అంశం : భారత రాజ్యాంగం.
శీర్షిక : రాజ్యాంగ రక్షణ మనందరి కర్తవ్యం.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
స్వాతంత్రోద్యమం, ప్రాణాలు కోల్పోయిన
ఎందరో అమర వీరుల త్యాగ ఫలం.
సత్య, శాంతి , ధర్మాలకు ప్రతీకగా
ఎగురవేయబడిన ముాడు రంగుల ఝండా .
ప్రజా ప్రభుత్వం కోసం పోరాడిన భారత రాజ్యాంగ చట్టం జనవరి, 26th 1950. నాటికి అమలులోకి వచ్చిన ఆనందం .
రాజ్యాంగ పరిషత్తు కు అధ్యక్షుడిగా డాక్టర్
"బాబూ రాజేంద్ర ప్రసాద్",
భారతీయ రాజ్యాంగ ప్రధాననిర్మాతగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ లు పొందిన గౌరవం.
మౌలిక రాజకీయ సుాత్రాలతో , ప్రజల ఆశలు, ఆకాంక్షలతో మన దేశ ఆదర్శాలను రాజ్యాంగ పీఠికలో
అభివ్యక్తం చేయబడిన చట్టం.
పౌరులకు తమవ్యక్తిత్వాన్ని అభివృద్ధిపరచుకోవడానికి, బాధ్యత కలిగిన పౌరులుగా జీవించేందుకు ప్రభుత్వపరంగా, చట్టరీత్యా ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్య్రముల హక్కు ఈ భారత సర్వోన్నత శాసనమైన రాజ్యాంగ చట్టం.
దేశ ప్రగతికి ,ఉన్నతికి , దేశ ప్రజల
సర్వ మత సమానత్వానికి, వెనుకబడిన బలహీన వర్గాలకు ప్రాథమిక హక్కుగా నెలకొని దేశానికి దిశా నిర్దేశం చేసిన చట్టం.
ప్రతి ఏటా 26 నవంబర్ ను రాజ్యాంగ దినంగా పాటిస్తూ, సమ సమాజ స్థాపనే లక్ష్యంగా ,ప్రజల ఉన్నతే ధ్యేయంగా సర్వోన్నత న్యాయస్థానం ప్రాథమిక హక్కులను ఎటువంటి సవరణలకు లోబడనివిగా చేసిన మహోన్నత శుభదినం
నేటి భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం॥
No comments:
Post a Comment