Tuesday, March 12, 2024

అంశం: అడవి జంతువులు (

అంశం: అడవి జంతువులు (గేయం).
శీర్షిక :  మా బాధలు  కనరండి.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి 
కళ్యాణ్ :  మహారాష్ట్ర.

పల్లవి:
-----
అడవిలో పుట్టాము అడవిలో పెరిగాము 
ఆనంద తీరాల ఆడాము పాడాము ॥
అనుపల్లవి :
--------
చీకుా చింతా లేని జీవితాలు మావీ
మాజంతు జీవాలకు సాటిరావు ఏవీ ॥అడవి ॥

చరణం :
------
సాధు  జంతు జీవాలము,  కలసి మెలసి ఉంటాము .
జాతి మతముల జోలికి పోమే పోముా 
కలసి నీరు తాగుతాం ,కలివిడిగా మసలుతాం.
అడవి యంతా తిరిగి అలసి సొలసి వాలుతాం ॥

చరణం :
------
క్రుార జంతు బంధులున్న , కుటిల బుద్ధి లేదుా
ఆకలైతేగానీ, దరికి చంపగ రావుా
స్వార్ధమన్నది లేదు  పాచి కుాడు నవి తినవుా
వలసినంత  మాత్రమె తిని, మిగులును వదలేసి పోవు ॥

చరణం :
------
ఆశ నిండు విసపు మనిషి  ఎదుటివాణ్ణి దోచే,
స్వార్ధ చింతనలు జేసి , నమ్మువారి  రోసే
 మానవత్వమే మరచే మనిషి మనిషినే కోసే,
జాతి భేదముల పేరున రాజకీయములు జేసే ॥

చరణం :
------
మేడ, మిద్దెలు కట్టగ మనిషి యడవి  కోసే
జంతువులను చంపి అమ్మి , సొమ్ములెన్నొ దాచే
 బ్రతుకు తెరువు పేరుతో బంధనాలు వేసే
గారడీలు చేయించి, మా  కడుపులు మాడ్చే॥ 

చరణం :
------
చిలకల మేల్కొలుపు లేదు, కోయిలమ్మ పాటలేదు
నెమలి కన్నెలాట లేదు , పుా బాలల శోభ లేదు
పచ్చదనపు వాడ లేదు, కొండ చాటు నీడ లేదు
ప్రకృతి పడతి ఎండి పోయె, భరత మాత క్రుంగిపోయె॥

చరణం :
------
బ్రతుకు తీరు బరువై , వాసములే  కరువై
 రోడ్లు జేరు మమ్ము  జంపె, మనిషి క్రుార మృగమై
మాస్థానము దోచీ , సంకెళ్ళను వేసీ
తోలు తీసి అమ్మకున్న మనిషి బ్రతుకు ఛీ ఛీ ॥

------------------------------------

No comments:

Post a Comment