Tuesday, November 15, 2022

రుబాయిలు

15/11/2022.
మహతీ సాహితీ కవి సంగమం 
అంశం : రుబాయిలు.

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర.


మాయింటి   తోటలో  మొక్కలవి   కొల్లలుగ
పుాసేయి విరివిగా  మొగ్గలవి   మల్లెలుగ.
సువాసన నిండేటి పుాలంటే  ఇష్టమే..
పారిజాత పుాలవి  కురిసేయి జల్లులుగ . ॥

మనుష్యులు స్వార్ధముగ మెలగడమవివేకం    .
 అందరితో   మెళకువగ  మసలడం  వివేకం.
పుడమిలో  అందరం కలిసుంటే  కద సుఖం.
అందుకే హితులతో అవ్వాలి మమేకం ॥

గురుముఖతః  నేర్చేదే  అసలైనది , పాండిత్యం .
సహజంగా   కొందరిదది    అరుదైనది,   వ్యక్తిత్వం .
మనజన్మతః  వచ్చేవవి పుార్వపుణ్య ఫలగుణాలు.
వివేకమే  మనుగడకిల  బలమైనది అస్తిత్వం ॥

********
రచ్చ కెక్కినవి ఎన్నో చరితలు.
 కుాలిపోయాయి ఎన్నో భవితలు 
నేటికీ రాని   నిజ స్వాతంత్ర్యం
కన్నీటి వ్యధల కడు జీవితాలు ॥

 రక్తపు టేరుల రాజ్యాంగాలివి.
 ముక్కలైనట్టి బాల్యాంగాలివి.
స్త్రీ జీవితమే  చిక్కుల వలయం .
 అబలల నణచే ఆధిక్యతలివి ॥

పిల్లలలో కానరాదె పసితనం.
మనుషులలో పెరిగిపోయె స్వార్ధ గుణం .
నీతిలేని నికృష్టపు సమాజమిది 
వావి వరుస మరచితిరే  నేటి తరం ॥

కలలలోన విహరిస్తే  కలసిరాదు నీసమయం.
విధులు నీవి లోపిస్తే కుాడిరాదు నీకు జయం
కష్టపడితె  కనపడునుగ కాంక్షించే  సుజీవితం
మంచిబాట నడవకుంటె  వెంటరాదు కోరు సుఖం ॥


No comments:

Post a Comment