15/11/2022.
మహతీ సాహితీ కవి సంగమం
అంశం : రుబాయిలు.
రచన : శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర.
మాయింటి తోటలో మొక్కలవి కొల్లలుగ
పుాసేయి విరివిగా మొగ్గలవి మల్లెలుగ.
సువాసన నిండేటి పుాలంటే ఇష్టమే..
పారిజాత పుాలవి కురిసేయి జల్లులుగ . ॥
మనుష్యులు స్వార్ధముగ మెలగడమవివేకం .
అందరితో మెళకువగ మసలడం వివేకం.
పుడమిలో అందరం కలిసుంటే కద సుఖం.
అందుకే హితులతో అవ్వాలి మమేకం ॥
గురుముఖతః నేర్చేదే అసలైనది , పాండిత్యం .
సహజంగా కొందరిదది అరుదైనది, వ్యక్తిత్వం .
మనజన్మతః వచ్చేవవి పుార్వపుణ్య ఫలగుణాలు.
వివేకమే మనుగడకిల బలమైనది అస్తిత్వం ॥
********
రచ్చ కెక్కినవి ఎన్నో చరితలు.
కుాలిపోయాయి ఎన్నో భవితలు
నేటికీ రాని నిజ స్వాతంత్ర్యం
కన్నీటి వ్యధల కడు జీవితాలు ॥
రక్తపు టేరుల రాజ్యాంగాలివి.
ముక్కలైనట్టి బాల్యాంగాలివి.
స్త్రీ జీవితమే చిక్కుల వలయం .
అబలల నణచే ఆధిక్యతలివి ॥
పిల్లలలో కానరాదె పసితనం.
మనుషులలో పెరిగిపోయె స్వార్ధ గుణం .
నీతిలేని నికృష్టపు సమాజమిది
వావి వరుస మరచితిరే నేటి తరం ॥
కలలలోన విహరిస్తే కలసిరాదు నీసమయం.
విధులు నీవి లోపిస్తే కుాడిరాదు నీకు జయం
కష్టపడితె కనపడునుగ కాంక్షించే సుజీవితం
మంచిబాట నడవకుంటె వెంటరాదు కోరు సుఖం ॥
No comments:
Post a Comment