13/04/2021
గోదావరి రచయితల సంఘం వారి అంబేద్కర్ జయంతి కవితల పండుగ కొరకు
అంశం : మహనీయుడు అంబేద్కర్ .
శీర్షిక : భారత రాజ్యాంగ నిర్మాత.
రచన :
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ మహారాష్ట్ర .
అగ్రకులాలవారి ఆధిపత్యపోరులోజరిగిన అవమానాల బాధంపు
డాక్టరేట్ పొందిన మొట్టమొదటి భారతీయుడిగా గుర్తింపు ॥
న్యాయవాదిగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్.. ,
అంటరానితనంపై పూరించిన సమరశంఖం.
అస్పృశ్యతా నివారణే తన ధ్యేయంగా
జీవిత కాలమంతా చేసిన వదలని పోరాటం ॥
న్యాయవాదిగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్.. ,
భారత రాజ్యాంగ నిర్మాతగా చరిత్రకెక్కిన ఘనం ॥
కుల, మత రహిత ఆధునిక భారత దేశపు
సంఘాధ్యక్షునిగా రాజ్యాంగ ప్రవేశం ॥
బహిష్కృత హితకారిణి’ అనే సంస్థను స్థాపించిన కారణం
అంటరానితనం,అస్పృశ్యతల భావన, శిక్షార్హమైన నేరమంటుా చేసిన ఉద్యమం ॥
నాటి భారత రాజ్యాంగ శిల్పిగా,
ప్రజాస్వామ్య పరిరక్షకునిగా,
అంబేద్కర్ విఖ్యాతుడైన వైనం .
నేటి మన కులరహిత్యానికి కారణమైన ఘనం॥
పారిశ్రామికీకారణ, వ్యవసాయాభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మిన అంబేద్కరు శ్రేష్ట.
భారత ప్రభుత్వం ఇచ్చిన అత్యంత
అభినందనీయమైన భారతరత్న 'అవార్డు గ్రహీత ॥
No comments:
Post a Comment