27/03/2022.
నేను సైతం కవి పత్రిక ఏప్రిల్-2022 సంచిక కొరకు నేను వ్రాసిన కవిత:
అంశం: "శుభకృత్ నామ సంవత్సరం ఉగాది..
శీర్షిక : నుాతన వత్సరానికి స్వాగతం.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
మారురున్న కాలమనే చక్రాల మధ్య
చావలేక బ్రతకలేకా అల్ల లాడుతున్న
జనసంద్రపు జీవన నౌకాయానంలో
కలకలం రేపుతున్న కణ బాధల గాధలు
ఎన్నో చేదు అనుభవాలు అక్రోశాలు.
జీవన గమనానికి కలిగించిన అవరోధాలు.॥
అణగారిపోతున్న ఆశలు ,ఆశయాలతో
బ్రతుకు భారమౌతున్న జనాల
అంతరంగాలలో చీకటి ముగిసిన వేకువలా ,
ఒడ్డుకు చేరబోతున్న ఒడిదుడుకుల
జీవన యానం ॥
శుభ సుాచకమైన కోయిల రాగాలతో
వసంత వీచికల మధుర సుమ గంధాలతో
మధుర భావనల మలయవీచికలతో
మారిన సంవత్సరపు మధుర భావనతో
ఆశల సౌధాలకు వేస్తున్న ఆనంద సోపానం ॥
శుభ సందేశాల సుమగంధసారమై
అలసిన మనసులకు ఆనంద కారియై
కొత్త బాసలకు కొత్తబాటలు చుాపుతుా
వస్తున్న "శుభకృత్ నామ "యుగాదికి
ఆరు ఋచుల ఆరోగ్య పక్వాలతో
ఆడుతుా పాడుతుా పలుకుదాం
ఆనంద గీతాల శుభ స్వాగతం ॥
No comments:
Post a Comment