నా పరిచయం...
శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
నా పరిచయం.
--------------------
నా పేరు శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి. ముంబాయి...దగ్గర కల్యాణ్ లో ఉంటాను .
మా తండ్రిగారి పేరు పంతుల రామారావుగారు.
మా తల్లిగారి పేరు పంతుల కామేశ్వరి గారు.
తమ్మడు పంతుల వేంకటరమణ ముార్తి.
సంగీత పరంగా మా పుట్టినిల్లు , సాహిత్య పరంగా నా మెట్టినిల్లు నాకు దొరికిన వరంగా చెప్పవచ్చు .
కారణం తాత ముత్తాత గార్లు విజయనగర రాజుగారి ఆస్థానంలో సంగీత గాత్ర , వీణా కళాకారులుగా ఉండేవారని మా అమమ్మ గారు చెపుతుా ఉండేవారు.
మా అమమ్మగారుా చాలా బాగా సంగీతం పాడేవారు.
మా పెద్దమ్మ పిన్నమ్మలు సంగీత గురువులు కావడం వారు ఇంట్లో పిల్లలకు గాత్రం తో పాటు వీణను నేర్పిస్తుా ఉండడంతో మా ఇల్లు సంగీత వీణా నాదాలతో కళకళ లాడుతుండేది.
ఆవిధంగా నాలో సంగీతాభిలాష పెరిగి నేనుకుాడా అమ్మే తొలి గురువుగా నా గాత్రానికి సంగీత శ్రీకారం చుట్టేను .
వివాహానంతరం బోంబే కల్యాణ్ లో స్థిరపడ్డాను.
మావారి పేరు పుల్లాభట్ల శ్రీరామ ముార్తి గారు.
రైల్వేలో మొాటర్ మేన్ గా రిటైర్ అయి ప్రస్తుతం
హైకోర్ట్ వకీలుగా కొనసాగుతన్నారు.
మా ఇద్దరు పిల్లలకీ వివాహాలయ్యేయి.
అబ్బాయి పి. రాజశైఖర్ ముార్తి సైబర్ సెక్యుారిటీ
ఫౌండర్ గా కొన్ని కంపెనీలకు డైరెక్టర్ గా
కొనసాగుతున్నాడు. వికీపీడియాలో రాజశేఖర్ ముార్తి పి. పేరుతో ఉన్న బయొాడేటా చదివి కోర్స్లు పుార్తి చేయడం వల్ల చాలా మంది యువత
నేటి కంప్యుాయుాటర్ విభాగంలో నిష్టాతులై
ఉద్యోగ ప్రాప్తులయ్యేరు.
అమ్మాయి వివాహానంతరం లండన్ లో స్థిరపడింది.
అన్యోన్య దాంపత్యం .వారిద్దరికీ పిల్లలున్నారు.
అటుపై నేను
ఇక్కడ పొరుగుారైన డోంబివిల్లి వాస్థవ్యులు
శ్రీమతి తారా రమేష్ గారి వద్ద సంగీత ప్రస్థానాన్ని కొనసాగించేను . హరికథా శిరోమణి యైన మా
అత్తయ్యగారు సాహిత్యాభిలాషి .అమె దగ్గరున్న పుస్తకాల గది ఒక పెద్ద గ్రంధాలయమని చెప్పవచ్చు
వారికి గల తొమ్మిది మంది సంతానంలో పెద్ద కోడలిగా
ఆరుగురు ఆడపడుచులు , మరుదుల అభిమానానికి
పాత్రురాలినయ్యేను.
వారందరుాకుాడా భక్తి , గాన, వాద్య భజన కళాకారులే
అమె సంగీత సాహిత్యాల నేర్పు కుార్పులతో రాసిన కీర్తనలు పద్యాలు స్తోత్రాలు అనేకం .
నిత్య పురాణ ఫఠనాలతో భజన సప్తాహాల విందుభోజనాదులతో మా ఇల్లు నిత్య కల్యాణం పచ్చతోరణమే.
అవిధంగా
నా పరిచయం...
నా పేరు , శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
నా పరిచయం.
--------------------
నా పేరు శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి. ముంబాయి...దగ్గర కల్యాణ్ లో ఉంటాను .
మా తండ్రిగారి పేరు పంతుల రామారావుగారు.
మా తల్లిగారి పేరు పంతుల కామేశ్వరి గారు.
సంగీత పరంగా మా పుట్టినిల్లు , సాహిత్య పరంగా నా మెట్టినిల్లు నాకు దొరికిన వరంగా చెప్పవచ్చు .
కారణం తాత ముత్తాత గార్లు విజయనగర రాజుగారి ఆస్థానంలో సంగీత గాత్ర , వీణా కళాకారులుగా ఉండేవారని మా అమమ్మ గారు చెపుతుా ఉండేవారు.
మా అమమ్మగారుా చాలా బాగా సంగీతం పాడేవారు.
మా పెద్దమ్మ పిన్నమ్మలు సంగీత గురువులు కావడం వారు ఇంట్లో పిల్లలకు గాత్రం తో పాటు వీణను నేర్పిస్తుా ఉండడంతో మా ఇల్లు సంగీత వీణా నాదాలతో కళకళ లాడుతుండేది.
ఆవిధంగా నాలో సంగీతాభిలాష పెరిగి నేనుకుాడా అమ్మే తొలి గురువుగా నా గాత్రానికి సంగీత శ్రీకారం చుట్టేను .
వివాహానంతరం బోంబే కల్యాణ్ లో స్థిరపడ్డాను.
మావారి పేరు పుల్లాభట్ల శ్రీరామ ముార్తి గారు.
మా ఆత్తయ్యగారు సాహిత్య ప్రియులవ్వడంతో
ఆమె ద్వారా నేర్చుకున్న సంగీతానికి , నేర్చుకున్న సాహిత్యానికి , సహజంగా ఉండే ఆశక్తి తోడై ,
కవితలు రాయడం పాటలు రాయడం రాగాలలో స్వరకల్పన చేయడం చేస్తుా. రాను రాను .ఎన్నో పాటలను , కధలను కవితలనుా రాస్తుా..అందరిచే ప్రశంశలు పొందేను.
నా స్వీయ రచనలను విని ఆస్వాదించి ,ఆనందించిన
గురువుగారు "శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ" గారు ,తాను రచించిన శివపదం పాటలను, స్వరపరచే అవకాశం నాకిచ్చి ,.శివాంజలి , శివ మనోహరి అనే పేర్లతో రెండు CD లుగా ఆవిష్కరించేరు. నేను రాసిన కీర్తనలకు వాటిలో మొదటి స్థానం కల్పించడం , స్వయంగా వారి చేతులమీదుగా సన్మానితురాలిని కావడం ,
నాకు గర్వకారణం.
పలు సంఘాలలో పాల్గొని రాసిన కవితలు పలు సంకలనాలలో చోటు చేసుకున్నాయి.
విన్నకోట మురళీకృష్ణగారు , కొడవటిగంటి రోహిణీప్రసాదుగార్ల ఆధ్వర్యంలో ఎన్నో లలిత సంగీతాలు రచించి స్వరపరచి పాడేను.
బోంబే షణ్ముఖానందలో, అన్నమాచార్య కీర్తనలు,
పలు అర్కెష్ట్రాలలో ఎన్నో సినీ గీతాలు , లలిత సంగీతం ,స్వీయ రచనలు కుాడా పాడేను.
కరోనా కారణంగా ప్రస్తుతం "ఆన్ లైన్" కవితల పోటీల్లో "ఇష్టపది" ప్రక్రియ లో "శ్రీమద్భగవద్గీత" పదునెనిమిది అధ్యాయాలు రాసి "ఇష్టపది శ్రేష్ట" బిరుదు పొందేను. పాశురాలను తెలుగులో కీర్తనలుగా రాసి స్వరపరచి
"అక్షర ఝరీ రత్న" బిరుదును పొందేను.
శతాక్షరి ప్రక్రియలో " పద ముత్యం " బిరుదు పొందేను
శ్రీ వడ్డేపల్లి గారు సృష్టించిన " పాట వెలదుల ప్రక్రియలో "సంపుార్ణ సుందరకాండ"ను రచించేను
సంక్షిప్త రామాయణ గాధను , భగవద్గీత పదునెమిది అధ్యాయాలను ,ముప్పది పాశురాలను తెలుగులో కీర్తనలుగా రాసి స్వరపరచేను..
నేను రాసిన కధలు, కవితలు కలిపి 1000 కి పైగానే ఉన్నాయి.
పెళ్ళిపాటలు సంక్రాంతి పాటలు , విరహ గీతాలు, లలిత గీతాలు , భక్తి గీతాలు , ఇలా వివిధ రకాలైన అనేక పాటలు కలిపి మొత్తం 800 పై చిలుకుగా ఉన్నాయి.
వివిధ ప్రక్రియల లో పాల్గొంటున్న నేను చాలా బిరుదులను అవార్డ్ లను పొందిన నేను ,
సంగీతమే పాటగా సాహిత్యమే నా ఆటగా
కవన వనంలో విహరిస్తుా ఆనందిస్తుా ఉంటాను.
సాహిత్య పుా దోటలో నాకు లభించిన పరిమళ సుమ గంధాలు..నాకు లభించిన
సన్మానపుారిత బిరుదులు , పురస్కారాలు అవార్డులు.
చాలానే ఉన్నాయి .
అన్ లైన్ కవితా పోటీల లో చాలా ప్రక్రియల లో ఇప్పటికీ పాల్గొంటుా ఉంటాను.
ఇది నా సంక్షిప్త పరిచయం.
No comments:
Post a Comment