21/03/2021.
ప్రపంచ కవితా దినోత్సవం.
శీర్షిక : భరత చరిత ఒక కన్నీటి కవిత.
రచన:శ్రీమతి: పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర.
మమతలు మంట కలిసిన
రక్త సంబంధాల ఆవేదన ఓ కవితైతే
మారుతున్న మనోభావాల కర్కశ-
వ్యవహారాల కన్నీటి వ్యధ మరో కవిత.
రాజకీయపుటెత్తుల రంకు బాసలకు
అధోగతిపాలౌతున్న అమాయక ప్రజల
ఆశ నిండిన చుాపుల నిరీక్షణ ఓ కవితైతే....
ఒకప్పటి భరత చరితల గౌరవ చిహ్నాలు
నేటి తరంలో తమ ఉనికిని కోల్పోతున్న
దయానీయ పరిస్థితుల దారుణ
సంఘటనలకు నోరిప్పలేని జనుల
బలహీనతల భవిత చరిత మరో కవిత.
దారుణాల దరువులకు గాయమైన
శరీరాలకు , కాస్తంత ఉపశమనం
కలిగించే సంస్థల ప్రైవేటీకరణలపై
కేంద్ర ప్రభుత్వాల సడలని నిర్ణయాల
మంటల సెగలకు ,బొబ్బలు తేలిన
కన్నీటి బాధల దీన గాధలు ఓ కవితైతే ...
కరోనా రేపిన కలకలానికి తోడు
నేటి పాలకుల అడ్డతోవల ఆలోచనలతో
అస్వతంత్రపు వేదనలకు లోనైన
నాటి బానిసత్వపు సంకెళ్ల బతుకులను
భారంగా మొాస్తున్న భరత చరితే
నేటి ఓ కన్నీటి కవిత. ॥
No comments:
Post a Comment