15/08/2022
మహతీ సాహితీ కవి సంగమఁం
అంశం : చిత్ర కవిత.
శీర్షిక : ఝండా కీర్తిని చాటుదాం.
రచన :శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
భరతమాత బిడ్డలం
భావి భరత పౌరులం
సమత మమత నిండి యున్న
స్వేశ్ఛా భారతీయులం ॥
వందే మాతరం
వందే మాతరం ॥
దేశ గీతములు పాడుతాం
దేశముకై పోరాడుతాం
తల్లి ఒడినదే శాంతి నింపుటకు
ఐకమత్యముగ మెలిగేస్తాం॥
వందే మాతరం
వందే మాతరం ॥
స్వాతంత్రోద్యమ కారుల వీరుల
సత్ చరితలనే చదివేస్తాం
వారి బాటలో అడుగిడతాం
వారి మాటకే జై కొడతాం ॥
వందే మాతరం
వందే మాతరం ॥
దేశం కోసం పోరాడు వీరుల
దేశ భక్తి కొనియాడుతాం
అసువులు బాసిన అన్న సిపాయిల
ఆదర్శ బాటను అడుగేస్తాం ॥
వందే మాతరం
వందే మాతరం ॥
ముాడు రంగులా ఝండా గుర్తును
మచ్చటగా ఎగరేయుదాం
గాందీ మాటలో శాంతి బాటలో
అందరమొకటై కలిసుందాం ॥
వందే మాతరం
వందే మాతరం ॥
దేశ ప్రగతికై పోరాటాలను
పొందుగ చేసి సాధిద్దాం
జాతి జాడ్యముల రుాపు మాపుదాం.
ఝండా కీర్తిని నిలపెడదాం ॥
వందే మాతరం
వందే మాతరం ॥
అరాచకాలను ఆపేద్దాం
ఆగడాలనే అరికడదాం
పచ్చదనమునే పెంచి తల్లిని
స్వచ్ఛ భారతిగ చేసేద్దాం ॥
వందే మాతరం
వందే మాతరం ॥
జనగణ గీతమునాలపించి
మన ఝండా కీర్తిని చాటుదాం
వందెమాతరం నినాదాల మన
దేశ భక్తినే చాటుదాం ॥
వందే మాతరం
వందే మాతరం ॥
పంద్రాగష్టున పలువురం కలిసి
స్వాతంత్ర్యోత్సవములు చేద్దాం
స్వాతంత్ర్య వీరుల జీవితచరితలు
భావి తరములకు అందిద్దాం ॥
వందే మాతరం
వందే మాతరం ॥
------------------------
No comments:
Post a Comment