30/04/2023.
జయ శంకర సారస్వత సమితి కవితా పోటీల కొరకు,
శీర్షిక : ప్రకృతితో పయనం.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
చల్లనిగాలి వీచే వేళలో పయనించే మల్లెపూల
మత్తు పరిమళం మురిపిస్తోంది.
కోయిలమ్మ పాడే పాటలో నిండైన రవం ,
హాయినిండు నిత్య వసంతమై మరపిస్తొింది॥
పరుగులు తీసే మనసు విహంగం
ఆ పరుగుతో పయనించే వయసు యానమై
ఇంద్రధనుసు ప్రభల పరుగుల స్వప్నమయ్యింది.. ॥
కన్నె మనసు కవితైెతే ,ఆ కవితలింద్రధనుసైతే
ఆకాసమంతా చిలిపి కలల మిణుకు తారలే కదా! ..
ఆ తారలన్నీ మెరిసే చిరు వెన్నెలలై కురిస్తే
ఆ చందమామ కళలలో దాగిన వలపు కధలే .కదా!॥
మబ్బుచాటున దాగిన మేఘం, చినుకై కురిస్తే
నా మనసు వేచియున్న ఒక చకోరమై నిలుస్తే..
తొలి చినుకు తడికి పడే ఆరాటం ఓ ప్రేమే కదా !॥
ఇలలోని అందమంతా నే పాడే పాటకు పల్లవైతే
జలజలల సాగే రాగ ఝరుల సందడి సడి
నా మదిలో రేగిన కలకలాల అలల సడులే కదా ! ...
చిన్ని చిన్ని చిలుక జంటలు ,పచ్చనైన
చేల పంటల్లో చేసే కువ -కువల కిల- కిలలు
నా మధుర గీతిలొ నిండు లయకు పదములే కదా... ॥
చిరుగాలి వెంట నా పయనం ,
కెరటాల నడుమ నా గమనం , నాలో
భావాలే అలలై తేలుతుా , చేరుకున్న తీరం ,
నే కోరుకున్న మధురమైన గమ్యమే కదా ॥
మనసంత మధుర భావం నిండియుంటే
మదినిండ రసపు పానం కదలుతుాంటే
అది పండు వెన్నెలంత తీయనైనదే కదా ! ...
పుాచే పూల సౌరభం, మలయారుత వలయ మైతే
చిరు చినుకు తడులు నిండిన మట్టి సోరభం -
చిన్నారి విత్తుకు, మొలకై నిలిచే ప్రాణంమే కదా !॥
తలపించు వేయి వినొదాల హాయి తలపుల్లో ....
చేసే సంగీత- సాహిత్య -స్వర ,విహారానికి
స-రి-గ-మ సఖుల సాయమే శృతి లయలైతే ,
సరదాలు చిందు రాగ మధువుల మకరందలో
మనిగే జీవితం ,ఆనంద మధు పరాగమేకదా. ॥
హామీ :
పై కవిత నా స్వీయ రచన.
____________________________________________
No comments:
Post a Comment