02/03/2022.
*వాల్మీకి సోమన పోతన వేమన (వా.సో.పో.వే)సాహిత్య వేదిక* ఆధ్వర్యంలో
అంశం : యుగములకు ఆది యుగాది.
శీర్షిక : చిగురుంచిన ఆశలు.
రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్: మహారాష్ట్ర .
ఎటుచుాసినా సహజమైన నుాతనత్వం.
వసంత ఋతువు ఆగమనంతో వచ్చే ఆది పర్వం .
చిరుగాలి వీచికలతో నవ యుగాది ప్రారంభం .
బంతీ చామంతుల మధుర వీచికల సుమ గంధం ॥
చిగురులు తొడిగిన ఆకుల గలగలలలు.
మామిడి పుాతల చిరు గంధపు ఘుమ ఘుమలు.
కోయిల రాగాల కొత్త వసంతాల మయుారి నాట్యాలు
నవ యుగాదికి పలుకుతున్న నవ్య స్వాగతాలు॥
గుమ్మాలకు పచ్చని తోరణాల శుభ సంకేతాలు
ఇంటింటా పసుపు కుంకుమలద్దిన గుమ్మాలు
యుగాది లక్ష్మికి పలికే ఉత్సాహపు స్వాగతాలు.
శుభ మంగళాలు పలుకు వేద పండితుల సామ గానాలు॥
కొత్త కోర్కెలతో చిగురించిన కొగ్రొత్త ఆశలు
నలిగిన మనసుల్లో నమ్మిక నిండిన ప్రశాంతతలు.
షడృచుల సమ్మేళనాలతో ఆరోగ్యామృత పక్వాలు.
కొత్త దనపు రాకతో పాతను మరచిన అత్మ విశ్వాసాలు॥
పంచాంగ శ్రవణంతో చీకటి బ్రతుకుల్లో చిగురించిన ఆశలు.
"శుభకృత్" ఆగమనానికి ప్రకృతి పాడే ఆనంద గీతాలు
మంగళ గీతాల మధుర భావనలతో "శుభారంభ-
యుగాది" కి జనులు పలికిన సుస్వాగతాలు ॥
హామీ:
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని
నా స్వీయ రచన.
No comments:
Post a Comment