09/09/2022.
శ్రీ శ్రీ కళావేదికలో
అంశం : బ్రతుకు జట్కా బండి.
శీర్షిక : మారుతున్న కాలంలో మనిషి బ్రతుకు.
రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
జీవిత చక్రం ఒడిదుడుకుల పట్టాలపై
గమ్య మెరుగని బాటలో చేసే ప్రయాణం.
సుఖ సంతోషాల వెతుకులాటలో
అలసిన జీవితాల ఆక్రోశం ॥
అధికార దాహపు అహంకారం
ప్రజల బలహీనతలకు వెలకట్టి
నోట్లు కురిపించి ఓట్లను కొని
అక్రమాల బాటలో అల్లర్లు సృష్టి స్తున్నాది ॥
గద్దెకెక్కిన ఘనులందరుా దేశ సంపత్తిని
వేలం వేస్తుా భరత భవితల జీవితాన్ని
బ్రతుకు వేదనలకు గురిచేస్తున్నారు॥
స్వార్ధం నిండిన మనిషి జీవితం
ధన దాహానికి బానిసై తన - పర అనే
బంధాలకు ఉద్వాసనలిడింది .
ఆటవిడుపులేని అహం హద్దులు దాటింది ॥
మారుతున్న కాలం తో పాటు
మారే మనుషుల మనస్తత్వం
మగువ మదిరలకు దాసొిహమై
బంధానుబంధాలను మట్టి కరిపిస్తోంది ॥
అడిగినవాడు అసలు పత్తా ఉండడు.
అడగనివాడికి అసలు బ్రతుకే ఉండదు.
భయం నిండిన బడుగు జీవితాలు
బ్రతుకు తెరువు లేక బానిసలౌతున్నారు॥
బానిసత్వపు సంకెళ్ళు విడిన ఆనందం
అనుభవంలోకి వచ్చిందన్న భావం
తలపులో మలుపు తిరగకు ముందే
మాట, స్వాతంత్ర్యాన్ని కోల్పోయింది ॥
బ్రతుకు జట్కా బండిలో నలిగిపోతున్న
జనుల చితుకు జీవితాలకు ముక్తి లేదు.
మననుద్ధరించేందుకు మరో ఉద్యమ వీరుడు
మళ్ళీ ఈ భువిలో పుట్ట బోడు ॥
*************::*********************
No comments:
Post a Comment