Friday, August 5, 2022

ప్రక్రయ : రుబాయిలు.

02/08/2022.
మహతీ సాహితీ కవి సంగమం .
అంశం : సాహిత్యాశం .
ప్రక్రియ : రుబాయిలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


ఎన్ని వేట్లు వేసినా ఒరిగిపోయిన చెట్టు చిగిరిస్తుంది.
ఎన్ని తుాట్లు పొడిచినా పగిలిపోయిన గుండె  .ప్రేమిస్తుంది
ఒకరి లాలించిన ఆమ్మైతే ఒకరు పాలించిన అమ్మ
ఎన్ని సార్లు అవమానించినా ఆమ్మతనం ఆదరిస్తుంది.॥

ఎన్ని కోట్లు వెచ్చించినా కోల్పోయిన ప్రేమ కొనలేవు 
ఎన్ని పాట్లు పడినా గతించిపోయిన నిన్న  కనలేవు.
జీవితంలో ప్రతీ పదానికీ అలోచించి అడుగేయాలి
ఎన్ని ఇక్కట్లు పడినా మాటజారిన చోట మనలేవు ॥

విద్య నేర్చినవాడు  వివేకవంతుడవుతాడు
విజ్ఞాన శాస్త్రం  నేర్చినవాడు మేధావంతుడౌతాడు.
పై రెండుా ఉన్నవాడు తత్త్వ-జ్ఞాన సముపార్జనుడు
వారందరితో బంధమున్న వాడు కీర్తిమంతుడౌతాడు.॥

అక్షరం తలరాత మార్చు వరం మిత్రమా 21
ఆవేశం అనర్ధాలను పెంచు  మిత్రమా 21
నిరక్షరాస్యతది  ముార్ఖత్వానికి ముాలం .
చదువది, సమయొాచిత సంస్కారము మిత్రమా ॥

నీతులు చెప్పడం ఎంతోమంది చేస్తారు.
నియమాలు పాటించమని కొంతమంది చెప్తారు.
చెప్పేముందు చేసి చుాపించడం మంచి లక్షణం.
పని చేసేవారు మాటలాడరని చాలామంది చెప్తారు.॥

పసి పిల్లలలో  అమాయకత్వం చుాస్తాం మనం
యువతలోని ఆవేశతత్త్వం  చుాస్తాం మనం 
మధ్యవయస్కుల్లో జీవితానుభవ పుాదోటలు.
వృద్ధాప్యంలో పండిన మనస్తత్వం చుాస్తాం ॥   


26/07/2022.౯
మహతీ సాహితీ కవి సంగమం .
శీర్షిక :  నిజాలు తెలుసుకో ..
ప్రక్రియ : రుబాయిలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .




మంచి చెడు తేడాలు తెలుసుకొని నడచుకో
మానవత్వ విలువలు నిలుపుకొని మసలుకో
మనిషిగ పుట్టినీవు పశువులాగ మారకు
స్నేహానుబంధాలు కలుపుకొని పెంచుకో ॥

కుార్చొని తింటే కొండలు కరుగుతాయి
అతిగా తింటే కండలు పెరుగుతాయి.
ఆరోగ్యమే మహాభాగ్యమనంటారు.
పద్ధతి పాటించు చింతలు తొలగుతాయి.॥

మనిషిని మనిషి మనసారా  ప్రేమించాలి .
కుల-మత బేధాల నోరారా ప్రతిఘటించాలి.
వసుధైక కుటుంబము మనదందరిదీ.. .
ఒకరికొకరై తనివితీరా బతకాలి ॥.

ఎవరినీ ఎప్పుడుా తక్కువ చేసి చుాడకు 
పిల్లలను  గారాబం చేసి పాడుచేయకు
మన నడతే  పిల్లల రేపటి భవిత భాట 
ఇల్లే పాఠశాల అనేటి వాసి , మరువకు ॥
 
రాజకీయంలో  స్వార్ధానిదే పైచేయొాయి
ప్రజలలో ఉన్న భయానికి కళ్ళెం వేయవోయి
 ఓటుకు నోటన్నది నేడు కనిపించే నిజమొాయి
నోరున్న వాడిదే రాజ్యమని తెలుసుకోవోయి .॥

మహతీ సాహితీ కవి సంగమం .
శీర్షిక :  నిజాలు తెలుసుకో ..
ప్రక్రియ : రుబాయిలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

మనిషిని మనిషి మనసారా  ప్రేమించాలి .
కుల-మత బేధాల నోరారా ప్రతిఘటించాలి.
వసుధైక కుటుంబము మనదందరిదీ.. .
ఒకరికొకరై తనివితీరా బతకాలి ॥.

మంచి చెడు తేడాలు తెలుసుకొని నడచుకో
మానవత్వ విలువలు నిలుపుకొని మసలుకో
మనిషిగ పుట్టినీవు పశువులాగ మారకు
స్నేహానుబంధాలు  కలుపుకొని పెంచుకో ॥

కలలో నిన్నే తలచితిని కృష్ణా 
ఇలలో నిన్నే కొలచితిని కృష్ణా 
యశోదా నంద  గోపాల బాలా
నను బ్రోవగ నిను పిలచితి కృష్ణా  ॥

రుబాయిలు.

బోనాల పండగకు భోగాలే  విందుగా 
ఆ తల్లి పుాలతో నిండే కను విందుగా
బంగారు బతుకమ్మ కొలువై వచ్చేనుగా
ఆట పాటల వేడ్క లందరీ పసందుగా ॥

మంచి చెడు తేడాలు తెలుసుకొని నడచుకో
 అనురాగబంధాలు నిలుపుకొని మసలుకో
మనిషిగ పుట్టినీవు పశువులాగ మారకు
 ఐశ్వర్యం ఆనందం పంచుకొని పెంచుకో ॥









 

No comments:

Post a Comment