21/3/2021.
క్రమ సంఖ్య : 112.
"గోరసం ప్రపంచ కవితా దినోత్సవ సంబరాలు"
అంశం: "దేశ భాషలందు తెలుగు లెస్స" .
శీర్షిక : కలికి తురాయి.
పదిహేను శతాబ్దాల పుార్వమే
వినుకొండ వల్లభరాయలవారిచే
"దేశ భాషలందు లెస్స నా తెలు"గంటుా
వర్ణింపబడి, క్రిష్ణ దేవరాయల ఆస్థాన
కవులైన అష్ట దిగ్గజాల కీర్తికిరీటంలో
కలికితురాయిగా మెరసిన కావ్య కళల
కాంతి కిరణం నా తెలుగు.॥
ముక్కోటి దేవతలకు మొాదమై,
సుస్వర నాదమై, వేద సారమైన ,
మేక్కొల్పు గీతాల మేలి సంగీతం నా తెలుగు॥
హిమ పన్నగ శోభలతో, గంగా, గోదావరీ
తరంగాల మలయ పవన
మధుర వీచిక నా తెలుగు॥
ప్రకృతి సంపదల సుమ సౌరభాలతో,
పాడి పంటల పచ్చని తోరణాల
వసంత కోయిల గీతం నా తెలుగు॥
భావి భారతానికి మార్గ నిర్దేశం చేసి, బంగరు
భవితకు బాట చుాపే రత్న గర్భ నా తెలుగు ॥
పంచదార కన్న పనస తొనల కన్న
కమ్మని తేనె కన్న తెలుగు మిన్న"
అన్న ముద్రతో తపాలా బిళ్ళగా
విడుదలైన విశ్వ కీర్తిని చాటిన
విమల యశ చరిత నా తెలుగు॥
-------------------------------------------
No comments:
Post a Comment