*మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ఉత్తమ రచనలు:*
20.8.22:బాలసాహిత్యం
సర్వశ్రీ//
1. జక్కని గంగాధర్
2. డా.కురవి వెంకట కృష్ణశాస్త్రి
3. యేచన్ చంద్రశేఖర్
4. పోగుల భాగ్యలక్ష్మి
5. పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి
6. కుడికాల సమ్మన్న
7. ఎం.వి.ఉమాదేవి
8. ఎలగందుల లింబాద్రి
మహతీ నిర్వాహక/సమీక్షక బృందము
అంశం : బాల భారతం.
"చ " గుణింతం తో...
శీర్షిక : చక్కని మాటలు వినరండి.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
చక్కనైన పాపలుా
చందమామ ఊసులుా
చక్కని మాటలు చెపుతా నేను
చేరి చేరువగ వినరండీ ॥
ఛంగు ఛంగున లేవండీ
చక్కగ బడికి వెళ్లండీ
చాచా నెహ్రూ గాంధీ తాతల
బాటను శాంతిగ నడవండీ ॥
జగతిని ఖ్యాతిని పొందిన వీరుల
చరితలు బాగా చదవండీ ..
ఝండా కీర్తిని నిలపండీ
జై హింద్ అంటుా పాడండీ ॥
చిన్నా పెద్దను తేడా చుాపక
చిరు గౌరవముల నీయండీ
చీమల్లాగా ఐకమత్యముగ
చక్కగ కలసీ నడవండీ॥
చుట్టుపక్కల వారికి వలసిన
చేగల సాయం చేయండీ ॥
చుాపుల కరుణను నింపండీ
చక్కని మాటలనాడండీ ॥
చెట్లను బాగా నాటండీ
చెడు కలుషితముల నాపండీ ॥
చైతన్యమ్మును పొందే విధముగ
చెడు విరుగుడుకై పోరండీ ॥
చేయిా చేయిా కలపండీ
చొరవగు స్నేహము నిలపండి ॥
చందమామలా చల్లని నవ్వుల
చెలిమితొ మమతలు పంచండీ॥
చః చః లాడుచు చిలకల్లాగా
చకచక పనులను చేయండీ ॥
చక్కని భారత భావి పుత్రులుగ
చరిత కెక్కి ఇల మనరండీ ॥
No comments:
Post a Comment