మహతీ సాహితీ కవి సంగమం.
25/10/2022.
అంశం : రుబాయిలు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
పొత్తిళ్ళలో పొందికగాను పెంచిందమ్మ.
ఆకలిదీర్చి అందంగాను పెంచిందమ్మ
తల్లి ఋణాన్ని తీర్చుకొనుటకు వెనుకాడొద్దు
ఇలదేవతగ హుందాగాను వచ్చిందమ్మ ॥
జీవితాన తప్పటడుగు లెప్పటికీ వేయబోకు.
తెలిసితెలిసి తప్పులవి యెప్పటికీ చేయబోకు
అంతరాత్మ సాక్షి, నిన్ను నిలదీయును.
మనసునెపుడు మొాసబుచ్చి ఎప్పటికీ బ్రతుకబోకు ॥
అవసరమని అబద్ధాల నాడబోకు.
స్వార్ధంతో బంధమ్ముల వీడబోకు ॥
మంచితోడ , అందరితో కలిసుండుము.
నమ్మించీ మొాసమ్ముల చేయబోకు.
నీతులనవి నిర్లక్ష్యం చేయబోకు
ఎవ్వరినీ అవమానము పరచబోకు
అవసరాని కందరినీ ఆదుకొనుము
మంచిమాట పెడచెవులను పెట్టబోకు॥
******************************
No comments:
Post a Comment