Saturday, March 18, 2023

అంశము: *సస్పెన్స్/థ్రిల్లర్/దెయ్యం కథలు*

[
19/04/2023.

తపస్వీ మనోహరం వారి కొరకు రచన .

విభాగం: *కథ*
అంశము: *సస్పెన్స్/థ్రిల్లర్/దెయ్యం కథలు*

శీర్షిక  : హీరో చింటుా...

( థ్రిల్లర్  కధ.)


రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .


చింటుా వాళ్ళ నాన్నగారికి ట్రాన్ఫర్ అవడం వల్ల వాళ్ళు ఊరు మారేరు.  తామున్న ఇల్లు ఒక సొసైటీలో రెండవ అంతస్తులో ఉంది. అది కొత్తగా కట్టినట్టుంది. చాలా ఫ్లోర్లు ఖాళీగా ఉన్నాయి. అన్నీ నాలుగు బెడ్రుామ్స్ ఉన్న ఇళ్ళే.
ఒకొక్క ఫ్లోర్ లో రెండేసి మాత్రమే ఇళ్ళున్నాయి.
కొత్త ఇల్లు కొత్త మనుషులు . చింటుాకి విచారంగా ఉంది.
"ఆ వుారిలో తనకెంతమంది స్నేహితులుండేవారో .
మళ్ళీ తనకు స్నేహితులు బోలెడుమంది కావాలంటే ఎన్ని రోజులు పడుతుందో..
అంతదాకా తనొక్కడే ఆడుకోవాలి. ఈ బిల్డింగ్ లో ఎవరెవరున్నారో తన తోటి పిల్లలు  ఉన్నారో లేదో రేపు చుాడాలి ." అనుకుంటుా అసహనంగా ఇల్లంతా కలయ తిరిగేడు.
చుాస్తుండగానే రాత్రి అయింది .
నాన్నగారి ఉద్యోగం ఏమిటోగానీ అలా టుార్లు తిరుగుతుానే ఉంటారు .ఇంట్లో తను అమ్మ మాత్రమే ఉండాలి.
ఇదిగో... ఇప్పుడు కుాడా నాన్నాగారు ఊరికి  వెళిపోతున్నారు. 
పాత ఇల్లు తమ సొంత ఇల్లే...ఆ ఇంటిలోకి అద్దెకు దిగేవారు రేపే వస్తున్నారు. ఏవేవో ఫార్మాలటీస్ పుార్తి చేయాలని నాన్నగారు వెంటనే బయలుదేరుతున్నారు. నాలుగు రోజుల్లో వచ్చేస్తానంటుా..
 అమ్మ నాన్నగారి బట్టలు పేక్ చేసి 
కొన్ని తినుబండారాలు  కేరేజి లో కట్టి ఇచ్చింది.
నాన్న తమను జాగర్తగా ఉండమని చెప్పి వెళ్లిపోయారు.
చుాస్తుాండగానే రాత్రి అయ్యింది . రాత్రి పదకొండు గంటలదాకా టి.వి. చుాసి .తను,  అమ్మ పడుక్కోవడానికి రెడీ అవుతున్నారు. ఇంతలో ఎవరో" టక్కు టక్కు " మని కొడుతున్న చప్పుడు వినిపించింది. తమ ఇంట్లోంచే ఆ చప్పుడు వస్తుాండడంతో
ఇద్దరికీ చాలా భయం వేసింది.
అసలే బిల్డింగ్ లో చాలామంది రానందున,  ఖాళీగా ఉంది.
దానికి తోడు తమ పక్క ఇంట్లో కుాడా ఎవరుా లేరు.
అది బయట తాళం వేసి ఉంది. అలాంటప్పుడు ఈ చప్పుడెలా వస్తున్నాది .అదీ తమ ఇంట్లోంచే వస్తున్నట్టుగా...
అమ్మ తనను గట్టిగా పట్టుకొని  బెడ్రుామ్ తలుపు లాక్ చేసింది . అక్కడున్నా వారెవరికైనా ఫొిన్ చేద్దామంటే ఎవరి నంబరుా తెలీదాయె. 
నాన్నగారికి చేద్దామంటే, ఫోన్ హాల్ లో, టి.వి.పక్కన ఉండిపోయింది. 
చప్పుడు అగి ఆగి వస్తున్నాది 
పెద్దపెద్ద సిటీల్లో అందరుా పై అంతస్తులనే  ఎంపిక చేస్తారు.
గాలి వెలుతురు తో పాటు , బాహ్య సౌందర్యం ..ఆస్వాదించవచ్చునన్న కోరికతో..
దానివల్ల ఒచ్చిన కొంతమందీ కుాడా ఐదవ అంతస్తు నుండి ఆపై అంతస్తుల్లో ఉన్నారు. అదీ అక్కడా..అక్కడా....
అందువల్ల తమ ఇంటికి  కింద , మీద కుాడా ఎవరుా లేరు.
ఆ విషయం తల్చుకుంటేనే భయంగా ఉండి , ఈ సమయంలో చమటలు పడుతున్నాయి.
ఆసమయంలో నేనే అమ్మకు తోడన్నట్టు  అమ్మ నన్ను గట్టిగా పట్టుకొని భయంతో మంచమెక్కింది. ఆరాత్రంతా మాకు చప్పుళ్ళు వినిపిస్తుానే ఉన్నాయి .
తెల్లారి ముాడు నాలుగు  గంటలౌతుాండగా  ప్రతిధ్వనిలాంటి మాటలు,
ఒక మగ గొంతుక.....
"నేను చాలా అసహాయస్థితిలో ఉన్నాను. దయుంచి నన్ను రక్షీంచండి "అన్న మాటలు చాలా బలహీనంగా వినిపించసాగాయి. తర్వాత ఏడుస్తున్నట్లు ముాలుగు లాంటి
శబ్దం రాసాగింది.

ఆమాటలు విన్న తర్వాత అమ్మకు  కొంచం ధైర్యం వచ్చిందేమొా..
నన్ను మంచం దిగొద్దని చెప్పి  తను మాత్రం మెల్లగా తలుపు తీసుకొని  బయటకు వెళ్ళింది. తెల్లారుతుాండడంతో కిటికీలు తీయగానే కాస్తంత చల్లగాలితో పాటు చిన్న వెలుగు కనిపించింది. అమ్మ ఆ శబ్దం వస్తున్న వేపుగా మెల్లగా నడవసాగింది. ఆ ముాలుగు తమ ముాడవ బెడ్రుామ్ బాత్రుామ్ లోంచీ వస్తున్నట్లనిపించడంతో ..భయంతో.వణుకుతుా ...మెయిన్ డోర్ గబ గబా తీసి అరుస్తున్నట్లుగా" చింటుా తొందరగా రా అంటుా తన ను పిలిచింది. అమ్మ భయపడడంతో చింటుాకి చమటలు పట్టేయి.
గబుక్కున మంచం దిగి పరిగెత్తి వెళ్ళి అమ్మను గట్టిగా చుట్టేశాడు.
వెంటనే  అమ్మ తనను  పట్టుకొని లిఫ్ట్ లోకి ఎక్కి బటన్ నొక్కింది.
లిఫ్ట్  క్షణంలో గ్రౌండ్ లో ఆగి ద్వారం తెరుచుకుంది.
అమ్మ పరుగు పరుగున  మెయిన్ గేటు దగ్గరున్న "వాచ్ మేన్" ను చేరుకుంది.
అంత తెల్లవారి ఒక ఆడ మనిషి గాభరాగా తన దగ్గరకు రావడంతో వాచ్ మేన్ గాభరాపడ్డాడు.
అమ్మ రాత్రి జరిగినదంతా వాడితో చెప్పింది.
వాడు ఆశ్ఛర్య పోయేడు. 
"ఈ బిల్డ్ంగ్ కట్టడం పుార్తయి నెల కావస్తున్నాది .కొన్ని కుటుంబాలు వచ్చి ఉంటున్నారు కుాడా...
ఎవరికీ ఇటువంటి అనుభవం కలగలేదు 
మరి ఈ అమ్మగారికి మాత్రం ఏడుపులు, చప్పుళ్ళు,  ఎందుకలా వినిపిస్తున్నాయి.  రెండవ అంతస్తులో దయ్యముందా...."
తలచుకోగానే వాడికి కుాడా కొంచం భయమేసింది.
వాచ్ మేన్ ఆలొచిస్తుా చుట్టుా చుాసేడు.
 బిల్డింగ్ చుట్టుా ఆవరణ  ఎంతో అందమైన మొక్కలతో ,
పచ్చని తివాచీ పరచినట్లుండే పచ్చ గడ్డితో, ఉండి ఆకర్షణీయంగా ఉంది.
చుట్టుా పెద్ద ప్రహారీ గోడ ఉండి,  రెండు పెద్ద గేట్లు కలిగి ఉంది.
ఒకటి పెద్ద గేటు....కార్లు వెళ్ళడానికి.
రెండవ గేటు కొంచం చిన్నది...మనుషుల కోసం నడకదారది. .
గేటు లోంచీ  బిల్డింగ్ దాకా నడిచి రావాలంటే కొంచం దుారమే ఉంటుంది.
అందరుా కార్లలోనే రావడం వల్ల, వారికి నడిచే అవసరం పడ దు.అదీగాక వచ్చిన వాళ్ళంతా పై అంతస్తుల్లో  ఉంటున్నారు.
అన్ని ఫ్లేట్లుా కొలుగోలు చేయబడి తాళాలు వేయబడ్డాయి.
ఈ రెండవ అంతస్తుకి వీళ్ళు మాత్రమే వచ్చేరు. 
తను గేటు కాపలాదారు మాత్రమే కావడం వల్ల బిల్డింగ్ 
దాకా వెళ్ళే అవసరం పడలేదు.
అక్కడికి వచ్చే  తోటమాలి , పనివాళ్ళుా ఎవరికీ కుాడా ఇటు వంటి సంఘటన జరుగుతున్నాట్టు తెలీదులా ఉంది.
ఇంత వరకు ఇటువంటి సంఘటన ఈ బిల్డింగ్  లో జరుగుతున్నట్టు తమ మధ్య ఏ విధమైన చర్చలుా జరగలేదు.
మరేమయ్యుంటుంది...?


ఆలోచిస్తుానే వాచ్ మేన్  చింటుాని వాళ్ళమ్మని అక్కడ దగ్గరలో ఉన్న రెష్ట్ రుామ్ లో కుార్చోమని చెప్పి , చాయ్ తెప్పించి ఇచ్చేడు. తరువాత ఇంటర్ కమ్ ఫోన్ నుండి 
బిల్డింగ్ లో ఉన్న అందరికీ  విషయం వివరించేడు.
మరోఅరగంటకే అక్కడి పరిస్థితంతా మారిపోయింది.
పై అంతస్తులో ఉన్న వాళ్లంతా  కిందకి దిగి వచ్చేరు.
కొందరు పోలీసులకి ఫొిన్ చేస్తే, మరి కొందరు తమకు తెలిసిన  మంత్రగాళ్ళకి , మరికొందరు పుాజారులకి, ఫోన్ చేసేశారు.
తర్వాత  కొందరు చింటుాని వాళ్ళమ్మను చుట్టు ముట్టి ప్రశ్నల వర్షం కురిపించసాగేరు. 
చింటుా వాళ్ళమ్మ  ,తన ఫోను హాలులో టి .వి.పక్కన ఉందని , ఎవరైనా తనతో సాయం వస్తే  తను ఆ ఫోన్ తీసుకుంటానని , దానితో తన భర్తకు ఫోన్ చేయాలని ,ఎంత మొత్తుకున్నా ఎవరుా  వినిపించుకోవడమే లేదు. 
మొత్తానికి ఆ గందరగోళం మధ్యాహ్నం దాకా సాగింది.
చింటుాకి ఆకలేస్తోంది.
ఇంతలో పొిలీసులు వచ్చేరు విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళకీ భయమేసిందో ఏమొా...
మంత్రగాళ్ళతో కలిసి  గుంపుగా తమ ఇంటి పక్కనే ఉన్న రెండవ అంతస్తు ఇంటి దగ్గరకు వచ్చేరు .
 చింటుా వాళ్ళమ్మ చెప్పినట్టుగా ఆ ఇంటినుండి
 ఏ శబ్ధం గానీ, ఏడుపుగానీ, వినపడలేదు. 
 చాలా తర్జన భర్జనల తరువాత ఆ ఇంటి తాళం విరగ్గిట్టి లోపలికి గుంపుగా వెళ్ళేరు.
 అదుగో...అప్పుడే అక్కడ  బాత్రుామ్ నుంచి చిన్నగా ముాలుగు వినిపించింది.
 అందరుా ఒక్కసారి నిశ్శబ్దం ఐపోయారు. అందులో ఒక పోలీసు ధైర్యం చేసి, బాత్ రుాం తలుపు తీయ ప్రయత్నించేడు. కానీ అది రాలేదు.
 బాగా గమనించగా అది "డబల్ లాక్ "పడినట్లు 
 గుర్తించి , తాళాలు తీసే వాడిని పిలిపించి తలుపులు 
 తెరిచారు. 
 అందులో ఒక మనిషి చిక్కి శల్యమై, క్రింద  పడి ముాలుగుతున్నాడు .అతని బట్టలన్నీ తడిసిపోయి ఉన్నాయి . బాత్రుామ్ అంతా అసహ్యకరమైన గబ్బు వాసనతో నిండి ఉంది
 అతని చేతిలో టాయిలెట్ పైప్ ఉంది. 
 అతనిపై నీళ్ళు జల్లినా అతడు లేవలేకపోయాడు.
 వెంటనే పోలీసులు  ఏంబులెన్స్ ని పిలిపించి, అతనిని ఆసుపత్రికి తరలించేరు.
 ఒకరోజంతా నారాయణకు "డిప్స్" ఎక్కించి ఎమర్జన్సీ వార్డ్ లో "అబ్జర్వేషన్ "లో ఉంచేరు.
 తర్వాత కొంచం కోలుకున్న నారాయణతో  పోలీస్ లు మాట్లాడసాగేరు.
అప్పుడు నారాయణ చెప్పిన విషయం ఇది.

--------
ఆ బిల్డింగ్ లో ఐదవ అంతస్తు పైనున్న ఇళ్ళు మాత్రమే అందరుా కొనుక్కున్నారు.
కిందనున్న నాలుగు ఫ్లోర్లుా ఖాళీగానే ఉండడంతో  రెండవ అంతస్తు లో ఉన్న ఒక ఇంట్లో అక్కడి వర్కర్లు అందరుా
 కలిసి మందు పార్టీ  చేసుకొని, బాగా తాగి ,తిన్నారు. 
తను కుాడా , చాలా తాగడంతో కడుపులో తిప్పినట్టై , 
వాంతి వస్తున్నట్టుగా అనిపించడంతో , బాత్రుామ్ లోకి 
 వెళ్ళి ధడాలున తలుపేశాడు..
వాంతి అవలేదు గానీ మత్తుగా తుాలుతుా  అక్కడే కుాలిపోయేడు.
ఎప్పడు తెలివి వచ్చిందో తెలీలేదు .అప్పటికీ మత్తు దిగలేదు.
కానీ ఆకలి దంచేస్తున్నాది.  
నారాయణ తలుపు తీయడానికి ప్రయత్నించేడు గాని అది లాక్ అవడంతో తెరుచుకోలేదు.
అతను తన సాటి వారి నందరినీ పేర పేరునా పిలిచేడు .
కానీ లాభం లేకపోయింది.
కొంతసేపటికి అందరుా వెళిపోయి ఉంటారని తెలుసుకున్నాడు.
దాంతో పిచ్చిగా అరుస్తుా ,అక్కడి కొళాయి  పైపులు లాగ ప్రయత్నిస్తుాండగా ...చివరికి  టాయ్ లెట్ బాక్స్ కి ఉన్న పైపు ఊడొచ్చింది .దానితోనే  అతడు చాలా సార్లు అక్కడున్న వెంటిలేటర్ని కొట్ట సాగేడు .
దాంతో , దాని అద్దాలైతే పగిలేయి గానీ 
ఎవరుా రాలేదు. ఆకలి , భయం, నిద్రలేమి , నీర్సానికి 
శక్తిలేక పడిపోయిన తను ఈ ఆసుపత్రిలోనే కళ్ళు
విప్పినట్టు చెప్పేడు.
నారాయణ చెప్పిన మాటలువిన్న అందరికీ అతనిమీద, కొంత జాలి , కొంత కోపం, కుాడా వచ్చేయి .
"ఈ తాగుడనే వెధవ అలవాటు వల్ల ఎంతమందిని ఇబ్బంది పెట్టేడో.."అంటుా కొందరు అసహ్యించుకున్నారు. 
మరి కొందరు "అయ్యిా పాపం , తిండి -తిప్పలు లేకుండా
ఒక్కడుా ఆ బాత్రుామ్ లో ఎంత బాధ పడ్డాడో " అంటుా..
జాలిపడ్డారు.
మరి కొందరు" చింటుా వాళ్ళమ్మ ధైర్యం చేసి వాచ్ మేన్ కు 
సంగతి చెప్పకపోతే  నారాయణ ప్రాణాలే పొియేవి" 
అంటుా వారి ధైర్యాన్ని పొగిడేరు.

చింటుాకి మాత్రం చాలా ఆనందంగా ఉంది.
ఈ కారణంగా తనకు , ఎంతోమంది పిల్లలు స్నేహితులయ్యేరు.
రేపటినుండి తను ,వారందరితో బోలెడు ఆటలు ఆడుకోవచ్చు .....ఎందుకంటే,  ఇప్పుడు తను
వారందరి దృష్టి లో , నారాయణని కాపాడిన ఓ పెద్ద హీరో..మరి.

********************************-*-




1. కె.కె.తాయారు
2. ఎం.వి.చంద్రశేఖరరావు
3. కార్తీక్ దుబ్బాక.
4. కాటేగారు పాండురంగ విఠల్
5. పంతుల లలిత 
6. మక్కువ.అరుణకుమారి
7. శ్రీ విజయ దుర్గ. ఎల్
8. సావిత్రి కోవూరు
9. శనగపల్లి ఉమామహేశ్వరరావు 
10. శ్రీసుధ కొలచన 
11. సుజాత కోకిల.
12. జి.కె.నారాయణ
13. పి. వి. యన్. కృష్ణవేణి 
14. దొడ్డపనేని శ్రీవిద్య
15. పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
16. యాంబాకం

మహిళా మనోహరి మాస పత్రిక కొరకు.
28/03/2023.
రచయిత్రి : యడవల్లి శైలజగారు.
పుస్తకం : హృదయరాగం.
సమీక్షకురాలు :
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.,
కల్యాణ్ : మహారాష్ట్ర .

యడవల్లి శైలజగారి హృదయరాగం...
ఒకమినీ నవల గానీ, ఓ పెద్ద  కధ గానీ, అయి ఉంటుదన్న
అభిప్రాయంతో  Pdf ఓపెన్ చేసిన నేను , ఆశ్ఛర్యానందాలకు గురయ్యాను..
అందులో  కన్నవాెు ,  గౌరవనీయులైన వారు , ఎందరో స్ఫుార్తి దాయకులు , హితులు స్నేహితులు , ప్రోత్సాహకులు ఐన
వారు తన హృదయానికి దగ్గరైన ఎంతో మంది గురించిన
తన మనసులో  ఉన్న భావనలను  పంచుకుంటుా...
మనలను కయాడా ఆలోచింపజేసి ఔను అనిపుంచిన విధానం నన్ను చాలా ఆకట్టుకొంది.
అమ్మగా ,అక్కగా, ఆలిగా, స్నేహితురాలిగా  అందరి పట్ల తన మనసులో ఉన్న ప్రేమను, అనురాగాన్ని  అభిమానాన్ని ,
తపనను  తెలియజేస్తున్న వైనం కళ్ళ నీళ్ళు పెట్టించింది..

ఈ నాటి పరిస్థితులు ఎలా మారాయంటే
అమ్మ, నాన్న, అక్క, చెల్లీ , అన్న, తమ్ముడు అనే రక్త బంధాలకు విలువ లేకుండాపోయింది, కాస్తంత సంపాదన రాగానే "ఎవరికి వారే యమునాతీరే "అన్నట్లున్నారు.
కాకుండా ప్రతీ ఒక్కరుా "ట్రెండ్ మారిందండీ "అని గొప్పగా చెప్పుకోవడం ఒక " ట్రెండ్ " గా మారిపోయింది. 
మనిషిలో స్వార్ధం పేరుకుపోయింది.
మానవత్వం మట్టిలో కలిసిపోయింది.
అటువంటి వారికోసమే అన్నట్టుగా శైలజగారు
బంధాలు బంధుత్వాలు వాటి విలువల గుార్చి ఆర్ద్రత నిండిన భావుకతతో తన మనసులోని భావాలను వ్యక్త పరచిన విధానం చాలా చాలా  బాగుంది.
తనను పెంచిన తల్లితండ్రుల మీదున్న గౌరవాభిమానాలని తెలియపరచే  విధానం..వారెంత కష్టపడితే తామీ స్థితికి వచ్చేరోనని  తన తమ్మళ్ళకు అన్నలకు  తెలియపరుస్తుా తల్లిదండ్రులను ముసలికాలంలో  ఏ విధంగా చుాసుకోవాలో  సుతిమెత్తగా ప్రేమతో తెలియపరచిన విధానం  చాలా బాగుంది.
.చాలా మంది స్నేహ బంధం గురించి పెద్దపెద్ద మాటలు పుటలు- పుటలుగా రాస్తారు.  కానీ నిజమైన స్నేహితునిగా
మసలలేరు.
అలాగే మనం చాలా మందిని ఎక్కడెక్కడో కలుస్తాం .ఆత్మీయతను పంచుకుంటాం . విడి పోతాం,  కానీ కొంతమందిని కలిసినపుడు అనుకోకుండా వారితో ఐన అనుభవాలని మనమెప్పటికీ మరవలేం.
మన జీవిత కాలంలో ఎంతో మంది సహకారం వల్ల
మనమెన్నో మెట్లు పైకెక్కుతాం . ఒకసారి పైకి వెళ్ళాకా మరి తిరిగి వెనక్కి చుాడం .
కానీ మన జీవితంలో  కొన్ని సంఘటనలు అనుకోకుండా  ఒకప్పటి  వారి సహాయాన్ని , వారి ఉనికిని గుర్తు చేస్తాయి. 
మనలో జ్ఞాపకాల  ఆ సడులే మన కళ్ళను  తడి చేస్తాయి.
కొంత అనందం,  కొంత అనురాగం , కొంత ఆప్యాయత , కొన్ని బాధలు , మరిన్ని బంధాలు, మమతానురాగాలు , స్నేహ బంధాలు ,కొన్ని పాత- కొత్త జ్ఞాపకాల తరంగాలు, లేపిన  ఎత్తుపల్లాలు  కలబోసిన  ప్రయాణమే  మన జీవితం.

ప్రతీ చిన్న మాటకు , చేతకు , స్పందించే మనసు అందరికీ ఉన్నా అది వ్యక్తపరచే విధానం చాలా మందికి తెలియదు.
కానీ అందరిలోనుా అన్ని రసాలకుా స్పందించే  హృదయం ఉంటుంది.
అందరి మాటను తన మాటగా  చెపుతుాన్నట్లుండే
" యడవల్లి శైలజగారి హృదయరాగం..."
అందమైన అనుభవాలను  ఆస్వాదింప జేసి  ఊరట కలిగించే  "సుందర సుమధుర మధుర పరాగం "

ఇటువంటి విలువలను తెలియ జేసే
మరిన్నిమంచి స్పందనలను  మరింత భావులతతో తెలియజేసి చదువరులకు స్ఫుార్తినివ్వాలని
మనఃస్ఫుార్తిగా కోరుకుంటుా....

శైలజగారుా...."హేట్సాఫ్ టుా యుా ".

అభినందనలతో..మీ స్నేహితురాలు

శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.,
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

No comments:

Post a Comment