31/10/2022.
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : చిత్ర కవిత.
శీర్షిక : సర్దార్ బిరుదాంకితుడు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
అహింసా విధానానికి కట్టుబడి
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా
భారత పోరాటాన్ని మరింత
ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. ॥
బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి
నాయకత్వం వహించి విజయవంతం చేసి
దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు॥
బార్డోలీ భూస్వాములు పెంచిన
పన్నులకు వ్యతిరేకంగా వారి
ప్రతిఘటనలో పాల్గొన్నారు
సమర్ధవంతమైన నాయకత్వంతో
సర్దార్ బిరుదును సార్ధకం చేసుకున్నారు.
భారతదేశ జాతీయవాద
నాయకుడిగా గుర్తించబడిన వ్యక్తి
సర్దార్ వల్లభాయ్ పటేల్. ॥
బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న
స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు.
దేశప్రజల సంక్షేమం కోసం అనేక
సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు.
ఆచరణాత్మక, నిర్ణయాత్మక మరియు
క్రూరమైన వ్యక్తిగా పరిగణించబడిన
వ్యక్తిగా బ్రిటిష్ వారికి శత్రువైన వ్యక్తి.॥
రాజ్యాంగ రచనలో ప్రాథమిక హక్కుల
కమిటీకి చైర్మెన్గా వ్యవహరించాడు.
దేశవిభజన అనంతరం జరిగిన
అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు.॥
భారతదేశపు ఉక్కు మనిషిగా
పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్
భారత ప్రభుత్వం ద్వారా "భారతరత్న "
బిరుదును పొందిన ఘనుడు.
No comments:
Post a Comment