Monday, November 29, 2021

చిత్రకవిత..

తేది: *29-11-2021: సోమవారం*
అంశము: *చిత్రకవిత*
ప్రక్రియ: *ఐచ్ఛికం".వచనం .
శీర్షిక : తాను తీసుకున్న గోతిలో తానే..సమాధి.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .

మ.సా.క.స..19.
కవిత సంఖ్య : 1.

స్వాతంత్ర్యానికి ముందు బానిసగా బ్రతికిన మనిషి
స్వాతంత్ర్యానంతరం తన మేధకు పదును పెట్టేడు.
చదువు సంస్కారాలతో పాటు సుఖజీవితానికి
కావలసిన సదుపాయాలు , ఇళ్ళు , యంత్రాంగాలు
భుా వాహనాలు, ఆకాశ యానాలు , క్షిపణులు
ఇలా ఎన్నో, తన మేధస్సుకు పదును పెట్టి, భరతావని
చరిత్రకు కీర్తి కిరీటం తొడిగేడు.

కాలం గడుస్తున్న కొద్దీ రాజులు మారారు.
రాజ్యాంగాలు మారేయి. నీతి- నియమాలు
దారి తప్పేయి. మనిషిలో స్వార్ధం పెరిగింది.
మమతలు, మానవత్వం , నశించేయి .

వావి వరుసలు, రక్త సంబంధాలుా కుాడా మరచి
కాముకులై మృగాల్లా వ్యవహరిస్తుా
ముందుకు దుాసుకు పోయిన మనిషి--కేంద్ర-
రాజకీయ స్వార్ధపు దురాగతాలకు,నలిగిపోయేడు.

తమ ఓటు హక్కును "నోట్ల"కట్టగా మార్చుకొని.
మనీకి, మందుకి లోబడి అదే జీవితానందమని
తలచి తిరిగి బానిసగా మారేడు. మనిషి జ్ఞానాన్ని మందుతో దోచుకున్న రాజకీయ దుండగులు మనిషి మెదడును దొలిచి మేధో రసాన్ని  పీల్చి , పిడిచి
పిప్పి చేస్తుా, మనిషి కనుగొన్న ప్రగతి పథాల సిరి-సంపదల ఖనులను, ప్రైవేటీకరణ పేరుతో  విదేశాలకమ్మి సొమ్ము చేసుకోవడం మొదలెట్టేరు.

మనీషి గా ఎదగవలసిన మనిషి, "మనీ" షి"లకు
లోబడి , రాజకీయ వైఫల్యాల విష పరిమాణానికి
లోనౌతున్న తమ జీవితాలను తిరిగి చక్కదిద్దుకుందామనుకొనే లోపే, రాజకీయ మాంత్రికులు తమ లోగల తెలివి , బుద్ధి, ఆలోచనలు గల మెదడు సారాన్ని తమకి తెలీకుండానే, రోజు రోజుకుా పీల్చి, పిప్పి చేస్తున్న సంగతి తెలుసుకొని,
తాము పుార్తిగా దోచుకోబడ్డాడని, రాజకీయ రణ నీతులకు తిరిగి తాము పుార్తి  బానిసలుగా మారేమని తెలుసుకొని ఏమీ చేయలేని  నిస్సహాయ పరిస్థితిలో, నిలువుగుడ్లేసు కొని, దిగ్భ్రాంతికి లోనవుతున్నాడు .
హతవిధీ...మనిషి మనిషితో ఆడుకొనే ఈ
ఆటలకు అంతమెప్పుడో...
హామీ:
ఈ రచన నా స్వీయ కవిత.

No comments:

Post a Comment