Monday, November 4, 2024

శీర్షిక : నేటి భారతం .

మహతీ సాహితీ కవిసంగమం.

18/10/2024.శుక్రవారం.

కవిత సంఖ్య : 5.

అంశం : ఐచ్ఛికం

శీర్షిక : నేటి భారతం .

రచన - శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కల్యాణ్ .మహారాష్ట్ర  

మ సా క .సం 43).




నిరుద్యోగ సమస్యలకు నీరైపోతున్న జీవితాలు

తీరని సమస్యలతో  అడుగడుగున అగచాట్లు 

 ముద్దు మచ్చట్లు తీరక యువత పడుతున్న పాట్లు.

 నోట్ల కొరతతో నోచుకోని సుఖాలకై ఎదురు దాట్లు॥

ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న ఆశ నిండిన ఓటర్లు.

మనుషుల బలహీనతకు "బ్యాలెట్ బాక్స్"లో

 కౌంట్  ఔతున్న ,ఓట్లు.

నోట్లకు అమ్ముడుపోయిన  ఓట్లు కొడుతున్న సిక్సర్లు.!!

ఏకాదశ గ్రహ బలంతో గద్దెనాక్రమిస్తున్న

 అక్రమ- నాయకత్వాలు ॥

 

నోట్లు ఓట్ల గారడీలో రన్నౌట్ అవుతున్న ప్రజా వికెట్లు .

బౌన్స్ ఔతున్న ధర్మ వ్యవస్థలు ,న్యాయాధికారాలు.

 ఓటింగ్ వ్యవస్థలో అధర్మంతో కుాడిన అస్తవ్యస్థాలు.

 గుర్తింపుకు రాని అబద్ధపు ఓట్లతో గెలుపు పతాకాలు॥

కాలే కడుపులకు ఐదు వత్సరాల ఎన్నికల సమయం .

ఓటునమ్మిన నోట్లతో కడుపులు నింపుకునే దైన్యం .

మద్యం వేటగాళ్ళకు  మత్తు మందుతో వైద్యం . 

నాయకుడెవరైనా మారనిబ్రతుకుల మండే జీవితం॥

ఇదే ఈనాటి  అవినీతి నిండిన....ఎన్నికల పర్వం.

చదరంగపు టెత్తులకు  దిగజారిపోయిన నేటి భారతం..

కలలు కల్లలై , ఓడిన, నేటి భారతి  కన్నీటి కథనం ॥



హామీ :

నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన. మత్తుకు 

No comments:

Post a Comment