Friday, August 12, 2022

నేను నా దేశం

నేను సైతం కవి పత్రిక ఆగష్టు  నెల సంచిక కొరకు...
అంశం : నేను నా దేశం .
శీర్షిక  :  రత్నగర్భ నా దేశం . 

శీర్షిక  :  రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర.

ప్రక్రియ : వచన కవిత.


"జననీ జన్మ భూమిశ్చ - స్వర్గాదపి గరీయసీ". అంటే
జనని, జన్మభూమి స్వర్గము కంటె ప్రియమైనవి కదా!".

అని స్వయముగా శ్రీరామంచంద్రుడే అన్న మాట.
భిన్నత్వంలో ఏకత్వాన్ని చుాపించిన  పుాదోట.
కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు విస్తరించి 
విభిన్న మతాలు,భాషలు, సంస్కృతులతో విలసిల్లుతూన్న  సువిశాలమైన దేశం నా దేశం .

ఆర్య భూమి, సూర్య భూమి, వీరభూమిగా
బోయి భీమన్న మాట సత్యమైన కోట.
దేశమంటే మట్టి కాదోయ్! దేశమంటే మనుషులోయ్!!- అన్న గురజాడ అప్పారావు పాట అందరి నోటా.

బ్రిటిష్ ఆర్మీని గడగడలాడించిన 
ధీర వనిత ఝాన్సీ లక్ష్మిబాయి.
భారత స్వాతంత్ర్యోద్యమానికి నాంది పలికిన
 తొలి  ఉద్యమకారుడు మంగల్ పాండే ..
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజలకు ప్రేరణ కలిగించిన ఉద్యమ తార భగత్ సింగ్. 
అహింసా మార్గంలో అద్భుతాలు సాధించవచ్చని..
ప్రపంచానికి సరికొత్త దిశానిర్దేశనం చేసిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మా గాంధీజీ...
భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన వ్యక్తి 
డాక్టర్ బాలా సాహెబ్ అంబేద్కర్ ...
ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించిన 
స్వామి వివేకానంద...
నాకు రక్తం ఇవ్వండి. నేను మీకు స్వాతంత్ర్యం తీసుకొస్తాను అన్న శుభాష్ చంద్రబోస్ ..వంటి
దేశ ప్రేమికులకు  జన్మ నిచ్చిన దేశం నాదేశం .
తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందిన అష్టదిగ్గజాల వంటి కవులతో , 
ఆష్టాదశ పురాణాలకు ఆది ముాలమై..
నాలుగు వేదాలకు నిలయమైన సంప్రదాయబద్ధ
సంస్కృతికి నిలయం నా దేశం.
అరవై నాలుగు కళలతో అలరిన అక్షయ, సంగీత సాహిత్యాలకు కావ్య కవన ఇతిహాసాల సమాహారం 
నా దేశం.

ఆంతులేని ఆప్యాయత ఆత్మీయత నిండిన
జన సందోహంతో, పలు  భాషలు నిండు పలకరింపులతో , హిమ పన్నగ శోభలతో, సాగర, నదీ
గమనాలతో పరవసించు ప్రకృతి వన శోభలతో
అలరారుతున్న దేశం...నా దేశం ॥

వేయేల !  పుణ్య భుామి నా దేశం నమొా నమామి!
         ॥నన్నేలిన  నా దేశం  సదా స్మరామీ ॥

 

No comments:

Post a Comment