రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
--------------------
శీర్షిక.
మారుతున్న విద్యా విధానం.
----------------------------------------
తలిదండృల బాధ్యత తనిగ పెంచుట వరకె.
మహిని మను బాటలో మార్గదర్శి గురువే ॥
తరమంతరించినా తరం కదలినా,అది---
గురువుల కే సాధ్యం గురువే ఇల దైవం...॥
అంతర్జాతీయపు అనేక పరిణామపు--
ప్రభావాల ఫలితం ఫల మెరుగని లోపం.
విద్యారంగాల్లో వివిధ ఒత్తిడులు-
నాణ్యత గల విద్యలు నలిగేటి శాపాలు॥
విద్యావ్యవస్థలవి వీధి బడిన వేళలు
గురు శిష్య బంధాలు గుడ్డి దారి బాటలు॥
గుణు లైన గురువులకు గౌర-విలువల లోపం.
గురు బాధ్యత క్షీణం గుణ శిష్యుల లోపం ॥
భవిష్యత్ ప్రణాళికల బాధ్యతల బరువుకును -
మొాయలేని గురువులు మొాడువారు బతుకులు.
కార్పరేట్ విద్యల కాలుష్య విధానం.
ధర , విజ్ఞానం విలువ - ధనానికి అమ్మకం ॥
కొనుగోలు పత్రాల కొందారులనేకం .
విద్యార్ధుల ప్రగతి వీధిపాలైన వైనం॥
నేడు విద్యల విలువ నిలువు దోపిడీ వల సమ సమాజ స్థాపన సద్గురుల బాధ్యత ఇల॥
--------------------------------------------------------------------
హామీ.....
ఇష్టపది ప్రక్రియ లో రాసిన --
" మారుతున్న విద్యా విధానం " అనే నా ఈ కవిత,
ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని, నా
స్వయ రచన.
No comments:
Post a Comment