అంశం : స్వాతంత్ర్యామృతోత్సవం
శీర్షిక : స్వాతంత్ర్య దినోత్సవానికి స్వాగతం.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర
తెల్లదొరల పాలనలో శృంఖలాల బానిసత్వం.
శుృతి మించిన కృుారత్వం అదర, రేగె కలకలం .
శాంతి నిండు బాటలో ఉద్యమాలకు శ్రీకారం.
దేశం కోసం దేహ సమర్పణల సమాహారం ॥
ఆగ్రహ సత్యాగ్రహాలకాకలికాప్తుల చావులు
తుపాకీల కాల్పులకు దేహాలె ఖండాలు
అస్థిత్వం కానరాని లాకప్పు జీవితాలు
రగులుతున్న రుధిరంతో ఉనికికై పోరాటాలు ॥
యువత గుండెలాయె తుాట్లు తెగెనెన్నో తాళిబొట్లు
కన్నతల్లు లెందరో కోల్పోయిన పేగు తట్లు
అందరొక్కటై పోరగ అందినదీ స్వాతంత్ర్యం
స్వార్ధమన్నదే లేకను కలిసి చేయ పోరు జయం ॥
శాంతి నిండు ఉద్యమాల బాట తాత గాంధీజీ
వెన్నంటీ నడిచె చాచా నెహ్రూ జీ, నేతాజీ.
వత్సరాల శాంతి పోరు కునుకు లేని జోరు హోరు
తెచ్చె మనకు స్వాతంత్ర్యం ఇచ్చె మనకు జీవితం ॥
ఆనందముప్పొంగగ అభినందనల పండగ
ఆగష్టు పదిహేనున ఆనందం నిండుగ
ప్రతి పౌరుని కంటిలో ఉబికిన కన్నీటి గంగ .
త్యాగధనుల జ్ఞాపకాన ఎగరె మన తిరంగా ॥
No comments:
Post a Comment