మహతీ సాహితీ కవి సంగమం .
అంశం : ఐచ్ఛికం .
శీర్షిక : పిడికెడు బువ్వెట్టుండ్రి. మీ కాల్మొక్కుతాం.
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర
రాజులు పోయిండ్రు మారాజులొత్తాండ్రు.
మట్టి మడుసులం మా పానాలు తీస్తుండ్రు
మడుసుల్లో మడిసిని సంపేస్తుండ్రు
మాయ మాటలు సెప్పి మసి పుాసేస్తుండ్రు ॥
మంత్రాలకు సింతకాయలు రాల్తయంటరు
మాటడిగినోడి మక్కలిరగ తంతుండ్రు.
బుక్కినోళ్ళకు కక్కినంతెడుతుాండారు.
కడుపు కాలినోడిని కాలరాస్తుండారు.॥
దుడ్డున్నోడిది దొడ్డ బతుకాయె.
మరి మాసుంటోల్ల గతెట్టా...
మట్టి మడుసులమాయె.
పుాట కుాలొత్తే పొట్ట నిండేదుంటాది.॥
కట్టపడేటోల్ల పొట్టకొట్టే సిండ్రు.
కుాలిపనులు సేసేటోల్లం..
మట్టికి , మన్నుకి కుాడా
మడతలెట్టిండ్రు ॥
ఇంటోల్ల పొట్ట నింపేటందుకు
యిసానిగ్గుాడా యిలువపెంచిండ్రు॥
కుాలి పన్ల తిరుగాడేటోల్లం
బుక్కెడు బువ్వ కోసం
అమ్ముకున్నం యిలువైన వోటు
మా పొట్ట కొట్టేసిందొక
మాయదారి ఓటు ॥
గవర్నమెంటోళ్ళు గద్దె నెక్కి
గిన్ని పధకాలు పెట్టేమంటుండృు.
గరీబోల్లం, గాయన్నీ నమ్మి
గోసంత నోటుకి గల్లంతై ఓటు నేసేస్తుండె
గెలిసి నోడు గెలిసినట్టే గెలిసి
గల్లంతు సేసి , మా దార్లు ముాసేత్తాండు.॥.
మా గోస యినేటోల్లు యెవులుా లేరా..?
మా కడుపులు నిపంపేటోల్లెవులుా లేరా.?
కారుతున్న కొపంల్లో, పుట్టెడు మందిమి
సగం సచ్చి బతుకుతున్నం.
పిడికెడు బువ్వెట్టుండ్రి మీ కాల్మొక్కుతం.॥
----------------------------------------------
No comments:
Post a Comment