అంశం : ప్రకృతి భీభత్సం .
శీర్షిక : చెడపకురా ! చెడేవు !
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
భరత మాత ఆగని కన్నీరు
ప్రళయమై భీభత్సాన్ని సృష్టి స్తోంది.
వాగులు వంకలుా పొంగి పోర్లుతున్నా-
మంచినీటి కొరత మనుషులకు శాపమయ్యింది ॥
మానవులు దానవులై చరిస్తున్నారు.
కామంతో మనిషి వావి వరుసల్ని మర్చిపోతున్నాడు.
కొండలు బండల కొరకు తవ్వి పారేస్తున్నారు.
పచ్చని చెట్లను భుా కబ్జాలకై నరికి వేస్తున్నారు.॥
గుాడు లేని పక్షుల కన్నీటి తాపాలు
పుడమి పాపులను శాపాలై వెంటాడుతున్నాయి॥
వాతావరణ నియంత్రణను కోల్పోయిన
ప్రకృతి మాత అస్తవ్యస్తమైన ఋతువుల
ఆగమనంతో హైరానపడుతోంది.॥
విసపు గెత్తాల మంటకు వెర్రెక్కిన మట్టి మాలక్ష్మి
పంట కోతల్లో పాశ హస్తాన్ని తిప్పుతుా
రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోంది.॥
పసి పిల్లల ప్రాణానికి, ఆడ పిల్లల మానానికి
రక్షణలేని రాపిడి చుాసి భరత మాత రోమాలు
నిక్కపొడుచుకుంటున్నాయి .॥
బద్దలౌతున్న సారహీనమైన భుామి,
కోపాగ్నితో రగులుతున్న అడవులు..
తడిలేని మేఘాలు , ఇంకిపోతున్న నీళ్ళు
విష పుారితమైన గాలులతో గాయపడి ,
కుష్టు పట్టిన తన గతికి గుండె పగిలిన
ప్రకృతి పడతి ప్రతీకారంతో ప్రళయ
భీభత్సవాన్ని సృష్టిస్తోంది.
" ఓ మనిషీ ! తస్మాత్ జాగర్త."
*************************
హామీ :
పై కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితము కాని నా స్వీయ రచన.
**********************:****************
No comments:
Post a Comment