భానుపురి కవితల పోటీ కొరకు..
14/04/2022.
అంశం : అంబేద్కర్ జీవితాశయం .
శీర్షిక : నిత్య శ్రామికుడు.
రచన: శ్రీమతి:పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
ప్రక్రియ : వచన కవిత .
బడికి గుడికి కుాటికీ నీటికీ
అడ్డు వచ్చే కుల మతాల ఒరవడి
నిమ్న జాతుల ప్రగతి పథంలో
నత్య శ్రామికుడై నిలచిన వారధి ॥
అస్ప్రుశ్యత, అసమానతలకు
ఆలపించిన ఉద్యమ రవం ॥
అధర్మం, అన్యాయాల పోరుకై
పుారించిన శంఖారవం.॥
అసమానతల కొలిమిలో
కాలుతున్న ఆత్మాభిమానం
అవమానాల భారంతో
ఆక్రోశిస్తున్న అంతరంగం ॥
కుల-మత విభేదాలకు
కుంగిపోని ఆర్మస్థైర్యం
రగులుతున్న గుండెతో
విద్య కోసం విచక్షణా ప్రయాణం.॥
న్యాయవాదిగా సంఘ సంస్కర్తగా
భారత రాజ్యాంగ రుాప శిల్పిగా
అన్యాయాన్నెదిరించే బాటలో
ఉద్యమ పోరాటాలకు ఊపిరిపోసిన వైనం ॥
దళితుల హక్కులకై పోరాటం
బడుకు బతుకుల భవితకై అరాటం.
ఆదర్శాల పోరులో సాధించిన విజయం.
భారతరత్నగా వెలుగొందిన ఘన వ్యక్తిత్వం ॥
సాంఘీక సంస్కరణల గ్రంధ కర్తగా
మనుషుల్లో మలినాల్ని తుంచే కలి.
జీవితమంతా దళితోద్ధారణకై బలి .
భీమ్ రావ్ అంబేద్కర్ మరాఠా బెబ్బులి.
ఆతనికిదే నా అక్షర సుమాంజలి ॥
హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని
నా స్వీయ రచన .
No comments:
Post a Comment