9/8/22.
సాహిత్యాంశము : మంచిని పెంచుకో.
ప్రక్రియ : రుబాయిలు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
గులాబీకి ముళ్ళుం టాయని వదిలేయగలమా .
పుాలెన్నో పుాస్తుం టాయని చిదిమేయగలమా .
మనిషి గుణగణాలు విజయానికిల సోపానాలు.
అలాగని భువిలో బ్రతకడం మానేయగలమా॥
తెల్లనివన్నీ పాలుకావు.
నల్లని వన్నీ నీళ్ళు నీళ్ళుకావు
అందం, అది మనిషికి శాపం..
చుాసినవన్ని నిజాలుకావు. ॥
జీవితంలో మంచి చెడులను తెలుసుకో.
అందరితో నువు స్నేహంగా మసలుకో.
చెడ్డవాడికిట విలువ లేదు .
గంజాయి వనాన తులసిలా నిలిచిపో॥
గుణవంతుడు అందరికీ మంచినే పంచగలడు.
మంచిపనులు చేస్తే హాయిగా జీవించగలడు.
నోరు మంచిదైతే ,ఊరంతా మంచంటారు.
సద్గుణాలున్నవాడే, లోపాలనెంచగలడు.॥
చేయి కలిపితే స్నేహము .
పోరు సలిపితే యుద్ధము.
మనిషిగా ఆలోచించు.
నేనన్నిటికీ సిద్ధము.॥
No comments:
Post a Comment