23/02/2023.
మహిళా దినోత్సవం పురస్కరించుకొని *మనోహరి మహిళా మాసపత్రిక* కొరకు
ఆర్టికల్ ....
అంశం:* అన్ని రంగాలలో మహిళలు మాత్రమే బాస్ లు అయితే..
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
నాడు ,
నాలుగు గోడల మధ్య సాంప్రదాయాల ముసుగులో
తన అస్ఠిత్వాన్ని కోల్పోయిన మహిళ -
నేడు ,
అనేకమంది సంఘ సంస్కర్తలు, స్త్రీలకు సమాన హక్కులు కల్పించే దిశలో కృషి చేయడంతో ,
భారతదేశంలో మహిళల చరిత్ర కీర్తి కిరీటాల సమాహారమయ్యింది..
ఆధునిక భారతదేశంలో మహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ సభాపతి, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించారు. భారతదేశపు ఇటీవలి రాష్ట్రపతి కూడా ఒక మహిళే కావడం విశేషం.
పురుషునితో సమానమైన ,హక్కులను సాధించిన స్త్రీలు
పురుషుని కన్నా కొన్ని రెట్ల ప్రతిభను కనబరుస్తుా ఇంటా బయటా కుాడా తమ విధినిర్వాహణలో తమదైన స్థాయిని పటిష్టం చేసుకోవడమేగాక పురుషులను
అధిగమించడంతో, స్త్రీ శక్తి అన్ని రంగాల లోనుా ప్రపంచ వ్యాప్తంగా విజయపథంపై నడుస్తుా తమ "సత్తా" ను చాటుకుంటోంది
ప్రపంచంలో ప్రతి మహిళా ఆమె ఎదుర్కునే పరిస్థితులు ఎటువంటివైనా కానీ తను కన్న కలలు నిజం చేసుకోవడం లేదా చేద్దామనుకున్న పనులు చేసి తీరగలదు.
వివిధ రంగాలలో మహిళలు దేశ సమానత్వానికి ,
అభివృద్ధికై కృషి చేస్తుానే ,చాలా దూరం వచ్చి అనేక రంగాల్లో తమ సత్తాను నిరూపించుకుంటూనే ఉన్నారు
మానవత్వం నశించిన , నేటి స్వార్ధపుారితమైన ప్రపంచంలో
స్త్రీలే "బాస్ లు ఐతే వారు సాధించే విజయాలు ఎన్నో...
అమ్మగా, ఆలిగా అక్కగా చెల్లిగా ఇంటి ఆడపడుచుగాతమ బాదర్యతలను నిర్వర్తిస్తున్న స్త్రీలు నేడు రాజకీయపరంగా
పుార్తి ప్రపంచాన్నే పరిపాలించగలిగినంత ఎత్తుకు ఎదిగారు.
సంగీత ,సాహిత్య, క్రీడా, రాజకీయ రంగాల లోనే కాక,
విద్యా ,వైద్య ,కర్షక ,కార్మిక ,సిపాయి ,సైన్య ,రంగాల లో తమ శక్తిని తాము నిరుాపించుకొని ,వీరత్వాన్ని , ధైర్యాన్ని ప్రదర్శించ గల సాహసవంతులు స్త్రీలు .
ప్రస్తుత సంక్షోభిత సమయంలో సామాజిక మార్పుకు సారథ్యం వహిస్తూ, ప్రత్యేకంగా నిలిచిన మహిళలు
ఎంతోమంది ఉన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఖగోళ శాస్త్రం, రాజకీయాలు, క్రీడల వరకు, మహిళలు ప్రతి వృత్తిలో ఒక ప్రమాణాన్ని సాధించి. తమ విజయాలతో భారతదేశాన్ని గర్వించేలా చేసిన టాప్ మహిళలున్నారు.
మహిళలే ప్రపంచానికి బాస్ అయితే...
బ్రిటన్ దేశంలో వేసవి సెలవుల్లో బడి పిల్లలకు ఉచితంగా ఆహరం ఇవ్వాలని వేసిన పిటిషన్ వెనక ఉన్న ఒక క్రిస్టినా కాగలదు..
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇందిరా గాంధీ ,భారతదేశపు మొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రిగా పనిచేసిన ప్రధాన మంత్రి కాగలదు..
భూమికి చేరే చివరి క్షణంలో ఫ్లైట్లో సాంకేతిక కారణాల వల్ల మరణించినా "నేటికీ నేషనల్ హీరోగానే
పరిగణింపబడుతుా" భారతీయ సంతతికి చెందిన మొదటి అమెరికన్ వ్యోమగామి ఇంజినీర్ గా అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ సంతతికి చెందిన మొదటి మహిళ..
కల్పనా చావ్లా" కాగలదు.
"భారత మహిళల క్రికెట్ జట్టుకు టెస్ట్ ,వన్డే కెప్టెన్. ఆమె మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి."మిథాలీ రాజ్" కాగలదు.
ఎయిర్ ఫోర్స్ మొట్టమొదటి మహిళా ఫ్లైయింగ్ ఆఫీసర్ "అంజలి గుప్తా".
మొట్టమొదటి సుప్రీం కోర్టు మహిళా న్యాయమూర్తి "ఎం.ఫాతిమా బీవి".
ఇండియన్ ఎయిర్ లైన్స్, మొట్టమొదటి మహిళా పైలట్ "దుర్గా బెనర్జీ". కాగలదు
యుద్ద విమానంలో మొట్టమొదటి మహిళా పైలట్ "అవని చతుర్వేది"కాగలదు
మొదటి మహిళా ముఖ్యమంత్రి "సుచేత కృపలాని" కాగలదు.
భారత మొదటి మహిళా ఐ.ఎ.ఎస్. అధికారి "అన్నా జార్జి".
ప్రపంచ బాక్సింగ్ పోటీలో గెలుపొందిన భారత మొదటి మహిళ "మేరీ కోమ్"
భారతదేశపు మొదటి మహిళా ఆర్మీ కెప్టెన్" లక్ష్మీ సెహగల్"
ఎవరెస్ట్ను అధిరోహించిను భారత మొదటి మహిళ "బచేంద్రిపాల్" కాగలదు .ఇలా ఎన్నో రంగాలలో స్త్రీలు నిష్ణాతులు కాగలరు.
ఇలా చెప్పుకుంటుా పోతే భారతదేశపు కీర్తి కిరీటంలో" కలికి తురాయిలై " కాలగమనంలోమరుగు పడిన అట్టడుగు వర్గాలకు చెంది , గుర్తించబడని మహిళలు ఎందరో ఉన్నారు.
అన్నిటా తామై, అన్ని రంగాలలో తామై, సృష్టి కి ప్రతి సృష్టి చేస్తున్న స్త్రీ శక్తిని , అంచనా వేయడం కష్టతరమే.
ఒక స్త్రీ ప్రపంచానికే బాస్ అయితే
అమ్మ ప్రేమ నందించడంతో పాటు అందరినీ సమాన దృష్టి తో పాలించి దేశాన్ని, దేశ ప్రజలను ఉన్నత స్థితికి తేవగలదన్న మాట మాత్రం అక్షరాలా నిజం అనడానికి ఏమాత్రముా సందేహం లేదు. ..
హామీ :
ఈ ఆర్టికల్ నా స్వీయ రచన.
+++++++++++++++++++++++++++++++++
No comments:
Post a Comment