తేదీ: *30-04-2022*
*శ్రీ శ్రీ గారి జయంతి సందర్భంగా*
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
శీర్షిక : విప్లవ కవి. శ్రీ శ్రీ .
అల్లకల్లోలమైన జన సంద్రంలో
ఒరిగిపోతున్న ఒడిదుడుకుల నావకు
చుక్కానై , జనులకు ఉత్తేజం కలిగించే
కవితా వాహినిలో బాటను చుాపిన
బహు జన చైతన్య కవితా ఖని
హేతువాదియైన శ్రీ శ్రీ ॥
ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించి
తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చి,
విప్లవ తుాణీరాలతో వింటిని సారించిన
అభ్యుదయ రచనా దురంధరుడు కవి శ్రీ శ్రీ .॥
అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించి
అందరి మన్ననలనుాపొందిన మేటి కవి శ్రీశ్రీ ॥
వ్యక్తి ఒక మహోద్యమ శక్తి" అని,
అతను సృజించిన అక్షరమే మహత్తర
మార్పుకు కారణమని ప్రత్యక్షంగా తన
కవితలతో భావోద్యమాన్ని ప్రకటించిన
విప్లవ ముార్తి శ్రీ శ్రీ ॥
గురజాడ బాటలో వాడుకైన భాషలో
మాత్రా ఛందస్సుల మహోజ్వల హోమాన్ని
సంకల్పించి , ఉద్రేకం ఉత్తేజం కలిగించే
కవన యజ్ఞానికి శ్రీకారం చుట్టిన ఘనుడు శ్రీ శ్రీ ॥
ఎన్నో విరుధ్ధమైన భావాలు గల వ్యక్తిత్వం
ఎన్నో సంఘర్షణలతో కుాడిన ఉద్వేగం.. .
హేతువాదం, నాస్తికత, మేళవించ రాసిన
మహోన్నత కవిత్వం బాటలో అతడు
రాసిన కవిత్వం , మహాప్రస్థానమై అతనికి
కీర్తి కిరీటాన్ని ఆపాదించి కవిగా ఆతనిని అందలాలకెక్కించింది ॥
శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించి,
తనదైన శైలిలో వాడి సిద్ధాంతాల
వేడిని సృజింపజేసి కవన వనం లో
మనlను విహరింపజేసిన హేతువాది గా అందరిమదిలో చిరస్థాయిగా నిలచిపోయి
విప్లవ విజేత శ్రీ శ్రీ గా ప్రసిద్ధి చెందిన
సాటిలేని మేటి కవి శ్రీరంగం శ్రీనివాసరావు ॥
హామీ పత్రం: ఇది నా స్వీయ రచన.దేనికీ అనువాదం కాదు. అనుసరణ కాదు.
*శ్రీ శ్రీ గారి జయంతి సందర్భంగా*
శీర్షిక : విశ్వ కవి శ్రీశ్రీ .
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
ఏడు సంవత్సరాల వయసులోనే
ఏర్పడిన సాహిత్యాభిలాష.
దాంధిక భాషలో ఛందోబద్ధంగా రాసిన
ప్రభవ అనే కావ్య సంపుటికి ప్రచురణతో
వేసిన సాహిత్య పునాది ॥
ఆటుపై గురజాడ స్ఫుార్తితో
వాడుక భాషలో మాత్రా ఛందస్సుతో
రాసిన జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి మొదలైన కవితల సంపుటి॥
ఆధునిక తెలుగు సాహిత్యంలో
ఆతను రాసిన కావ్యాల లో
మహాప్రస్థానం కావ్యం
అత్యున్నత స్థానంలో నిలిచి
శ్రీశ్రీని మహాకవిని చేసింది ॥
సామాజిక వాస్తవికతకు దగ్గరగా
ఎన్నో కవితా సంకలనాలు
మరెన్నో నాటికలు, కధలు
గీతాలు వంటి ఎన్నో రచనలు
శ్రీ శ్రీ మహోన్నత వ్యక్తిత్వానికి
నెలవైన నిండు నిదర్శనాలు ॥
ప్రాస నిండిన శ్లేషతో .అల్పాక్షరాల్లో
అనల్పార్ధాన్ని సృష్టించడంలో మేటియై
"వ్యక్తే ఒక శక్తి" అంటుా
మహత్తర శబ్ద ప్రయోగాలతో కవిత్వంలో
నవ్యతను సృజించిన వ్యక్రి .శ్రీశ్రీ ॥
నాటికీ నేటికీ కుాడా ఆతను రాసిన
మహా ప్రస్థానం ఏకైక మహా కావ్యంగా
అనంతమైన భావ సముాహాల
విప్లవ కావ్యమై తెలుగు కవిత్వ చరిత్రలో
తిరుగు లేని మలుపుగా నిలిచిపోయింది॥
హేతువాది నాస్తికుడు అయిన శ్రీశ్రీ
విప్లవ రచయితల సంఘం స్థాపకునిగా
అభ్యుదయ రచయితల సంఘాధ్యక్షుడిగా,
పాటల రచయితగా ప్రజల గుండెల్లో
చిరస్మరణీయుడై నిలచిపోయాడు.
************************:::
హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితము కాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment