24/04/2022.
శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి సారధ్యంలో ,
అంశం : "పల్లె గూటికి పండగ వచ్చింది"
శీర్షిక : భరతీయ సంస్కృతికి నిండు నిదర్శనాలు ॥
రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
పల్లె గుాటికి పండగొచ్చింది.
వాడ వాడలా వెలుగునిచ్చింది .
సాంప్రదాయ కట్టుబాట్లతో సంస్కారం పంచింది.
వలపు పలకరింపుల ప్రేమను చిలకరించింది.॥
తెల్లవారకముందే తెరచిన దేవళాలు.
వాడవాడలా వినిపించే గుడి జేగంటలు .
సామ గానాలతో వేల్పుల మేల్కొల్పులు.
దేవతారాధనలకై విప్రులు చేసే వేద ఘోషలు ॥
ఇంటింటా గుమ్మాలకు పసుపు ,కుంకుమలు
మామిడాకు తోరణాల ముద్ద మందారాలు ,
రంగురంగుల రంగవల్లులతో నిండు స్వాగతాలు.
ప్రతి ఇంటా వెలిగే దివ్య జ్యోతుల కళ కళలు.॥
ఇంతుల అధరాల పారే నవ్వుల గలగలలు.
నేతి వంటల తీపి ఘుమ ఘుమలు .
మమత నిండిన పలకరింపుల పులకరింతలు .
పాడి నిండిన లోగిళ్ళలో గోలక్ష్మికి పుాజలు ॥
పౌరాణిక చరితల వీధి ప్రసంగాలు
క్రిష్ణ లీలా విశేషాలతో వీధి నాటకాలు.
భారత భాగవతాది హరి కథా, సంగీతాలు.
అందరి మదిలో భక్తి నిండిన భావ ప్రకంపనలు॥
పసిడి ధాన్య లక్ష్మికి నేతి వంటల తీపి భోగాలు.
పిల్లా పాపల కేరింతలతో నిండిన లోగిళ్ళు.
పల్లెల్లో జరిగిన పండగలు , పబ్బాలు
భరతీయ సంస్కృతికి నిండు నిదర్శనాలు ॥
హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment