నేనిచ్చే పంచ పదాలు
*లోకం,శోకం,పాపం,తాపం,కోపం*
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
స్వార్ధపరులైన జనంతో నిండింది లోకం.
కామం , వనితలను వెంబడిస్తున్న శాపం.
మానవత్వం మరచి కొందరు చేస్తున్నారు పాపం .
రాక్షసత్వంతో నిండియున్న పురుషుల ప్రతాపం.
భగవంతుని కోపానికి వస్తుందిలే ప్రళయ మీశ్వరీ ॥
నీతి రీతి ప్రీతి బీతి రతి
నీతి లెరని చోట నియమ ముండదు.
ఈ రీతి జగతిలో ధర్మ ముండదు.
ప్రీతి నిండిన పలకరింపులకు తావుండదు.
బీతి నిండు బ్రతుకులో సారముండదు
నిరతి నియమాలు పాటించకపోతే మనిషిలో
మంచి తనముండదు.॥
No comments:
Post a Comment