శ్రీ శ్రీ కవన వేదిక వారి కవితా సంకలనం కోసం
-----------------------------------------
శ్రీ శ్రీ కవన వేదిక వారి "హరోం హర సంగాము సంగమేశ్వర"
కవితా సంకలనం కొరకై వ్రాసినది .
శీర్షిక : సంగం : సంగమేశ్వర దేవాలయం .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
ఏడు నదులు కలిసే ఏకైక ప్రదేశం
పవిత్ర పుణ్య క్షేత్రం సంగమేశ్వరం.
బలరాముడు ప్రతిష్టించిన లింగం.॥
నాగావళి- సువర్ణముఖి -వేదావతి
ఒకేచోట సంగమించిన పవిత్ర స్థలంలో.
ద్వాపర యుగంలో కరువు, నష్టం. .
కళింగ దేశంలో నానా కష్టాలతో జనం॥
చలించిన బలరాముని ప్రయత్నం
నాగలితో భుామిని దున్నిన ఫలితం
గంగా ప్రవాహంతో దేశం సుభిక్షం.॥
నాగలితో భుామిని దున్నిన ఫలితంగా
నాగావళి పేరుతో పవిత్ర నదీ ప్రవాహం .॥
నాగావళి , మరో ఉప నదితో కలసిన
ప్రదేశంలో ప్రతిష్టంచిన అద్భుత లింగం.
పవిత్ర పుణ్యక్షేత్రంగా ,"సంగం" .గ్రామం.
సంగమేశ్వరుని పేరుతో పవిత్ర శైవ క్షేత్రం॥
స్థల పురాణం ప్రకారం ,వినిపించే కథనం.
తండ్రి జమదగ్నిమహర్షి ఆజ్ఞ మేరకు
తన తల్లి రేణుకాదేవిని బలరాముడు
సంహరించి, పాప పరిహారార్ధం పవిత్ర
సంగమ స్థానంలో చేసిన శివలింగ ప్రతిష్టాపనం॥
సంగమేశ్వరుని దర్శనం సర్వపాపహరణం.
ప్రతీ వత్సరం బ్రహ్మోత్సవాల సంబరం ,
శ్రీ కామాక్షిదేవీ సమేత సంగమేశ్వరస్వామి
రోజుకొక వాహనంపై భక్తులకు దర్శనం .॥
మహా శివరాత్రి పర్వదినంలో
బలరాముడు ప్రతిష్టించిన మహిమాన్విత
ఐదు పవిత్ర శివ లింగాల దర్శనం
పుణ్యప్రదం,సమస్త పాప ప్రక్షాళనం .॥
మహాకురుక్షేత్ర యుద్ధానంతరం బలరాముడు ప్రతిష్టించిన పంచలింగ ఆలయాల్లో
ముాడవదైన సంగమేశ్వరలింగం .
భక్తుల కొంగుబంగారమైన పవిత్ర క్షేత్రం .॥
హామీ :
నా ఈ వచన కవిత ఏమాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.
*********************************
శీర్షిక : పవిత్ర పంచారామాలు.
శ్రీ సంగమేశ్వర దేవాలయాలు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
1
కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం.
ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి
కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం
కలిగించే సంగమేశ్వర దేవాలయం. ॥ వేలసంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం॥
2.
అహోబిలం కొండల్లో పుట్టిన సెలయేరు
భవనాశిని నదిగా రూపాంతరం చెంది
కృష్ణలో కలిసే స్థలం సంగమేశ్వరం .॥
3
ప్రజల పాప ప్రక్షాళన చేసిన గంగాదేవికి
కాకి రూపం రాగా, ఈ సంగమంలో
స్నానం చేసి హంసగా మారిన కథనం ,॥
గంగమ్మ పాపాలు నివృత్తి అయినందున
నివృత్తి సంగమేశ్వరం అన్న పేరుతో ప్రసిద్ధం.॥
4.
ఆరణ్య వాస సమయంలో లింగ ప్రతిష్ఠ
చేయ సంకల్పించిన ధర్మరాజు ॥
లింగాల కోసం భీముని కాశీ ప్రయాణం.
కాలయాపన ఐనందున వేప మొద్దుతో
చేసిన శివలింగ ప్రతిష్ఠ అద్వితీయం.॥
5.
నాగలితో భుామిని దున్నిన ఫలితంగా
నాగావళి పేరుతో పవిత్ర నదీ ప్రవాహం .॥
నాగావళి , మరో ఉప నదితో కలసిన
ప్రదేశంలో ప్రతిష్టంచిన అద్భుత లింగం.
పవిత్ర పుణ్యక్షేత్రంగా ,"సంగం" .గ్రామం.
సంగమేశ్వరుని పేరుతో పవిత్ర శైవ క్షేత్రం॥
కోస్తా తీర ప్రాంతంలో పంచారామాలు
ఇమల్లేశ్వరం, అమరేశ్వరం, సిద్దేశ్వరం,
కపిలేశ్వరం, సంగమేశ్వరం పేర్లతో ప్రసిద్ధి. ॥
భీముడు కాశీ నుండి తెచ్చిన లింగాలతో
వెలిసిన పంచేశ్వర పవిత్ర క్షేత్రాలు
భక్తుల పాలిటి కొంగుబంగారాలు ॥
No comments:
Post a Comment