అంశము: సాహిత్యాంశము.
మహాకవి కాళిదాసు.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
శీర్షిక : కవి కుల శ్రేష్ఠి .
(వచన కవిత).
సంస్కృత కవియైన కాళిదాసు
గొప్ప శువ భక్తుడు.నాటక కర్త.
కవికుల గురువుగా పేరున్న
ఇతడు హిందుా పురాణ ,
తత్త్వాలకు సంబంధించిన
ఎన్నో కావ్య-నాటకాలను
రచించిన ప్రతిభావంతుడు.
కాళికాదేవి అనుగ్రహము
పొందిన వర ప్రసాదుడు.
నవ రత్నములుగా పేరుగాంచిన
విక్రమార్కుని ఆస్థాన కవులలో
ఒకఁడైన కాళిదాసు
ఉపమానోపమేయములను
అతిచక్కగా పోల్ఛు సమర్ధుడు.
అంతేగాక శాకుంతలము,
మాళవికాగ్నిమిత్రము,
విక్రమోర్వశీయము అను
నాటకములును, రఘువంశము,
మేఘసందేశము, కుమారసంభవము
అను కావ్యములు రచించి
ఉత్తమ కవిగా పేరొందన ఘనుడు.
ఈయన ఇంకా, నళోదయము,
శృంగార తిలకము, ప్రశ్నోత్తరమాల,
కవికంఠ పాశము, కర్పూరమంజరి,
భోజచంపువుఅనే గ్రంథములను,
మేఘసందేశమనే కావ్యమును,
శ్యామలా దండకమును రచించి
కవికుల గురువుగా కీర్తించబడినాడు.
వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే l
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ll
వంటి అత్యద్భుతమైన ఉపమాలంకార
సౌందర్యం గల శ్లోక రాజములను
రచించి ఉత్తమ కవిగా అద్భుత
ఉపమానాలతో కవితాలోకాన్ని
అలరించిన కాళిదాసు కవితా
సౌందర్యం ఏనాటికీ రతగని పెన్నిధి.
అనడంలో అతిశయొాక్తి లేదు.
No comments:
Post a Comment