Tuesday, December 7, 2021

ఓ మనిషీ! మేలుకో !

శీర్షిక : ఓ మనిషీ ! మేలుకో !
(వచన కవిత.)

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .


*అభివృద్ధి పేరుతో  అస్తవ్యస్త రాజకీయాలు.
*ప్రజల సొమ్ము దోచుకొనే రాజకీయ వ్యుాహాలు.
*అవసరానికందని ప్రభుత్వ పథకాలు.
*సమాజ బాధ్యతెరుగని ప్రజా పావులు.
*సభ్య సమాజానికి తావివ్వని  కులమత బేధాలు.
*వావి వరుసలెంచని వరుస క్రుార చర్యలు.
• ప్రజలను మభ్యపెట్టే తీరులో రాజకీయ కార్యకలాపాలు.
• మన దేశ ప్రగతికి తీరని లోపాలు.
• విదేశీ వ్యామొాహంతో వీధికెక్కిన బ్రతుకులు.
• పరిశుభ్రత పాటించని పరనిందాప్రతాపులు.
• పెరుగుతున్న జనాభాతో ప్రగతి పథ అవరోధాలు.
• పచ్చదనం కరువైనా ప్రగల్ఫాలు పలికే ప్రతినిధులు.
• ప్రదుాషణతో నిండుతున్న భారత బహిరంగ స్థలాలు.
• స్వార్ధం నిండిన నాయకుల స్వశ్ఛ భారత్ ప్రణాళికల వైఫల్యాలు.
• అధికార బలానికి ఆహుతౌతున్న ప్రజా ప్రగతి పథ సాధనాలు
• పరదేశ ప్రైవేటీకరణ కు లోనౌతున్న స్వదేశీ సంపత్తులు.
• నిర్వీర్యమౌతున్న మేధకు నీరుగారుతున్న జనాలు.
• పెరుగుతున్న జనాభాకు, తరుగుతున్న భుాభాగాలు.
• పరిశుభ్రతకు తావివ్వని పనికిరాని బాసలు.
•కుళ్ళిన వ్యవస్థలో కాపురముంటున్న కరోనా వంటి కణాలు.
• రోడ్ల బారుల్లో నిండుతున్న రోగుల శవాలు.
• దారి  కానరాక, చేసే ముాకుమ్మడి దహనాలు.
• బొమికల పునాదులేసి లేపుతున్న ఆకాశ హార్మ్యాలు.
• నీటి కరువుకు నిర్వీర్యమౌతున్న పంట భుాములు.
• అన్నదాత కన్నీరే  అవని నిండు శాపాలు.
• అసహాయుల హాహాకారాలు,రైతన్నల అత్మహత్యల అక్రోశాలు.
• బడగు బ్రతుకుల్లో ఆరిపోతున్న ఆశా దీపాలు.
• పెరుగుతున్న ధరల వలలో పెనుగులాడుతున్న జనాలు.
•ఊపిరాడని జనాల మస్తిష్కంలో పగ నిండిన పొగలు.
• ఆ పొగల సెగల సంకేతాలు ,అరాచకం అగ్నిలో దహనమవ్వకముందిడే...మేల్కొల్పుకు  చిహ్నాలు॥
• 
***************************************

No comments:

Post a Comment