మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
తేది:23.11.2021
అంశం:సాహిత్యాంశము(దుర్వాస మహర్షి)
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి. కల్యాణ్ : మహారాష్ట్ర .
ప్రక్రియ: వచనం
శీర్షిక: గర్వ భంగం
ఈవారంకవితాసంఖ్య:2
మ.సా.క.సం: 19
అత్రి అనసుాయల పుతృడు అతి కోపిష్టి అతడు.
కోపముతో శాపములిచ్చే ముక్కోపి యైనా
ఆదరించినవారిని ఆనుగ్రహించే వర ప్రసాదుడు.
అతనికి సేవ చేసిన కుంతి కి అతను ప్రసాదించిన
ఉపాసనా మంత్రాల ప్రభావంతోనే ముగ్గురు
పుతృలను కలిగిన విషయం విదితమే.
దుార్వాసుని కోపానికి అంబరీషుని కధ తార్కాణం.
ఏకాదశి ఉపవాస దీక్షావిరమణకై , ఆతిధ్యానికి
రావలసిన దుార్వాసుని రాక ఆలశ్యమైనందున
ద్వాదశి ఘడియలు దాటక మునుపే తులసి తీర్ధం
సేవించినందున, అదిగ్రహించిన ముక్కోపియైన
దుార్వాసుడు అంబరీషుని పైకి మహాకృత్యను
సృష్టించి విడిచిపెట్టిన కారణంతో విష్ణువునాశ్రయించిన
అంబరీషుని రక్షణకై విడచిన సుదర్శన చక్రం
ఆ రాక్షసిని హతమార్చి , దుార్వాసుని వెంటబడుతుంది.
బ్రహ్మ రుద్రాదులు సైతం చక్రాన్ని ఆపలేని కారణంగా దుార్వాసుడు విష్ణు ముార్తి శరణు కోరుతాడు.
విష్ణువు , ఆతనిని అంబరీశునే శరణుకోరమని
చెప్పగా..దుార్వాసుడు అంబరీశుని ప్రార్ధించినందున
చక్రం శాంతిస్తుంది.
ఈ విధంగా ముక్కోపియైన దుార్వాసునికి
గర్వ భంగమవుతుంది.
హామీ:
పై వచనం నా స్వీయ రచన.
No comments:
Post a Comment