శ్రీ శ్రీ కళా వేదిక వారి ఆధ్వర్యంలో
అంశం : భ్రుాణ హత్యలు.
09/ 05/2022.
ప్రక్రియ : వచన కవిత.
శీర్షిక : తప్పెవరిది...?
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
కాలం గమనంలో ఎన్నో మార్పులు.
రాజ్యాంగ రణ నీతులకు రాపిడౌతున్న
నీతి న్యాయాలలో నిలకడలేని తీర్పులు.
పెరిగిన కక్షలు కావేశాల కార్చిచ్చుకు
బలౌతున్న స్త్రీలు, నేలపాలౌతున్న
గర్భస్థ పిండాలు॥
ఇటు మాదక ద్రవ్యాల మత్తు మానవ
జీవితాలతో మారణ హోమం చేస్తోంది.
అటు మానవ మేధస్సు చరవాణి,దుారదర్శన్
రుాపాలలో యువత భవితను కాటువేస్తోంది.॥
దాంతో , ముాకుమ్మడి అత్యా చారాలతో
మానవత్వం మంటకలిసిపోతోంది.
వావి వరుసలు వికృత రుాపం దాలుస్తున్నాయి॥
భ్రుాణ హత్యా పాపాలు పెరిగిపోయాయి.
నేడు ఆడతనం అమ్మ తనానికి
దుారమౌతుాంటే,ఆడపిల్లలు లేక మగపిల్లలు ఒంటరిగా మిగిలిపోతుా ఆడదాని పొందుకోసం అంగలార్చుతుా అందినవారిని ఆక్రమిస్తున్నారు.॥
వావి వరుసలు మరచిన కాముకులవల్ల వచ్చే గర్భస్రావాల సంఖ్య రోజురోజుకుా పెరిగిపోతోంది.
బాలలు బాలింతలౌతున్నారు.
యువతులు , మానాన్ని కోల్పోతున్నారు.॥
దీనికి బాధ్యులెవరు ? ..
స్వార్ధం నిండిన పాలకులదా...?
మాదకద్రవ్యాల విక్రేతలదా ..?
సకాలంలో తీర్పునీయని చట్టాలదా...?
సవరించలేని సాంకేతిక పరిజ్ఞానానిదా...?
మానవత్వం మరచిన మానవుడిదా..?
హామీ:
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితముకాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment