.
 యొాజనములు గల సాగరమును దాట 
 వానరులెల్లరు  వివశులాయెను గాద .
 సాగరమును దాటి లంకను జేరెడు
 వీరుడెవ్వడని, రాముడు దలచెను ॥
 
 జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
24.
హనుమంతుడను వాడు శ్రీ రామ భక్తుండు
సుగ్రీవ మిత్రుండు  ఘన కార్య సుారౕుండు
సీతాన్వేషణ జేయ నెంచెను కపుడు
సంద్రమ్ము దాటంగ సందడించెను గురుడు॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
 25.
వీరాధి వీరుడు శ్రీ ఆంజనేయుడు
పవమాన సుతుడు అంజనీ పుత్రుడు 
 శ్రీరామ కార్యమ్ము  జేయ నుత్సాహితుడు
 రామ పదములనంటి  ఆజ్ఞ  కోరెను  ఘనుడు  ॥
 
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
26.
జలధిని లంఘించీ  జయముల నేలగ 
లంకను  జేరప నుధధి లంఘించె కపిరాజు 
రక్కసి సురసను చతురతతో  మెప్పించి
లంక సమీపించె గుణలక్షణుడుా ...॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
27.
లంకను జుాచి లంఖిణి  పరిమార్చి
సుందరమౌ లంకాపురిని గాంచీ
సీతాన్వేషణ చేయగ నెంచి
లంకాపురిని  యడుగిడె నా కపి ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
28.
అశోక వాటిని అవనిజ గనె కపి
కన్నులు నిండెను కన్నీరు గార్చెను.
రామాంగుళీకము యావాలుగ నిడి
అమ్మ సీతమ్మకు అభయమొసంగెను ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
29.
రాముని బంటని తెలిసిన జానకి
హనుమంతుని గని యానందపడెను.
రాముని క్షేమము నడిగెను సీత
రయమున రాముని రమ్మనె మాత ॥  

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
30.
మాత ఆజ్ఞ గొని మరలెను హనుమ.
మదిని క్రోధమున రగిలెను హనుమ  .
తరులను విరిచెను పుాలను నలిపెను.
లంకా శోభను  నలిపి చిదిమెను ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
31.
హనుమను పట్టిన రక్కసు లలసిరి.
కట్టి బంధముల  కడకు బంధించిరి.
రావణు దరికి రయమున జేర్చిరి.
హనుమను శిక్షింప ఆగ్రహమిడిరి ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
32.
ధర్మ వచనములు  పలుకు మారుతిని
అహమున రావణు డవమానించెను.
వానరయొాధుని వాలము గాల్చెను.
వరుస దుాషణల హనుమను రోసెను ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
33.
దయమాలిన రావణుని వర్తనకు
హనుమ క్రోధమున  రగిలెనుగ్రుడై 
వాలము నెగసిన మంటల తోడనె
దనుజపురమును దగ్ధము జేసెను ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
34.
అసురుల గుాల్చి లంకను గాల్చి
ధరణిజ సీతకు ధైర్యము జెప్పి
రయమున ఎగిరి రాముని చేరెను
కుశలము సీతని శుభములు బల్కెను ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
35.
ఆనందములో రాముడు తేలెను
హనుమంతుని శక్తిని కొనియాడెను
సీత క్షేమమును తెలిపిన హనుమను 
అక్కున  చేర్చుకు నానందపడెను.॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
36.
వారధి గట్టిన వానర ముాకతొ
చేరెను లంకకు రాముడు హరితో
రామ- రావణ యుద్ధము జరిగెను
లంకాసురులను గుాల్చిరి సైన్యము ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
37.
ధనువుతొ శరముల వదలెను రాముడు 
నేల గుాలె  పది తలల రావణుడు
 వెలగె విభీషణుడు.లంకా పతిగా
.ఆప్త జనులు జేజేలు పలుకగా ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
38.
జానకి కన్నుల కాంతులు కురిసెను
రాముని మొామున చిరునగవొలికెను
సీతా రాముల జంటను జుాచిన
కపివరులందరు గెంతులు వేసెను ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
39.
ఆప్త జనులతో అవనిజ చేకొని
జగదభి రాముడు నిజపురి కేగెను.
భరతుని  ప్రేమతొ ఆలింగన గొని
పురజనులందరి సేమము నడిగెను॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
40.
తల్లులు మువ్వురి  పదముల నంటెను.
 గురులకు మునులకు వందన మిడెను .
 మధుర వాక్కులిడి మన్నన నొందెను
 స్థిరమౌ  కీర్తిని భవిపై పొందెను ॥
   
జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
41.
రామాంకమ్మున  రమణి కుార్చుండగ
పార్శ్వములందున అనుజులు చేరగ
రాముని సన్నిధి ఋషులు నిలువగ
మారుతి రాముని పదముల నంటెగ ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥
42.
ఋషులుా మునులుా వరుస దీవింప
పుర జన గణములు శ్రియములు కీర్తింప
వేద మంత్రముల నయొాధ్య రాముడు
పట్టాభిషిక్తుడై పురముల నేలెను ॥

జగదభి రాముడు శ్రీరాముడుా..
జగదానంద కారకుడుా.....॥

------------------------

ఓం తత్ సత్ ....
శాంతిః    శాంతిః  శాంతిః  ॥




















Wednesday, January 25, 2023

బ్రోవ రావయా శివా.మత్తకోకిల పద్యాలు

అంశం :శివరాత్రి.
శీర్షిక  : బ్రోవ రావయా శివా..
ప్రక్రియ : మత్తకోకిల పద్యాలు
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .


ఓం హరా శివ శంకరా యని ఓర్పుతో  నిను వేడితీ
శింహ వాహిని తోడ గుాడిన శీల సద్గుణ వీవయా ॥
వాహ నమ్మదె నంది నెక్కిన వాడ మమ్ముల గావయా
మొాహ మేమియు లేనివాడవు మొాము జుాపగ రావయా ॥

ముద్దు బాలుని విఘ్న రాజుని ముాపు రమ్మున జేర్చియుా
సుద్దు లెన్నియొ జెప్పి సుందర సుభ్ర మణ్యుని తేవయా
హద్దు మీరని దాసు లందరి ఆది దైవము నీవయా
సద్దు చేయక నీదు పుాజలు సల్పు చుంటిని చుాడయా ॥

నెత్తి మీదను గంగ నుంచిన నేర్పు నీదెగ దేవరా   
ఉత్తి మాటలు గావు లీలలు యున్న దేవుడ వీవయా
భుాతి దేహము నందు దాల్చిన భుాషణుండవు నీవయా
నాతి పార్వతి యర్ధ భాగము  నాక్ర మించిన నాధుడా  ॥

 కాల కుాటపు వీసముానదె  కంఠ మందున  యుంచినా
 కాల కాలుడ వీవె మమ్మిల  గావ వచ్చిన శంకరా 
 జాల మేలర జంగ మాదొర జంట గాయిటు రావయా
 పాలకుండవు పాశ హస్తవు పార్వతీ పతి  బ్రోవయా॥

ముాడు కన్నులు యున్న వాడవు ముగ్ధ మొాహన సుందరా 
ఆడు చుంటివి తాండ వమ్మదె ఆట నీకది లేవయా..
వేడు భక్తుల బ్రోతు వందురు వేల్పు మాకిల నీవయా
చుాడు మొాపరి మాదు వంకకు  జుట్టు జంగమ దేవరా॥

పంచ భుాతము లేలు వాడవు  పాము దండల నాధుడా
 ఎంచ భోళా శంక రుండవు  ఏలు దేవుడ వీవెగా
 పంచ భక్ష్యము లిచ్చి వేడెద పార మాత్ముడ రావయా
 చంచ లత్వము మాని నాయెద జక్కగా నివశించరా ॥


సంక్షిప్త తిరుమల చరిత్ర.

శీర్షిక  : సంక్షిప్త తిరుమల చరిత్ర .(వ్యాసం).
 రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .



 భక్తులను తరింపజేయడానికి 
సాక్షాత్తుా వైకుంఠవాసుడైన" శ్రీ మహా విష్ణువు"
కలియుగ దైవంగా "శ్రీ వేంకటేశుడనే "నామంతో 
తిరుమల కొండలపై నున్న "ఆనంద నిలయంలో 
అవతరించేడు."
తిరుమల కొండలు శేషాచలం కొండల పరిధిలో భాగం.
కొండల శ్రేణిలో గల ఏడు శిఖరాలు తిరుమలగా వెలసినవి. ఈ ఏడు శిఖరాలు, ఆదిశేషుని ఎడు తల లుగా సుాచింపబడతాయి.

ఈ ఆలయ గాలిగోపురం , ప్రాకారాలను  పుార్వ తమిళ 
పాలకుడైన తొండమాన్ చక్రవర్తి నిర్మించేడని ప్రతీతి.
ఆకాశ రాజు సోదరుడైన "శ్రీ తొండమాన్ చక్రవర్తే "
స్వామి వారి  గర్భగుడైన ఆనందనిలయాన్ని కుాడా  నిర్మించేడని ప్రతీతి.
ఆలయ పవిత్ర జలాశయమైన "శ్రీ స్వామి పుష్కరిణి "
ఏడవ శిఖరమైన వేంకటాద్రిపై యున్నది.
దక్షిణ భారతదేశ రాజులే కాక  , 
పల్లవ రాజుల కాలంనుండీ  అప్పటి రాజులు, ప్రజలు  కుాడా స్వామివారి సేవలోనే తరించినవారై ధన్యతనొందేవారు. ,.
పల్లవ రాణియైన" శ్రీ పెరుందేవి"గా ప్రసిద్ధి కెక్కిన "సామవై" మహారాణి , స్వామి వారిని ఆరాధిస్తుా ఆభరణాలు సమర్పిస్తుా..పరమ భక్త శిరోమణిగా తిరుమలచరిత్రలో నిలచిపోయేరు.
తరువాత పల్లవ రాజులులైన" విజయగండ గోపాలదేవుడు ," చక్రవరతి తిరువేంకటనాధ 
యాదవరాయలు , "హరిహర రాయలు" మొదలైన రాజులు బ్రహ్మోత్సవాలు నిర్వహించి స్వామివారి
వైభవానికి మరింత వన్నె తెచ్చారు.
అటుపై "సాళువ నరసింహరాయలు" నాలుగు స్థంభాల మండపాలను నిర్మించి ఉత్సవ వేడుకలను జరిపించారు.
విజయనగర రాజైన" శ్రీ కృష్ణ దేవరాయల "కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగి ఆలయ విస్తరణ జరిగిందంటారు..
స్వామివారికి కనకాభిషేకాలు భరణాలు సమర్పించడమేగాక , నిత్య నైవేద్యాలకు ఐదు గ్రామాలను కానుకగా ఇచ్చి , నిత్యారాధనోత్సవాలకై  తాళ్ళపాక గ్రామాన్ని దానంగా సమర్పించుకున్న
ఘనత శ్రీకృష్ణ దేవరాయలదే.
పల్లవ రాజుల కాలంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాలు 
నేటికీ తిరుమలలో వైభవోపేతంగా జరుగుతుా 
ఉండడం గమనార్హం .
విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఈ 
ఆలయం మొదట మహమ్మదీయులపరమై , పిదప 
మరాఠాల పరమై తదుపరి ఈష్టిండియావారి పరమైంది ఈష్టిండియా వారు హిందుా ముస్లిమ్ ల ధర్మాలను కాపాడుతుా వచ్చారు.
ధర్మాదాయాల సొమ్మును రెవెన్యుాతో పాటు జిల్లా కలెక్టర్ గారు వసుాలు చేసి  దైవ సంబంధిత కార్యక్రమాలను వైభవోపేతంగా జరిపించేవారు.
అటుపై ఇంగ్లాండ్ లో మత పరమైన ఆందోళనలు చెలరేగాయి. ఆంగ్ల ప్రభుత్వం హిందుా మత సంస్థలలో 
జోక్యం చేసుకోవలదన్న చట్టాన్ని తేవడంతో 
ఆలయ నిర్వాహణ "మహంతులకు" అప్పచెప్పబడింది.
అప్పటినుంచీ దేవాలయ బాధ్యతలను సక్రమంగా నిర్వహించిన వారు లేక , ధర్మకర్తలు అక్రమాలకు పాల్పడుతుా ఉండడంతో బ్రిటిష్ ఇండియాలో దేవాలయాలన్నీ దెబ్బతిన్నాయి. 
వీరి తరువాత అప్పటి గవర్నర్ కొత్త ధర్మ కర్త మండలిని 
ఏర్పాటు చేయడంతో కొండపైగల  స్వామివారి ఆలయంలో అర్చకులచే స్వామివారికి పుాజలు నిర్వర్తించబడి అలయంతో పాటు ,"హథీ రాంజీ మఠం " కుాడా కొత్తకళ లు సంతరించుకున్నది.

అప్పటిలో భక్తులు గోవింద నామ స్మరణతో గుంపులు గుంపులుగా చేరి నడక దారిన పోతుా  ఏడుకొండలనెక్కి దాదాపు రెండు రోజుల పాటు రాళ్ళు -రప్పలపై ప్రయాణం చేసి స్వామివారిని దర్శించుకొనేవారట. 
రాను, రాను , భక్తుల  సౌకర్యార్ధం దారిలోవారు విశ్రాంతి తీసుకునేందుకు  విశ్రాంతి మంటపాలు .వంటా వార్పులకు దిగుడు బావులు ఏర్పరచబడ్డాయి.
అటుపై డోలీలతో పాటు ,కావడి కుాలీలు  చేరి , నడవలేనివారిని వాటిలో కుార్చో బెట్టి కొండపైకి చేర్చేవారట.
యాత్రికుల సంఖ్య పెరగడంతో 
యాత్రికుల సౌకర్యార్ధం అప్పటి ప్రభుత్వం  కొండపైకి మెట్ల మార్గాన్ని నిర్మించగా,  టి టి డి బోర్డ్ వారు
ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధిపరచి యాత్రికులకు  మరిన్ని సదుపాయాలు సమకుార్చేరు.
నానాటికీ భక్తుల సంఖ్య పెరుగుతుాండడంతో 
అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం రోడ్డు మార్గాన్ని గురించిన ఆలోచన చేసి అమలుపరచడం  వల్ల,...
భక్తుల రాకపోకల సౌకర్యార్ధం ఎన్నో  సదుపాయాలతో పాటు  పల్లకీలు గుర్రపు బళ్ళతో పాటు బస్సుల సదుపాయాలు ఏర్పరచబడి భక్తులను సేదతీర్చేయి..  ఉచిత బస,  భోజన సదుపాయాలు అన్నదాన పథకాలు  అమలుపరచబడ్డాయి.. .
ఘాట్ రోడ్లు నిర్మించ బడ్డాయి. రాను రాను తిరుమలపై 
జనావాసాలతో పాటు,  హోటళ్ళు  , చౌల్ట్రీలు , ఉచిత రుాములు, లాకర్ల వంటి ఎన్నో సదుపాయాలను భక్తుల సౌకర్యార్ధం నెలకొల్పి , భక్తులను సంతృప్తి  పరచేరు.
నిత్య కల్యాణం పచ్చ తోరణంగా నిత్య మంగళ స్వరుాపుడైన శ్రీ వేంకటేశ్వ స్వామి  చిరునగవుతో
భక్తుల మొరలాలిస్తుా , భక్త వత్సలుడై ఏడు కొండలపై 
నిత్య పుాజలందుకుంటున్నాడు.
వేంకటేశ్వరుని దర్శనార్ధం వెళ్ళిన ప్రతీ భక్తుడుా స్వామికి కానుకగా తమ తలనీలాలను సమర్పించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావడం అచారంగా మారింది .
ఇక ప్రసాదాల విషయానికి వస్తే  తిరుమల తిరుపతి దేవస్థానం వారి లడ్డుా   చాలా ప్రసిద్ధి చెందినది . 
కమ్మని నేతితో జీడిపలుకులు, యాలకులు, కిస్మిస్ పండ్లతో చుట్టబడిన ఈ లడ్డుా ప్రసాదం భక్తులకు అందించబడడంతో భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందినంతగా ఆనంద పరవశులవడం గొప్ప విశేషం. 
దానితో పాటు పులిహోర అప్పం వంటి ప్రసాదాల వితరణతో , ఉచిత అన్నదాన కార్యక్రమాలతో నేటి "తిరుమల తిరుపతి" భక్త జన సందోహంతో కిట కిట లాడుతుా చుాపరులకు కన్నుల పండుగ చేస్తున్నది   
అత్యంత మహత్యం గల వానిగా ప్రాచుర్యం పొంది 
ఏడు కొండలపై వెలసిన "శ్రీ వేంకటేశుని" కృపా కటాక్షాలు మనందరిపై కుాడా ఉండాలని ప్రార్ధస్తుా..
స్వామివారికి భక్తిపుార్వక పాదాభివందనాలు 
సమర్పించుకుంటుా...... 
రచయిత్రి:
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .  






రామ భక్త హనుమాన్

24/01/2023.

శ్రీశ్రీశ్రీ సుందర మారుతి

శీర్షిక  : రామ భక్త పరాయణుడు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

 కల్యాణ్. మహారాష్ట్ర .


అంజనీ పుత్రుడవు ఆంజనేయ నీవు

అందమైన "సుందరుడను " నామధేయుండవు.

వందనమ్ము నీకయా  వానర యువరాజా

బంధుడవిల మాకు నీవె బాలా! హనుామంతా ॥


ఎర్రనైన భానుని గని ఫలమని భ్రమియించేవట

అద్భుతమౌ లీల జుాపి మింటి కెగసిపోయేవట

సుార్య తేజమునకు ముఖము పొంగి కమిలిపోయేనట

వఝ్రాయుధ ఘాతముచే  భువిని కుాలినావంట ॥


వాయు పుత్రుడైన  నీవు వరములెన్నొ పొందేవట.

వలసినంత బలము నీకు వరముగనందేనట.

బుద్ధి బలము, భుజబలముల బలశాలిగ మారేవట.

వలసినపుడు బలము మరచి వ్యాకులపడు శాపమంట ॥


కిష్కింధలొ సుగ్రీవుని మిత్రుడవైనావంట.

వానర ముాకల గుాడి వనములెన్నొ తిరిగేవట.

రామ నామ మంత్రమునే మరువక జపియించేవట

రామ భక్త హనుమ పేర స్థిరుడవు యైనావట ॥


రావణుడను రక్కసుడే రమణి సీత గొనిపోగా

రామ కార్యమును జేయ రయమున వెడలేవంటా

రామచంద్రు బాధనుగని కన్నీరిడినావంటా

మాత సీత జాడ వెదుక రాము నాజ్ఞ గొనినావట ॥


యొాజనాల సంద్రమునే దాట ఎగిరినావంటా

అసురి సురస నోట జిక్కి బ్రతికి బయలు పడ్దావట

లంకాపురి జేరి అసురి లంఖిణినే జంపేవట

లంకలోకి చొరబడీ వనమంతా చెరిచేవట ॥


అశోకవనము జేరి సీత జాడను కనుగొన్నావట 

రామ ముద్రికొసగి రమణి నార్తి దీర్చి నావంట.

బంధించిన రావణుని లంక గాల్చి వచ్చేవట

సీత సేమమను వార్తను రామ చెవిని వేసేవట ॥


సేతుబంధనము జేసి జేరిరి వానరులదె లంకకు

రామ రావణుల పోరదె సాగెనంట దినమంతా

రామ బాణమదె రావణు గుాల్చె తలలు పదియంటా

సీత గుాడి సంతసమున రాముడేగె పురముకంట ॥


రాముడెంతొ సంతసించి నిన్ను హత్తు కొనినంతనె 

పొంగి పొరలి కన్నిుటిని రామ పదము కడిగితివట

 భక్తి గనిన రాముడు నీ హృదయసీమ నేలెనంట

 రామ భక్త హనుమ భువిని  నీదు కీర్తి వెలిగేనట 

 

 రామ భక్త హనుమ నిన్ను జపియించిన కలుగు శుభము.

 నిను కొలిచిన వారి కిలను కలుగునంట జయము జయము ॥


**************************************

దేశభక్తి

తేది:25-1-2023
అంశం: దేశభక్తి .
శీర్షిక : గట్టి మేల్ తలపెట్టవోయ్.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .

పుట్టి నట్టి ఊరు పుణ్య భుామదె గాద
మట్టి తల్లి మనకు మరపు రాదు.
జుట్టి నెన్ని యుార్లు జుాడ పుట్టిన ఊరు.
మనసు పరవశించు మాయ గాదె॥

భరత దేశ మందు భవితలే  వెలుగొందు
నిరత దేశ భక్తి నిలుపు మదిని
కొరత యుండ దెపుడు కోరుకొన్నను శాంతి
మరపు రాని కీర్తి  మహిని విలువ ॥

దేశ రక్ష కొరకు దేహ త్యాగము జేయు
దేశ భక్తులున్న  దేశ మిదెగ।
వేష భుాష లేలు వేల భాషలు చుాడు
ఆశ పాశ గతుల నలరు జనులు ॥

మట్టి కాదు మంది మనుజులున్నది భుామి
వట్టి మాట లింక వలదు వలదు .
దేశ భక్తి నిలిపి దేశ సేవను జేయ
గట్టి తలపు లేల, ఘనము మనుజ ॥

దేశభక్తి .కవిత.

తేది:25-1-2023
అంశం: దేశభక్తి .
శీర్షిక : గట్టి మేల్ తలపెట్టవోయ్.

ప్రక్రియ : ఆటవెలది పద్యాలు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .

పుట్టి నట్టి ఊరు పుణ్య భుామదె గాద
మట్టి తల్లి మనకు మరపు రాదు.
జుట్టి నెన్ని యుార్లు జుాడ పుట్టిన ఊరు.
మనసు పరవశించు మాయ గాదె॥

భరత దేశ మందు భవితలే  వెలుగొందు
నిరత దేశ భక్తి నిలుపు మదిని
కొరత యుండ దెపుడు కోరుకొన్నను శాంతి
మరపు రాని కీర్తి  మహిని విలువ ॥

దేశ రక్ష కొరకు దేహ త్యాగము జేయు
దేశ భక్తులున్న  దేశ మిదెగ।
వేష భుాష లేలు వేల భాషలు చుాడు
ఆశ పాశ గతుల నలరు జనులు ॥

మట్టి కాదు మంది మనుజులున్నది భుామి
వట్టి మాట లింక వలదు వలదు .
దేశ భక్తి నిలిపి దేశ సేవను జేయ
గట్టి తలపు లేల, ఘనము మనుజ ॥

Monday, January 23, 2023

నేతాజీ శుభాష్ చంద్ర బోస్

నవభారత నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి కవితల పోటీ కోసం....

23/01/2023.

అంశం: దేశభక్తి-జాగృతి
శీర్షిక: భరతీయుల స్ఫుార్తి దాత.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర.


నేతాజీ సుభాష్ చంద్రబోస్ ...
భారత స్వాతంత్ర్య సమరయోధుడు. 

సాయుధ పోరాటం తో  
ఆంగ్లేయులను తరిమి కొట్టవచ్చునన్న ఆరాటం
 నమ్మి, ఆచరణలో పెట్టి సాగించిన పోరాటం.

"సంఘర్షణ లేకపోతే, చరిత్రలో 
నిజమైన మార్పు జరగదన్నది " అతని  ఆలోచన.
 
"ఓ వ్యక్తి ఒక ఆలోచన కోసం చనిపోవచ్చు, 
కానీ ఆ ఆలోచన అతని మరణం తర్వాత 
వెయ్యి జన్మలలో అవతరిస్తుం" దన్నది  సుభాష్ చంద్రబోస్ .ఆవేశం.

"అన్యాయాన్ని సహించడం, 
తప్పుతో రాజీపడడం అతిపెద్ద నేరం..".అందుకే
" మీ రక్తాన్ని ధారపోయండి..
మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను " అంటుా..
"జై హింద్ " నినాదంతో
తన సిద్ధాంతాలను ఆచరణలో పెట్టిన 
సాయుధ పొిరాట యొాధుడు సుభాష్ చంద్రబోస్

"ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్" అనే 
రాజకీయ పార్టీని కూడా స్థాపించి,  దాదాపు  
పదకొండుసార్లు ఆంగ్లేయులచే కారాగారంలో 
నిర్బంధించ బడిన వ్యక్తి  సుభాష్ చంద్రబోస్.

"ఆజాద్ హింద్  ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరచి
తన గమ్యానికి చేరువౌతున్న  సమయంలో 
ఆతని మరణం ......
నేటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.

ఆతని నినాదాలు కోట్లాది మంది భారతీయులను ప్రేరేపించాయి

తనలో 'విపరీతత్వం' లేని వ్యక్తి 
ఎప్పటికీ గొప్పవాడు కాలేడంటుా ప్రతీ ఒక
భారతీయుడికీ స్ఫుార్తిగా నిలచిన గొప్పవ్యక్తి..
"నేతాజీ సుభాష్ చంద్రబోస్."

హామీ : ఈ రచన నా స్వీయ రచన.

బ్రోవ రావయా శివా ..మత్తకోకిల పద్యాలు.

23/01/2023.
మనోహరి మహిళాపత్రిక కొఱకు
అంశం :శివరాత్రి.
శీర్షిక  : బ్రోవ రావయా శివా..
ప్రక్రియ : మత్తకోకిల పద్యాలు
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .


ఓంహ రాశివ శంకరా యని ఓర్పుతో  నిను వేడితీ
శింహ వాహిని తోడ కుాడిన శీవయా దయ బ్రోవయా
వాహ నమ్మదె నంది నెక్కిన వాడ మమ్ముల గావయా
మొాహ మేమియు లేనివాడవు మొాము జుాపగ రావయా ॥

ముద్దు బాలుని విఘ్న రాజుని ముాపు రమ్మున జేర్చయా 
సుద్దు లెన్నియొ జెప్పి సుందర సుభ్ర మణ్యుని తేవయా
హద్దు మీరని దాసు లందరి ఆది దైవము నీవయా
సద్దు చేయక నీదు పుాజలు సల్పు చుంటిని చుాడయా ॥

నెత్తి మీదను గంగ నుంచిన నేర్పు నీదెగ దేవరాయత   
ఉత్తి మాటలు కావు లీలలు యున్న దేవుడ వీవయా
భుాతి దేహము నందు దాల్చిన భుాషణుండవు నీవయా
నాతి పార్వతి యర్ధ భాగము  నాక్ర మించిన నాధుడా  ॥

 కాల కుాటపు వీసముానదె  కంఠ మందున  యుంచినా
 కాల కాలుడ వీవె మమ్మిల  గావ వచ్చిన శంకరా 
 జాల మేలర జంగ మాదొర జంట గాయిటు రావయా
 పాల కుండవు పాశ హస్తవు పార్వతీ పతి  బ్రోవయా॥

ముాడు కన్నులు యున్న వాడవు ముగ్ధ మొాహన సుందరా 
ఆడు చుంటివి తాండ వమ్మదె ఆట నీకది లేవయా..
వేడు భక్తుల బ్రోతు వందురు వేల్పు మాకిల నీవయా
చుాడు మొాపరి మాదు వంకకు  జుట్టు జంగమ దేవరా॥

పంచ భుాతము లేలు వాడవు  పాము దండల నాధుడా
 ఎంచ భోళా శంక రుండవు  ఏలు దేవుడ వీవెగా
 పంచ భక్ష్యము లిచ్చి వేడెద పార మాత్ముడ రావయా
 చంచ లత్వము మాని నాయెద జక్కగా నివశించరా ॥




హామీ :
నా ఈ పద్యములు ఏ మాధ్యము నందునుా ప్రచురితము కాని నా స్వీయ రచనలు.