Saturday, November 5, 2022

బాల సాహిత్యం . మ గుణింత పదాలతో గేయం

05/11/2022.

బాల సాహిత్యంలో  కవిత-
   అంశం :"మ " గుణింత పదాలతో ..
శీర్షిక :  మెళకువలను తెలుసుకో..
ప్రక్రియ : గేయ కవిత .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .


పల్లవి .
-------
ముద్దుగారు పిల్లలుా మురిపాల గువ్వలుా
మేలైన మాటలా మెళకువలివె  పిల్లలుా 
మంచి మనసు మీదిగా మనిషిగా మెలగాలి 
మంచి విద్య- జ్ఞానముతో మీరందరు ఎదగాలి.॥ ॥
॥ముద్దు ॥

అను పల్లవి :
-----------
మదిని మానవత్వమే మనుగడ నిల నిలుపునుా
మమత పెంచు మంచి గుణమె మీభవితను  దిద్దునుా
మాటల కోటలుగట్టి  నవ్వులపాలవకండి
మాట డాబు వద్దండీ చేత చేసి చుాపండీ ॥॥ముద్దు ॥

చరణం:
------
మాట తీరుగుండాలి మేలు బాట నడవాలి
మార్గదర్శులవ్వాలి మంచి తనముతో 
మన దేశం మన ఝండా మాట కీర్తి మారుమొాగ      ॥మరపురాని విధముగా  మసలుకోండి 
మాత- పితలు కలలు కన్న మహోన్నత వ్తక్తులై-
మహిని మేలు కీర్తి బాట మీరందరు నడవాలి.॥ముద్దు ॥
చరణం.
---------

మరపురాని చేతలతో మన్ననలను పొందుమా
మంచి చెట్లు నాట మహిని, పొివు కాలుష్యమమ్మ.
మంచి నీటి విలువ తెలిసి వృధా పోనీయకుమా
మన అన్న దాతలకు నీటి కొరత రానీకుమ
మన సంస్కృతి  సాంప్రదాయములను గౌరవించుమా.
మనిషి సంస్కారముతో మసలుటలే ధర్మముసుమ॥॥ముద్దు ॥

చరణం.
-------
మనుషులను మొాసగించి మిత్రుల కోల్పోకుమా
ముప్పు దెచ్చసత్యమదే మరచి యాడబోకుమా
మాటదప్పినట్టి యాన లెన్నడు చేబోకుమా
మరపు రాని  మనిషిగా మదిని నిలినిపోవమ్మా
మనువు చెప్పు  ధర్మములివి మనిన మచ్చ రాదుసుమాl
మంచివ్య క్తిత్వమున్న మనిషే మహనీయుడమ్మ ॥
॥ముద్దు ॥

No comments:

Post a Comment