Thursday, December 9, 2021

మన ప్రాధమిక బాధ్యత

27/03/2021.
తెలుగు భారతి సాహిత్య సేవా సమితి ఆధ్వర్యంలో..
అంశం: జాతీయ ఝండాకు వంద సంవత్సరాలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక : దేశ పౌరుల ప్రాధమిక విధి.

స్వాతంత్రోద్యమ పోరాటం చేసి సాధించిన
స్వాతంత్ర్యం , ఎంతోమంది చేసిన
త్యాగ నిరతికి నిదర్శనం.
ఆగష్టు పదిహేనున మువ్వన్నెల జెండాను
ఎగురవేస్తూ, యావత్ భారతావని, త్రివర్ణపతాక సృష్టికర్త అయిన పింగళి వెంకయ్యకు నిరాజనం పలుకుతోంది.
. ముాడు రంగుల మన జాతీయజెండాను, జాతీయగీతాన్ని, జాతీయ గౌరవ చిహ్మాలను,  స్వాతంత్ర్యయోధులను గౌరవించడం మన భారత పౌరుల ప్రాధమిక విధి.
1947 జూలై 27వ తేదీన నిర్వ‌హించిన రాజ్యాంగ స‌భ‌లో మొద‌ట‌గా ఆమోదింపబడిండి.
త్యాగాన్ని తెలిపే కాషాయం, శాంతిని చూపే తెల్లదనం, పంట పొలాను తెలిపే పచ్చదనం, ధర్మం నిలిపే అశోకచక్రం… ఇవన్నీ కలగలిపి ఉన్న మన జాతీయ పతాకం వంద వత్సరాలు పుార్తి చేసుకొని
"భరత జాతి కీర్తి చిహ్నంగా "ఎప్పటికీ నిలిచిపోవాలి
అన్న సత్ సంకల్పంతో. మన జాతీయ ఝండాకు
ఐకమత్యంతో ,గౌరవపుార్వకంగా "జై " కొడదాం .

No comments:

Post a Comment