Thursday, April 28, 2022

ఓ మనిషీ ! ఇకనైనా కళ్ళు తెరువు.

28/04/2022.
రచన :శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  : మహారాష్ట్ర .

శీర్షిక : "ఓ మనిషీ ! ఇకనైనా కళ్ళు తెరువు"॥
                   (ఆరని కన్నీటి కథనం )

అద్దాల సౌధాల లో అధికారిక హంగులు
బ్రతుకు పొిరాటాలతో బడగు జీవితాలు.
రాజకీయపు రంగులతో రసహీనమైన చట్టాలు
డబ్వుకు దాసోహమంటున్న నీతి -న్యాయాలు ॥

మనిషిలో పెరుగుతున్న స్వార్ధం 
మంచి చెడుల విచక్షతను కోల్పోతోంది.
కులమతాల కుటిల దాడులకు, జన-
 జీవితాలు తమ ఉనికిని కోల్పోతున్నాయి ॥

రహదారుల్లో వెలసిన వృద్ధాశ్రమాల్లో
రక్త బంధాలు మరచి పారవేసిన 
 తోలు తిత్తులు, పేగు బంధాల
 ప్రేమ  పిలుపుకై  పరితపిస్తున్నాయి ॥
 
 ఆడపిల్లగా పుట్టిన క్షణం నుంచే 
అతివ ఆత్మ రక్షనును కోల్పోతున్నాది.
వావి వరుసలు మరచిన కామం
సాముాహిక సంతర్పణ చేసుకుంతోంది ॥

కాముకుల  వికృత అనందానికి 
ఆట బొమ్మలుగా మారిన అబలు 
అవమానాన్ని భరించలేక 
ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ॥

నోటుకు "ఓటు" అమ్ముడుపోతోంది.
మత్తులో మునిగిన జనాలు
మంచి చెడుల తేడాను మనీ"బరువుతో
కొలిచి భావి తరాల భవిష్యత్తుకు బంధం వేస్తున్నారు..
 
రాజకీయాల్లో రౌడీయిజం పెరిగిపోయింది.
మనుషుల్లో మానవత్వం తరిగిపోయింది.
దైవ చింతనలు మతకలహాలకు మాధ్యమాలై 
దొమ్మి దాడులకు దోహదపడుతున్నాయి ॥

స్వచ్చ భారత్ , బేటీ బచావో అన్న 
ఆవేశపు నినాదాల రాజకీయ చదరంగంలో
 జనం కళ్ళు గప్పిన, కేంద్రం నిర్ణయాలకు
దేశ సంపద ప్రైవేటీకరణమై పరుగుతీసింది॥

వికృత వైకుంఠపాళీ వింత పాచికలాటలో
భావి తరం , బ్రతుకు తెరువు కోల్పోయి
వెర్రి కుక్కల వేటకు బలై .వీధిపాలయ్యింది॥

కోల్పోతున్న స్వాతంత్ర్యానికి కుంగిపోతుా
ఆవిరౌతున్న సంస్కృతి ,తరిగిపోతున్న 
పచ్చదనపు దౌర్భాగ్యానికి పరితపిస్తుా 
ఆమని అపస్వరాల  ఆరంగేట్రం చేసింది ॥

తరాలు మారినా తల రాతలు మారని 
మనిషి దుర్దశను చుాసి ,కాలం రంగు మార్చింది.
దాంతో పంచ భుాతాలు దారి తప్పేయి.
గ్రహ గాడ్పులు గాడి తప్పాయి.
ఆరు ఋతువులు అపసవ్యమయ్యేయి.

తరుగుతున్న భుా సంపదకు 
తల పగిలిన ప్రకృతి ప్రకోపానికి 
జన జీవితం అస్తవ్యస్తమయ్యింది.
"ఓ మనిషీ ! ఇకనైనా కళ్ళు తెరువు"॥

No comments:

Post a Comment