శీర్షిక :
శ్రీ గిడుగు రామ ముార్తి పంతులు
పాఠ్యాంశ' , గ్రంధ,కావ్యాల భాష.
అక్షరాశ్యులకు కుాడా అర్ధమవని గ్రాంధిక ప్రాస
నిరక్షరాశ్యులకు కుాడా అర్ధమవ్వాలన్న ధ్యాస
నిత్య వాడుక భాషగా మార్చాలన్న ఆత్మ ఘోష॥
పర్యవసానం పుస్తక వనంలో వీర విహారం
తుమ్మెద గ్రోలిన మధువు రీతి ,
నిత్య సాహిత్య రస పానం ,.
సాధించిన "వ్యవహారిక భాషా సుగంధ" ఫల సారం॥
తోటి సహాధ్యాయుల సమిష్టి సహకారంతో ..
భాషోద్యమాకారుని క్రుషి , వేసిన సోపానం.
నేడు యావత్ భారత దేశం చేస్తున్న--
తెలుగు వెలుగుల" సరళభాషా" వీర విహారం.॥
అందరికీ అందుబాటులోకి వచ్చిన ఆనంద సౌరభం
" తెలుగుభాషాదినోత్సవ" మనే సాహిత్య సంబరం.
అతని జన్మదినదినాన -
అద్భుతంగా జరిగే ఆనందోత్సవం. ॥
(29 ఆగష్ట్ నాడు." తెలుగు భాషా దినోత్సవం ).
కైజర్ - ఇ- హింద్ అనే గౌరవ స్వర్ణ సుాత్రం తో
నిండిన పురస్కార సుమ-సౌరభాల తోరణం.
డాక్టరేట్, కళాప్రపుార్ణ వంటి ఎన్నో బిరుదు-
సుమాల సమాహార సమ్మేళనం.॥
పట్టు వదలని విక్రమార్కుని రీతి
పట్టుదల తో సాధించిన ఘన కీర్తి.
తెలుగుభాషా ఉద్యమొాద్యుతి స్ఫుార్తి
అతడే శ్రీ గిడుగు రామ్ముార్తి.॥
----------------------------------------
రచన, శ్రీమతి-
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్
8097622021.
No comments:
Post a Comment