శీర్షిక : స్వయంకృతాపరాధం .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర
ఎక్కడీ తీతువు పిట్ట
హృదయవిదారకంగా అరుస్తోంది.
కరడు కట్టిన హృదయాలకు
కన్నీరు తెప్పించేలా.॥
ధనాకాంక్షకు దగ్ధమౌతున్న ధరణి
రసాయనాల ఎద్దడికి సారహీనమౌతున్న
మట్టి పొరల్లో పేరుకు పోతున్న విషపు చిత్తడి॥
విషపుారిత వాతావరణంలో.
పెరిగిన ఉష్ణోగ్రతల ఉధృతాలు ॥.
రక్షణ లేని పర్యావరణంలో
మలమల మాడుతున్న జీవితాలు॥
రసాయనాల్లో నండిన విషాలతో
కల్తీ నిండిన ఆహార పదార్ధాలు
అశువులు బాస్తున్న పశువులు
రోగలకు నెలవైన మానవ కళేబరాలు.॥
పచ్చదనం కోల్పోయిన ప్రకృతిలో
ఆక్సిజన్ కరువైన హా హాకారాలు.
దేశమంతా శవాలు నిండిన
కుతంత్రాల కుళ్ళు వాసనలు.॥
పురుగుల మందుల ఉపయొాగాలు
జన జీవుల పాలిటి శాపాలు॥
రోగాలు నిండిన జన్మలకు
సవరింపులు జరగని అస్తవ్యస్తాలు, ॥
దుర్వాసన తో కుాడిన
మురికి వ్యర్ధాల విష వాయువులు.
జన జీవితాలలో రోగాలు
రొచ్చుల అల్లల్లోలాలు ॥
దేశమంతా శవాలు నిండిన
కుతంత్రాల కుళ్ళు వాసనలు
మనిషే మనిషికి బరువై, నీ ,నా
ఆరోపణల స్వార్ధం నిండిన బతుకులు ॥
పచ్చదనం కానరాని ప్రకృతిలో
పర్యావరణ రక్షణ లేని ప్రారబ్ద జీవితం॥
నేటి కలుష్యం నిండిన వాతావరణం
జనాలు తెచ్చిపెట్టుకున్న స్వయంకృతాపరాధం .
***************:****::::::::::::
No comments:
Post a Comment